-
రింకూ సింగ్ విధ్వంసం.. 33 బంతుల్లో 6 సిక్సర్ల సాయంతో..!
సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ 2023లో టీమిండియా యువ చిచ్చరపిడుగు రింకూ సింగ్ విధ్వంసం సృష్టించాడు. పంజాబ్తో ఇవాళ (నవంబర్ 2) జరుగుతున్న క్వార్టర్ఫైనల్-1లో రింకూ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. కేవలం 33 బంతుల్లో4 ఫోర్లు, 6 సిక్సర్ల సాయంతో అజేయమైన 77 పరుగులు చేశాడు. రింకూ విధ్వంసం ధాటికి పంజాబ్ ఆఖరి రెండు ఓవర్లలో 39 పరుగులు సమర్పించుకుంది. ఆఖరి ఓవర్లో రింకూ టీమిండియా సహచరుడు అర్షదీప్ సింగ్ను టార్గెట్ చేశాడు. ఈ ఓవర్లో రింకూ 3 సిక్సర్ల సాయంతో 23 పరుగులు పిండుకున్నాడు. రింకూ విధ్వంసం ధాటికి తొలుత బ్యాటింగ్ చేసిన ఉత్తర్ప్రదేశ్ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 169 పరుగులు చేసింది. రింకూతో పాటు సమీర్ రిజ్వి (29 బంతుల్లో 42 నాటౌట్; ఫోర్, 4 సిక్సర్లు) రాణించాడు. యూపీ ఇన్నింగ్స్లో గోస్వామి (16), కరణ్ శర్మ (14), నితీశ్ రాణా (17) తక్కువ స్కోర్లకే ఔటైనా సమీర్ అండతో రింకూ చెలరేగిపోయాడు. పంజాబ్ ఇన్నింగ్స్లో సిద్దార్థ్ కౌల్, హర్ప్రీత్ బ్రార్ తలో వికెట్ పడగొట్టగా.. నితీశ్ రాణా రనౌటయ్యాడు. అనంతరం 170 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన పంజాబ్ 12 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 81 పరుగులు చేసింది. అన్మోల్ప్రీత్ సింగ్ (42 నాటౌట్), నేహల్ వధేరా (21 నాటౌట్) క్రీజ్లో ఉన్నారు. పంజాబ్ ఇన్నింగ్స్లో అభిషేక్ శర్మ (12), ప్రభసిమ్రన్ సింగ్ (0), మన్దీప్ సింగ్ (1) నిరాశపరచగా.. అన్మోల్ప్రీత్, నేహల్ జట్టును గెలిపించేందుకు ప్రయత్నిస్తున్నారు. యూపీ బౌలర్లలో భువనేశ్వర్ కుమార్ పొదుపుగా (2 ఓవర్లలో 3 పరుగులు) బౌలింగ్ చేయడంతో పాటు 2 వికెట్లు పడగొట్టాడు. మోహిసిన్ ఖాన్కు మరో వికెట్ దక్కింది. -
రాణించిన నితీశ్ రాణా.. చెలరేగిన భువనేశ్వర్ కుమార్
సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ 2023లో టీమిండియా క్రికెటర్లు భువనేశ్వర్ కుమార్, నితీశ్ రాణా సత్తా చాటారు. నిన్న గుజరాత్తో జరిగిన ప్రీక్వార్టర్ఫైనల్-1లో ఈ ఇద్దరు ఉత్తర్ప్రదేశ్ ఆటగాళ్లు ఆయా విభాగాల్లో రాణించారు. తొలుత బౌలింగ్లో భువీ.. ఆతర్వాత బ్యాటింగ్లో రాణా చెలరేగారు. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్ను భువనేశ్వర్ కుమార్ (4-0-21-3) దారుణంగా దెబ్బకొట్టాడు. భువీతో పాటు మోహిసిన్ ఖాన్ (4-0-13-2), నితీశ్ రాణా (1-0-9-1), ధన్కర్ (3-0-21-1), కార్తీక్ త్యాగి (4-0-27-1) రాణించడంతో గుజరాత్ 127 పరుగులకు (20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి) పరిమితమైంది. గుజరాత్ ఇన్నింగ్స్లో సౌరవ్ చౌహాన్ (32) టాప్ స్కోరర్గా నిలిచాడు. అనంతరం నామమాత్రపు లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన యూపీ.. రాణా (49 బంతుల్లో 71 నాటౌట్; 7 ఫోర్లు, 2 సిక్సర్లు) మెరుపు ఇన్నింగ్స్తో చెలరేగడంతో 18.4 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేరుకుంది. రాణాతో పాటు సమీర్ రిజ్వి (30) రాణించాడు. గుజరాత్ బౌలర్లలో రవి బిష్ణోయ్ 2 వికెట్లు పడగొట్టగా.. చింతన్ గజా, హేమంగ్ పటేల్ తలో వికెట్ దక్కించుకున్నారు. నిన్ననే జరిగిన క్వార్టర్ఫైనల్-2లో బెంగాల్పై అస్సాం 8 వికెట్ల తేడాతో గెలుపొందింది. నవంబర్ 2న మరో రెండు ప్రీ క్వార్టర్ఫైనల్ మ్యాచ్లు జరుగనున్నాయి. -
పొట్టి క్రికెట్లో కొనసాగుతున్న రియాన్ పరాగ్ విధ్వంసకాండ
సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ 2023లో అస్సాం కెప్టెన్ రియాన్ పరాగ్ (ఐపీఎల్లో రాజస్తాన్ రాయల్స్ ఆల్రౌండర్) డ్రీమ్ రన్ కొనసాగుతుంది. ఈ టోర్నీలో అతను వరుసగా ఏడో హాఫ్ సెంచరీ బాదాడు. గత మ్యాచ్లో చేసిన హాఫ్ సెంచరీతో ప్రపంచ రికార్డు (టీ20ల్లో వరుసగా ఆరు హాఫ్ సెంచరీలు చేసిన తొలి ఆటగాడిగా వార్నర్, సెహ్వాగ్, బట్లర్ల పేరిట ఉన్న రికార్డు బద్దలు) నెలకొల్పిన రియాన్.. తాజాగా హాఫ్ సెంచరీతో తన రికార్డును మరింత మెరుగుపర్చుకున్నాడు. బెంగాల్తో నిన్న (అక్టోబర్ 31) జరిగిన ప్రీ క్వార్టర్ ఫైనల్-2లో బ్యాట్తో పాటు బంతితోనూ రాణించిన రియాన్.. తన జట్టును విజయతీరాలకు చేర్చాడు. ఈ గెలుపుతో అస్సాం క్వార్టర్ ఫైనల్కు చేరింది. ఈ మ్యాచ్లో రియాన్ 2 వికెట్లు పడగొట్టడంతో పాటు 31 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో అజేయమైన 50 పరుగులు చేశాడు. Riyan Parag celebration myan 😭😭😭.He fucking just said, these guy's aren't on my level. I am fucking couple level ahead of them 😭😭😭Proper Chad pic.twitter.com/Gd8fbECfM7— HS27 (@Royal_HaRRa) October 31, 2023 టీమిండియాలో చోటు దక్కేనా..? ముస్తాక్ అలీ టోర్నీలో వరుసగా ఏడు హాఫ్ సెంచరీలు బాది జోరుమీదున్న రియాన్.. త్వరలో ఆస్ట్రేలియాతో జరిగే టీ20 సిరీస్లో భారత జట్టులో చోటుపై కన్నేశాడు. ముస్తాక్ అలీ ట్రోఫీకి ముందు నుంచే భీకరమైన ఫామ్లో ఉన్న రియాన్.. బ్యాట్తో పాటు బంతితోనూ రాణిస్తూ భారత సెలెక్టర్లకు సవాలు విసురుతున్నాడు. మ్యాచ్ విషయానికొస్తే.. అస్సాంతో జరిగిన మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన బెంగాల్ నిర్ణీత ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 138 పరుగులు చేసింది. అస్సాం బౌలర్లు ఆకాశ్ సేన్గుప్తా 3, రియాన్ పరాగ్ 2, మ్రిన్మోయ్ దత్తా, శివ్శంకర్ రాయ్, సౌరవ్ డే తలో వికెట్ పడగొట్టారు. బెంగాల్ ఇన్నింగ్స్లో ఎనిమిదో నంబర్ ఆటగాడు కరణ్ లాల్ (24) టాప్ స్కోరర్గా నిలిచాడు. అనంతరం 139 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన అస్సాం.. రిశవ్ దాస్ (31), బిషల్ రాయ్ (45 నాటౌట్), రియాన్ పరాగ్ (50 నాటౌట్) రాణించడంతో 17.5 ఓవర్లలో కేవలం 2 వికెట్లు మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని చేరుకుంది. నిన్ననే జరిగిన మరో ప్రీక్వార్టర్ ఫైనల్లో గుజరాత్పై ఉత్తర్ప్రదేశ్ 6 వికెట్ల తేడాతో గెలుపొంది క్వార్టర్ ఫైనల్కు అర్హత సాధించింది. నవంబర్ 2న మరో రెండు ప్రీ క్వార్టర్ఫైనల్ మ్యాచ్లు జరుగనున్నాయి. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ 2023లో రియాన్ పరాగ్ గణాంకాలు.. 45(19) & 0/53(4) 61(34) & 2/25(4) 76(37) & 3/6(4) 53(29) & 1/17(4) 76(39) & 1/37(4) 72(37) & 1/35(3) 57(33) & 1/17(4) 50(31) & 2/23(4) -
చరిత్ర సృష్టించిన రియాన్.. ఓవరాక్షన్ స్టార్ కాస్త సూపర్ స్టార్ అయ్యాడు..!
