-
ఐపీవోవైపు ఎన్ఎస్ఈ చూపు
ముంబై: స్టాక్ ఎక్సే్ఛంజీ దిగ్గజం నేషనల్ స్టాక్ ఎక్సే్ఛంజీ(ఎన్ఎస్ఈ) పబ్లిక్ ఇష్యూ యోచనలో ఉంది. క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ నుంచి అనుమతులు లభించిన తదుపరి సవరించిన ముసాయిదా ప్రాస్పెక్టస్ను దాఖలు చేయనున్నట్లు ఎన్ఎస్ఈ ఎండీ, సీఈవో ఆశి‹Ùకుమార్ చౌహాన్ వెల్లడించారు. వెరసి సెబీ నుంచి గ్రీన్సిగ్నల్ లభించాక మరోసారి ఐపీవో సన్నాహాలు ప్రారంభించనున్నట్లు పేర్కొన్నారు. అధిక రిస్కులుగల డెరివేటివ్స్లో లావాదేవీలు చేపట్టవద్దంటూ ఈ సందర్భంగా రిటైల్ ఇన్వెస్టర్లను హెచ్చరించారు. ఈ విభాగంలో తగినంత సమాచారమున్న ఇన్వెస్టర్లు మాత్రమే ట్రేడింగ్ చేయగలరని తెలియజేశారు. సెబీ పరిశీలన ప్రకారం 10మంది ట్రేడర్లలో 9మంది నష్టపోయినట్లు ప్రస్తావించారు. ఇప్పటికే బీఎస్ఈ బొంబాయి స్టాక్ ఎక్సే్ఛంజీ(బీఎస్ఈ) 2017లోనే పబ్లిక్ ఇష్యూకి వచ్చింది. సెబీ నిబంధనల ప్రకారం ఎన్ఎస్ఈలో లిస్టయ్యింది. అయితే లిస్టింగ్ సమయంలో చౌహాన్ బీఎస్ఈ సీఈవోగా బాధ్యతలు నిర్వహించడం గమనార్హం! ఎక్సే్ఛంజీ సుపరిపాలన విషయంలో కొంతమంది మాజీ ఎగ్జిక్యూటివ్లు నిబంధనల ఉల్లంఘనకు పాల్పడిన ఆరోపణలతో ఎన్ఎస్ఈపై సెబీ దర్యాప్తునకు తెరతీసిన సంగతి తెలిసిందే. దీంతో ఎన్ఎస్ఈ లిస్టింగ్ ప్రణాళికలకు బ్రేక్ పడింది. కోలొకేషన్ సౌకర్యాలను అక్రమంగా వినియోగించినట్లు ఆరోపణలు వెలువడ్డాయి. తద్వారా కొంతమంది ట్రేడింగ్ సభ్యులకు ముందస్తు ప్రవేశం కలి్పంచినట్లు ఆరోపణలు తలెత్తాయి. కాగా.. 2016 డిసెంబర్లో ఎన్ఎస్ఈ ఐపీవో చేపట్టేందుకు వీలుగా సెబీకి ప్రాస్పెక్టస్ను దాఖలు చేసింది. తద్వారా రూ. 10,000 కోట్ల సమీకరణకు ప్రణాళికలు వేసింది. దీనిలో భాగంగా ఎన్ఎస్ఈ వాటాదారులు 22 శాతం ఈక్విటీని విక్రయించేందుకు ఆసక్తి చూపారు. అయితే 2020లోనూ ఎన్ఎస్ఈ ఎండీ, సీఈవో విక్రమ్ లిమాయే సెబీ అనుమతుల తదుపరి ఐపీవో ప్రాసెస్ను ప్రారంభించేందుకు ప్రణాళికలు వేసినప్పటికీ ముందుకుసాగలేదు. -
సౌదీ అరేబియా స్టాక్ ఎక్స్ఛేంజ్ హెడ్గా సారా! ఎవరీమె.?
సౌదీ అరేబియాలో మహిళల పట్ల ఎలాంటి ఆంక్షలు ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అలాంటి చోట ఇటీవల పలు సంచలనాత్మక నిర్ణయాలు తీసుకుంటుంది. అందుకు కారణం ఆ దేశ ప్రస్తుత క్రౌన్ ప్రిన్స్ మహమ్మద్ బిన్ సల్మాన్ అల్ సాద్ అని చెప్పొచ్చు. ఇటీవల ఆయన హాయాంలోనే సంచలన నిర్ణయాలు ఎక్కువుగా తీసుకుంటున్నారు. ముఖ్యంగా సౌదీ దేశ చరిత్రలోనే తొలిసారిగా మిస్ యూనివర్స్ పోటీల్లో పాల్గొనాలని నిర్ణయంతో అందర్నీ ఆశ్చర్యపరిచారు. వాటన్నింటకంటే మునుపే ఓ మహిళ సౌదీ అతి పెద్ద స్థాక్ మార్కెట్కి చైర్మన్ అయ్యి సంచలనానికి తెరతీసింది. ఏకంగా యావత్తు ప్రపంచం ఆమె విజయాన్ని చూసి విస్తుపోయింది. ఇంతకీ ఎవరీమె అంటే.. 44 ఏళ్ల సారా అల్-సుహైమి సౌదీ స్టాక్ ఎక్స్ఛేంజ్ చైర్మన్గా అత్యున్నత పదవిని అలంకరించిన తొలి సౌదీ మహిళగా చరిత్ర సృష్టించింది. ముఖ్యంగా ఆర్థిక ప్రపంచంలో రికార్డు సృష్టించింది. ఆమెను చూస్తే.. సౌదీ కార్యాలయాల్లో మహిళల పాత్రలు దినదినాభివృద్ధి చెందుతున్నాయోమో! అనిపిస్తుంది. ఇక ఆమె ఎడ్యుకేషన్ పరంగా..సౌద్ విశ్వవిద్యాలయంలో అకౌంటింగ్ ప్రోగ్రామ్లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసింది. ఆ తర్వాత 2015లో హార్వర్డ్ బిజినెస్ స్కూల్లో జనరల్ మేనేజ్మెంట్ ప్రోగ్రామ్ పూర్తి చేసింది. ఆమె బ్యాంకింగ్ కుటుంబానికి చెందినది. ఎందుకంటే ఆమె తండ్రి జమ్మాజ్ అల్ సుహైమి గల్ఫ్ బ్యాంక్, సౌదీ అరేబియా క్యాపిటల్ మార్కెట్స్ అథారిటీలో ఉన్నత పదవులును అలంకరించారు. ఇక సారా కూడా తండ్రి అడుగు జాడల్లోనే నడిచింది. అత్యున్నత మార్కులతో గ్రాడ్యుయేఏషన్ పూర్తి చేసి అద్భతమైన కెరీర్కు మార్గం సుగమం చేసుకుంది. సారా తొలుత ఎన్సీబీ క్యాపిటల్ చీప్ ఎగ్జిక్యూటివ్గా అయ్యినప్పుడే ఆమె కెరీర్ అంచెలంచెలుగా పెరగడం ప్రారంభించింది. ఇది సౌదీ అరేబియాలో అతిపెద్ద వాణిజ్య బ్యాంకుగా ఏర్పడటానికి సాంబాతో విలీనమయ్యింది. ఇక ప్రస్తుతం సారా సౌదీ స్టాక్ ఎక్స్ఛేంజ్ మార్కెట్కే చైర్మన్ అయిన తొలి మహిళగా చారిత్రాత్మక విజయాన్ని అందుకుంది. ఆమె విజయం ఒక్క సౌదీలోనే గాదు యావత్తు ప్రపంచంలోనే సంచలనం సృష్టించింది. అంతేగాదు ఆమె ఎన్సీబీ క్యాపిటల్ ఫైనాన్షియల్ ల్యాండ్స్కేప్లో కీలక పాత్ర పోషించింది. వినూత్న పెట్టుబడి వ్యూహాలను పరిచయం చేసింది. దీంతో అత్యధిక మంది క్లయింట్ల ఆకర్షించేలా మంచి ఫలితాలను అందుకుంది. అంతేగాదు సారా ఫోర్బ్స్ మ్యాగజైన్లో ప్రపంచంలోని అత్యుత్తమ మహిళల జాబితాలో చోటు దక్కించుకుంది. On the occasion of #InternationalWomensDay, Sarah al-Suhaimi, the Arab world’s first female stock exchange head, rang the opening bell of Tadawul, the largest financial market in the region.https://t.co/fo6MckbJ2M pic.twitter.com/s22FYn8ZZe — Al Arabiya English (@AlArabiya_Eng) March 8, 2019 (చదవండి: యూఎస్లోనే అత్యంత సంపన్న మహిళగా..ఏకంగా 75 వేల కోట్లు..!) -
ఆర్థిక సంవత్సరానికి లాభాలతో గుడ్ బై...
