-
నీళ్లలాంటి ఆహారం.. టాయిలెట్ పక్కనే పడుకున్నా..: హీరోయిన్
బాలీవుడ్ నటుడు, ఎంఎంస్ ధోని హీరో సుశాంత్ సింగ్ రాజ్పుత్ ఆత్మహత్య అప్పట్లో సంచలనం సృష్టించింది. యంగ్ హీరో సూసైడ్ చేసుకోవడంతో ఇండస్ట్రీ ఒక్కసారిగా షాక్కు గురైంది. అయితే సుశాంత్ ప్రియురాలు, నటి రియా చక్రవర్తిపై ఫిర్యాదు రావడంతో పోలీసులు కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. నెల రోజుల పాటు జైలులో ఉన్న రియా ఆ తర్వాత బెయిల్పై రిలీజై బయటికొచ్చారు. తాజాగా ఓ షోకు హాజరైన రియా జైలులో ఉన్నప్పటి చేదు అనుభవాలను పంచుకున్నారు. రియా మాట్లాడుతూ.. 'నాకు జైలులో ఎక్కువగా రోటీ, క్యాప్సికం పెట్టేవాళ్లు. కేవలం అవీ పేరుకే గానీ మొత్తం నీళ్లలాగే ఉండేది. అయినప్పటికీ ఆకలిగా ఉండటంతో గతిలేక తినేసేదాణ్ని. నేను పడుకునే ప్లేస్ పక్కనే బాత్రూమ్ ఉండేది. ఇలాంటివి దుర్భర పరిస్థితులు జైలులో చవిచూశా. ఆ సమయంలో పడిన శారీరక బాధల కన్నా.. మానసిక క్షోభనే ఎక్కువ అనుభవించా. కానీ మిగిలిన వారితో పోలిస్తే నా పరిస్థితి కాస్తా ఫరవాలేదనిపించేది. కొందరు బెయిల్ వచ్చినా రూ.5 వేలు, రూ.10 వేలు కూడా కట్టలేక అక్కడే ఉండేవారు. నాకు బెయిల్ వచ్చినప్పుడు.. మీరు హీరోయిన్ కదా.. మీ సంతోషాన్ని డ్యాన్స్ చేసి చూపిచండని కొందరు అడిగారు. అందుకే ఆ సమయంలో నాగిని పాటకు డ్యాన్స్ చేశా' అని జైలులోని అనుభవాలను చెప్పుకొచ్చారు. View this post on Instagram A post shared by Rhea Chakraborty (@rhea_chakraborty) -
సుశాంత్తో బ్రేకప్పై హీరోయిన్ ఆసక్తికర వ్యాఖ్యలు
బాలీవుడ్ స్టార్ సుశాంత్ సింగ్ మరణం ఇప్పటికీ మిస్టరీగానే మిగిలింది. ఆయన మరణించి మూడేళ్లు దాటిన(2020 జూన్లో ఆత్మహత్య చేసుకున్నాడు).. ఇప్పటికీ ఆయన గురించి వార్తలు వస్తూనే ఉన్నాయి. ఆయన మాజీ ప్రియురాలు అంకిత లోఖండేతో పాటు అతన్ని పెళ్లి చేసుకోవాలనుకున్న రియా చక్రవర్తి.. ఇప్పటికీ సుశాంత్ని తలచుకొని బాధపడుతుంటారు. తాజాగా హీరోయిన్ అంకితా లోఖండే..సుశాంత్తో బ్రేకప్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. సుశాంత్ని తాను ఎంతగానో ప్రేమించానని, కానీ ఇతరుల మాటలను విని తనకు బ్రేకప్ చెప్పాడని ఆవేదన వ్యక్తం చేసింది. ‘మేమిద్దరం విడిపోవడానికి పెద్ద కారణాలేవి లేవు. సుశాంత్ విడిపోదామని చెప్పగానే నేను షాకయ్యాను. ఆయన నిర్ణయంతో రాత్రికి రాత్రే నా జీవితంలోని