ఐపీఎల్లో రాజస్తాన్ రాయల్స్కు ఆడుతూ, ఆటకంటే ఓవరాక్షన్ ద్వారా ఎక్కువ పాపులర్ అయిన రియాన్ పరాగ్ ఇటీవలికాలంలో అతిని పక్కకు పెట్టి ఆటపై మాత్రమే దృష్టి సారిస్తూ సత్ఫలితాలు సాధిస్తున్నాడు. వ్యక్తిగత ప్రవర్తనతో పాటు ఫామ్లేమి కారణంగా గత ఐపీఎల్లో సరైన అవకాశాలు రాని రియాన్.. ఆతర్వాత జరిగిన అన్ని దేశవాళీ టోర్నీల్లో అద్భుతంగా రాణించి శభాష్ అనిపించుకుంటున్నాడు. ప్రస్తుతం జరుగుతున్న దేశవాళీ టోర్నీలో (సయ్యద్ ముస్తాక్ అలీ టీ20 ట్రోఫీ-2023) ఆల్రౌండ్ షోతో అదరగొడుతున్న రియాన్.. ఇప్పటివరకు జరిగిన అన్ని మ్యాచ్ల్లో బ్యాట్తో పాటు బంతితోనూ రాణిస్తూ మ్యాచ్ విన్నర్గా మారాడు. ఈ టోర్నీలో అస్సాం జట్టుకు కెప్టెన్గా వ్యవహరిస్తున్న రియాన్.. వరుసగా ఆరు హాఫ్ సెంచరీలు సాధించి ప్రపంచ రికార్డును సైతం నెలకొల్పాడు. టీ20 క్రికెట్లో రియాన్కు ముందు ఏ ఇతర ఆటగాడు వరుసగా ఆరు హాఫ్ సెంచరీలు సాధించలేదు. ఈ టోర్నీలో బ్యాటింగ్తో పాటు బౌలింగ్లోనూ అదరగొడుతున్న రియాన్.. ప్రతి మ్యాచ్లో వికెట్లు కూడా తీసి పర్ఫెక్ట్ ఆల్రౌండర్గా పేరు తెచ్చుకుంటున్నాడు. ఈ ప్రదర్శనలతో ఓవరాక్షన్ స్టార్ కాస్త సూపర్ స్టార్గా మారిపోయాడు. ముస్తాక్ అలీ టోర్నీలో భాగంగా కేరళతో ఇవాళ (అక్టోబర్ 27) జరిగిన మ్యాచ్లో 33 బంతుల్లో ఫోర్, 6 సిక్సర్ల సాయంతో అజేయమైన 57 పరుగులు చేసిన రియాన్.. తన కోటా 4 ఓవర్లు పూర్తి చేసి పొదుపుగా (17 పరుగులు) బౌలింగ్ చేయడంతో పాటు వికెట్ తీసుకుని తన జట్టును ఒంటిచేత్తో గెలిపించాడు. ఈ ప్రదర్శనకు ముందు రియాన్ వరసగా 102 నాటౌట్, 95 (దియోదర్ ట్రోఫీ), 45, 61, 76 నాటౌట్, 53 నాటౌట్, 76, 72 పరుగులు స్కోర్ చేశాడు. ఈ ప్రదర్శనలతో రియాన్ త్వరలో జరుగనున్న ఐపీఎల్ 2024 వేలంలో భారీ ధర పలికే అవకాశం ఉంటుంది. ఒకవేళ రియాన్ను రాయల్స్ టీమ్ రిలీజ్ చేయకపోతే.. ఆ జట్టులోనే మంచి అవకాశాలు దక్కే ఛాన్స్ ఉంటుంది. -
T20 Cricket: విధ్వంసకర ఇన్నింగ్స్తో 11 బంతుల్లోనే.. తొలి భారత బ్యాటర్గా!
SMAT 2023- Ashutosh Sharma breaks Yuvraj Singh's record: సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ(SMAT)-2023 సందర్భంగా టీమిండియా మాజీ ఆల్రౌండర్ యువరాజ్ సింగ్ అరుదైన రికార్డు బద్దలైంది. ఫాస్టెస్ట్ ఫిఫ్టీ సాధించిన ఓవరాల్ భారత బ్యాటర్ల జాబితాలో యువీని వెనక్కి నెట్టి అశుతోశ్ శర్మ సరికొత్త చరిత్ర సృష్టించాడు. అశుతోష్ సంచలన ఇన్నింగ్స్ దేశవాళీ టీ20 టోర్నీ SMAT సోమవారం(అక్టోబరు 16) ఆరంభమైన విషయం తెలిసిందే. ఈ క్రమంలో రెండో రోజు షెడ్యూల్లో భాగంగా రాంచి వేదికగా అరుణాచల్ ప్రదేశ్- రైల్వేస్ జట్లు మంగళవారం తలపడ్డాయి. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన రైల్వేస్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో ఆ జట్టు వికెట్ కీపర్ బ్యాటర్ ఉపేంద్ర యాదవ్(103) అజేయ సెంచరీతో మెరవగా ఏడో స్థానంలో బ్యాటింగ్కు దిగిన అశుతోష్ శర్మ సంచలన ఇన్నింగ్స్ ఆడాడు. కేవలం 11 బంతుల్లోనే కేవలం 11 బంతుల్లోనే 50 పరుగులు పూర్తి చేసుకున్నాడు. తద్వారా మధ్యప్రదేశ్ ఆటగాడు అశుతోష్ యువీ రికార్డును బ్రేక్ చేశాడు. ఇక అరుణాచల్ ప్రదేశ్తో మ్యాచ్లో మొత్తంగా 12 బంతులు ఎదుర్కొన్న ఈ రైట్హ్యాండ్ బ్యాటర్.. 53 రన్స్ చేశాడు. ఇందులో ఒక ఫోర్, 8 సిక్సర్లు ఉన్నాయి. ఈ మ్యాచ్లో నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 246 పరుగులు చేసిన రైల్వేస్.. అరుణాచల్ ప్రదేశ్ను 119 పరుగులకే ఆలౌట్ చేసింది. తద్వారా 127 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించింది. యువీ నాటి టీ20 వరల్డ్కప్లో టీ20 వరల్డ్కప్-2007లో ఇంగ్లండ్తో మ్యాచ్ సందర్భంగా యువరాజ్ సింగ్ సిక్సర్ల వర్షం కురిపించిన విషయం తెలిసిందే. స్టువర్ట్ బౌలింగ్లో ఒకే ఓవర్లో ఆరు సిక్సర్లు బాది చరిత్ర సృష్టించాడు. ఈ క్రమంలో 12 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. యువీ రికార్డు బ్రేక్ చేసిన నేపాల్ బ్యాటర్ అయితే, ఇటీవలే యువీ పేరిట ఉన్న ఈ రికార్డు బద్దలైన విషయం తెలిసిందే. చైనాలో ఆసియా క్రీడలు-2023 సందర్భంగా నేపాల్ బ్యాటర్ దీపేంద్ర సింగ్ ఐరీ మంగోలియాపై 9 బంతుల్లోనే 50 పరుగుల మార్కు అందుకున్నాడు. తద్వారా అంతర్జాతీయ క్రికెట్లో యువీ పేరిట ఉన్న రికార్డు బ్రేక్ చేసి తన పేరు చరిత్ర పుటల్లో లిఖించుకున్నాడు. చదవండి: మెకానికల్ ఇంజనీర్! పాక్ను ఒంటిచేత్తో ఓడించి.. టీమిండియా పరువు కాపాడి! ఒకే ఒక్కసారి కెప్టెన్గా.. -
కెప్టెన్లుగా టీమిండియా స్టార్లు తిలక్, సంజూ, భరత్.. పొట్టి క్రికెట్ టోర్నీ షురూ
Syed Mushtaq Ali Trophy 2023- జైపూర్: దేశవాళీ టి20 క్రికెట్ టోర్నమెంట్ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ నేడు మొదలవుతుంది. 22 రోజులపాటు జరిగే ఈ టోర్నీలో మొత్తం 38 జట్ల మధ్య 135 మ్యాచ్లు జరుగుతాయి. 38 జట్లను ఐదు గ్రూపులుగా విభజించారు. గ్రూప్ ‘ఎ’లో హైదరాబాద్, డిఫెండింగ్ చాంపియన్ ముంబై, బరోడా, హరియాణా, ఛత్తీస్గఢ్, జమ్మూ కశ్మీర్, మిజోరం, మేఘాలయ ఉన్నాయి. ఇక గ్రూప్ ‘సి’లో ఆంధ్ర, రైల్వేస్, సౌరాష్ట్ర, అరుణాచల్ప్రదేశ్, గోవా, గుజరాత్, మణిపూర్, పంజాబ్ జట్లకు చోటు కల్పించారు. అక్టోబర్ 27 వరకు గ్రూప్ లీగ్ మ్యాచ్లు జరుగుతాయి. లీగ్ మ్యాచ్లు పూర్తయ్యాక ఐదు గ్రూప్ల్లో తొలి రెండు స్థానాల్లో నిలిచిన 10 జట్లు నాకౌట్ దశకు అర్హత సాధిస్తాయి. కాగా సోమవారం జరిగే తొలి లీగ్ మ్యాచ్లలో తిలక్ వర్మ సారథ్యంలోని హైదరాబాద్ జట్టు మేఘాలయతో... కోన శ్రీకర్ భరత్ నాయకత్వంలోని ఆంధ్ర జట్టు గోవాతో తలపడతాయి. ఈ టోర్నీ మ్యాచ్లను జియో సినిమా యాప్, స్పోర్ట్స్ 18 ఖేల్ చానెల్స్లో ప్రత్యక్ష ప్రసారం చేస్తారు. ఇక సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ-2023లో కోన శ్రీకర్ భరత్(ఆంధ్ర), తిలక్ వర్మ(హైదరాబాద్)తో మరో టీమిండియా స్టార్ సంజూ శాంసన్(కేరళ) సైతం.. హిమాచల్ ప్రదేశ్ అక్టోబరు 16 నాటి మ్యాచ్తో కెప్టెన్గా బరిలోకి దిగనున్నాడు. గ్రూప్ ఎ: హర్యానా, బరోడా, ఛత్తీస్ గఢ్, మేఘాలయ, హైదరాబాద్, మిజోరం, ముంబై, జమ్ముకశ్మీర్. గ్రూప్ బి: అస్సాం, హిమాచల్ ప్రదేశ్, కేరళ, బీహార్, చండీగఢ్, ఒడిశా, సిక్కిం, సర్వీసెస్. గ్రూప్ సి: ఆంధ్రప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, గోవా, గుజరాత్, మణిపూర్, పంజాబ్, రైల్వేస్, సౌరాష్ట్ర. గ్రూప్ డి: బెంగాల్, జార్ఖండ్, మహారాష్ట్ర, పుదుచ్చేరి, రాజస్థాన్, ఉత్తరాఖండ్, విదర్భ. గ్రూప్ ఇ: ఢిల్లీ, కర్ణాటక, మధ్యప్రదేశ్, నాగాలాండ్, తమిళనాడు, త్రిపుర, ఉత్తరప్రదేశ్. -