ముంబై: ఆర్థిక సంవత్సరం చివరి రోజైన గురువారం స్టాక్ సూచీలు లాభాలతో ముగిశాయి. సెన్సెక్స్ 655 పాయింట్లు పెరిగి 73,651 వద్ద ముగిసింది. నిఫ్టీ 203 పాయింట్లు బలపడి 22,327 వద్ద నిలిచింది. ప్రపంచ ఈక్విటీ మార్కెట్ల నుంచి సానకూల సంకేతాలు అందుకున్న సూచీలు ఉదయం లాభాలతో మొదలయ్యాయి. ట్రేడింగ్ ప్రారంభం నుంచి మీడియా మినహా అన్ని రంగాల షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించింది. ఒక దశలో సెన్సెక్స్ 1,194 పాయింట్లు పెరిగి 74,190 వద్ద, నిఫ్టీ 392 పాయింట్లు బలపడి 22,516 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని అందుకున్నాయి. స్టాక్ మార్కెట్ సంబంధించి ఆర్థిక సంవత్సరం చివరి రోజు కావడంతో పాటు ఫారెక్స్ మార్కెట్లో బలహీనతల కారణంగా ఆఖర్లో లాభాల స్వీకరణ చోటు చేసుకుంది. దీంతో సూచీలు కొంతమేర ఆరంభ లాభాలు కోల్పోయాయి. సెన్సెక్స్ దాదాపు ఒకశాతం లాభపడటంతో బీఎస్ఈలో రూ.3.33 లక్షల కోట్ల సంపద సృష్టి జరిగింది. ► సెన్సెక్స్ 30 షేర్లలో యాక్సిస్ బ్యాంక్ (0.50%), రిలయన్స్ (0.37%), హెచ్సీఎల్ (0.26%), టెక్ మహీంద్రా (0.25%) మాత్రమే నష్టపోయాయి. మిగిలిన 26 షేర్లూ లాభపడ్డాయి. ► బీఎస్ఈ, నిఫ్టీలు ఎంపిక చేసుకున్న షేర్లలో బీటా వెర్షన్ టి+0 ట్రేడ్ సెటిల్మెంట్ను ప్రారంభించాయి. తొలి రోజున రెండు ఎక్స్ఛేంజిల్లో 60 మందికి పైగా సభ్యులు పాల్గొన్నారు. నేడు ఎక్స్ఛేంజిలకు గుడ్ఫ్రైడే సెలవు. శని, ఆదివారాలు సాధారణ సెలవులు రోజులు కావడంతో ట్రేడింగ్ సోమవారం ప్రారంభం అవుతుంది. ర్యాలీ ఎందుకంటే ప్రత్యామ్నాయ పెట్టుబడి ఫండ్ల(ఏఐఎఫ్)లో రుణదాతల పెట్టుబడులపై గతంలో కఠిన ఆంక్షల విధించిన ఆర్బీఐ తాజాగా నిబంధనలను సులభతరం చేయడంతో అధిక వెయిటేజీ ప్రభుత్వ, ప్రైవేటు బ్యాంకులతో పాటు ఫైనాన్స్ రంగాల షేర్లు రాణించాయి. మోర్గాన్ స్టాన్లీ వచ్చే ఆర్థిక సంవత్సరానికి గానూ భారత వృద్ధి అవుట్లుక్ను 6.5 శాతం నుంచి 6.8 శాతానికి అప్గ్రేడ్ చేసింది. ఇటీవల ఎఫ్ఐఐలు భారత ఈక్విటీల పట్ల కొనుగోళ్లకు ఆసక్తి చూపుతున్నారు. అమెరికా సూచీలు రికార్డు స్థాయిల్లో ట్రేడవుతున్నాయి. ఆసియా, యూరప్ మార్కెట్లు 0.5% పెరిగాయి. 2023– 24లో రూ.128 లక్షల కోట్ల సృష్టి దేశీయ స్టాక్ మార్కెట్ 2023–24లో గణనీయమైన లాభాలు పంచింది. సెన్సెక్స్ 14,660 పాయింట్లు (25%) ర్యాలీతో ఇన్వెస్టర్ల సంపదగా భావించే బీఎస్ఈలో కంపెనీల మొత్తం విలువ ఏడాది వ్యవధిలో 128 లక్షల కోట్ల పెరిగి రూ.387 లక్షల కోట్లు చేరింది. సెన్సెక్స్ మార్చి 7న 74,245 వద్ద జీవితకాల గరిష్టాన్ని నమోదు చేసింది. మార్చి 2న ఇన్వెస్టర్ల సంపద సైతం రూ.394 లక్షల వద్ద ఆల్టైం హైని తాకింది. ఇదే కాలంలో నిఫ్టీ 4,967 పాయింట్లు(29%) పెరిగింది. మార్చి 11న 22,526 వద్ద చరిత్రాత్మక గరిష్టాన్ని అందుకుంది. 2022–23లో 423 పాయింట్లు పెరిగినప్పటికీ ఇన్వెస్టర్లకు రూ. 5.86 లక్షల కోట్ల నష్టం వాటిల్లింది. కార్వికి సెబీ మరో షాక్ కార్వీ ఇన్వెస్టర్ సర్వీసెస్ లిమిటెడ్కు సెబీ మరో షాక్ ఇచ్చింది. అర్హత ప్రమాణాలను ఉల్లంఘించినందుకు మర్చంట్ బ్యాంకర్ రిజి్రస్టేషన్ను రద్దు చేసింది. 2023 మార్చి 15–17 తేదీల్లో కార్వీ ఇన్వెస్టర్ సర్విసెస్ను సెబీ బృందం తనిఖీల నేపథ్యంలో తాజా నిర్ణయం తీసుకుంది. గతంలోనూ సెబీ కార్వీపై పలు చర్యలు తీసుకున్న సంగతి విదితమే. ఐసీఐసీఐ సెక్యూరిటీస్ డీలిస్టింగ్ స్టాక్ ఎక్స్ఛేంజిల నుంచి డీలిస్ట్ చేసేందుకు 72 శాతం వాటాదారులు అనుమతించినట్లు ఐసీఐసీఐ సెక్యూరిటీస్ తాజాగా వెల్లడించింది. అయితే రిటైల్ ఇన్వెస్టర్లు ఈ పథకాన్ని వ్యతిరేకిస్తున్నట్లు పేర్కొంది. డీలిస్టింగ్ తదుపరి మాతృ సంస్థ ఐసీఐసీఐ బ్యాంక్లో విలీనంకానున్నట్లు తెలియజేసింది. డీలిస్టింగ్ పథకంలో భాగంగా ఐసీఐసీఐ సెక్యూరిటీస్ వాటాదారులు తమ వద్దగల ప్రతీ 100 షేర్లకుగాను 67 ఐసీఐసీఐ బ్యాంక్ షేర్లను పొందనున్నట్లు వెల్లడించింది. -
అదే రోజు సెటిల్మెంట్
న్యూఢిల్లీ: ట్రేడ్ చేసిన రోజే సెటిల్మెంట్ విధానాన్ని తీసుకొచ్చే దిశగా సెబీ కీలక అడుగు వేసింది. అదే రోజు సెటిల్మెంట్ (సేమ్డే), వెనువెంటనే (రియల్ టైమ్) సెటిల్మెంట్ను ఐచ్ఛికంగా ప్రవేశపెట్టడానికి సంబంధించి సంప్రదింపుల పత్రాన్ని విడుదల చేసింది. స్టాక్ ఎక్సే్ఛంజ్లలో షేర్ల కొనుగోలు, విక్రయ లావాదేవీలకు ప్రస్తుతం టీప్లస్1 విధానం అమల్లో ఉంది. అంటే ట్రేడ్ చేసిన రోజు కాకుండా తదుపరి పని దినం రోజున ఆ షేర్ల సెటిల్మెంట్ (విక్రయించిన వారి నుంచి తీసుకుని, కొనుగోలు చేసిన వారికి జమ చేయడం) చేస్తున్నారు. టీప్లస్1 విధానాన్ని సెబీ 2021లో దశలవారీగా అమల్లోకి తీసుకొచి్చంది. అంతకుముందు వరకు టీప్లస్2 విధానం ఉండేది. టీప్లస్5 స్థానంలో టీప్లస్3ని 2002లో ప్రవేశపెట్టారు. 2003లో టీప్లస్2 అమల్లోకి వచి్చంది. అదే రోజు సెటిల్మెంట్ విధానం వల్ల షేర్లను విక్రయించిన వారికి ఆ రోజు ముగింపు లేదా మరుసటి రోజు ఉదయానికి నిధులు అందుబాటులోకి వస్తాయి. షేర్లను కొనుగోలు చేసిన వారికి ఖాతాల్లో అదే రోజు జమ అవుతాయి. దీనివల్ల మరింత లిక్విడిటీ, ఇన్వెస్టర్లకు సౌకర్యం లభిస్తుంది. ఈ సంప్రదింపుల పత్రంపై జనవరి 12 వరకు సూచనలు, సలహాలు తెలియజేయాలని ప్రజలను సెబీ కోరింది. ఐచ్ఛికంగా.. సెక్యూరిటీలు, నిధుల క్లియరింగ్, సెటిల్మెంట్కు టీప్లస్0, ఇన్స్టంట్ సెటిల్మెంట్ సైకిల్ను ప్రస్తుత టీప్లస్1 విధానంతోపాటు ఐచి్ఛకం అమలును ప్రతిపాదిస్తున్నట్టు సెబీ తన సంప్రదింపుల పత్రంలో పేర్కొంది. ఇన్వెస్టర్ల ప్రయోజనాల పరిరక్షణకు, సెక్యూరిటీల మార్కెట్ల అభివృద్ధికి సెబీ వరుసగా పలు చర్యలు తీసుకుంటూ వస్తున్న విషయం తెలిసిందే. తక్షణ సెటిల్మెంట్ సైకిల్ను అమల్లోకి తీసుకురావడమే క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ ఉద్దేశ్యంగా ఉంది. నిజానికి ఇన్వెస్టర్ షేర్లను కొనుగోలు చేయాలంటే, ముందుగా అందుకు సంబంధించిన నిధుల మొత్తాన్ని తన ఖాతాకు జోడించుకోవడం తప్పనిసరి. అప్పుడే కొనుగోలుకు అవకాశం ఉంటుంది. అలాగే, షేర్ల విక్రయానికి (డెలివరీ) సైతం ఆయా సెక్యూరిటీలను కలిగి ఉండాలి. అప్పుడే బ్రోకర్లు ట్రేడ్లను అనుమతిస్తారు. కనుక తక్షణ సెటిల్మెంట్ ఆచరణ సులభమేనని సెబీ భావిస్తోంది. దీనివల్ల సెక్యూరిటీలు, నిధులను తక్షణమే ఇన్వెస్టర్లు పొందడానికి వీలు పడుతుందన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. ఆందోళనలు.. ‘‘నూతన విధానం వల్ల లిక్విడిటీ తగ్గిపోతుందని, సమర్థమైన ధరల అన్వేషణపై ప్రభావం పడుతుందన్న ఆందోళనలు నెలకొన్నాయి. అలాగే, ట్రేడ్లు చేయడానికి ముందే నిధులు, సెక్యూరిటీలు కలిగి ఉండాల్సి రావడం వల్ల ట్రేడింగ్ వ్యయం పెరిగిపోతుందని.. ఫలితంగా టీప్లస్1 సెటిల్మెంట్ సైకిల్తో పోలిస్తే టీప్లస్0 విధానంలో ధరల వ్యత్యాసానికి దారితీస్తుంద్న ఆందోళన ఉంది’’అని సెబీ పేర్కొంది. ఈ ఆందోళనలను తగ్గించేందుకు వీలుగా టీప్లస్0, టీప్లస్1నూ వినియోగించుకునే వెసులుబాటును కలి్పస్తున్నట్టు తెలిపింది. తద్వారా రెండు విధానాల మధ్య ధరల అంతరాన్ని తొలగించుకోవచ్చని పేర్కొంది. రెండింటి మధ్య సెక్యూరిటీ ధరల్లో అంతరం ఉంటే ఆర్బిట్రేజ్ ద్వారా ప్రయోజనం, లిక్విడిటీని పొందొచ్చని తెలిపింది. రెండు దశల్లో మొదటి దశలో టీప్లస్0 విధానాన్ని మధ్యా హ్నం 1.30 గంటల వరకు ఐచి్ఛకంగా అమలు చేయవచ్చు. ఈ వ్యవధిలోపు నమోదైన ట్రేడ్స్కు సంబంధించి నిధులు, సెక్యూరిటీల పరిష్కారాన్ని సాయంత్రం 4.30 గంటలకు పూర్తి చేస్తారు. రెండో దశలో ఇన్స్టంట్ ట్రేడ్ విధానాన్ని అమలు చేయనున్నారు. ఇది 3.30 గంటల వరకు ఉంటుందని సెబీ సంప్రదింపుల పత్రం స్పష్టం చేస్తోంది. -
Madhabi Puri Buch: ఇక అదే రోజు సెటిల్మెంట్
ముంబై: క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ రానున్న(2024) మార్చికల్లా స్టాక్ ఎక్సే్ఛంజీలలో నిర్వహించే లావాదేవీల సెటిల్మెంట్ను అదే రోజు పూర్తిచేసేందుకు వీలు కలి్పంచనుంది. ఇప్పటికే లావాదేవీ చేపట్టిన ఒక్క రోజులోనే(టీప్లస్ 1) సెటిల్మెంట్ పూర్తవుతోంది. అయితే మార్చికల్లా లావాదేవీ నిర్వహించిన రోజే(టీప్లస్0) సెటిల్మెంట్కు తెరతీసే లక్ష్యంతో ఉన్నట్లు సెబీ చైర్పర్శన్ మాధవీ పురి బచ్ పేర్కొన్నారు. ఆపై మరో 12 నెలల్లోగా లావాదేవీ నమోదైన వెంటనే అప్పటికప్పుడు(ఇన్స్టెంట్) సెటిల్మెంట్కు వీలు కలి్పంచాలని భావిస్తున్నట్లు తెలియజేశారు. వెరసి రియల్టైమ్ ప్రాతిపదికన లావాదేవీల పూర్తిని చేపట్టాలని ఆశిస్తున్నట్లు సెబీ బోర్డు సమావేశం తదుపరి విలేకరుల సమావేశంలో మాధవి వెల్లడించారు. స్టాక్ మార్కెట్ లావాదేవీల ఇన్స్టెంట్ సెటిల్మెంట్ ఆలోచనపై మార్కెట్ మేకర్స్ నుంచి ఈ సందర్భంగా సలహాలు, సూచనలను ఆహా్వనిస్తున్నట్లు తెలియజేశారు. కొత్త సెటిల్మెంట్ను ప్రస్తుత సెటిల్మెంట్కు సమాంతరంగా అమలు చేయనున్నట్లు పేర్కొన్నారు. కొత్త సెటిల్మెంట్ను ఐచ్ఛికంగా ఎంపిక చేసుకోవచ్చని మాధవి తెలిపారు. అయితే కొన్ని ఎంపిక చేసిన భారీ ప్రొడక్టులకు మాత్రమే అది కూడా ఆప్షనల్గా అందుబాటులో ఉంటుందని వెల్లడించారు. ఈ ఏడాది జనవరి నుంచి స్టాక్ మార్కెట్ లావాదేవీల సెటిల్మెంట్ గడువును టీప్లస్ 2 నుంచి టీప్లస్ 1కు తగ్గించిన సంగతి తెలిసిందే. -
ఆరు కంపెనీలుగా వేదాంతా
బిలియనీర్ అనిల్ అగర్వాల్ గ్రూప్.. వేదాంతా రిసోర్సెస్.. సరికొత్త ప్రణాళికలకు తెరతీసింది. వీటి ప్రకారం డైవర్సిఫైడ్ దిగ్గజం వేదాంతా లిమిటెడ్ ఆరు లిస్టెడ్ కంపెనీలుగా విడిపోనుంది. ఇక మైనింగ్ దిగ్గజం హిందుస్తాన్ జింక్ విభిన్న విభాగాల కార్పొరేట్ నిర్మాణాన్ని పూర్తిస్థాయిలో సమీక్షించనుంది. తద్వారా ఓవైపు రుణ భారాన్ని తగ్గించుకోవడం, మరోపక్క వాటాదారులకు అధిక విలువను రాబట్టడం లక్ష్యాలుగా పెట్టుకుంది. వివరాలు చూద్దాం.. న్యూఢిల్లీ: డైవర్సిఫైడ్ దిగ్గజం వేదాంతా లిమిటెడ్ కీలక బిజినెస్లను ప్రత్యేక కంపెనీలుగా విడదీయనుంది. అల్యూమినియం, ఆయిల్– గ్యాస్, స్టీల్, ఫెర్రస్ మెటల్స్, బేస్ మెటల్స్ పేరుతో ఐదు విభాగాలను విడదీసేందుకు ప్రణాళికలు వేసింది. వీటిని విడిగా లిస్ట్ చేయడం ద్వారా వాటాదారులకు మరింత విలువ చేకూర్చనున్నట్లు వేదాంతా తాజాగా వెల్లడించింది. దీనిలో భాగంగా సరళతర విభజనకు తెరతీయనుంది. వెరసి వేదాంతా వాటాదారులకు తమవద్దగల ప్రతీ 1 షేరుకీ విడదీయనున్న 5 కంపెనీలకు చెందిన ఒక్కో షేరు చొప్పున కేటాయించనున్నారు. ఆపై వీటిని స్టాక్ ఎక్సే్చంజీలలో లిస్ట్ చేయనున్నట్లు వేదాంతా తెలియజేసింది. వెరసి వేదాంతాసహా.. ఆరు లిస్టెడ్ కంపెనీలకు తెరలేవనుంది. ఇక మరోవైపు హిందుస్తాన్ జింక్సహా.. కొత్తగా ఏర్పాటు చేసిన స్టెయిన్లెస్ స్టీల్, సెమీకండక్టర్ డిస్ప్లే బిజినెస్లలో 65 శాతం చొప్పున వాటాను కలిగి ఉండనుంది. ఈ మొత్తం ప్రణాళికల అమలును 12–15 నెలలలోగా పూర్తిచేయాలని వేదాంతా భావిస్తోంది. గ్రూప్నకు మాతృ సంస్థ వేదాంతా రిసోర్సెస్.. హోల్డింగ్ కంపెనీగా కొనసాగనుంది. హింద్ జింక్ కార్పొరేట్ సమీక్ష వేదాంతా గ్రూప్ కంపెనీ హిందుస్తాన్ జింక్ పూర్తిస్థాయిలో కార్పొరేట్ నిర్మాణాన్ని సమీక్షించనుంది. కంపెనీ విలువలో మరింత వృద్ధికి వీలుండటంతో కార్పొరేట్ నిర్మాణ సమీక్షకు బోర్డు నిర్ణయించినట్లు మైనింగ్ దిగ్గజం హిందుస్తాన్ జింక్ వెల్లడించింది. ప్రధానంగా జింక్, లెడ్, సిల్వర్, రీసైక్లింగ్ బిజినెస్లను ప్రత్యేక చట్టబద్ధ సంస్థలుగా ఏర్పాటు చేసే లక్ష్యంతో ఉన్నట్లు తెలియజేసింది. కంపెనీకిగల భిన్న విభాగాల పరిమాణం, కార్యకలాపాలు, వృద్ధి అవకాశాలను పరిగణనలోకి తీసుకుని తాజా ప్రతిపాదనలకు తెరతీసినట్లు వివరించింది. వీటిలో బిజినెస్ అవసరాలరీత్యా మూలధన నిర్మాణం, పెట్టుబడి కేటాయింపుల విధానాలు, కీలక అంశాలపై ప్రత్యేక దృష్టి తదితర అంశాలున్నట్లు తెలియజేసింది. తద్వారా విభిన్న బిజినెస్లు తమ మార్కెట్ పొజిషన్ను వినియోగించుకుని దీర్ఘకాలిక వృద్ధి సాధించేందుకు వీలు కల్పించనున్నట్లు తెలియజేసింది. వెరసి అన్ని రకాల వాటాదారులకు విలువ చేకూర్చే వ్యూహంతో ఉన్నట్లు పేర్కొంది. బిజినెస్ల విడదీత వార్తలతో ఎన్ఎస్ఈలో వేదాంతా షేరు 7 శాతం దూసుకెళ్లి రూ. 223 వద్ద నిలవగా.. హిందుస్తాన్ జింక్ 3.5 శాతం జంప్చేసి రూ. 308 వద్ద ముగిసింది. నిధుల సమీకరణ.. ప్రతీ ప్రత్యేక విభాగాన్నీ ఒక్కొక్క కంపెనీగా విడదీయడం ద్వారా వేదాంతా గ్రూప్ కార్పొరేట్ నిర్మాణాన్ని సరళతరంగా మార్చివేయనుంది. ఆయా రంగాలపై పూర్తిస్థాయిలో దృష్టిసారించే బాటలో స్వతంత్ర సంస్థలుగా ఏర్పాటు చేయనుంది. దీంతో సావరిన్ వెల్త్ఫండ్స్ తదితర గ్లోబల్ ఇన్వెస్టర్లతోపాటు.. సంస్థాగత, రిటైల్ ఇన్వెస్టర్లకు పెట్టుబడి అవకాశాలను కలి్పంచే యోచనలో ఉంది. వెరసి దేశ ఆర్థిక వృద్ధిని అవకాశాలుగా మలచుకునే ప్యూర్ప్లే కంపెనీలలో పెట్టుబడులకు వ్యూహాత్మక ఇన్వెస్టర్లను ఆకట్టుకోనుంది. ప్రపంచస్థాయి మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యమిస్తున్న భారత్లో కమోడిటీలకు భారీ డిమాండ్ కనిపించనున్నట్లు వేదాంతా భావిస్తోంది. ఇటీవలే సెమీకండక్టర్లు, డిస్ప్లే తయారీలోకి సైతం ప్రవేశించింది. -
కొత్త రికార్డ్! ఐపీవో ముగిసిన రెండు రోజుల్లోనే లిస్టింగ్..
న్యూఢిల్లీ: గత వారం ఐపీవోకు వచ్చిన వైర్లు, కేబుళ్ల తయారీ కంపెనీ ఆర్ఆర్ కేబుల్ కొత్త రికార్డుకు తెరతీస్తోంది. బుధవారం (సెప్టెంబర్ 20) స్టాక్ ఎక్స్చేంజీల్లో లిస్ట్ అవుతోంది. వెరసి పబ్లిక్ ఇష్యూ ముగిసిన రెండు రోజుల్లోనే స్టాక్ ఎక్సే్ఛంజీల్లో లిస్ట్ అయిన తొలి కంపెనీగా నిలుస్తోంది. ఇక టీ+3 విధానంలో లిస్టయిన తొలి కంపెనీ రత్నవీర్ ప్రెసిషన్ ఇంజనీరింగ్కాగా.. రెండో రోజు నుంచి టీ+2లో ఆర్ఆర్ కేబుల్లో ట్రేడింగ్ ప్రారంభంకానుంది. క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ ఆగస్ట్లో ఐపీవో తదుపరి లిస్టింగ్ కాలాన్ని సగానికి కుదించింది. దీంతో టీ+6 నుంచి టీ+3కి లిస్టింగ్ కాలావధి తగ్గింది. ఆర్ఆర్ కేబుల్ ఇష్యూ సెప్టెంబర్ 13న మొదలై 15న ముగిసింది. సెప్టెంబర్ 1 నుంచి లిస్టింగ్ తాజా మార్గదర్శకాలు స్వచ్చంద ప్రాతిపదికన అమలులోకి వచ్చాయి. అయితే 2023 డిసెంబర్ 1 నుంచి తప్పనిసరి కానున్నాయి. ఈ నెల 20 నుంచి ఆర్ఆర్ కేబుల్ ఈక్విటీ షేర్లు బీ గ్రూప్లో లిస్ట్కానున్నట్లు బీఎస్ఈ ఒక ప్రకటనలో పేర్కొంది. -
డెలాయిట్ రాజీనామాకు సరైన కారణాలు లేవు
న్యూఢిల్లీ: ఆడిటింగ్ బాధ్యతల నుంచి తప్పుకోవడానికి సంబంధించి డెలాయిట్ చెబుతున్న కారణాలు సహేతుకంగా, నమ్మశక్యంగా లేవని అదానీ పోర్ట్స్ అండ్ స్పెషల్ ఎకనమిక్ జోన్ (ఏపీసెజ్) వ్యాఖ్యానించింది. ఈ అంశంపై స్టాక్ ఎక్సే్చంజీలకు 163 పేజీల వివరణ సమరి్పంచింది. డెలాయిట్ హాస్కిన్స్ అండ్ సెల్స్తో తమ నాయకత్వం నిర్వహించిన సమావేశాల్లో గ్రూప్లోని ఇతర లిస్టెడ్ కంపెనీల ఆడిటింగ్ వ్యవహారాలపై డెలాయిట్ ఆందోళన వ్యక్తం చేసినట్లు పేర్కొంది. అయితే, ఇతర సంస్థలన్నీ స్వతంత్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్నవైనందున.. వాటిల్లో నియామకాల విషయంలో సిఫార్సులు చేయడమనేది ఆడిటర్ పరిధిలో ఉండదని డెలాయిట్కు తాము స్పష్టం చేసినట్లు వివరించింది. ఆడిటర్గా కొనసాగేందుకు డెలాయిట్ ఇష్టపడకపోవడం వల్ల సామరస్యంగా క్లయిట్–ఆడిటర్ కాంట్రాక్టును రద్దు చేసుకున్నట్లు తెలిపింది. డెలాయిట్ రాజీనామా వల్ల ఆరి్థక ఫలితాలపై ఎటువంటి ప్రతికూల ప్రభావం ఉండబోదని పేర్కొంది. వివాదాస్పద హిండెన్బర్గ్ నివేదిక పరిణామాల నేపథ్యంలో అదానీ గ్రూప్ కంపెనీలకు సంబంధించి కొన్ని లావాదేవీలపై డెలాయిట్ కూడా సందేహాలు వ్యక్తం చేసింది. అదానీ గ్రూప్లోని ఇతరత్రా సంస్థలకు తాము అధికారిక ఆడిటర్లుగా లేనందున తక్షణం ఏపీసెజ్ నుంచి కూడా తప్పుకుంటున్నట్లు ఆగస్టు 12న ప్రకటించింది. దీంతో ఏపీసెజ్ ఎంఎస్కేఏ అండ్ అసోసియేట్స్ను ఆడిటర్గా నియమించుకుంది. -
