ఆత్రం సుగుణను గెలిపించాలి | Sakshi
Sakshi News home page

ఆత్రం సుగుణను గెలిపించాలి

Published Fri, May 10 2024 4:05 PM

ఆత్రం సుగుణను గెలిపించాలి

● డీసీసీ అధ్యక్షుడు శ్రీహరిరావు

నిర్మల్‌చైన్‌గేట్‌: ఈ నెల 13న నిర్వహించే పార్లమెంట్‌ ఎన్నికల్లో కాంగ్రెస్‌ ఎంపీ అభ్యర్థి ఆత్రం సుగుణను భారీ మెజారిటీతో గెలిపించాలని డీసీసీ అధ్యక్షుడు శ్రీహరిరావు కోరారు. దిలావర్‌పూర్‌ మండలం సముందర్‌పల్లి గ్రామానికి చెందిన బీఆర్‌ఎస్‌ నాయకులు ఏఎంసీ చైర్మన్‌ దేవేందర్‌రెడ్డి, సాగర్‌రెడ్డి డీసీసీ అధ్యక్షుడు శ్రీహరిరావు సమక్షంలో కాంగ్రెస్‌లో చేరారు. వారికి పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు. ఈ సందర్భంగా శ్రీహరిరావు మా ట్లాడుతూ నిర్మల్‌ నియోజకవర్గంలో కాంగ్రెస్‌పార్టీ అనూహ్య రీతిలో పుంజుకుందన్నారు. కాంగ్రెస్‌ పా ర్టీ ప్రజలకు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ లను నెరవేర్చి ప్రజాపాలన అందిస్తుందన్నారు. కా ర్యక్రమంలో మండల అధ్యక్షుడు సాగర్‌రెడ్డి, మాజీ ఏఎంసీ చైర్మన్‌ దేవేందర్‌రెడ్డి, సీనియర్‌ నాయకులు, వసంత్‌, తిరుపతి తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement