-
వేరు కుంపట్లతో దాసరిగారి పేరు చెడగొట్టొద్దు: దర్శక–నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ
‘‘నరసింహారావుగారు (దర్శకుడు) మాట్లాడి, దాసరిగారి పేరిట రామ సత్యనారాయణ ఓ ఈవెంట్ చేశారు. రేపు మేం చేయబోతున్నాం అన్నారు. నేనేం అంటున్నానంటే... వచ్చే ఏడాది నుంచి సినిమా ఇండస్ట్రీ తరఫున దాసరిగారి జయంతిని అందరూ ఒక్కటై, ఒకే వేడుకలా జరుపుకునేలా ΄్లాన్ చేద్దాం. బయటివాళ్లు కావాలంటే ఎవరి ఇష్టం వచ్చినట్లు వారు చేసుకుంటారు.ఇండస్ట్రీలో వేరు వేరు కుంపట్లు పెట్టి, గురువు (దాసరి నారాయణరావు) గారి పేరుని మనం చెడగొట్టొద్దు. గురువుగారి పేరును నిలబెట్టడానికి ప్రయత్నం చేద్దాం’’ అన్నారు దర్శక–నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ. దర్శకరత్న దాసరి నారాయణరావు జయంతి (మే 4)ని ‘డైరెక్టర్స్ డే’గా తెలుగు పరిశ్రమ సెలబ్రేట్ చేసుకుంటోంది. తెలుగు దర్శకుల సంఘం ఆధ్వర్యంలో మే 4న హైదరాబాద్లోని ఎల్బీ స్టేడియంలో ఈ వేడుక జరగాల్సింది.కానీ ఎన్నికల సమయంలో ఇలాంటి పెద్ద ఈవెంట్ నిర్వహిస్తే లా అండ్ ఆర్డర్ సమస్యలు తలెత్తే అవకాశాలు ఉన్నాయని పోలీస్ శాఖ చెప్పిన నేపథ్యంలో ఈవెంట్ తేదీని ఈ నెల 19కి మార్చామని తెలుగు దర్శకుల సంఘం అధ్యక్షుడు వీరశంకర్ శనివారం ఏర్పాటు చేసిన సమావేశంలో తెలిపారు. ఈ వేడుక కొత్త తేదీ పోస్టర్ను తమ్మారెడ్డి భరద్వాజ, సి. కల్యాణ్, దామోదర ప్రసాద్ విడుదల చేశారు. ‘‘దేశవ్యాప్తంగా సినీ కార్మికుల సంక్షేమంలో టాలీవుడ్ నంబర్ వన్గా ఉందంటే కారణం దాసరిగారే’’ అన్నారు సి. కల్యాణ్.‘‘డైరెక్టర్స్ డే ఈవెంట్ సక్సెస్ కావడానికి శ్రమిస్తున్న యువ దర్శకులకు ధన్యవాదాలు’’ అన్నారు వీరశంకర్. ‘‘దాసరిగారి పేరిట రామసత్యనారాయణ ఈవెంట్ చేశారు. మే 5న మేం చేస్తున్నాం. దర్శకుల సంఘం చేయనున్న ఈవెంట్ కూడా సక్సెస్ కావాలి’’ అన్నారు రేలంగి నరసింహారావు. నిర్మాతలు దామోదర ప్రసాద్, ప్రసన్న కుమార్, దర్శకులు ఎన్. శంకర్, సముద్ర, మెహర్ రమేష్, గోపీచంద్ మలినేని, అనిల్ రావిపూడి, వశిష్ఠ, తెలుగు ఫిల్మ్ ఫెడరేషన్ అధ్యక్షుడు అనిల్ కుమార్ వల్లభనేని తదితరులు పాల్గొన్నారు. -
జర్నీ టు అయోధ్య
శ్రీరామ నవమిని పురస్కరించుకుని చిత్రాలయం స్టూడియోస్ బ్యానర్ అధినేత వేణు దోనేపూడి ‘జర్నీ టు అయోధ్య’ (వర్కింగ్ టైటిల్) పేరుతో సినిమా ప్రకటించారు. ప్రస్తుతం గోపీచంద్ హీరోగా ‘విశ్వం’ చిత్రాన్ని నిర్మిస్తున్న ఈ బేనర్లో ‘జర్నీ టు అయోధ్య’ రెండో సినిమా. దర్శకుడు వీఎన్ ఆదిత్య ఈ చిత్రానికి కథ అందిస్తున్నారు. ‘‘అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో పాన్ ఇండియా స్థాయిలో ఈ చిత్రం రూపొందనుంది. ప్రస్తుతం ప్రీ ్ర΄÷డక్షన్ పనులు జరుగుతున్నాయి. ఇప్పటికే వీఎన్ ఆదిత్య నేతృత్వంలో అయోధ్య సహా పలు చోట్ల లొకేషన్స్ పరిశీలిస్తున్నారు. ఒక యంగ్ డైరెక్టర్ తెరకెక్కించనున్న ఈ సినిమాలోని నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలు త్వరలో తెలియజేస్తాం’’ అన్నారు మేకర్స్. ఈ చిత్రానికి దర్శక– నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ నిర్మాణ సారధ్యం వహిస్తున్నారు. -
దాసరి నారాయణరావు 77వ జయంతి వేడుకలకు ఏర్పాట్లు
దశాధిక రంగాల్లో అసాధారణ స్థాయిలో రాణించి, శతాధిక చిత్ర దర్శకునిగా... అనుపమాన దార్శకునిగా తెలుగు చలనచిత్ర చరిత్రలో ఆచంద్రతారార్కం నిలిచిపోయే పేరు ప్రఖ్యాతులు గడించిన దర్శక శిఖరం డాక్టర్ దాసరి నారాయణరావు 77వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించేందుకు ఆయన ప్రియ శిష్యులు సన్నాహాలు చేస్తున్నారు. దాసరి బహుముఖ ప్రతిభను నేటి తరానికి గుర్తు చేస్తూ... వారిలో స్ఫూర్తిని నింపేందుకు "దర్శకరత్న డి.ఎన్. ఆర్.ఫిల్మ్ అవార్డ్స్" పేరిట తెలుగు సినిమా రంగానికి చెందిన వివిధ విభాగాల్లో ప్రతిభ కనబరిచినవారికి పట్టం కట్టి, దాసరికి ఘన నివాళులు అర్పించనున్నారు. దర్శకరత్నతో సుదీర్ఘమైన అనుబంధం కలిగిన ప్రముఖ దర్శకనిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ, ప్రముఖ దర్శకులు రేలంగి నరసింహారావు - ప్రముఖ నిర్మాత సి.కళ్యాణ్ అధ్యక్షకార్యదర్శులుగా ఇందుకోసం ఏర్పాటైన కమిటీలో ఆడిటర్ గా, ఆర్ధిక సలహాదారుగా దాసరితో ప్రత్యేక అనుబంధం కలిగిన బి.ఎస్.ఎన్. సూర్యనారాయణ, ప్రముఖ ఫిల్మ్ జర్నలిస్ట్ ప్రభు, ధీరజ అప్పాజీ సభ్యులుగా ఉన్నారు. హైదరాబాద్, శిల్పకళావేదికలో అత్యంత వైభవంగా మే 5న నిర్వహించనున్న ఈ వేడుక వివరాలు వెల్లడించేందుకు తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్ కౌన్సిల్ హాల్లో మీడియా సమావేశం నిర్వహించారు. ఇందులో "దర్శకరత్న డి.ఎన్. ఆర్.ఫిల్మ్ అవార్డ్స్" జ్యురీ మెంబర్స్ తమ్మారెడ్డి భరద్వాజ, రేలంగి నరసింహారావు, బి.ఎస్.ఎన్. సూర్యనారాయణ, ప్రభు, అప్పాజీలతోపాటు... తెలుగు నిర్మాతల మండలి ప్రధాన కార్యదర్శి టి.ప్రసన్నకుమార్ పాల్గొన్నారు. తమ్మారెడ్డి మాట్లాడుతూ... "దశాధిక రంగాల్లో రాణించిన దాసరికి నివాళులు అర్పిస్తూ... "అభినవ దర్శకరత్న, అభినయ రత్న, నిర్మాణరత్న, పంపిణీరత్న, ప్రదర్శనారత్న, కథారత్న, సంభాషణారత్న, గీతరత్న, పాత్రికేయరత్న, సేవారత్న" పురస్కారాలు ప్రదానం చేయనున్నాం. ఇతర అవార్డులను స్మాల్ అండ్ మీడియం బడ్జెట్ సినిమాల నుంచి ఎంపిక చేయనున్నాం. ఈ కార్యక్రమాన్ని ఇంత ఘనంగా నిర్వహించేందుకు నడుం కట్టిన సూర్యనారాయణ గారిని అభినందిస్తున్నాను" అన్నారు. రేలంగి నరసింహారావు మాట్లాడుతూ... "దాసరి లేని లోటు ఎప్పటికీ తీరనిది. ఈ అవార్డుల ఎంపిక అత్యంత పారదర్శకంగా, ప్రామాణికంగా ఉండేలా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాం. దాసరి భౌతికంగా దూరమై ఏడేళ్లు కావస్తున్నా ఆయనపై అపారమైన ప్రేమాభిమానాలతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న బి.