పరిస్థితులన్నీ మారిపోయాయి. బ్రేకప్ ఎందుకు చెప్పాడో తెలియదు. కానీ అతని నిర్ణయాన్ని మాత్రం తప్పుబట్టాలని నేను ఎప్పుడు అనుకోలేదు. ఎదుట వాళ్ల మాటలు విని ఆయన నాకు బ్రేకప్ చెప్పాడేమో అనిపిస్తుంది’అని అంకితా లోఎఖండే చెప్పుకొచ్చింది. కాగా, సుశాంత్ ఇండస్ట్రీకి అడుగుపెట్టిన తొలినాళ్లలోనే అంకితతో పరిచయం ఏర్పడింది. ఇద్దరు కలిసి ఓ సీరియల్లో నటించారు. ఈ క్రమంలోనే వీరిద్దరి మధ్య ప్రేమ చిగురించింది. అయితే సుశాంత్ హీరోగా మారిన తర్వాత పరిస్థితులు మారాయి. వీరిద్దరు విడిపోయారు. ఆ తర్వాత సుశాంత్.. రియా చక్రవర్తితో ప్రేమాయణం కొనసాగించాడు. ఇద్దరు కలిసి పెళ్లి చేసుకోవాలనుకున్నారు. కానీ అనుహ్యంగా 2020లో ఆత్మహత్య చేసుకున్నాడు. -
మూన్పై ల్యాండ్ ఎలా కొనాలి? ధర తక్కువే! వేద్దామా పాగా!
చంద్రయాన్-3 సాప్ట్ ల్యాండ్ అయింది. దీంతో చందమామపై మనుషులు జీవించేందుకు ఆస్కారం కలుగుతుందా? అక్కడ ల్యాండ్ ఎంత ఉంటుంది. మూన్ ఎస్టేట్, చందమామ విల్లాస్, జాబిల్లి రిసార్ట్స్ అంటూ అక్కడి రియల్ ఎస్టేట్ వ్యాపారం సోషల్మీడియాలో జోరుగా చర్చ నడుస్తోంది. ఇప్పటికే బాలీవుడ్హీరో షారుఖ్ ఖాన్, దివంగత నటుడు సుశాంత్ సింగ్ రాజ్పుత్ చంద్రుడిపై సైట్ కొన్నారన్న వార్తల నేపథ్యంలో మరింత చర్చ జోరుగా నడుస్తోంది. ప్రపంచవ్యాప్తంగా రియల్ ఎస్టేట్ బిజినెస్కు ప్రాధాన్యత పెరుగుతున్న నేపథ్యంలో చాలా మంది ధనిక వ్యాపారవేత్తలు, సెలబ్రిటీలు చంద్రునిపై ప్రాపర్టీ కొన్నారు. మరికొందరు అంతరిక్షంపై వారి ఆసక్తి, అభిరుచి కారణంగా కొందరు దీనిని భవిష్యత్తు పెట్టుబడిగా భావిస్తారు. చంద్రునిపై భూమిని కొనగలరా? చంద్రునిపై భూమిని సొంతం చేసుకోవాలని చాలా మంది ఆలోచిస్తూ ఉంటారు. భూమిని కొనుగోలు చేయవచ్చు,కానీ దాని యాజమాన్య హక్కులు పొంద లేరు. దానిని క్లెయిమ్ చేసుకోలేరు. దీనికి సంబంధించి 1967లో భారత్తో 104 దేశాలు ఇందుకు సంబంధించి ఒప్పందం కుదుర్చుకున్నాయి. మూడు పెద్ద దేశాలు, సోవియట్ యూనియన్, అమెరికా, యూఏ కలిసి బఔటర్ స్పేస్ ట్రీటీ అని పిలిచే అంతర్జాతీయ ఒప్పందాన్ని రూపొందించాయి. దీని ప్రకారం చందమామపై సైట్(Lunar Land Purchase)ని కొనుగోలు చేయడానికి ఒక మార్గం ఉంది. లూనార్ రిజిస్ట్రీ అనే అధికారిక వెబ్సైట్ను సందర్శించి, కొనుగోలు చేయాలనుకుంటున్న ప్రాంతాన్ని ఎంచుకోవచ్చు. ఇందులో సీ ఆఫ్ ట్రాంక్విలిటీ, లేక్ ఆఫ్ డ్రీమ్స్ వంటి