బీసీసీఐ నుంచి బిగ్న్యూస్
భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) నుంచి ఇవాళ (ఏప్రిల్ 11) ఓ బిగ్న్యూస్ వెలువడింది. 2023-24 భారత దేశవాలీ సీజన్కు సంబంధించిన పూర్తి షెడ్యూల్ను బీసీసీఐ ఇవాళ ప్రకటించింది. జూన్ 2023-మార్చి 2024 మధ్యలో సాగే ఈ సీజన్లో మొత్తం 1846 మ్యాచ్లు జరుగనున్నాయి. 2023 జూన్ 28న మొదలయ్యే దులీప్ ట్రోఫీతో ఈ సీజన్ ప్రారంభమవుతుంది. ఈ టోర్నీ జులై 16, 2023న ముగుస్తుంది. ఆ వెంటనే జులై 24-ఆగస్ట్ 3 మధ్యలో దియోధర్ ట్రోఫీ జరుగుతుంది. ఈ రెండు టోర్నీల్లో ఆరు జోన్ల జట్లు (సెంట్రల్, సౌత్, నార్త్, ఈస్ట్, వెస్ట్, నార్త్-ఈస్ట్) పాల్గొంటాయి. ఈ రెండు టోర్నీ తర్వాత అక్టోబర్ 1 నుంచి రంజీ ఛాంపియన్ సౌరాష్ట్ర-రెస్ట్ ఆఫ్ఇండియా జట్ల మధ్య ఇరానీ ట్రోఫీ మొదలవుతుంది. ఈ మూడు మల్టీ డే ఫార్మాట్ (టెస్ట్ ఫార్మాట్) టోర్నీల తర్వాత సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ (టీ20 ఫార్మాట్), విజయ్ హజారే ట్రోఫీ (వన్డే ఫార్మాట్) లు మొదలవుతాయి. ముస్తాక్ అలీ ట్రోఫీ అక్టోబర్ 16 నుంచి నవంబర్ 6 వరకు జరుగనుండగా.. విజయ్ హజారే ట్రోఫీ నవంబర్ 23 నుంచి డిసెంబర్ 15 వరకు జరుగుతుంది. ఈ రెండు పరిమిత ఓవర్ల టోర్నీల్లో మొత్తం 38 జట్లు పోటీపడతాయి. అనంతరం 2024 జనవరి 5 నుంచి ప్రతిష్టాత్మక రంజీ ట్రోఫీ మొదలుకానుంది. మార్చి 14 వరకు సాగే ఈ టోర్నీలోనూ మొత్తం 38 జట్లు పాల్గొంటాయి. ఇక మహిళల క్రికెట్ విషయానికొస్తే.. సీనియర్ వుమెన్స్ టీ20 ట్రోఫీతో మహిళల డొమెస్టిక్ సీజన్ ప్రారంభమవుతుంది. ఈ టోర్నీ అక్టోబర్ 19 నుంచి నవంబర్ 9 వరకు సాగుతుంది. ఆతర్వాత నవంబర్ 24-డిసెంబర్ 4 మధ్యలో సీనియర్ వుమెన్స్ ఇంటర్ జోనల్ ట్రోఫీ జరుగుతుంది. దీని తర్వాత జనవరి 4, 2024 నుంచి సీనియర్ వుమెన్స్ వన్డే ట్రోఫీ మొదలవుతుంది. ఈ టోర్నీ జనవరి 26 వరకు సాగుతుంది. -
కీలక ఇన్నింగ్స్ ఆడిన సర్ఫరాజ్ ఖాన్.. ముస్తాక్ అలీ ట్రోఫీ విజేత ముంబై
సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ-2022 విజేతగా ముంబై జట్టు నిలిచింది. ఇవాళ (నవంబర్ 6) జరిగిన ఫైనల్లో ముంబై.. హిమాచల్ప్రదేశ్ను 3 వికెట్ల తేడాతో ఓడించి తొలిసారి టైటిల్ను సొంతం చేసుకుంది. ఈ మ్యాచ్లో సర్ఫరాజ్ ఖాన్ (31 బంతుల్లో 36 నాటౌట్; 3 ఫోర్లు, సిక్స్) కీలక ఇన్నింగ్స్ ఆడగా, తనుష్ కోటియన్ తొలుత బౌలింగ్లో (3/15, 5 బంతుల్లో 9 నాటౌట్; సిక్స్), ఆతర్వాత బ్యాటింగ్లో ఉత్కంఠ సమయంలో సిక్సర్ కొట్టి ముంబైని గెలిపించాడు. టాస్ గెలిచి తొలుత బౌలింగ్ చేసిన ముంబై.. తనుష్ కోటియన్, మోహిత్ అవస్థి (3/15), అమన్ హకీం ఖాన్ (1/24), శివమ్ దూబే (1/16) బంతితో రాణించడంతో నిర్ణీత ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 143 పరుగులు చేసింది. ఏకాంత్ సేన్ (37) టాప్ స్కోరర్గా నిలిచాడు. అనంతరం స్వల్ప లక్ష్య ఛేదనలో ముంబై ఆరంభంలోనే తడబడినప్పటికీ.. యశస్వి జైస్వాల్ (27), శ్రేయస్ అయ్యర్ (34), సర్ఫరాజ్ ఖాన్ ఓ మోస్తరుగా రాణించి ముంబైని విజేతగా నిలిపారు. 12 బంతుల్లో 23 పరుగులు చేయాల్సిన సమయంలో సర్ఫరాజ్ ఖాన్ 2 ఫోర్లు, సిక్సర్ బాది జట్టును గెలుపు ట్రాక్లో పెట్టాడు. ఆఖరి ఓవర్లో ముంబై గెలుపుకు 8 పరుగులు అవసరం కాగా.. తనుష్ కోటియన్.. రిషి ధవన్ వేసిన మూడో బంతికి సిక్పర్ బాది ముంబై చాన్నాళ్ల కలను సాకారం చేశాడు. -
శివాలెత్తిన శుభ్మన్ గిల్.. 11 ఫోర్లు, 9 సిక్సర్లతో విధ్వంసకర శతకం
SMAT 2022 Quarter Final 1 PUN VS KAR: సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ-2022లో భాగంగా ఇవాళ (నవంబర్ 1) జరిగిన తొలి క్వార్టర్ ఫైనల్లో పంజాబ్-కర్ణాటక జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్లో పంజాబ్ 9 పరుగుల తేడాతో గెలుపొంది సెమీఫైనల్కు చేరుకుంది. టాస్ ఓడి ప్రత్యర్ధి ఆహ్వానం మేరకు తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్.. శుభ్మన్ గిల్ (55 బంతుల్లో 126) విధ్వంసకర శతకంతో రెచ్చిపోవడంతో నిర్ణీత ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 225 పరుగులు భారీ స్కోర్ చేసింది. గిల్కు జతగా అన్మోల్ప్రీత్ సింగ్ (43 బంతుల్లో 59; 9 ఫోర్లు) బాధ్యతాయుతమైన హాఫ్ సెంచరీతో రాణించాడు. కేవలం 49 బంతుల్లోనే కెరీర్లో తొలి టీ20 శతకం బాదిన గిల్.. 11 ఫోర్లు, 9 సిక్సర్ల సాయంతో విధ్వంసం సృష్టించాడు. కర్ణాటక బౌలర్లలో విధ్వత్ కావేరప్ప 3 వికెట్లు పడగొట్టగా.. కృష్ణప్ప గౌతమ్ ఓ వికెట్ దక్కించుకున్నాడు. 💯 for @ShubmanGill! 👏 👏 What a cracking knock this has been from the right-hander in the #QF1 of the #SyedMushtaqAliT20! 👌 👌 #KARvPUN | @mastercardindia Follow the match ▶️ https://t.co/be91GGi9k5 pic.twitter.com/OaECrucM6g — BCCI Domestic (@BCCIdomestic) November 1, 2022 అనంతరం 226 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన కర్ణాటక.. ఆరంభంలో వరుసగా వికెట్లు కోల్పోయినప్పటికీ, ఆతర్వాత గెలిచేందుకు విశ్వప్రయత్నాలు చేసింది. అభినవ్ మనోహర్ (29 బంతుల్లో 62 నాటౌట్; 5 ఫోర్లు, 5 సిక్సర్లు), మనీశ్ పాండే (29 బంతుల్లో 45; 5 ఫోర్లు, 2 సిక్సర్లు), మనోజ్ భాండగే (9 బంతుల్లో 25; ఫోర్, 3 సిక్సర్లు), కృష్ణప్ప గౌతమ్ (14 బంతుల్లో 30 నాటౌట్; 2 ఫోర్లు, 2 సిక్సర్లు), చేతన్ (25 బంతుల్లో 33; 4 ఫోర్లు, సిక్స్) జట్టును గెలిపించేందుకు విఫలయత్నం చేశారు. వీరి పోరాటంతో కర్ణాటక 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 216 పరుగులు చేయగలిగింది. పంజాబ్ బౌలర్లలో రమన్దీప్ సింగ్ 2 వికెట్లు పడగొట్టగా.. సిద్ధార్ధ్ కౌల్, బల్తేజ్ సింగ్, అశ్వనీ కుమార్ తలో వికెట్ దక్కించుకున్నారు. కాగా, ఇవాళే జరిగిన మరో రెండు క్వార్టర్ ఫైనల్స్లో ఢిల్లీపై విధర్భ.. బెంగాల్పై హిమాచల్ ప్రదేశ్ గెలుపొందాయి. హిమాచల్.. బెంగాల్పై 4 వికెట్ల తేడాతో గెలుపొందగా.. ఢిల్లీపై విధర్భ ఒక్క పరుగు తేడాతో విజయం సాధించింది. సాయంత్రం 4:30 గంటలకు ముంబై-సౌరాష్ట్ర జట్ల మధ్య నాలుగో క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ జరుగనుంది. -
ఐదేసిన సిద్ధార్థ్ కౌల్.. పంజాబ్ ఘన విజయం
సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ 2022 ఎలైట్ గ్రూప్-బిలో పంజాబ్ వరుస విజయాలతో దూసుకుపోతుంది. జైపూర్ వేదికగా పుదుచ్చేరితో ఇవాళ (అక్టోబర్ 20) జరిగిన మ్యాచ్లో 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ టోర్నీలో ఇప్పటివరకు ఆడిన 6 మ్యాచ్ల్లో 5 విజయాలు సాధించిన పంజాబ్.. 20 పాయింట్లు సాధించి టేబుల్ టాపర్గా నిలిచింది. పుదుచ్చేరితో జరిగిన మ్యాచ్లో టాస్ గెలిచి తొలుత బౌలింగ్ చేసిన పంజాబ్.. ప్రత్యర్ధిని కేవలం 86 పరుగులకే కట్టడి చేసింది. వెటరన్ పేసర్ సిద్ధార్థ్ కౌల్ (5/12) ఐదు వికెట్లతో చెలరేగడంతో పుదుచ్చేరి నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి స్వల్ప స్కోర్కే పరిమితమైంది. సిద్దార్థ్కు జతగా బల్తేజ్ సింగ్ (1/17), హర్ప్రీత్ బ్రార్ (1/16), మార్కండే (2/17) రాణించారు. పుదుచ్చేరి ఇన్నింగ్స్లో పరమేశ్వరన్ శివరామన్ (25), అంకిత్ శర్మ (23), అరుణ్ కార్తీక్ (15) మాత్రమే రెండంకెల స్కోర్ చేశారు. అనంతరం స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన పంజాబ్.. కేవలం 10 ఓవర్లలోనే 2 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేరుకుంది. అభిషేక్ శర్మ (29), శుభ్మన్ గిల్ (21), ప్రభ్సిమ్రన్ సింగ్ (23 నాటౌట్), హర్ప్రీత్ బ్రార్ (13 నాటౌట్) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. పుదుచ్చేరి బౌలర్లలో సాగర్ ఉదేషికి ఓ వికెట్ దక్కింది. -
'ఎంపిక చేయలేదన్న కోపమా.. కసిని చూపించాడు'
సయ్యద్ ముస్తాక్ అలీ టి20 టోర్నీలో భాగంగా టీమిండియా పేసర్ ఉమ్రాన్ మాలిక్ వేసిన ఒక బంతి సోషల్ మీడియలో వైరల్గా మారింది. 150 కిమీ స్పీడ్తో వచ్చిన బంతి మిడిల్ స్టంప్ను ఎగురగొట్టడమే కాదు.. వికెట్ను పిచ్ బయటకి పడేలా చేసింది. దీనికి సంబంధించిన వీడియోను ఎస్ఆర్హెచ్ జట్టు తన ట్విటర్లో షేర్ చేసుకుంది. ప్రస్తుతం వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. టి20 ప్రపంచకప్కు ఎంపిక చేయలేదన్న కోపమో లేక బాధ తెలియదో కానీ ఉమ్రాన్లో కసి మాత్రం స్పష్టంగా కనిపించిందని అభిమానులు కామెంట్ చేశారు. జమ్మూ కశ్మీర్, మహారాష్ట్ర మధ్య మ్యాచ్లో ఇది చోటుచేసుకుంది. ఈ మ్యాచ్లో ఉమ్రాన్ మాలిక్ 4 ఓవర్లలో 27 పరుగులిచ్చి నాలుగు వికెట్లు తీశాడు. ఇతని ఖాతాలో మహారాష్ట్ర కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ వికెట్ కూడా ఉంది. ఇక తొలుత నెట్ బౌలర్గా టి20 ప్రపంచకప్కు ఎంపిక చేసినట్లు బీసీసీఐ ప్రకటించింది. ఉమ్రాన్ ఆస్ట్రేలియాకు కూడా వెళ్లేందుకు కూడా అన్ని ఏర్పాట్లు చేసింది. అయితే చివరి నిమిషంలో ఉమ్రాన్ మాలిక్ను పంపడం లేదని బీసీసీఐ తెలిపింది. దీంతో అతని ఫ్యాన్స్ తీవ్ర నిరాశ చెందారు. ఆ తర్వాత సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీలో ఆడుతున్న ఉమ్రాన్ మాలిక్ తన బౌలింగ్ పవరేంటో చూపిస్తున్నాడు. The #JammuExpress has hit max speed in #SMAT2022, shattering the wickets consistently 🔥#OrangeArmy #SunRisersHyderabad | @umran_malik_01 pic.twitter.com/aVlnNjlCcI — SunRisers Hyderabad (@SunRisers) October 18, 2022 చదవండి: 'భారత్లో జరిగే వరల్డ్కప్ను బాయ్కాట్ చేస్తాం' 40 పరుగులకే ఆలౌట్.. టోర్నీ చరిత్రలో చెత్త రికార్డు -
40 పరుగులకే ఆలౌట్.. టోర్నీ చరిత్రలో చెత్త రికార్డు
సయ్యద్ ముస్తాక్ అలీ టి20 టోర్నీ చరిత్రలో మణిపూర్ అత్యల్ప స్కోరు నమోదు చేసింది. ఈ నేపథ్యంలో అత్యంత చెత్త రికార్డు మూటగట్టుకుంది. టోర్నీలో భాగంగా ఎలైట్ గ్రూఫ్-బిలో పంజాబ్తో మ్యాచ్లో 40 పరుగులకే కుప్పకూలింది. పంజాబ్ బౌలర్ల దాటికి విలవిలలాడిని మణిపూర్ బ్యాటర్స్లో 10 మంది సింగిల్ డిజిట్కే పరిమితమయ్యారు. రెక్స్ సింగ్ 25 పరుగులతో టాప్ స్కోరర్గా నిలిచాడు. జట్టు స్కోరు 40 అంటే అందులో రెక్స్వి 25 పరుగులు.. మిగతా 10 మంది సింగిల్ డిజిట్కే పరిమితమయ్యారు. అందునా ముగ్గురు బ్యాటర్స్ డకౌట్గా వెనుదిరిగారు. మార్కండే 4 వికెట్లతో చెలరేగగా.. రమణ్దీప్ సింగ్ రెండు వికెట్లు, అభిషేక్ శర్మ, సిద్ధార్థ్ కౌల్, బల్తేజ్ సింగ్, హర్ప్రీత్ బార్లు తలా ఒక వికెట్ తీశారు. అనంతరం స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన పంజాబ్ జట్టు 5.3 ఓవర్లలో ఒక వికెట్ కోల్పోయి లక్ష్యాన్ని అందుకుంది. అభిషేక్ శర్మ 28 నాటౌట్ జట్టును గెలిపించాడు. -
వరల్డ్కప్కు పక్కనబెట్టడంతో సయ్యద్ ముస్తాక్ టోర్నీకి..
దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్లో అద్భుతంగా ఆకట్టుకున్న శ్రేయాస్ అయ్యర్ బీసీసీఐ ప్రత్యేక అనుమతితో సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీలో పాల్గొననున్నాడు. ఈ సీజన్లో ముంబై తరపున శ్రేయాస్ ప్రాతినిధ్యం వహించనున్నాడు. కాగా జట్టులో 16వ అనధికారిక ఆటగాడిగా అయ్యర్ కొనసాగనున్నాడు. వాస్తవానికి జట్టుకు 15 మందిని మాత్రమే ఎంపిక చేస్తారు. అయితే బీసీసీఐ స్పెషల్ పర్మిషన్ ఇవ్వడంతో ముంబై జట్టు శ్రేయాస్ను 16వ ఆటగాడిగా తీసుకుంది. ఇక అంతకముందు శార్దూల్ ఠాకూర్ టి20 ప్రపంచకప్కు స్టాండ్ బైగా ఎంపికవడంతో అతని స్థానంలో సూర్యాన్ష్ హెగ్డేను జట్టులోకి తీసుకుంది. ఇక అక్టోబర్ 20 రాజ్కోట్ వేదికగా రాజస్తాన్తో మ్యాచ్లో శ్రేయాస్ అయ్యర్ బరిలోకి దిగే అవకాశం ఉంది. అయితే తొలుత శ్రేయాస్ అయ్యర్ను టి20 ప్రపంచకప్కు స్టాండ్ బై ప్లేయర్గా ఎంపిక చేశారు. జట్టులో అదనపు బ్యాటర్గా రాణించగల సత్తా ఉన్న అయ్యర్ను ఆస్ట్రేలియాకు పంపకపోవడంపై అభిమానులు నిరాశకు గురయ్యారు. అయితే జట్టులో అదనపు బ్యాటర్స్ అవసరం పెద్దగా లేదని గుర్తించినందునే అయ్యర్ను ఆసీస్కు పంపలేదని బీసీసీఐ వివరణ ఇచ్చింది. చదవండి: ఆసీస్తో వార్మప్ మ్యాచ్ .. టీమిండియా గెలిచేనా! -
తిలక్ వర్మ జోరు.. హైదరాబాద్కు హ్యాట్రిక్ విజయం
జైపూర్: ముస్తాక్ అలీ ట్రోఫీ దేశవాళీ టి20 క్రికెట్ టోర్నీలో హైదరాబాద్ మూడో విజయం నమోదు చేసింది. త్రిపుర జట్టుతో జరిగిన గ్రూప్ ‘బి’ నాలుగో లీగ్ మ్యాచ్లో హైదరాబాద్ ఐదు వికెట్ల తేడాతో గెలిచింది. యువ బ్యాటర్ తిలక్ వర్మ తన అద్భుతమైన ఫామ్ కొనసాగిస్తూ వరుసగా నాలుగో మ్యాచ్లోనూ అర్ధ సెంచరీ సాధించాడు. త్రిపుర నిర్దేశించిన 159 పరుగుల లక్ష్యాన్ని హైదరాబాద్ సరిగ్గా 20 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి ఛేదించింది. తిలక్ వర్మ 46 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్స్లతో 67 పరుగులు చేశాడు. మికిల్ జైస్వాల్ (21 బంతుల్లో 32; 1 ఫోర్, 2 సిక్స్లు), తనయ్ త్యాగరాజన్ (11 బంతుల్లో 24 నాటౌట్; 3 ఫోర్లు, 1 సిక్స్) కూడా ధాటిగా ఆడి హైదరాబాద్ విజయానికి బాటలు వేశారు. అంతకుముందు త్రిపుర 20 ఓవర్లలో 8 వికెట్లకు 158 పరుగులు చేసింది. రవితేజ, తనయ్ త్యాగరాజన్ రెండేసి వికెట్లు తీశారు. -
అదరగొట్టిన తిలక్ వర్మ.. హైదరాబాద్కు మరో విజయం
జైపూర్: ముస్తాక్ అలీ ట్రోఫీ దేశవాళీ టి20 క్రికెట్ టోర్నీలో హైదరాబాద్ రెండో విజయం నమోదు చేసింది. గోవా జట్టుతో శుక్రవారం జరిగిన గ్రూప్ ‘బి’ లీగ్ మ్యాచ్లో హైదరాబాద్ 37 పరుగుల తేడాతో గెలిచింది. ముందుగా హైదరాబాద్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 177 పరుగులు చేసింది. తిలక్ వర్మ (46 బంతుల్లో 62; 6 ఫోర్లు, 2 సిక్స్లు) వరుసగా మూడో అర్ధ సెంచరీ సాధించాడు. కెప్టెన్ తన్మయ్ అగర్వాల్ (41 బంతుల్లో 55; 6 ఫోర్లు, 1 సిక్స్) కూడా రాణించాడు. గోవా తరఫున ఆడుతున్న క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ తనయుడు అర్జున్ టెండూల్కర్ 4 ఓవర్లలో కేవలం 10 పరుగులిచ్చి 4 వికెట్లు తీయడం విశేషం. అనంతరం గోవా 18.5 ఓవర్లలో 140 పరుగులకు ఆలౌటై ఓడిపోయింది. హైదరాబాద్ బౌలర్లు టి.రవితేజ 20 పరుగులిచ్చి 4 వికెట్లు.. అనికేత్ రెడ్డి 19 పరుగులిచ్చి 2 వికెట్లు తీసి గోవా జట్టును దెబ్బ తీశారు. చదవండి: సెంచరీతో చెలరేగిన పృథ్వీ షా.. ముంబై భారీస్కోరు -
సెంచరీతో చెలరేగిన పృథ్వీ షా.. ముంబై భారీస్కోరు
సయ్యద్ ముస్తాక్ అలీ టి20 టోర్నీలో భాగంగా ముంబై కెప్టెన్ పృథ్వీ షా సెంచరీతో చెలరేగాడు. శుక్రవారం ఎలైట్ గ్రూఫ్-ఏలో భాగంగా అస్సాంతో మ్యాచ్లో ఈ ముంబై ఓపెనర్ శతకం సాధించాడు. 61 బంతుల్లోనే 13 ఫోర్లు, 9 సిక్సర్లతో 134 పరుగులు బాదాడు. ఫలితంగా ముంబై జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 230 పరుగుల భారీ స్కోరు సాధించింది. ముంబై చేసిన 230 పరుగుల్లో 134 పరుగులు పృథ్వీ షావే ఉన్నాయంటే అతని విధ్వంసం ఎంతలా సాగిందో అర్థం చేసుకోవచ్చు. యశస్వి జైశ్వాల్ 42 పరుగులతో పృథ్వీకి సహకరించాడు. సర్ఫరాజ్ ఖాన్ 15, శివమ్ దూబే 17 పరుగులతో నాటౌట్గా నిలిచారు. అస్సాం బౌలర్లలో రియాన్ పరాగ్, రోషన్ అస్లామ్, రాజ్కుద్దీన్ అహ్మద్లు తలా ఒక వికెట్ తీశారు. ఇక మ్యాచ్లో 134 పరుగులు నాటౌట్గా నిలిచిన పృథ్వీ షా సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీ చరిత్రలో అత్యధిక వ్యక్తిగత స్కోరు జాబితాలో నాలుగో స్థానంలో నిలిచాడు. తొలి స్థానంలో శ్రేయాస్ అయ్యర్ 147 పరుగులు, పునిత్ బిస్త్ 146 నాటౌట్, మహ్మద్ అజారుద్దీన్ 137 నాటౌట్ వరుసగా తొలి మూడు స్థానాల్లో ఉన్నారు. Maiden hundred for Captain Prithvi Shaw in T20 format, hundred from 46 balls including 10 fours and 6 sixes, A knock to remember, What a player. pic.twitter.com/bokhoHDAPQ — Johns. (@CricCrazyJohns) October 14, 2022 చదవండి: 'భయపడితే పనులు కావు.. పరుగులు చేయడమే' గంగూలీపై రవిశాస్త్రి ఆసక్తికర వ్యాఖ్యలు -
అంబటి రాయుడు, షెల్డన్ జాక్సన్ వాగ్వాదం.. వీడియో వైరల్
టీమిండియా మాజీ క్రికెటర్ అంబటి రాయుడు, యంగ్ క్రికెటర్ షెల్డన్ జాక్సన్ మధ్య జరిగిన గొడవ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. సయ్యద్ ముస్తాక్ అలీ టి20 టోర్నీలో భాగంగా ఇది చోటుచేసుకుంది. విషయంలోకి వెళితే ఎలైట్ గ్రూఫ్ డిలో బుధవారం బరోడా, సౌరాష్ట్ర మధ్య మ్యాచ్ జరిగింది. సౌరాష్ట్ర ఇన్నింగ్స్ సమయంలో బ్యాటింగ్ చేస్తున్న షెల్డన్ జాక్సన్తో అంబటి రాయుడు ఏదో విషయమై మాట్లాడుతున్నాడు. చూస్తుండగానే ఇద్దరి మధ్య మాటల యుద్ధం జరిగి కొట్టుకునే దాకా వెళ్లిపోయారు. ఇంతలో అంపైర్లతో పాటు ఆటగాళ్లు వచ్చి ఇద్దరిని విడదీయడంతో వివాదం సద్దుమణిగింది. అయితే వీరి గొడవకు గల కారణం మాత్రం ఏంటనేది తెలియరాలేదు. మాములుగానే అంబటి రాయుడు దూకుడు స్వభావం కలిగిన ఆటగాడు. ఇంతకముందు కూడా రాయుడు చాలా సందర్భాల్లో సహనం కోల్పోయి ఆటగాళ్లతో గొడవ పడిన దాఖలాలు ఉన్నాయి. టీమిండియాలో సరైన అవకాశాలు రాకపోవడంతో అసహనం వ్యక్తం చేసిన రాయుడు జూలై 2, 2019న అంతర్జాతీయ క్రికెట్కు గుడ్బై ప్రకటించాడు. టీమిండియా తరపున అంబటి రాయుడు 55 వన్డేలు ఆడి 1695 పరుగులు సాధించాడు. అతని ఖాతాలో మూడు సెంచరీలతో పాటు 10 అర్థసెంచరీలు ఉన్నాయి. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన బరోడా జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 175 పరుగులు చేసింది. మితేష్ పటేల్ 60, విష్ణు సోలంకి 51 పరుగులు చేశారు. ఆ తర్వాత బ్యాటింగ్ చేసిన సౌరాష్ట్ర 19.4 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేధించింది. సమరత్ వ్యాస్ 52 బంతుల్లో 97 పరుగులతో టాప్ స్కోరర్గా నిలిచాడు. కేవలం మూడు పరుగుల తేడాతో సెంచరీ మార్క్ను చేజార్చుకున్నాడు. pic.twitter.com/twhRAM0o2Y — cricket fan (@cricketfanvideo) October 12, 2022 చదవండి: ఏకకాలంలో నలుగురు పరిగెత్తుకొచ్చారు.. ఏం లాభం! తిలక్ వర్మ.. ఈసారి మాత్రం వదల్లేదు -
తిలక్ వర్మ.. ఈసారి మాత్రం వదల్లేదు
జైపూర్: ముస్తాక్ అలీ ట్రోఫీ దేశవాళీ టి20 క్రికెట్ టోర్నీలో హైదరాబాద్ తొలి విజయం నమోదు చేసింది. ఎలైట్ గ్రూప్ ‘బి’లో భాగంగా పాండిచ్చేరితో బుధవారం జరిగిన మ్యాచ్లో హైదరాబాద్ నాలుగు పరుగుల తేడాతో గెలిచింది. ముందుగా హైదరాబాద్ 20 ఓవర్లలో 8 వికెట్లకు 147 పరుగులు చేసింది. తిలక్వర్మ (41 బంతుల్లో 57; 1 ఫోర్, 4 సిక్స్లు) వరుసగా రెండో అర్ధ సెంచరీ చేశాడు. మికిల్ జైస్వాల్ (25 బంతుల్లో 44 నాటౌట్; 2 ఫోర్లు, 4 సిక్స్లు) కూడా రాణించాడు. కాగా తొలి మ్యాచ్లో హాఫ్ సెంచరీతో రాణించినప్పటికి జట్టును గెలిపించలేకపోయాడు. కానీ ఈసారి మాత్రం తన అర్థసెంచరీతో జట్టుకు విజయం అందించేదాకా వదల్లేదు. అనంతరం 148 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పాండిచ్చేరి 20 ఓవర్లలో 4 వికెట్లకు 143 పరుగులు చేసి ఓడిపోయింది. హైదరాబాద్ తరఫున భగత్ వర్మ, తిలక్ వర్మ, సీవీ మిలింద్ ఒక్కో వికెట్ పడగొట్టారు. మరోవైపు ఇండోర్లో ఆంధ్ర, హిమాచల్ ప్రదేశ్ జట్ల మధ్య మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది. చదవండి: భారత సంతతి క్రికెటర్పై 14 ఏళ్ల నిషేధం -
క్రికెట్ చరిత్రలో తొలిసారి.. కొత్త నిబంధన అమల్లోకి
సాధారణంగా క్రికెట్లో సబ్స్టిట్యూట్ అంటే ఫీల్డర్ గాయపడితే అతని స్థానంలో మైదానంలోకి వస్తాడు. కానీ అతనికి ఫీల్డింగ్ మినహా బ్యాటింగ్, బౌలింగ్ చేసే అవకాశం ఉండదు. అయితే సబ్స్టిట్యూట్గా వచ్చే ఆటగాడికి బ్యాటింగ్, బౌలింగ్ చేసేలా బీసీసీఐ ''ఇంపాక్ట్ ప్లేయర్'' పేరిట కొత్త నిబంధన తీసుకొచ్చింది. ఈ నిబంధన జట్టు కెప్టెన్లకు ఎంతగానో ఉపయోగపడనుంది. బ్యాటింగ్లో చెలరేగిన ఒక ఆటగాడు బౌలింగ్ చేయాల్సిన అవసరం లేనప్పుడు అతని స్థానంలో ఒక బౌలర్ను తీసుకునే అవకాశం కెప్టెన్కు ఉంటుంది. తాజాగా బీసీసీఐ తెచ్చిన ''ఇంపాక్ట్ ప్లేయర్'' నిబంధనను సయ్యద్ ముస్తాక్ అలీ టి20 టోర్నీలో తొలిసారి ఉపయోగించారు. టోర్నీలో భాగంగా ఎలైట్ గ్రూఫ్-బిలో ఢిల్లీ, మణిపూర్ మధ్య మ్యాచ్లో హృతిక్ షోకీన్ తొలి ఇంపాక్ట్ ప్లేయర్గా నిలిచి చరిత్ర సృష్టించాడు. త్వరలోనే ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధనను ఐపీఎల్లో కూడా అమలు చేయనున్నారు. ఇక తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 167 పరుగులు చేసింది. ఓపెనర్ హితెన్ దలాల్(27 బంతుల్లో 47 పరుగులు, 7 ఫోర్లు, ఒక సిక్సర్) రాణించాడు. యష్ దుల్ 24, హిమ్మత్ సింగ్ 25 పరుగులు చేశారు. అయితే బ్యాట్తో రాణించిన హితెన్ దలాల్ బౌలింగ్ చేయలేడు కాబట్టి కెప్టెన్ నితీష్ రాణా అతని స్థానంలో బౌలర్ హృతిక్ షోకీన్ను ఇంపాక్ట్ ప్లేయర్గా తీసుకొచ్చాడు. ఇది ఢిల్లీ జట్టుకు లాభం చేకూర్చింది. బౌలింగ్లో షోకీన్(3-0-13-2) చెలరేగడంతో ఢిల్లీ విజయాన్ని అందుకుంది. షోకీన్తో పాటు మయాంక్ యాదవ్ కూడా రెండు వికెట్లు తీయడం.. నితీష్ రాణా, లలిత్ యాదవ్లు చెరొక వికెట్ తీయడంతో మణిపూర్ 96 పరుగులకే ఆలౌటైంది. ఆ తర్వాత కాసేపటికే మణిపూర్ కెప్టెన్ లాంగ్లోన్యాంబ కీషాంగ్బామ్ కూడా బౌలర్ బిష్వోర్జిత్ స్థానంలో బ్యాటర్ అహ్మద్ షాను ఇంపాక్ట్ ప్లేయర్గా తీసుకొచ్చాడు. చదవండి: 'ఏదైనా సాధిస్తేనే ఇంటికి రా' గంగూలీ కథ ముగిసినట్లే..! -
కొత్త రూల్ ప్రవేశపెట్టనున్న బీసీసీఐ.. ఇన్నింగ్స్ మధ్యలో ఆటగాడిని మార్చేయవచ్చు
భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) దేశవాళీ క్రికెట్లో కొత్త రూల్ను ప్రవేశపెట్టనుంది. వచ్చే నెలలో (అక్టోబర్) ప్రారంభంకానున్న సయ్యద్ ముస్తాక్ అలీ టీ20 ట్రోఫీ నుంచి 'ఇంపాక్ట్ ప్లేయర్' అనే నయా రూల్ను అమల్లోకి తేనుంది. ఈ రూల్ అమల్లోకి వస్తే ఇన్నింగ్స్ మధ్యలో ఆటగాడిని మార్చుకునే వెసలుబాటు లభిస్తుంది. ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ ప్రకారం.. ఇన్నింగ్స్ ప్రారంభమయ్యాక 14 ఓవర్ల లోపు ఇరు జట్లు ఒక్కో ఆటగాడిని మార్చుకునే అవకాశం ఉంటుంది. సాధారణంగా మ్యాచ్ మధ్యలో ఆటగాడికి గాయమైనా లేక ఆనారోగ్యం బారిన పడినా అతని స్థానంలో మరో ఆటగాడు (సబ్స్టిట్యూట్) బరిలోకి దిగుతాడు. ఇక్కడ సబ్స్టిట్యూట్గా వచ్చిన ఆటగాడు కేవలం ఫీల్డింగ్ మాత్రమే చేయాల్సి ఉంటుంది. అదే ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ ప్రకారం అయితే బౌలింగ్ చేసే జట్టులో ఇన్నింగ్స్ 14 ఓవర్లలోపు ఆటగాడు గాయపడినా లేదా మ్యాచ్ అప్పటి స్థితిగతులను బట్టి ఓ ఆటగాడిని మార్చుకోవాలని భావించినా ఓవర్ ముగిశాక కెప్టెన్ లేదా హెడ్ కోచ్ లేదా మేనేజర్లలో ఎవరో ఒకరు ఫీల్డ్ అంపైర్ లేదా ఫోర్త్ అంపైర్కు సమాచారం అందిస్తే ఆటగాడిని మార్చుకునే ఛాన్స్ ఉంటుంది. ఇంపాక్ట్ ప్లేయర్గా వచ్చిన ఆటగాడు బ్యాటింగ్తో పాటు 4 ఓవర్ల పాటు బౌలింగ్ కూడా చేయవచ్చు. అదే బ్యాటింగ్ చేసే జట్టు వికెట్ పడ్డాక ఇన్నింగ్స్ బ్రేక్ సమయంలో ఇంపాక్ట్ ప్లేయర్ గురించి అంపైర్కు సమాచారం అందిస్తే ఆటగాడిని మార్చుకునే వెసలుబాటు ఉంటుంది. ఇందుకోసం ఇరు జట్లు టాస్ సమయంలో ప్లేయింగ్ ఎలెవెన్తో పాటు నలుగురు ఇంపాక్ట్ ప్లేయర్స్ జాబితాను సమర్పించాల్సి ఉంటుంది. తప్పనిసరి కాని ఈ ఇంపాక్ట్ ప్లేయర్ ఆప్షన్ ప్రకారం ఒక్కసారి జట్టును వీడిన ఆటగాడు తిరిగి జట్టులోకి వచ్చే అవకాశం (ఆ మ్యాచ్ వరకు) ఉండదు. ప్రస్తుతం బిగ్బాష్ లీగ్లో మాత్రమే అమల్లో ఉన్న ఈ రూల్ త్వరలో సయ్యద్ ముస్తాక్ అలీ టీ20 టోర్నీలోనూ అమల్లోకి రానుంది. ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ను వచ్చే సీజన్ నుంచి ఐపీఎల్లో సైతం ప్రవేశ పెట్టాలని బీసీసీఐ యోచిస్తుంది. క్రికెట్తో పాటు ఇంపాక్ట్ ప్లేయర్ ఆప్షన్ ఫుట్బాల్, రగ్బీ, బాస్కెట్ బాల్ వంటి క్రీడల్లో కూడా అమల్లో ఉంది. ఈ రూల్ అమల్లోకి వస్తే క్రికెట్ మరింత రసవత్తరంగా మారనుందని విశ్లేషకులు భావిస్తున్నారు. -
Ind Vs WI: ఆ ఇద్దరికి బంపరాఫర్.. ఒకరు వన్డే, మరొకరు టీ20 సిరీస్కు ఎంపిక!
India Vs West Indies Series 2022: దక్షిణాఫ్రికా పర్యటనతో పరాభవాన్ని మూటగట్టుకున్న టీమిండియా స్వదేశంలో వెస్టిండీస్తో పరిమిత ఓవర్ల సిరీస్కు సిద్ధమవుతోంది. మూడు వన్డేలు, మూడు టీ20లతో కూడిన సిరీస్ ఆడనుంది. ఈ క్రమంలో ఇప్పటికే గాయం నుంచి కోలుకున్న కెప్టెన్ రోహిత్ శర్మ అందుబాటులోకి రానుండగా.. దేశవాళీ టోర్నీల్లో అదరగొట్టిన ఆటగాళ్లకు కూడా అవకాశం ఇవ్వాలని బీసీసీఐ భావిస్తోందట. సౌతాఫ్రికాతో టూర్లో తుది జట్టు కూర్పు.. తదనంతర ఫలితాలు దృష్టిలో పెట్టుకుని సమతౌల్యమైన జట్టును ఎంపిక చేసే పనిలో సెలక్టర్లు ఉన్నారు. ఈ జాబితాలో ఆల్రౌండర్ రిషి ధావన్, షారుఖ్ ఖాన్ పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. 458 పరుగులు.. 17 వికెట్లు.. దేశవాళీ వన్డే టోర్నీ విజయ్ హజారే ట్రోఫీలో హిమాచల్ ప్రదేశ్ కెప్టెన్ రిషి ధావన్ అద్భుత ఆటతీరు కనబరిచిన సంగతి తెలిసిందే. బ్యాటర్గా.. బౌలర్గా రిషి ధావన్ అత్యుత్తమంగా రాణించాడు.ఈ టోర్నీలో మొత్తంగా 458 పరుగులు చేయడంతో పాటుగా 17 వికెట్లు పడగొట్టాడు. ఇందులో నాలుగు అర్ధ సెంచరీలతో పాటు ఒక 4 వికెట్ హాల్ కూడా ఉండటం విశేషం. ఇలా ఆటగాడిగా.. సారథిగా హిమాచల్ ప్రదేశ్ మొట్టమొదటి సారిగా ఈ మెగా ఈవెంట్లో విజేతగా నిలవడంలో కీలక పాత్ర పోషించాడు. ఈ నేపథ్యంలో రిషి సుదీర్ఘకాలం తర్వాత జాతీయ జట్టులో చోటు దక్కించుకునే ఛాన్స్ ఉంది. విండీస్తో వన్డే సిరీస్కు అతడిని ఎంపిక చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. #VijayHazareTrophy winners. 🏆 Congratulations and a round of applause for Himachal Pradesh on their triumph. 👏 👏#HPvTN #Final pic.twitter.com/bkixGf6CUc — BCCI Domestic (@BCCIdomestic) December 26, 2021 ఆఖరి బంతికి సిక్స్ కొట్టి.. మరోవైపు... తమిళనాడు ఆటగాడు షారుఖ్ ఖాన్ సైతం దేశవాళీ టీ20 టోర్నీ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ, వన్డే టోర్నీ విజయ్ హజారే ట్రోఫీలో రాణించాడు. ముఖ్యంగా సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ ఫైనల్లో ఆఖరి బంతికి సిక్సర్ కొట్టి తమిళనాడును విజేతగా నిలిపి అందరి చేత ప్రశంసలు అందుకున్నాడు. ఈ ప్రదర్శన దృష్ట్యా విండీస్ టీ20 సిరీస్కు షారుఖ్ను సెలక్ట్ చేయనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇదిలా ఉండగా... దక్షిణాఫ్రికా టూర్లో ఘోరంగా వైఫల్యం చెందిన వెంకటేశ్ అయ్యర్, భువనేశ్వర్ కుమార్ తదితరులపై వేటు పడటం ఖాయంగా కనిపిస్తోంది. ఇక గాయం కారణంగా టూర్కు దూరమైన అక్షర్ పటేల్, కరోనా కారణంగా వన్డే సిరీస్ మిస్సైన వాషింగ్టన్ సుందర్.. వీరితో పాటు ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా రీ ఎంట్రీ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. Sensational Shahrukh! 💪 💪 Sit back & relive this @shahrukh_35 blitz which powered Tamil Nadu to #SyedMushtaqAliT20 title triumph. 🏆 👏 #TNvKAR #Final Watch his knock 🎥 ⬇️https://t.co/6wa9fwKkzu pic.twitter.com/evxBiUdETk — BCCI Domestic (@BCCIdomestic) November 22, 2021 చదవండి: రాహుల్, పంత్కు ప్రమోషన్.. రహానే, పుజారాలకు డిమోషన్! -
ఆఖరి ఓవర్లో అద్భుతం.. నాలుగు బంతుల్లో నాలుగు వికెట్లు
Darshan Nalkande Pics 4 Wkts In Four Consecutive Balls.. సయ్యద్ ముస్తాక్ అలీ టి20 ట్రోఫీలో భాగంగా శనివారం ఒక అద్భుత ఘటన జరిగింది. విదర్భ, కర్ణాటక మధ్య జరిగిన సెమీఫైనల్లో మ్యాచ్లో విదర్భ బౌలర్ దర్శన్ నల్కండే నాలుగు వరుస బంతుల్లో నాలుగు వికెట్లు తీసి చరిత్ర సృష్టించాడు. అందులోనూ ఇన్నింగ్స్ ఆఖరి ఓవర్లో ఈ ఫీట్ నమోదు చేయడం విశేషం. చదవండి: Syed Mustaq Ali T20: ఓటమి నుంచి తృటిలో తప్పించుకొని ఫైనల్కు ఇన్నింగ్స్ 20వ ఓవర్ వేసిన దర్శన్ నల్కండే.. తొలి బంతికి అనిరుద్ద జోషిని వెనక్కిపంపాడు. తర్వాత వరుస బంతుల్లో శరత్ బీఆర్, జగదీష్ సుచిత్లు పెవిలియన్ చేర్చి హ్యాట్రిక్ నమోదు చేశాడు. ఇక చివరగా నాలుగో బంతికి ఇన్ఫాం బ్యాటర్ అభినవ్ మనోహర్ను ఔట్ చేసి నాలుగో వికెట్ సాధించాడు. ఈ నలుగురిలో అభివన్ మనోహర్ వికెట్ పెద్దది. దీంతో దర్శన నల్కండే అద్భుత ప్రదర్శనపై ట్విటర్లో ప్రశంసలు లభిస్తున్నాయి. అయితే ఈ సెమీఫైనల్ మ్యాచ్లో కర్ణాటక చేతిలో విదర్భ పరాజయం పాలైంది. ఇక ఫైనల్ చేరిన కర్ణాటక నవంబర్ 22న తమిళనాడుతో అమితుమీ తేల్చుకోనుంది. చదవండి: Steve Smith As Test Captain: ఆస్ట్రేలియా టెస్టు కెప్టెన్గా మరోసారి స్టీవ్ స్మిత్! pic.twitter.com/hAios7nHR0 — Simran (@CowCorner9) November 20, 2021 -
ఓటమి నుంచి తృటిలో తప్పించుకొని ఫైనల్కు
Karnataka Enters Final Beat Vidarbha By 4 Runs.. సయ్యద్ ముస్తాక్ అలీ టి20 ట్రోఫీలో ఓటమి నుంచి తృటిలో తప్పించుకున్న కర్ణాటక ఫైనల్లో ప్రవేశించింది. విదర్భతో జరిగిన ఉత్కంఠభరిత సెమీఫైనల్లో 4 పరుగుల తేడాతో కర్ణాటక విజయం సాధించింది. ఆద్యంతం హోరాహోరీగా సాగిన సెమీస్లో విదర్భ గెలుపు ముంగిట బోల్తా పడింది. తొలుత బ్యాటింగ్ చేసిన కర్ణాటక నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 176 పరుగులు చేసింది. ఓపెనర్ రోహన్ కదమ్(56 బంతుల్లో 87 పరుగులు, 7 సిక్సర్లు, 4 ఫోర్లు) కదం తొక్కడం.. కెప్టెన్ మనీష్ పాండే 54 పరుగులతో సహకరించాడు. తొలి వికెట్కు ఈ ఇద్దరు రికార్డు స్థాయిలో 132 పరుగులు జోడించారు. ఆ తర్వాత అభినవ్ మనోహర్ 27 మినహా మిగతావరు పూర్తిగా విఫలమయ్యారు. విదర్భ బౌలర్లలో దర్శన్ నల్కండే 4, లలిత్ యాదవ్ 2, యష్ ఠాకూర్ ఒక వికెట్ తీశారు. చదవండి: Syed Mustaq Ali T20: హైదరాబాద్ ఘోర ఓటమి.. ఫైనల్లో తమిళనాడు అనంతరం బ్యాటింగ్ చేసిన విదర్భ ఇన్నింగ్స్లో పెద్దగా స్కోర్లు నమోదు కానప్పటికి బ్యాట్స్మన్ తలో చెయ్యి వేశారు. అథర్వ తైడే 32, గణేష్ సతీష్ 31 పరుగులు చేశారు. కర్ణాటక బౌలింగ్లో కెసి కరియప్ప 2, విద్యాదర్ పాటిల్, దర్శన్ ఎంబి, జగదీష్ సుచిత్, కరుణ్ నాయర్ తలా ఒక వికెట్ తీశారు. ఫైనల్లో ప్రవేశించిన కర్ణాటక.. తమిళనాడుతో అమితుమీ తేల్చుకోనుంది. ఇక 2019 సయ్యద్ ముస్తాక్ అలీ టి20 ట్రోఫీలో ఈ రెండు జట్ల మధ్యే ఫైనల్ జరగింది. అప్పుడు తమిళనాడుపై గెలిచి కర్ణాటక ట్రోఫీని అందుకుంది. చదవండి: Shaheen Afridi: సిక్స్ కొట్టాడని కసితీరా కొట్టాడు.. క్షమాపణ ఎందుకు షాహిన్? -