మూడు రోజుల్లోనే లిస్టింగ్ - సెబీ తాజా నిర్ణయం
న్యూఢిల్లీ: ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్ (ఐపీవో)లకు సంబంధించి సెబీ సానుకూల నిర్ణయం తీసుకుంది. ఐపీవో ఇష్యూ ముగిసిన రోజు నుంచి ఆరు పని దినాల్లో స్టాక్ ఎక్స్చేంజ్లలో ప్రస్తుతం లిస్ట్ కావాల్సి ఉండగా, దీన్ని మూడు రోజులకు తగ్గించింది. అంటే ఇకపై ఐపీవో ముగిసిన రోజు తర్వాత నుంచి మూడో పనిదినం రోజున ఆ కంపెనీ స్టాక్ ఎక్స్చేంజ్లలో లిస్ట్ కావాల్సి ఉంటుంది. సెప్టెంబర్ 1, ఆ తర్వాత నుంచి వచ్చే ఐపీవోలకు మూడు రోజుల లిస్టింగ్ నిబంధన ఐచ్ఛికమే. అంటే ఇప్పటి మాదిరే ఆరు రోజులు (టీప్లస్6) లేదంటే మూడు రోజుల గడువు (టీప్లస్3)ను కంపెనీలు అనుసరించొచ్చు. కానీ, డిసెంబర్ 1 నుంచి మాత్రం విధిగా అన్ని ఐపీవోలు మూడు రోజుల లిస్టింగ్ నిబంధననే అమలు చేయాల్సి ఉంటుందని సెబీ తన ఆదేశాల్లో స్పష్టం చేసింది. అందరికీ అనుకూలమే సెబీ నిర్ణయం చిన్న ఇన్వెస్టర్ల నుంచి పెద్ద ఇన్వెస్టర్ల వరకు ఎంతో ప్రయోజనం కలిగించనుంది. షేర్ల కేటాయింపు లేకపోతే బ్యాంక్ ఖాతాల్లో బ్లాక్ అయిన నిధులు తొందరగా విడుదల అవుతాయి. రుణం తీసుకుని ఐపీవోల్లో దరఖాస్తు చేసే హెచ్ఎన్ఐలు కూడా ఉంటారు. వీరికి రోజుల వారీగా రుణంపై వడ్డీ భారం పడుతుంది. తొందరగా లిస్ట్ అయితే, తాము తీసుకున్న రుణాన్ని తొందరగా తీర్చేసే వీలుంటుంది. అటు ఐపీవోకు వచ్చిన కంపెనీలకూ ప్రయోజనమే. ఎలా అంటే ఐపీవో నిధులను అవి వేగంగా పొందొచ్చు. ఏఎస్బీఏ కింద షేర్లు అలాట్ కాని వారి నిధులను బ్యాంకు ఖాతాల్లో టీప్లస్3 రోజున అన్బ్లాక్ చేయాల్సి ఉంటుంది. లేదంటే వారికి చెల్లించే పరిహారం అనేది ట్లీప్లస్3 తర్వాతి రోజు నుంచి అమల్లోకి వస్తుందని సెబీ తెలిపింది. -
9 భాషల్లో ఎన్డీటీవీ న్యూస్ ఛానల్స్
న్యూఢిల్లీ: అదానీ గ్రూప్లో భాగమైన మీడియా దిగ్గజం న్యూఢిల్లీ టెలివిజన్ (ఎన్డీటీవీ) తొమ్మి ది భారతీయ భాషల్లో న్యూస్ ఛానల్స్ను మొదలుపెట్టే యోచనలో ఉంది. దశలవారీగా వీటిని ప్రారంభించనున్నట్లు స్టాక్ ఎక్సే్చంజీలకు సంస్థ తెలియజేసింది. ఇందుకోసం సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ అనుమతులు తీసుకోవాలన్న ప్రతిపాదనకు గురువారం జరిగిన సమావేశంలో బోర్డు ఆమోదముద్ర వేసినట్లు వివరించింది. అనుమతులు వచ్చాక చానళ్ల ప్రారంభ తేదీలను స్టాక్ ఎక్సే్చంజీలకు తెలియజేస్తామని పేర్కొంది. ఎన్డీటీవీ వ్యవస్థాపకులు ప్రణయ్ రాయ్, రాధికా రాయ్ల వాటాలను కూడా కొనుగోలు చేసిన తర్వాత అదానీ గ్రూప్ గతేడాది డిసెంబర్లో కంపెనీని పూర్తిగా దక్కించుకుంది. 2023 మార్చి 31తో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో ఎన్డీటీవీ రూ. 221 కోట్ల ఆదాయం నమోదు చేసింది. -
హైదరాబాద్లో లండన్ స్టాక్ ఎక్స్చేంజ్ గ్రూప్ టెక్ సెంటర్
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ నగరంలో టెక్నాలజీ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ సెంటర్ ఏర్పాటుకు లండన్ స్టాక్ ఎక్స్చేంజ్ ముందుకు వచ్చింది. లండన్ స్టాక్ ఎక్స్ఛేంజ్ గ్రూప్ పీఎల్సీఎక్సలెన్స్ సెంటర్ఏర్పాటుతో దాదాపు వెయ్యిమందికి ఉపాధి లభించనుంది.మంత్రి కేటీఆర్తో లండన్లోజరిగిన సమావేశం అనంతరం సంస్థ ప్రకటించింది. (ప్యూర్ ఈవీ కొత్త ఈ-స్కూటర్: 150 కి.మీ రేంజ్, ధర ఎంతంటే?) ఈ మేరకు తెలంగాణ ఐటీ, పరిశ్రమల మంత్రి కేటీఆర్ లండన్లో ఎల్ఎస్ఈజీ గ్రూప్ చీఫ్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ (CIO) ఆంథోనీ మెక్కార్తీతో సమావేశం అయ్యారు. తెలంగాణ రాష్ట్రానికి పెట్టుబడులు ఆకర్షించడమే లక్ష్యంగా కొనసాగుతున్న మంత్రి కేటీఆర్ యూకే పర్యటనలో భాగంగా తెలంగాణ ప్రభుత్వం, ఎల్ఎస్ఈజీ మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది. ఈ ఎంఓయూపై పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్, ఎన్ఆర్ఐ వ్యవహారాల ప్రత్యేక కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి మెక్కార్తీ సంతకాలు చేశారు. ఇది ఫైనాన్షియల్ సర్వీసెస్, ఇన్సూరెన్స్ రంగానికి ఊతమమ్వివనుందని అంచనా. లండన్ స్టాక్ ఎక్స్ఛేంజ్ గ్రూప్ గ్లోబల్ ఫైనాన్షియల్ మార్కెట్స్కు ఇన్ఫ్రాస్ట్రక్చర్, డేటా ప్రొవైడర్గా సేవలందిస్తున్నది. ప్రపంచవ్యాప్తంగా 70 దేశాలలో పని చేయడంతో పాటు 190 దేశాలలో వినియోగదారులకు సేవలు అందిస్తోంది. Exciting news for Telangana, all the way from London! London Stock Exchange Group PLC (LSEG) announces its decision to set up a Technology Centre of Excellence in Hyderabad generating employment for about 1000 people in a year. The announcement was made after Minister @KTRBRS,… pic.twitter.com/9gqmgzzm65 — Minister for IT, Industries, MA & UD, Telangana (@MinisterKTR) May 12, 2023 -
స్టార్టప్లలో మహిళల హవా
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: గతంలో పురుషులకు మాత్రమే పరిమితమైన దేశీ స్టార్టప్ రంగంలో ఇప్పుడు మహిళలు దూసుకెళుతున్నారు. కొంగొత్త ఆవిష్కరణలతో అంకుర సంస్థలను విజయవంతంగా నడిపిస్తున్నారు. టెక్నాలజీ, ఈ–కామర్స్, ఫైనాన్స్ తదితర రంగాల్లో రాణిస్తున్నారు. మహిళల సారథ్యంలోని నైకా, జివామి, షీరోస్ వంటి పలు విజయవంతమైన అంకుర సంస్థలు ఇందుకు నిదర్శనం. ఫల్గుణీ నాయర్ నేతృత్వంలోని ఫ్యాషన్ ప్రొడక్ట్స్ సంస్థ నైకా... సంచలన స్థాయిలో స్టాక్ ఎక్స్చేంజీల్లో లిస్టయ్యింది. ఇన్వెస్టర్లు భారీగా ఎగబడి మరీ షేర్లు కొన్నారు. ఇక అంతకన్నా ముందు .. దాదాపు నలభై ఏళ్ల క్రితం రజని బెక్టర్ ఏర్పాటు చేసిన బేకరీ ఉత్పత్తుల సంస్థ మిసెస్ బెక్టర్స్ లిస్టింగ్కు వస్తే ఇన్వెస్టర్లు బ్రహ్మరథం పట్టారు. ఇలాంటి సానుకూల స్పందన ఊతంతో మరిన్ని స్టార్టప్లు కూడా లిస్టింగ్ బాట పడుతున్నాయి. గజల్ అలగ్ సహ–వ్యవస్థాపకురాలిగా ఉన్న ఆరోగ్య ఉత్పత్తుల సంస్థ మామాఎర్త్ కూడా తాజాగా ఐపీవో యత్నాల్లో ఉంది. ఇలా పలు అంకుర సంస్థలు మహిళలకు ఉపాధి అవకాశాలు కల్పించడంతో పాటు మహిళలకు అవసరమైన ఉత్పత్తులు, సర్విసులను అందించడంపై ప్రధానంగా దృష్టి పెట్టేవిగా ఉంటున్నాయి. 2014లో చిన్న, మధ్య తరహా వ్యాపారాలు సహా దేశీయంగా మహిళల సారథ్యంలోని స్టార్టప్ల సంఖ్య .. మొత్తం అంకుర సంస్థల్లో 8 శాతంగా ఉండేది. ప్రస్తుతం ఇది దాదాపు 14 శాతానికి చేరినట్లు గణాంకాలు చెబుతున్నాయి. పురుషుల సారథ్యంలోని అంకుర సంస్థలతో పోలిస్తే మహిళల నేతృత్వంలోని స్టార్టప్లు 2.5 రెట్లు ఎక్కువగా మహిళలకు ఉపాధి కల్పిస్తున్నాయని, పెట్టుబడులపై 35 శాతం అధికంగా రాబడులు అందించగలుగుతున్నాయని పరిశ్రమవర్గాలు పేర్కొన్నాయి. లక్ష్యంపైనే గురి.. వ్యాపారాన్ని ప్రారంభించడమంటే అనేక సవాళ్లతో కూడుకున్న వ్యవహారం కావడంతో పాటు మిగతా వర్గాల నుంచి సహకారం లభించడం కూడా కీలకం. వ్యాపారం ప్రారంభించడానికి ముందే టార్గెట్ మార్కెట్, పోటీ, తాము అందించే సర్వీసులు, ఉత్పత్తుల ప్రత్యేకత వంటి అంశాలపై స్పష్టమైన అవగాహన ఉండాలని స్పేస్మంత్ర వ్యవస్థాపకురాలు నిధి అగర్వాల్ పేర్కొన్నారు. మహిళా ఎంట్రప్రెన్యూర్లు మరింత తరచుగా తమ నిర్ణయాలను ప్రశ్నించుకుంటూ ముందుకు సాగాల్సి వస్తుందని టెరావిటా వ్యవస్థాపకురాలు రాహీ అంబానీ తెలిపారు. అయితే, ఒడిదుడుకులను అధిగమించి, లక్ష్యంపైనే దృష్టి పెడితే విజయం సాధించవచ్చని ఆమె పేర్కొన్నారు. ప్రభుత్వాల తోడ్పాటు.. స్టార్టప్ రంగంలోనూ మహిళలు రాణించేలా ప్రభుత్వాలు, వివిధ సంస్థలు తోడ్పాటు అందిస్తుండటం కూడా వారికి సహాయకరంగా ఉంటోంది. అటల్ ఇన్నోవేషన్ మిషన్, స్టాండప్ ఇండియా వంటి స్కీములు స్టార్టప్లకు అండగా ఉంటున్నాయి. నిధులపరంగాను, ఇతరత్రా సహాయాన్ని అందించేందుకు యాక్సిలరేటర్లు, ఇన్క్యుబేటర్లు మొదలైనవి ఉన్నాయి. ఏడబ్ల్యూఎస్ నుంచి యాక్సెలరేట్హర్ 2023 అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని అమెజాన్ వెబ్ సర్విసెస్ (ఏడబ్ల్యూఎస్), ప్రముఖ వెంచర్ క్యాపిటల్ సంస్థ లైట్స్పీడ్ కలిసి యాక్సెలరేట్హర్ 2023 పేరిట ప్రత్యేక ప్రోగ్రాంను ఆవిష్కరించాయి. ప్రారంభ స్థాయి దేశీ స్టార్టప్ల మహిళా వ్యవస్థాపకులు తమ సంస్థలను నిర్మించుకునేందుకు, వృద్ధిలోకి తెచ్చుకునేందుకు, విజయవంతమైన వ్యాపారాలుగా తీర్చిదిద్దుకునేందుకు అవసరమైన తోడ్పాటు దీని ద్వారా పొందవచ్చు. ఈ ఆరు వారాల యాక్సిలరేషన్ ప్రోగ్రామ్నకు దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు ఏడబ్ల్యూఎస్ ఇండియా హెడ్ (స్టార్టప్ ఎకోసిస్టమ్) అమితాబ్ నాగ్పాల్ తెలిపారు. దీనికి ఎంపికైన స్టార్టప్లు నిధుల సమీకరణ, సాంకేతిక అంశాలపరమైన మద్దతు పొందవచ్చని ఆయన పేర్కొన్నారు. కనీస లాభదాయకత ఉత్పత్తి కలిగి ఉండి, మూడు మిలియన్ డాలర్ల కన్నా తక్కువ నిధులను సమీకరించిన స్టార్టప్లు దీనికి దరఖాస్తు చేసుకోవచ్చు. ఫండ్ మేనేజర్లలో 10 శాతమే.. గడిచిన కొన్నేళ్లుగా మ్యూచువల్ ఫండ్ పరిశ్రమలో మహిళల మేనేజర్ల సంఖ్య పెరుగుతున్నా ఇప్పటికీ అది సుమారు 10% స్థాయిలోనే ఉన్నట్లు మారి్నంగ్స్టార్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్ ఇండియా వార్షిక నివేదిక పేర్కొంది. దీని ప్రకారం మహిళా ఫండ్ మేనేజర్ల సంఖ్య గతేడాది 32గా ఉండగా ప్రస్తుతం 42కి పెరిగింది. అదే సమయంలో మొత్తం ఫండ్ మేనేజర్ల సంఖ్య 399 నుంచి 428కి చేరింది. వీరిలో 42 మంది మహిళలు.. ఫండ్స్ను ప్రైమరీ లేదా సెకండరీ మేనేజర్లుగా నిర్వహిస్తున్నారు. 2017లో 18 మందికి పరిమితమైన ఫండ్ మేనేజర్ల సంఖ్య ఆ తర్వాత నుంచి క్రమంగా పెరిగినట్లు మార్నింగ్స్టార్ పేర్కొంది. ప్రస్తుతం 24 ఫండ్ సంస్థల్లో 42 మంది మహిళా మేనేజర్లు ఉన్నారు. మహిళా మాసంగా మార్చి .. ఐసీఐసీఐ లాంబార్డ్ ఆర్థిక, ఆరోగ్య విషయాల్లో మహిళలకు సాధికారత కల్పించే ప్రయత్నాల్లో భాగంగా మార్చి నెలను మహిళా మాసంగా పాటిస్తున్నట్లు ప్రైవేట్ రంగ బీమా సంస్థ ఐసీఐసీఐ లాంబార్డ్ వెల్లడించింది. ఈ సందర్భంగా కాంప్లిమెంటరీ హెల్త్ చెకప్లను అందిస్తున్నట్లు తెలిపింది. దేశవ్యాప్తంగా అన్ని ప్రధాన ప్రాంతాల్లోనూ ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ (ముందుగా వచ్చిన వారికి) ప్రాతిపదికన 10,000 మంది మహిళలకు ఈ అవకాశాన్ని కల్పిస్తున్నట్లు వివరించింది. దీని కింద థైరాయిడ్ ప్రొఫైల్, విటమిన్ డీ, బీ12 తదితర టెస్టులను నిర్వహిస్తారు. అలాగే మహిళా మోటరిస్టులకు కాంప్లిమెంటరీగా రోడ్సైడ్ అసిస్టెన్స్ సర్వీసులు అందిస్తున్నట్లు సంస్థ తెలిపింది. ఇక మహిళా ఎంట్రప్రెన్యూర్íÙప్ను ప్రోత్సహించే దిశగా మహిళా ఏజెంట్లను రిక్రూట్ చేసుకునేందుకు, అవగాహన కల్పించేందుకు సమగ్ర శిక్షణ కార్యక్రమం కూడా నిర్వహించనున్నట్లు కంపెనీ ఈడీ సంజీవ్ మంత్రి పేర్కొన్నారు. మహిళల కోసం సిగ్నిటీ ప్రత్యేక కార్యక్రమాలు టెక్నాలజీ రంగంలో మహిళలకు తోడ్పాటునిచ్చే దిశగా అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు సిగ్నిటీ టెక్నాలజీస్ సంస్థ వెల్లడించింది. మార్చి 9న ’ఉమెన్ ఇన్ టెక్ రౌండ్టేబుల్’ వర్చువల్ సమావేశాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపింది. పలు మహిళా దిగ్గజాలు పాల్గొనే ఈ చర్చాగోష్టికి సంస్థ ఎస్వీపీ శిరీష పెయ్యేటి సారథ్యం వహిస్తారు. అలాగే, మహిళలు కొత్త విషయాలను నేర్చుకునేలా, అనుభవజ్ఞులు నుంచి సలహాలు పొందేలా వెసులుబాటు కల్పించే దిశగా ’హర్డిజిటల్స్టోరీ’ పేరిట ప్రత్యేక ఫ్రేమ్వర్క్ను రూపొందిస్తున్నట్లు సిగ్నిటీ పేర్కొంది. ఇక కార్పొరేట్ సామాజిక బాధ్యత (సీఎస్ఆర్) కింద హైదరాబాద్లోని ప్రభుత్వ ఎంఎన్జే ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఆంకాలజీతో కలిసి పనిచేస్తున్నట్లు, ’ప్రాజెక్ట్ సిగ్నిఫికెన్స్’ పేరిట 100 మంది గ్రామీణ ప్రాంత మహిళలకు డిజిటల్ నైపుణ్యాల్లో శిక్షణ కల్పిస్తున్నట్లు వివరించింది. -
ఎఫ్అండ్వోలో జీల్ కొనసాగింపు
న్యూఢిల్లీ: ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ విభాగంలో మీడియా రంగ కంపెనీ జీ ఎంటర్టైన్మెంట్ లిమిటెడ్(జీల్)ను కొనసాగించనున్నట్లు స్టాక్ ఎక్సే్ఛంజీ దిగ్గజం ఎన్ఎస్ఈ తాజాగా ప్రకటించింది. వెరసి డెరివేటివ్స్ నుంచి జీల్ను తప్పించేందుకు గురువారం తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంది. జీల్కు వ్యతిరేకంగా చేపట్టిన దివాలా ప్రక్రియను వారాంతాన జాతీయ కంపెనీ చట్ట అపిల్లేట్ ట్రిబ్యునల్(ఎన్సీఎల్ఏటీ) నిలిపివేసింది. ఎసెస్ల్ గ్రూప్లోని మరో కంపెనీ సిటీ నెట్వర్క్స్ రూ. 89 కోట్ల చెల్లింపుల్లో విఫలంకావడంపై ఇండస్ఇండ్ బ్యాంక్ క్లెయిమ్ చేసింది. ఈ రుణాలకు జీల్ గ్యారంటర్గా ఉంది. కాగా.. కల్వెర్ మ్యాక్స్ ఎంటర్టైన్మెంట్(సోనీ పిక్చర్స్ నెట్వర్క్స్ ఇండియా)తో విలీనంకానున్న జీల్కు ఎన్సీఎల్ఏటీ ఆదేశాలు ఉపశమనాన్ని కల్పించాయి. ఈ నేపథ్యంలో ఫిబ్రవరి 28 నుంచి జీల్ కౌంటర్లో తిరిగి మే నెల ఎఫ్అండ్వో కాంట్రాక్టులను ఎన్ఎస్ఈ అనుమతించింది. మార్చి, ఏప్రిల్ కాంట్రాక్టులు యథాతథంగా కొనసాగుతాయి. -
విశాఖలో బీఈఎల్ ‘ఎస్డీసీ’
సాక్షి, అమరావతి/సాక్షి, విశాఖపట్నం: కేంద్ర ప్రభుత్వ నవరత్న కంపెనీ భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (బీఈఎల్) విశాఖపట్నంలో సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ సెంటర్(ఎస్డీసీ)ను ప్రారంభించింది. రక్షణతోపాటు వివిధ రంగాలకు సంబంధించి సురక్షితమైన ఐటీ సేవలను అందించడమే లక్ష్యంగా విశాఖలోని రామ్నగర్ ప్రాంతంలో ఈ ఎస్డీసీని ఏర్పాటు చేసినట్లు బీఈఎల్ శుక్రవారం ఒక ప్రకటన ద్వారా స్టాక్ ఎక్స్చేంజీలకు తెలియజేసింది. 150 మంది ఇంజనీర్లు పని చేసేవిధంగా ఏర్పాటు చేసిన ఎస్డీసీ కేంద్రాన్ని ఇటీవల బీఈఎల్ డైరెక్టర్ (బెంగళూరు కాంప్లెక్స్) కె.వినయ్కుమార్ ప్రారంభించినట్లు వెల్లడించింది. బెంగళూరులోని స్ట్రాటజిక్ బిజినెస్ యూనిట్ (ఎస్బీయూ)ను విస్తరిస్తూ విశాఖలో ఎస్డీసీని ఏర్పాటు చేసినట్లు వివరించింది. బీఈఎల్కు చెందిన సాఫ్ట్వేర్ డివిజన్ ఇప్పటికే అతి కీలకమైన రక్షణ, ఎయిర్స్పేస్, ఈ–గవర్నెన్స్, హోమ్ల్యాండ్ సెక్యూరిటీ వంటి రంగాల్లో అనేక ప్రాజెక్టులను విజయవంతంగా అమలుచేసింది. అత్యంత కీలకమైన విభాగాల్లో సురక్షితమైన ఐటీ సేవలను అందించే లక్ష్యంతో విశాఖలో ఎస్డీసీ యూనిట్ను ఏర్పాటు చేసినట్లు తెలిపింది. ఇక్కడ నుంచి డీఆర్డీవోతో కలిపి నేవీకి సంబంధించిన అన్ని రకాల ఐటీ ఆధారిత ప్రాజెక్టులను చేపట్టనుంది. వీటితోపాటు స్మార్ట్ సిటీ, హోమ్ల్యాండ్ సెక్యూరిటీ రంగాల్లో అవసరమైన సాఫ్ట్వేర్ సొల్యూషన్స్ను అందించనున్నట్లు పేర్కొంది. ఆహ్లాదకరమైన, అత్యంత సురక్షిత వాతావరణంలో ఉద్యోగులు పనిచేసే విధంగా ఎస్డీసీ ఏర్పాటు చేసినట్లు వివరించింది. ఇప్పటికే ఐటీ రంగంలో దిగ్గజ సంస్థలు ఇన్ఫోసిస్, అమెజాన్ డెవలప్మెంట్ సెంటర్, రాండ్స్టాడ్ వంటి ప్రతిష్టాత్మకమైన ఐటీ కంపెనీలను ఆకర్షించిన విశాఖ... తాజాగా మరో నవరత్న కంపెనీ బీఈఎల్ కూడా తమ యూనిట్ను ఏర్పాటు చేయడంతో రాష్ట్ర విద్యార్థులు సంతోషం వ్యక్తంచేస్తున్నారు. -
నిఫ్టీ సూచీలలో అదానీ గ్రూప్ షేర్లు
నిఫ్టీ ఇండెక్సులలో ఈ ఏడాది మార్చి31 నుంచి సవరణలు చేపడుతున్నట్లు స్టాక్ ఎక్సే్ఛంజీ దిగ్గజం ఎన్ఎస్ఈ తాజాగా వెల్లడించింది. నిఫ్టీ ఇండెక్సులలో ప్రయివేట్ రంగ కంపెనీలు అదానీ విల్మర్, అదానీ పవర్తోపాటు పలు ఇతర కంపెనీలకు చోటు లభించనుంది. అదానీ విల్మర్ నిఫ్టీ నెక్ట్స్ 50, నిఫ్టీ 100కు ప్రాతినిధ్యం వహించనుంది. ఇక అదానీ పవర్కు నిఫ్టీ 500, 200లతోపాటు నిఫ్టీ మిడ్క్యాప్ 100, 150, లార్జ్మిడ్ క్యాప్ 250, మిడ్స్మాల్ క్యాప్ 400లలో చోటు లభించనుంది. ఇండెక్సుల నిర్వహణ సబ్కమిటీ షేర్ల జాబితాలో సవరణలను నిర్ణయించినట్లు ఎన్ఎస్ఈ తెలియజేసింది. అయితే ప్రధాన ఇండెక్స్ నిఫ్టీ–50లో ఎలాంటి మార్పులూ చేపట్టడంలేదని ఎన్ఎస్ఈ స్పష్టం చేసింది. కాగా.. నిఫ్టీ నెక్ట్స్ 50 ఇండెక్స్లో ఏబీబీ ఇండియా, కెనరా బ్యాంక్, పేజ్ ఇండస్ట్రీస్, వరుణ్ బెవరేజెస్ సైతం ప్రాతినిధ్యం వహించనున్నట్లు వెల్లడించింది. మరోవైపు బంధన్ బ్యాంక్, బయోకాన్, గ్లాండ్ ఫార్మా, ఎంఫసిస్, వన్ 97 కమ్యూనికేషన్స్లను నిఫ్టీ నెక్ట్స్ 50 ఇండెక్స్నుంచి తప్పిస్తున్నట్లు పేర్కొంది. -