అనేక ప్రాంతాలుంటాయి. ఔటర్ స్పేస్ ట్రీటీ ప్రకారం లూనార్ ల్యాండ్ రిజిస్ట్రీ, ప్రైవేట్ యాజమాన్యం కోసం భూమిని కొనుగోలు చేయడం అసాధ్యం, చట్టవిరుద్ధం. కానీ, ది లూనార్ రిజిస్ట్రీ వంటి ఏజెన్సీలు ఇప్పటికీ ఖగోళ భూమిని విక్రయిస్తున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నాయి. చంద్రునిపై ల్యాండ్ కొన్న కొందరు ప్రముఖులు చంద్రునిలోని లాకస్ ఫెలిసిటాటిస్ (ఆనంద సరస్సు) ప్రాంతంలో చంద్రునిపై ఒక ఎకరం భూమిని కొనుగోలు చేసినట్లు AIIMS జోధ్పూర్ నర్సింగ్ ఆఫీసర్ మీనా బిష్ణోయ్ (Meena Bishnoi) ఇద్దరు కుమార్తెల కోసం చంద్రునిపై భూమిని కొనుగోలు చేసినట్లు చెప్పారు. లూనా సొసైటీ జారీ చేసిన సర్టిఫికెట్ను కూడా ఆమె చూపించారు. బాలీవుడ్ స్టార్ షారుఖ్ ఖాన్(Shah Rukh Khan) 52వ పుట్టినరోజు సందర్భంగా స్వయంగా వెల్లడించినట్టుగా ఆస్ట్రేలియాలోని ఓ అభిమాని చంద్రుడిపై ప్రాపర్టీని(Land On Moon) బహుమతిగా ఇచ్చాడట. అలాగే అంతరిక్షం, నక్షత్రాలు, సైన్స్ పట్ల ఎంతో ఆసక్తి ఉన్న యాక్టర్ సుశాంత్ సింగ్ రాజ్పుత్(Sushanth Singh Rajput). సుశాంత్ సింగ్ రాజ్ పుత్ కొన్న ప్రాంతాన్ని మేర్ ముస్కోవియన్స్ లేదా 'మస్కోవి సీ' అని పిలుస్తారు.మూన్ ల్యాండ్ను 2018, జూన్ 25న సుశాంత్ తన పేరున రిజిస్టర్ చేయించుకున్నాడు. అలాగే సూరత్కి చెందిన ఒక బిజినెస్ మేన్ తన రెండేళ్ల కూతురి కోసం చంద్రుడిపై కొంత భూమిని కొనుగోలు చేశాడు. అజ్మీర్కు చెందిన ధర్మేంద్ర అనిజా తన వివాహ వార్షికోత్సవం సందర్బంగా తన భార్య సప్నా అనిజాకు చంద్రునిపై మూడు ఎకరాల భూమిని బహుమతిగా ఇచ్చాడు. 20 ఏళ్ల క్రితమే 5 ఎకరాలు రాజీవ్ వి బగ్ధి దాదాపు 20ఏళ్ల క్రితమే 5 ఎకరాల ప్లాట్ను కొనుగోలు చేయడం గమనార్హం.2003లో చంద్రునిపై ఒక ప్లాట్ను కేవలం 140 డాలర్లకు (సుమారు రూ. 9,500)కి కొనుగోలు చేశారు.లూనార్ రిపబ్లిక్ జారీ చేసిన అన్ని అధికారిక పత్రాలప్రకారం జూలై 27, 2003న న్యూయార్క్లోని లూనార్ రిజిస్ట్రీ ద్వారా 'రాజీవ్ బగ్దీ 32.8 డిగ్రీల ఉత్తర అక్షాంశం, 15.6 డిగ్రీల పశ్చిమాన మారే ఇంబ్రియం (వర్షాల సముద్రం) వద్ద ఉన్న ఆస్తికి నిజమైన, చట్టపరమైన యజమాని. రేఖాంశ ట్రాక్ -30'. అంతేకాదు 2030 నాటికి మూన్ టూరిజం ప్రారంభమవుతుందని బగ్ది ఆశాభావం వ్యక్తం చేశారు. -
సుశాంత్ బర్త్డే సెలబ్రేట్ చేసిన సారా, వీడియో వైరల్
బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్పుత్ ఈ లోకాన్ని విడిచి మూడేళ్లపైనే అవుతున్నా అభిమానుల గుండెల్లో మాత్రం సజీవంగానే ఉన్నాడు. సోషల్ మీడియాలో తరచూ అతడి పేరు వినిపిస్తూనే ఉంది. శనివారం (జనవరి 21న) ఆయన పుట్టినరోజును పురస్కరించుకుని హీరోయిన్ సారా అలీ ఖాన్ చిన్నారులతో కలిసి కేక్ కట్ చేసింది. ఎన్జీవోలోని చిన్నారుల సమక్షంలో కేక్ కట్ చేసిన సారా పిల్లలతో కలిసి చప్పట్లు కొట్టింది. ఈ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. 'హ్యాపీ బర్త్డే సుశాంత్, ఇతరులను నవ్వించడమంటే నీకెంత ఇష్టమో నాకు తెలుసు. పై నుంచి మమ్మల్ని చూస్తున్న నీ ముఖంలో మేమంతా కలిసి చిరునవ్వు తెప్పించామని భావిస్తున్నాం. ఈ రోజును ఇంత స్పెషల్గా మార్చినందుకు సునీల్ అరోరాకు ప్రత్యేక ధన్యవాదాలు. మీలాంటివాళ్లు ఈ ప్రపంచాన్ని మరింత ఉత్తమంగా, సురక్షితంగా, సంతోషకరంగా మార్చుతారు. మీరు కూడా ఇతరులకు సంతోషాన్ని పంచండి' అని రాసుకొచ్చింది. ప్రస్తుతం ఈ వీడియో వైరల్గా మారగా సారా చేసిన పనికి మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నారు నెటిజన్లు. అదే సమయంలో కొందరు మాత్రం ఇదంతా వట్టి డ్రామా అని విమర్శలు గుప్పిస్తున్నారు. కాగా సుశాంత్, సారా.. కేదార్నాథ్ (2018) సినిమాలో కలిసి పని చేశారు. ఈ చిత్రంతోనే సారా ఇండస్ట్రీకి పరిచయమైంది. View this post on Instagram A post shared by Sara Ali Khan (@saraalikhan95) చదవండి: ఈ ఏడాది ఏ హీరోయిన్ చేతిలో ఎన్ని సినిమాలున్నాయో తెలుసా? -
ప్రియుడ్ని పెళ్లాడిన అంకిత లోఖండే, ముంబైలో గ్రాండ్ వెడ్డింగ్
Ankita Lokhande- Vicky Jain Are Married: సుశాంత్ సింగ్ మాజీ ప్రేయసి, బాలీవుడ్ నటి అంకితా లోఖండే ప్రియుడు విక్కీ జైన్ను వివాహమాడింది. ఈ వేడుకకు ముంబైలోని గ్రాండ్ హయత్ హోటల్ వేదికైంది. వధువు అంకిత గోల్డెన్ కలర్ లెహంగా ధరించగా, వరుడు విక్కీ జైన్ కూడా వధువుకు సరిపోలే బంగారు- తెలుపు రంగు షేర్వాణీ ధరించాడు. వేదిక వద్దకు వధూవరులిద్దరు పాతకాలపు కారులో రావడం ఆకట్టుకుంది. వీరి పెళ్లి వేదికను వివిధ రకాల పూలతో అందంగా అలంకరించారు. కాగా కరోనా నిబంధనల నేపథ్యంలో కేవలం కుటుంబ సభ్యులు, సన్నిహితులు, సినీ ప్రముఖుల మధ్య వీరి వివాహ కార్యక్రమం ఈరోజు(డిసెంబర్ 14) ముంబైలో అంగరంగ వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా తన