Syed Mustaq Ali T20: హైదరాబాద్ ఘోర ఓటమి.. ఫైనల్లో తమిళనాడు
Tamil Nadu Enters Final Beat Hyderabad By 8 Wickets.. సయ్యద్ ముస్తాక్ అలీ టి20 ట్రోఫీలో భాగంగా తమిళనాడుతో జరిగిన సెమీఫైనల్లో హైదరాబాద్ ఘోర ఓటమి చవిచూసింది. తొలుత బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ 18.3 ఓవర్లలో 90 పరుగులకే కుప్పకూలింది.తనయ్ త్యాగరాజన్ 25 పరుగులతో టాప్ స్కోరర్గా నిలవగా.. మిగతా 10 మంది సింగిల్ డిజిట్కే పరిమితమ్యారు. తమిళనాడు బౌలర్ శరవణ కుమార్ 5 వికెట్లతో దుమ్మురేపగా.. ఎం అశ్విన్, మహ్మద్ చెరో 2 వికెట్లు తీశారు. అనంతరం స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన తమిళనాడు 14.2 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని అందుకుంది. కెప్టెన్ విజయ్శంకర్ 43 పరుగులు నాటౌట్.. సాయి సుదర్శన్ 34 నాటౌట్ గెలిపించారు. ఈ విజయంతో తమిళనాడు ఫైనల్లో ప్రవేశించింది. ఇక విదర్భ, కర్ణాటక మధ్య జరగనున్న సెమీఫైనల్ విజేతతో అమీతుమీ తేల్చుకోనుంది. చదవండి: chris gayle: క్రిస్ గేల్ విధ్వంసం.. కేవలం 23 బంతుల్లోనే.. -
తిలక్ వర్మ మెరుపు ఇన్నింగ్స్.. సెమీ ఫైనల్లో హైదరాబాద్
Syed Mushtaq Ali Trophy-Hyderabad Enter Into Semi-Finals: దేశవాళీ టి20 టోర్నీ ముస్తాక్ అలీ ట్రోఫీలో హైదరాబాద్ సెమీ ఫైనల్లోకి ప్రవేశించింది. గురువారం జరిగిన క్వార్టర్స్లో హైదరాబాద్ 30 పరుగుల తేడాతో గుజరాత్ను ఓడించింది. ముందుగా హైదరాబాద్ 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 158 పరుగులు చేసింది. ఠాకూర్ తిలక్ వర్మ (50 బంతుల్లో 75; 5 ఫోర్లు, 2 సిక్స్లు) మెరుపు బ్యాటింగ్తో చెలరేగగా...కెప్టెన్ తన్మయ్ అగర్వాల్ (21 బంతుల్లో 31; 4 ఫోర్లు, 1 సిక్స్), రాహుల్ బుద్ధి (16 బంతుల్లో 25 నాటౌట్; 3 ఫోర్లు, 1 సిక్స్) రాణించారు. అనంతరం గుజరాత్ 20 ఓవర్లలో 8 వికెట్లకు 128 పరుగులే చేయగలిగింది. రిపాల్ పటేల్ (24 బంతుల్లో 35; 1 ఫోర్, 2 సిక్స్లు) టాప్ స్కోరర్గా నిలిచాడు. టి. రవితేజ (3/27), సీవీ మిలింద్ (2/28) కట్టుదిట్టమైన బౌలింగ్తో ప్రత్యర్థిని దెబ్బ తీశారు. కర్నాటక సూపర్ ఓవర్తో... కర్నాటకతో క్వార్టర్ ఫైనల్లో బెంగాల్ విజయలక్ష్యం 161 పరుగులు...చివరి ఓవర్లో 20 పరుగులు చేయాల్సి ఉండగా, 2 సిక్స్లు, ఫోర్ సహా తొలి ఐదు బంతుల్లో బెంగాల్ 19 పరుగులు రాబట్టింది. ఆఖరి బంతికి సింగిల్ తీసేందుకు ప్రయత్నించిన ఆకాశ్ దీప్ను మనీశ్ పాండే డైరెక్ట్ త్రోతో రనౌట్ చేశాడు. దాంతో స్కోరు సమమైన మ్యాచ్ ‘సూపర్ ఓవర్’కు వెళ్లింది. బెంగాల్ 5 పరుగులే చేసి 2 వికెట్లు కోల్పోగా...కర్నాటక 2 బంతుల్లో ఆట ముగించింది. అంతకు ముందు కర్నాటక 20 ఓవర్లలో 5 వికెట్లకు 160 పరుగులు చేసింది. కరుణ్ నాయర్ (29 బంతుల్లో 55 నాటౌట్; 4 ఫోర్లు, 3 సిక్స్లు) అర్ధ సెంచరీ చేశాడు. అనంతరం రితిక్ ఛటర్జీ (51) అర్ధసెంచరీ సహాయంతో బెంగాల్ కూడా 160 పరుగులు చేయగలిగింది. తమిళనాడు, విదర్భ కూడా... కేరళపై 5 వికెట్లతో గెలిచిన తమిళనాడు సెమీస్ చేరింది. ముందుగా కేరళ 4 వికెట్లకు 181 పరుగులు చేయగా, తమిళనాడు 19.3 ఓవర్లలో 5 వికెట్లకు 187 పరుగులు సాధించింది. మరో క్వార్టర్స్లో విదర్భ 9 వికెట్లతో రాజస్తాన్ను చిత్తు చేసింది. రాజస్తాన్ 8 వికెట్లకు 84 పరుగులకే పరిమితం కాగా...విదర్భ 14.5 ఓవర్లలో వికెట్ నష్టానికి 87 పరుగులు చేసి విజయాన్నందుకుంది. శనివారం జరిగే తొలి సెమీ ఫైనల్లో తమిళనాడుతో హైదరాబాద్...విదర్భతో కర్నాటక తలపడతాయి.
Pagination
ఓటర్ మిత్రమా.. జాగ్రత్త! ఆ సౌండ్ వస్తేనే మీరు ఓటేసినట్టు!
ఇది కదా క్రేజ్ అంటే.. సీఎం జగన్ ఇంటర్వ్యూకి మిలియన్ల వ్యూస్
Sakshi.com ఇప్పుడు సరికొత్తగా మీ ముందుకు
కాపులు, ముస్లింలకు రిజర్వేషన్లు అక్కర్లేదు: పవన్కళ్యాణ్
రైతు కుమార్తె విజయం.. రిషబ్ శెట్టి అభినందనలు
పులివెందుల ప్రజలకు ఇద్దరిపైనా ప్రేమే: వైఎస్ భారతి
RCB Vs PBKS: కోహ్లి అరుదైన రికార్డు.. ఐపీఎల్ చరిత్రలోనే తొలి క్రికెటర్గా
Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో బిగ్ ట్విస్ట్..
బిజీగా ఉండటం ఇంత డేంజరా! హెచ్చరిస్తున్న సైకాలజిస్ట్లు
కారులో వాసన బాగుందని తెగ పీల్చుకుంటున్నారా.?
గూగుల్కు ఓటింగ్ శోభ!
క్యూలో నిలబడిన విజయ సాయి రెడ్డి
శ్రీనగర్లో భారీ బందోబస్తు మధ్య మొదలైన పోలింగ్!
ఏపీ ఎన్నికల పోలింగ్ వేళ సీఎం జగన్ సందేశం
నోటాకు 50 శాతం కంటే ఎక్కువ ఓటింగ్ వస్తే.. ఏమవుతుందో తెలుసా?
హాలీవుడ్ కింగ్ ఆఫ్ కల్ట్ రోజర్ కన్నుమూత
Daily Horoscope: ఈ రాశి వారికి కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా ఉంటాయి
ఏపీలో కాసేపట్లో ప్రారంభం కానున్న సార్వత్రిక ఎన్నికల పోలింగ్
నారావారిపల్లెలో టీడీపీ శ్రేణుల దౌర్జన్యకాండ
Watch Live: ఏపీ ఎన్నికల లైవ్ అప్ డేట్స్
తప్పక చదవండి
- నోటాకు 50 శాతం కంటే ఎక్కువ ఓటింగ్ వస్తే.. ఏమవుతుందో తెలుసా?
- నయవంచనకు చెక్ పెడదాం
- ఈసీ ద్వంద్వ వైఖరి
- జనస్వామ్యమా! జయీభవ!!
- మంత్రి బొత్సపై చంద్రబాబు కొత్త కుట్ర
- వైఎస్ విజయమ్మ పేరుతో టీడీపీ తప్పుడు లేఖ
- ఐరాస కాంక్షించే అభివృద్ధికి ఏపీయే వేదిక
- పేదింటి పిల్లలకు వర్సిటీ చదువులు ఉచితం
- ఓటర్ మిత్రమా.. జాగ్రత్త! ఆ సౌండ్ వస్తేనే మీరు ఓటేసినట్టు!
- జగన్ ఒక నిజం... ఒక భావోద్వేగం
Advertisement