చిత్రా రామకృష్ణ విచారణకు గ్రీన్సిగ్నల్
న్యూఢిల్లీ: కో–లొకేషన్ స్కామ్ కేసులో మాజీ మేనేజింగ్ డైరెక్టర్, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (ఎండీ, సీఈవో) చిత్రా రామకృష్ణను విచారించేందుకు సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ)కు వీలుకల్పిస్తూ ప్రముఖ స్టాక్ ఎక్సే్ఛంజ్ ఎన్ఎస్ఈ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. ఫిబ్రవరి 7వ తేదీన ఈ మేరకు బోర్డ్ ఆమోదముద్ర వేసినట్లు సంబంధిత ఉన్నత స్థాయి వర్గాలు వెల్లడించాయి. డిసెంబర్ త్రైమాసికంలో ఎక్సే్ఛంజ్ ఆదాయ అంశాలను కూడా బోర్డ్ ఈ సందర్భంగా ఆమోదించినట్లు ఆ వర్గాలు తెలిపాయి. గత ఏడాది మార్చి 6వ తేదీన చిత్రా రామకృష్ణ అరెస్టయ్యారు. అటు తర్వాత ఆమెను విచారించేందుకు నేషనల్ స్టాక్ ఎక్సే్ఛంజ్ ఆఫ్ ఇండియా (ఎన్ఎస్ఈ) బోర్డు ఆమోదం కోసం సీబీఐ వేచి చూస్తోంది. నిజానికి ఈ కేసులో 2018 మేలో సీబీఐ ఎఫ్ఐఆర్ను నమోదుచేసింది. అనంతరం దాదాపు నాలుగు సంవత్సరాల తర్వాత ఆమె అరెస్టయ్యారు. స్కామ్ ఏమిటి? మార్కెట్ ఎక్సే్ఛంజీల కంప్యూటర్ సర్వర్ల నుంచి కొందరు స్టాక్ బ్రోకర్లకు చట్ట విరుద్ధంగా కీలక ముందస్తు సమాచారం లభించేలా చిత్రా రామకృష్ణ అవకతవకలకు పాల్పడ్డారన్న ప్రధాన ఆరోపణపై సీబీఐ విచారణ జరుపుతోంది. ఎక్సే్ఛంజ్ ప్రాంగణంలో ఆయా స్టాక్ బ్రోకర్లు తమ సర్వర్లు, సిస్టమ్స్ లోకేట్ చేయడానికి, నిర్దిష్ట రాక్లను రెంట్కు తీసుకోడానికి అనుమతించారన్నది క్లుప్తంగా కో–లొకేషన్ స్కామ్ ప్రధానాంశం. ఈ కో– లెకేషన్ స్కామ్ ద్వారా కొంతమంది బ్రోకర్లు అధిక ఫ్రీక్వెన్సీ ట్రేడింగ్లో ప్రిఫరెన్షియల్ యాక్సెస్ను పొందారన్న ఆరోపణలు ఉన్నాయి. రామకృష్ణ 2009లో ఎన్ఎస్ఈ జాయింట్ మనేజింగ్ డైరెక్టర్గా నియమితులయ్యారు. 2013 మార్చి 31 వరకు ఆ స్థానంలో కొనసాగారు. 2013 ఏప్రిల్ 1న ఆమె ఎండీ, సీఈఓగా పదోన్నతి పొందారు. ఎన్ఎస్ఈలో ఆమె పదవీకాలం డిసెంబర్ 2016లో ముగిసింది. కో–లొకేషన్ కుంభకోణం వ్యవహారంలో క్యాపిటల్ మార్కెట్స్ రెగ్యులేటర్ సెబీ 2019లో ఏప్రిల్ చిత్రారామకృష్ణ అలాగే ఎన్ఎస్ఈ ఎండీ, సీఈవోగా పనిచేసిన రవి నారాయణ్లను లిస్టెడ్ కంపెనీ లేదా మార్కెట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్స్టిట్యూషన్తో లేదా మరే ఇతర మార్కెట్ ఇంటర్మీడియేటరీతో సంబంధం లేకుండా ఐదేళ్ల పాటు నిషేధించింది. నిర్ణీత వ్యవధిలో తీసుకున్న జీతాల్లో 25 శాతాన్ని డిపాజిట్ చేయాలని కూడా వారిని ఆదేశించింది. అయితే ఈ ఏడాది ఫిబ్రవరిలో రామకృష్ణ, నారాయణ్లపై మార్కెట్ రెగ్యులేటర్ జారీ చేసిన ఆదేశాలను సెక్యూరిటీస్ అప్పిలేట్ ట్రిబ్యునల్ (శాట్) కొట్టివేసింది. సుప్రీంకోర్టులో మాజీ సీఈఓకు ఊరట ఢిల్లీ హైకోర్టు బెయిల్పై జోక్యానికి నో... ఇదిలావుండగా, చిత్రరామకృష్ణకు బెయిల్ మంజూరు చేస్తూ ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వుల్లో జోక్యం చేసుకోవడానికి అత్యున్నత న్యాయస్థానం నిరాకరించింది. సీబీఐ కేసులో చిత్రారామకృష్ణకు ఢిల్లీ హైకోర్టు గతేడాది సెప్టెంబర్ 28వ తేదీన బెయిల్ మంజూరు చేసింది. దీనిని సవాలు చేస్తూ, సీబీఐ సుప్రీంను ఆశ్రయించింది. దీనిని విచారించిన జస్టిస్ అజయ్ రస్తోగీ, బేల ఎం త్రివేదిలతో కూడిన డివిజన్ బెంచ్ సీబీఐ అప్పీల్ను తిరస్కరిస్తూ, అరెస్టయిన 60 రోజుల్లో రావాల్సిన బెయిల్కు సంబంధించి మాత్రమే హైకోర్టు ఉత్తర్వులు ఉన్నాయని పేర్కొంది. విచారణను ఈ బెయిల్ ప్రభావితం చేయబోదని తెలిపింది. గత ఏడాది ఫిబ్రవరి 24న ఈ కేసులో అరెస్టయిన ఎక్సే్ఛంజ్ మాజీ గ్రూప్ ఆపరేటింగ్ ఆఫీసర్ (జీఓఓ) ఆనంద్ సుబ్రమణియన్కు బెయిల్ మంజూరు చేస్తూ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వుల్లో జోక్యం చేసుకోవడానికి కూడా సుప్రీంకోర్టు నిరాకరించింది. కాగా, కో–లొకేషన్ కేసుకు సంబంధించి అక్రమ ధనార్జన (మనీలాండరింగ్) ఆరోపణలపై గత ఏడాది జూలై 14న చిత్రా రామకృష్ణఅను అరెస్ట్ చేస్తున్నట్లు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) చూపించింది. ఈ కేసులో కూడా ఈ ఏడాది ఫిబ్రవరి 9 ఢిల్లీ హైకోర్టు చిత్రా రామకృష్ణకు బెయిల్ మంజూరు చేసింది. ఎన్ఎస్ఈ ఉద్యోగుల అక్రమ ఫోన్ ట్యాపింగ్, రహస్య సమాచార సేకరణ వంటి ఆరోపణలు కూడా ఈడీ దాఖలు చేసిన మనీలాండరింగ్ కేసులో ఉన్నాయి. -
ఇక ఎన్ఎస్ఈ సోషల్ స్టాక్ ఎక్ఛ్సేంజీ
న్యూఢిల్లీ: ఎక్ఛ్సేంజీ దిగ్గజం ఎన్ఎస్ఈ సోషల్ స్టాక్ ఎక్ఛ్సేంజీ ఏర్పాటుకు ముందస్తు అనుమతి పొందింది. ప్రత్యేక విభాగంగా ఏర్పాటు చేసేందుకు క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ నుంచి తాజాగా గ్రీన్సిగ్నల్ అందుకుంది. దీంతో ఎస్ఎస్ఈ పేరుతో విడిగా ఒక విభాగాన్ని నెలకొల్పేందుకు కృషి చేయనున్నట్లు ఎన్ఎస్ఈ తెలియజేసింది. ఈ ప్లాట్ఫామ్ సోషల్ ఎంటర్ప్రైజ్లకు గరిష్ట లబ్దిని అందించగలదని విశ్వసిస్తున్నట్లు ఎన్ఎస్ఈ ఎండీ, సీఈవో ఆశిష్కుమార్ చౌహాన్ ఈ సందర్భంగా పేర్కొన్నారు. సస్టెయిబుల్ డెవలప్మెంట్ లక్ష్యాలకు చేయూతనివ్వగలదని తెలియజేశారు. సెబీ ఏర్పాటు చేసిన వర్కింగ్ గ్రూప్, టెక్ని కల్ గ్రూప్ సిఫారసులమేరకు జులైలోనే ఎస్ఎస్ఈ మార్గదర్శకాలు విడుదలయ్యాయి. దేశీయంగా ఎస్ఎస్ఈ కొ త్త ఆలోచనకాగా.. ప్రయి వేట్, నాన్ప్రాఫిట్ రంగాలకు పెట్టుబడుల సమీకరణకు వీలు కల్పించడం ద్వారా సేవలందించనుంది. కాగా.. అక్టోబర్లో బీఎస్ ఈసైతం ఎస్ఎస్ఈ ఏర్పాటుకు సూత్ర ప్రాయ అనుమతిని పొందినట్లు వెల్లడించిన విషయం విదితమే. -
గ్రాము ఎస్జీబీ ధర రూ.5,409
ముంబై: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మూడో విడత సావరీన్ గోల్డ్ బాండ్ (ఎస్జీబీ) ఇష్యూ 19న ప్రారంభం కానుంది. ఈ నెల 23న ఇష్యూ ముగుస్తుంది. ఇందులో భాగంగా ఒక గ్రాము ఎస్జీబీ ధర రూ.5,409 అని ఆర్బీఐ ప్రకటించింది. అన్ని షెడ్యూల్డ్ వాణిజ్య బ్యాంకులు, పోస్టాఫీసులు, స్టాక్ ఎక్సేంజ్ల ద్వారా ఎస్జీబీలను కొనుగోలు చేసుకోవచ్చు. వీటి కాల వ్యవధి ఎనిమిదేళ్లు. పెట్టుబడి నాటికి ప్రకటించిన గ్రాము బంగారం విలువ ఆధారంగా వార్షికంగా 2.5 శాతం వడ్డీ చెల్లింపులు లభిస్తాయి. గడువు తీరిన తర్వాత వచ్చే రాబడి, పెట్టుబడి మొత్తంపై పన్ను ఉండదు. ఒక ఇన్వెస్టర్ కనీసం ఒక గ్రాము నుంచి, గరిష్టంగా 4 కిలోల వరకు కొనుగోలు చేసుకోవచ్చు. ఆన్లైన్లో దరఖాస్తు చేసుకుని, ఆన్లైన్ పేమెంట్ చేసిన వారికి ఒక గ్రాముపై రూ.50 తగ్గింపు లభిస్తుంది. -
మరింత పారదర్శకంగా బైబ్యాక్