మెహందీ, ఎంగేజ్మెంట్, హల్దీ, సంగీత్ కార్యక్రమాలకు సంబధించిన ఫొటోలను అంకిత కొద్ది రోజులుగా షేర్ చేస్తూ వచ్చింది. దీంతో ఆమె ఫొటోలు నెట్టింట వైరల్గా మారాయి. ఇండోర్లో జన్మించిన అంకిత 2005లో తన నటన కలను సాకారం చేసుకోడానికి ముంబైకి వచ్చింది. తన టాలెంట్ నిరూపించుకునేందుకు 'టాలెంట్ హంట్' రియాలిటీ షోలో పాల్గొంది. చదవండి: (భార్యభర్తలుగా తొలిసారి మీడియా ముందుకు కత్రినా-విక్కీ, వీడియో వైరల్) నాలుగేళ్ల తర్వాత 'పవిత్ర రిష్టా' టీవి సీరియల్తో పెద్ద బ్రేక్ వచ్చింది. ఈ సీరియల్తో పరిచయమైన సుశాంత్ సింగ్తో డేటింగ్ చేస్తున్నట్లు 2019లో అంకిత ప్రకటించింది. తర్వాత సుశాంత్తో ఆరేళ్ల పాటు రిలేషన్షిప్లో ఉంది. కంగనా రనౌత్ నటించిన 'మణికర్ణిక'తో సినిమాల్లోకి అడుగుపెట్టింది అంకిత. తర్వాత 'బాఘీ 3' చిత్రంలో కూడా నటించింది. సుశాంత్తో బ్రేకప్ తర్వాత మరో బాలీవుడ్ నటుడు విక్కీజైన్తో ప్రేమలో పడింది. గత మూడేళ్లుగా వీరు ప్రేమలో మునిగితేలుతున్నారు. చదవండి: (Katrina Kaif: సల్మాన్, రణ్బీర్ నుంచి కత్రినాకు ఖరీదైన బహుమతులు, అవేంటంటే..)
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
Lok Sabha Election 2024: యాదవ భూమిలో ఎస్పీకి అగ్నిపరీక్ష
పీఠమెక్కేదెవరో..?
మెరుగైన వైద్యసేవలు అందించాలి
ఉచిత శిక్షణను సద్వినియోగం చేసుకోవాలి
బాబు మట్టికొట్టుకు పోతాడు
● పెన్షన్ డబ్బుల కోసం పండుటాకుల కష్టాలు ● బ్యాంకు చుట్టూ తప్పని ప్రదక్షిణలు ● ఆటోల్లో తిరగలేక నీరసిస్తున్న వృద్ధులు ● మండే ఎండల్లో అభాగ్యుల ముప్పుతిప్పలు ● ఎంత పనిచేశావు చంద్రబాబూ అంటూ కన్నీరుపెడుతున్న అవ్వాతాతలు
● ఆగమోక్తం..భాష్యకారుల ఉత్సవం
పేదల ప్రభుత్వాన్ని ఆశీర్వదించండి
మాపై ఎందుకంత కక్ష
నేడు పలమనేరుకుసీఎం వైఎస్ జగన్
తప్పక చదవండి
- కెనడాలో మనవడిని చూడ్డానికి వెళ్లి...మనవడితో సహా దుర్మరణం
- Banjara Hills: విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం.. నిండు ప్రాణం బలి
- తాతా.. నీకు టాటా..
- స్విమ్మింగ్ పూల్ ఒడ్డున ఎమ్మెల్యే వినూత్న నిరసన!
- తిరుమలలో వడగళ్ల వర్షం (ఫొటోలు)
- Daily Horoscope: ఈ రాశివారు చేపట్టిన పనులు పూర్తి చేసుకుంటారు
- కందికుంట అడ్డంగా దొరికినా..
- నిందితుడిని హంతకుడని ఎలా ముద్ర వేస్తారు?
- Rachana Banerjee: దీదీ కాదు... దీదీ నంబర్వన్
- కళ్లు చల్లబడ్డాయా బాబూ!
Advertisement