న్యూఢిల్లీ: క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ షేర్ల బైబ్యాక్ విధానాన్ని క్రమబద్ధీకరించేందుకు నడుం బిగించింది. ఇందుకు తాజా ప్రతిపాదనలతో చర్చా పత్రాన్ని విడుదల చేసింది. తద్వారా బైబ్యాక్ ప్రక్రియను మరింత పారదర్శకంగా, వేగంగా, సమర్థవంతంగా, వాటాదారులకు మద్దతిచ్చే బాటలో చేపట్టే చర్యలకు తెరతీసింది. వీటి ప్రకారం గరిష్ట పరిమితిలో కోతతోపాటు, బైబ్యాక్ పూర్తిచేసే గడువును భారీగా తగ్గించనుంది. బైబ్యాక్లో షేర్ల కొనుగోలు వివరాలపై స్పష్టత కోసం స్టాక్ ఎక్సే్ఛంజీలలో ప్రత్యేక విండోను ఏర్పాటు చేయనుంది. ప్రస్తుతం ఓపెన్ మార్కెట్ ద్వారా కంపెనీ చెల్లించిన మూలధనంలో 15 శాతానికి మించకుండా ఫ్రీ రిజర్వుల ద్వారా బైబ్యాక్ను చేపట్టేందుకు వీలుంది. వచ్చే ఏప్రిల్ నుంచి 10 శాతానికి కుదిస్తోంది. ఆపై ఏడాది 5 శాతానికి, తదుపరి పరిమితిని పూర్తిగా ఎత్తివేయనుంది. ఇక టెండర్ మార్గంలో బైబ్యాక్కు ప్రస్తుతమున్న 25 శాతం పరిమితిని 40 శాతానికి పెంచనుంది. ప్రస్తుతం బైబ్యాక్ పూర్తికి ఆరు నెలల గడువు లభిస్తోంది. అయితే ఈ గడువులో కృత్రిమంగా డిమాండును సృష్టించడం ద్వారా షేర్ల ధరలను ప్రభావితం చేసేందుకు అవకాశముంటున్నదని సెబీ పేర్కొంది. దీంతో గడువులో పలు మార్పులకు శ్రీకారం చుట్టింది. తాజా ప్రతిపాదనలపై సెబీ డిసెంబర్ 1వరకూ పబ్లిక్ నుంచి సూచనలు కోరుతోంది. 22 రోజులకు పరిమితం తాజా ప్రతిపాదనల ప్రకారం 2023 ఏప్రిల్ నుంచి బైబ్యాక్ గడువును 66 పనిదినాలకు కుదించనుంది. ఆపై 2024 ఏప్రిల్ నుంచి 22 రోజులకు తగ్గించనుంది. ఈ బాటలో 2025 ఏప్రిల్ నుంచి ఓపెన్ మార్కెట్ విధానానికి స్వస్తి పలకనుంది. స్టాక్ ఎక్సే్ఛంజీల ద్వారా బైబ్యాక్ను చేపడితే ఇందుకు కేటాయించిన నిధులను 75 శాతం వరకూ వినియోగించవలసి ఉంటుంది. ప్రస్తుతం ఈ పరిమితి 50 శాతంగా ఉంది. అంతేకాకుండా గడువులో సగం రోజులు ముగిసేసరికి కనీసం 40 శాతం సొమ్మును షేర్ల కొనుగోలుకి వెచ్చించవలసి ఉంటుంది. యాక్టివ్గా ట్రేడయ్యే షేర్లలోనే బైబ్యాక్ను చేపట్టవలసి ఉంటుంది. కంపెనీ నికరంగా రుణరహితమై ఉంటే ఒకే ఆర్థిక సంవత్సరంలో రెండుసార్లు బైబ్యాక్ చేపట్టేందుకు అనుమతిస్తారు. అయితే ఇందుకు ఆరు నెలల కనీస గడువును పాటించడంతోపాటు టెండర్ మార్గాన్ని ఎంచుకోవలసి ఉంటుంది. ఇక బుక్ బిల్డింగ్ పద్ధతిలో ఓపెన్ మార్కెట్ బైబ్యాక్లకు ప్రమోటర్లు, సహచరులు పాల్గొనేందుకు అనుమతించరు. బైబ్యాక్పై పన్ను విధింపును కంపెనీకి బదులుగా సంబంధిత వాటాదారులకు బదిలీ చేయవలసిందిగా ప్రభుత్వానికి సూచించింది. ప్రస్తుతం బైబ్యాక్లో పాలుపంచుకోని వాటాదారులపై పన్ను భారం పడుతున్నందున తాజా సవరణలకు సెబీ ప్రతిపాదించింది. -
బీఎస్ఈ లాభాల్లో క్షీణత
న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2022–23) రెండో త్రైమాసికంలో స్టాక్ ఎక్ఛేంజీ దిగ్గజం బీఎస్ఈ లిమిటెడ్ నిరుత్సాహకర ఫలితాలు ప్రకటించింది. జులై–సెప్టెంబర్(క్యూ2)లో నికర లాభం దాదాపు సగానికి క్షీణించి రూ. 34 కోట్లకు పరిమితమైంది. గతేడాది(2021–22) ఇదే కాలంలో రూ. 65 కోట్లు ఆర్జించింది. మొత్తం ఆదాయం మాత్రం 6 శాతం పుంజుకుని రూ. 240 కోట్లకు చేరింది. గత క్యూ2లో రూ. 226 కోట్ల ఆదాయం నమోదైంది. అయితే నిర్వహణ మార్జిన్లు 28 శాతం నుంచి 7 శాతానికి భారీగా పతనమయ్యాయి. ఇందుకు కారణాలను ఎక్ఛేంజీ వెల్లడించలేదు. కాగా.. మొత్తం వ్యయాలు 36 శాతం పెరిగి రూ. 184 కోట్లను దాటాయి. ఎక్సే్ఛంజీలో రిజిస్టరైన మొత్తం ఇన్వెస్టర్ల ఖాతాలు 11.7 కోట్లకు ఎగశాయి. రోజువారీ సగటు టర్నోవర్ ఈక్విటీ విభాగంలో 17 శాతం వృద్ధితో రూ. 4,740 కోట్లను తాకగా.. డెరివేటివ్స్ నుంచి 88 శాతం అధికంగా రూ. 2.26 లక్షల కోట్లు చొప్పున నమోదైంది. కరెన్సీ డెరివేటివ్స్లో సైతం సగటు టర్నోవర్ 31 శాతం ఎగసి రూ. 32,161 కోట్లకు చేరింది. -
సోషల్ స్టాక్ ఎక్స్చేంజీలకు మార్గదర్శకాలు
న్యూఢిల్లీ: ప్రతిపాదిత సోషల్ స్టాక్ ఎక్సే్చంజీ (ఎస్ఎస్ఈ)కి సంబంధించిన వివరణాత్మక మార్గదర్శకాలను మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ సోమవారం విడుదల చేసింది. ఈ ఎక్సే్చంజీలో నమోదు చేసుకునేందుకు ఉండాల్సిన అర్హతా ప్రమాణాలు, వెల్లడించాల్సిన వివరాలు మొదలైన అంశాలను ఇందులో పొందుపర్చింది. లాభాపేక్ష లేని సంస్థలు (ఎన్పీవో) నిధులు సమీకరించుకునేందుకు అదనపు మార్గాన్ని అందించాలనే ఉద్దేశంతో ఈ ఏడాది జులైలో సెబీ కొన్ని నిబంధనలు ప్రతిపాదించింది. తాజా మార్గదర్శకాల ప్రకారం సమీకరించిన నిధుల వినియోగం గురించిన వివరాలను త్రైమాసికం ముగిసిన నాటి నుంచి 45 రోజుల్లోగా ఎస్ఎస్ఈకి ఎన్పీవో తెలియజేయాలి. అలాగే ఆర్థిక సంవత్సరం ముగిసిన 90 రోజుల్లోగా సదరు నిధుల వినియోగంతో సాధించిన సామాజిక ప్రయోజనాల వివరాలను (ఏఐఆర్)ను కూడా సమర్పించాలి. మరిన్ని వివరాలు .. ► చారిటబుల్ ట్రస్టుగా ఎన్పీవో నమోదై ఉండాలి. కనీసం మూడేళ్లుగా కార్యకలాపాలు నిర్వహిస్తుండాలి. క్రితం ఆర్థిక సంవత్సరంలో కనీసం రూ. 10 లక్షల నిధులు సమీకరించుకుని, రూ. 50 లక్షల మేర వ్యయాలు చేసినదై ఉండాలి. ► అత్యధికంగా విరాళాలిచ్చిన టాప్ 5 దాతలు, ఇన్వెస్టర్ల వివరాలు వెల్లడించాలి. బడ్జెట్, కార్యకలాపాల స్థాయి, ఉద్యోగులు.. వాలంటీర్ల సంఖ్య, ప్రోగ్రామ్వారీగా నిధుల వినియోగం మొదలైనవి తెలియజేయాలి. ► నియంత్రణ సంస్థ నిర్దేశించిన 16 అంశాల్లో ఏదో ఒక దానిలో ఎన్పీవో కార్యకలాపాలు సాగిస్తున్నదై ఉండాలి. పేదరికం, అసమానతలు, పౌష్టికాహార లోపం మొదలైన వాటి నిర్మూలన, విద్య.. ఉపాధి కల్పనకు తోడ్పాటునివ్వడం మొదలైన అంశాలు వీటిలో ఉన్నాయి. ► అఫోర్డబుల్ హౌసింగ్ సంస్థలు తప్ప కార్పొరేట్ ఫౌండేషన్లు, రాజకీయ లేదా మతపర కార్యకలాపాలు సాగించే సంస్థలు, ట్రేడ్ అసోసియేషన్లు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అలాగే హౌసింగ్ కంపెనీలను సోషల్ ఎంటర్ప్రైజ్గా గుర్తించరు. స్టాక్ బ్రోకర్ల కట్టడికి నిబంధనలు.. క్లయింట్ల సెక్యూరిటీలు, నిధులను స్టాక్ బ్రోకర్లు దుర్వినియోగం చేయకుండా నివారించేందుకు సెబీ కొత్త నిబంధనలు రూపొందించింది. వీటి ప్రకారం క్లయింట్ల డీమ్యాట్ ఖాతాల్లో నుంచి సెక్యూరిటీలను ట్రేడింగ్ మెంబరు పూల్ ఖాతాల్లోకి బదలాయించడాన్ని డిపాజిటరీలు నిర్ధారించుకోవాల్సి ఉంటుంది. నవంబర్ 25 నుంచి ఇవి అమల్లోకి వస్తాయి. -
పీవీఆర్, ఐనాక్స్ విలీనానికి ఓకే
న్యూఢిల్లీ: మల్టీప్లెక్స్ దిగ్గజాలు పీవీఆర్ లిమిటెడ్, ఐనాక్స్ లీజర్ మధ్య విలీనానికి స్టాక్ ఎక్సే్ఛంజీలు బీఎస్ఈ, ఎన్ఎస్ఈ అనుమతించాయి. రెండు ఎక్సే్ఛంజీలూ ఇందుకు నో అబ్జక్షన్ ప్రకటించినట్లు పీవీఆర్, ఐనాక్స్ లీజర్ పేర్కొన్నాయి. జాతీయ కంపెనీ చట్ట ట్రిబ్యునల్(ఎన్సీఎల్టీ), ఇతర నియంత్రణ సంస్థల నుంచి పీవీఆర్, ఐనాక్స్ లీజర్ విలీనానికి తొలుత స్టాక్ ఎక్సే్ఛంజీ దిగ్గజాలు అనుమతించవలసి ఉన్నట్లు నిపుణులు తెలియజేశారు. ఈ ఏడాది మార్చి 27న రెండు సంస్థలూ విలీన అంశాన్ని వెల్లడించిన సంగతి తెలిసిందే. విలీన కంపెనీ 1,500కుపైగా తెరలతో అతిపెద్ద మల్టీప్లెక్స్ చైన్గా ఆవిర్భవించనుంది. సంయుక్త సంస్థను పీవీఆర్ ఐనాక్స్ లిమిటెడ్గా వ్యవహరించనున్నారు. ఈ వార్తల నేపథ్యంలో పీవీఆర్ షేరు ఎన్ఎస్ఈలో దాదాపు 6 శాతం దూసుకెళ్లి రూ. 1,788 వద్ద నిలవగా.. ఐనాక్స్ లీజర్ 5.3 శాతం జంప్చేసి రూ. 482 వద్ద ముగిసింది. -
బీఎస్ఈ డివిడెండ్ రూ. 13.5
న్యూఢిల్లీ: దిగ్గజ స్టాక్ ఎక్సేంజీ బీఎస్ఈ గత ఆర్థిక సంవత్సరం(2021–22) చివరి క్వార్టర్లో ప్రోత్సాహకర ఫలితాలు సాధించింది. క్యూ4(జనవరి–మార్చి)లో నికర లాభం రెట్టింపునకుపైగా ఎగసి రూ. 72 కోట్లకు చేరింది. అంతక్రితం ఏడాది(2020–21) ఇదే కాలంలో కేవలం రూ. 32 కోట్లు ఆర్జించింది. మొత్తం ఆదాయం సైతం రూ. 152 కోట్ల నుంచి రూ. 205 కోట్లకు జంప్చేసింది. వాటాదారులకు షేరుకి రూ. 13.50 చొప్పున తుది డివిడెండు ప్రకటించింది. మార్చిలో ప్రకటించిన బోనస్ ఇష్యూ తదుపరి పూర్తి ఈక్విటీపై డివిడెండు చెల్లించనుంది. గత కొన్నేళ్లుగా సంస్థలు, ఇన్వెస్టర్ల కోసం మార్కెట్లు, ప్రొడక్టులను బీఎస్ఈ నిర్మిస్తూ వచ్చినట్లు ఎక్సేంజీ ఎండీ, సీఈవో అశిష్కుమార్ చౌహాన్ పేర్కొన్నారు. తద్వారా అన్ని రకాల ఆర్థిక పరిస్థితుల్లోనూ వృద్ధికి ఊతమిచ్చినట్లు తెలియజేశారు. ఈ ఏడాది (2022–23)లోనూ వివిధ వృద్ధి అవకాశాలపై దృష్టి సారించనున్నట్లు తెలియజేశారు. కాగా.. మార్చితో ముగిసిన పూర్తి ఏడాదికి బీఎస్ఈ నికర లాభం 73 శాతం దూసుకెళ్లి రూ. 245 కోట్లను తాకింది. 2020–21లో రూ. 142 కోట్లు మాత్రమే ఆర్జించింది. మొత్తం ఆదాయం 48 శాతం వృద్ధితో రూ. 743 కోట్లకు చేరింది. అంతక్రితం రూ. 501 కోట్ల టర్నోవర్ నమోదైంది. చదవండి: ఐసీఈఎక్స్పై సెబీ కొరడా! -
బీమా కంపెనీలు లిస్టింగ్కు వెళ్లాలి!
ముంబై: పెట్టుబడులను సులభంగా సమీకరించేందుకు వీలుగా ఇన్సూరెన్స్ కంపెనీలు స్టాక్ ఎక్సే్ఛంజీలలో లిస్టింగ్ను పరిశీలించవచ్చని బీమా రంగ నియంత్రణ సంస్థ ఐఆర్డీఏ చైర్మన్ దేవాశిష్ పాండా పేర్కొన్నారు. పబ్లిక్ ఇష్యూలు చేపట్టడం ద్వారా బీమా కంపెనీలు లిస్టింగును సాధించవచ్చని తెలియజేశారు. దీంతో బిజినెస్లో వృద్ధి అవకాశాలకు వీలుగా పెట్టుబడులను సమకూర్చుకునేందుకు వీలు చిక్కుతుందని తెలియజేశారు. అంతేకాకుండా దేశీయంగా బీమా విస్తృతికి సైతం లిస్టింగ్స్ దోహదపడతాయని అభిప్రాయపడ్డారు. బీమా రంగ కంపెనీలను ఐపీవోలకు వెళ్లవలసిందిగా సూచిస్తున్నట్లు విలేకరుల సమావేశంలో వెల్లడించారు. పీఎస్యూ దిగ్గజం ఎల్ఐసీ పబ్లిక్ ఇష్యూకి వస్తే మార్కెట్లో 60 శాతం లిస్టయినట్లేనని వ్యాఖ్యానించారు. ఇది అత్యధిక పారదర్శకత, సమాచార వెల్లడికి దారి చూపుతుందని పేర్కొన్నారు. కంపెనీలు మరింత పురోగమించడానికి లిస్టింగ్ దోహదపడుతుందని, అంతిమంగా ఇది బీమా రంగ వ్యాప్తికి కారణమవుతుందని వివరించారు. ఐఆర్డీఏ చైర్మన్గా పాండా గత నెలలో బాధ్యతలు స్వీకరించిన సంగతి తెలిసిందే. బీమా రంగ సంస్థలతో రెండు రోజులుగా ఇక్కడ పాండా సమావేశాలు నిర్వహిస్తున్నారు. రూ.100 కోట్ల ప్రవేశ నిబంధన ఎత్తివేయాలి బీమా వ్యాపారం ప్రారంభించేందుకు కనీసం రూ.100 కోట్ల పెట్టుబడి పరిమితిని ఎత్తివేయాలంటూ ప్రభుత్వాన్ని కోరే అవకాశం ఉన్నట్టు ఐఆర్డీఏఐ చైర్మన్ దేవాశిష్ పాండా తెలిపారు. ప్రస్తుత నిబంధన సదుపాయ కల్పన కంటే అడ్డంకిగా ఉన్నట్టు తాము గుర్తించామన్నారు. ఈ రంగంలోకి మరిన్ని సంస్థలు ప్రవేశానికి వీలుగా పరిమితిని ఎత్తివేయడం లేదా తగ్గించాల్సిన అవసరం ఉందన్నారు. సవరించిన వ్యాపార ప్రణాళికలు సమర్పించండి ప్రభుత్వ సాధారణ బీమా సంస్థలకు ఐఆర్డీఏ ఆదేశం సవరించిన వ్యాపార ప్రణాళికలు సమర్పించాలంటూ మూడు ప్రభుత్వరంగ సాధారణ బీమా సంస్థలు.. నేషనల్ ఇన్సూరెన్స్ కంపెనీ, యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్, ఓరియంటల్ ఇన్సూరెన్స్ను ఐఆర్డీఏ ఆదేశించింది. ఈ మూడు ప్రభుత్వరంగ బీమా సంస్థలు ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటుండడం గమనార్హం. ప్రభుత్వరంగ సాధారణ బీమా సంస్థలకు సంబంధించి కొంత సమాచారాన్ని ప్రభుత్వం కోరిందని, దాన్ని అందించినట్టు ఐఆర్డీఏఐ చైర్మన్ పాండా తెలిపారు. ఆయా సంస్థలకు ప్రభుత్వం నిధులను అందించే అవకాశం ఉందన్నారు. ఐఆర్డీఏఐ చైర్మన్ దేవాశిష్ పాండా, ఇతర సీనియర్ అధికారులు, సభ్యులు, బీమా సంస్థల ఉన్నతాధికారుల సమావేశం గురువారం ముంబైలో జరిగింది. -
డిష్ టీవీకి షాక్! వాటాదారులతో అంత ఈజీ కాదు!
గతేడాది(2021) డిసెంబర్ 30న నిర్వహించిన సాధారణ వార్షిక సమావేశం(ఏజీఎం)లో ప్రతిపాదనలన్నీ వీగిపోయినట్లు డీటీహెచ్ సేవల కంపెనీ డిష్ టీవీ వెల్లడించింది. ఆర్థిక ఫలితాలు, డైరెక్టర్గా తిరిగి ఏఎం కురియన్ ఎంపిక తదితర మూడు ప్రతిపాదనలనూ వాటాదారులు తిరస్కరించినట్లు తాజాగా స్టాక్ ఎక్సేంజీలకు తెలియజేసింది. అతిపెద్దవాటాదారు అయిన యస్ బ్యాంక్తో న్యాయపరమైన వివాదాల కారణంగా ఇప్పటివరకూ వివరాలను బయటపెట్టలేదని కంపెనీ ప్రస్తావించింది. అయితే క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ సోమవారం జారీ చేసిన మధ్యంతర ఉత్తర్వులతో ఈ అంశాలను వెల్లడించినట్లు డిష్ టీవీ పేర్కొంది. ఇటీవల జరిగిన 33వ ఏజీఎంలో ప్రతిపాదించిన 2021–22 ఏడాదికి కాస్ట్ ఆడిటర్స్ రెమ్యునరేషన్, స్టాండెలోన్, కన్సాలిడేటెడ్ ఫలితాలు, కురియన్ పునఃనియామకం అంశాలకు వ్యతిరేకంగా అధిక శాతం వోటింగ్ నమోదైనట్లు వివరించింది.
Pagination
ఆ బీప్ సౌండ్ వస్తేనే.. మీ ఓటు వేసినట్టు
ఇది కదా క్రేజ్ అంటే.. సీఎం జగన్ ఇంటర్వ్యూకి మిలియన్ల వ్యూస్
Sakshi.com ఇప్పుడు సరికొత్తగా మీ ముందుకు
కాపులు, ముస్లింలకు రిజర్వేషన్లు అక్కర్లేదు: పవన్కళ్యాణ్
రైతు కుమార్తె విజయం.. రిషబ్ శెట్టి అభినందనలు
పులివెందుల ప్రజలకు ఇద్దరిపైనా ప్రేమే: వైఎస్ భారతి
RCB Vs PBKS: కోహ్లి అరుదైన రికార్డు.. ఐపీఎల్ చరిత్రలోనే తొలి క్రికెటర్గా
Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో బిగ్ ట్విస్ట్..
బిజీగా ఉండటం ఇంత డేంజరా! హెచ్చరిస్తున్న సైకాలజిస్ట్లు
కారులో వాసన బాగుందని తెగ పీల్చుకుంటున్నారా.?
పోలింగ్ ప్రశాంతంగా జరిగేలా చర్యలు
భైంసా రోడ్షోలో ఉద్రిక్తత
ఎన్నికలకు సర్వం సిద్ధం
అకాల వర్షం.. అన్నదాతకు నష్టం
సమయం లేదు మిత్రమా..
● అరచేతిలో వైకుంఠం చూపిన రేవంత్.. ● రూ.2,500, తులం బంగారం ఇచ్చిండా.. ● రూ.2 లక్షల రుణమాఫీ చేసిండా.. ● తెలంగాణలో బీజేపీని అడ్డుకునేది బీఆర్ఎస్సే ● నిర్మల్ కార్నర్ మీటింగ్లో కేటీఆర్
ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేయాలి
ఫోన్ పోతే ఆందోళన వద్దు
ఆత్రం సుగుణను గెలిపించాలి
నేతన్నలకు ఏడాది పొడవునా ఉపాధి
తప్పక చదవండి
- రొమాంటిక్ సీన్స్.. ఒళ్లంతా దద్దుర్లు వచ్చేశాయి: టాలీవుడ్ హీరోయిన్
- ‘అద్భుతం కంటే తక్కువేం కాదు’.. కేజ్రీకు మద్యంతర బెయిల్పై
- ‘సంతోషం’.. కేజ్రీవాల్కు మద్యంతర బెయిల్పై దీదీ
- నామినేషన్ దాఖలుకు బీజేపీ అభ్యర్థి పరుగులు.. చివరికి ఏమైందంటే..
- సింపతీ కోసమే కేజ్రీవాల్ అరెస్ట్
- అమిత్ షా నివాసంలో పద్మగ్రహీతలకు విందు....మెనులో ఎలాంటి రెసిపీలు ఉన్నాయంటే..
- టాలీవుడ్లో అది చాలా కష్టం.. అసౌకర్యంగా అనిపిస్తుంది: సంయుక్త
- రెడ్ లిప్స్టిక్ను ఉత్తరకొరియా ఎందుకు బ్యాన్ చేసిందో తెలుసా!
- డాగ్ లవర్స్ బీ అలర్ట్ : ప్రమాదకరమైన కుక్కలపై తమిళనాడు నిషేధం
- ఆ బీప్ సౌండ్ వస్తేనే.. మీ ఓటు వేసినట్టు
Advertisement