ఎస్.ఎన్. సూర్యనారాయణకు అభినందనలు" అన్నారు. బి.ఎస్.ఎన్. సూర్యనారాయణ మాట్లాడుతూ... "దాసరి ప్రధమ జయంతిని ఘనంగా నిర్వహించాం. కరోన కారణంగా కంటిన్యూ చేయలేకపోయాయాం. ఇకపై ప్రతి ఏటా ఈ వేడుక నిర్వహిస్తాం" అన్నారు. టి.ప్రసన్నకుమార్ మాట్లాడుతూ... "దురదృష్టవశాత్తూ మన రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు అవార్డుల విషయంలో చిత్రపరిశ్రమను చిన్నచూపు చూస్తున్నాయి. అలక్ష్యం చేస్తున్నాయి. ఇటువంటి తరుణంలో బి.ఎస్.ఎన్. సూర్యనారాయణ గారు చొరవ తీసుకుని భారతదేశం గర్వించదగ్గ మహానుభావుడైన దాసరి పేరిట అవార్డ్స్ ఇస్తుండడం ఎంతైనా అభినందనీయం" అన్నారు. ప్రభు మాట్లాడుతూ... "చిత్ర పరిశ్రమలోని ప్రతి విభాగంలో అత్యద్భుత ప్రతిభ కనబరిచిన ఒకే ఒక్కడు దర్శకరత్న డాక్టర్ దాసరి. ఆయన స్మారకార్ధం నిర్వహిస్తున్న ఈ పురస్కారాల వేడుకకు యావత్ చిత్ర పరిశ్రమ సహకరించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను" అన్నారు. ధీరజ అప్పాజీ మాట్లాడుతూ... "అవార్డ్స్ కమిటీలో చోటు దక్కించుకోవడం తనకు "లైఫ్ టైమ్ అచీవ్మెంట్"లాంటిదని పేర్కొన్నారు. -
అవినీతి బాబు చుట్టూ..రాజకీయమేంటి?
కులం పునాదులతో రాజకీయాలేంటి? ఎవరో కొందరు..ఎవరి కోసమో ఈ నాటకాలాడితే ఎలా? మాసిపోయిన ‘సెటిలర్స్’ గాయాన్ని గెలికి గెలికి... పుండుగా చేయడం న్యాయమా?.. ప్రముఖ సినీ దర్శకుడు, తెలుగు సినీ కార్మికుల నేతగా ప్రసిద్ధి చెందిన తమ్మారెడ్డి భరద్వాజ సంధించిన ప్రశ్నలివి. అవినీతి ఆరోపణల కేసులో అరెస్టయిన చంద్రబాబుకు కులం ప్రాతిపదికన సానుభూతి తెలిపే విధానం వల్ల జరిగే నష్టాన్ని ఆయన ప్రస్తావించారు. ఇదే అదనుగా అందరికీ ‘కమ్మ’ రంగు పులమడం సరికాదని తమ్మారెడ్డి తీవ్రంగా ఆక్షేపించారు. దివంగత ఎన్టీఆర్ కూడా టీడీపీని కేవలం ఒక సామాజికవర్గానికే పరిమితం చేయలేదని చెప్పారు. తికమక పెట్టే రాజకీయాలు..ఇబ్బందులు సృష్టించే నాయకులను ఈసారి ఎన్నికల్లో చూస్తున్నామనేది ఆయన భావన. తెలంగాణ వ్యాప్తంగా కనిపిస్తున్న పబ్లిక్ మూడ్ మొదలుకొని, మారుతున్న రాజకీయాలపై తమ్మారెడ్డి విస్పష్టమైన వైఖరిని వెల్లడించారు. ఆయనేమన్నారంటే....? పవన్ రాజకీయమేంటి? పవన్కల్యాణ్ రాజకీయం ఆశ్చర్యం కలిగిస్తోంది. ఆంధ్రప్రదేశ్లో టీడీపీతోనే ఉంటానంటాడు. బీజేపీని వదిలేస్తానంటాడు. తెలంగాణకు వచ్చి బీజేపీకి మద్దతిస్తాడు. కలిసి పోటీ అంటాడు. చంద్రబాబు జైలుకెళ్లిన తర్వాతే కదా... జనసేన, టీడీపీ పొత్తు బంధం బయటకొచ్చింది. చంద్రబాబు జైలు నుంచి రాగానే పవన్కే కృతజ్ఞతలు తెలిపారు. మరి ఇదేంటి? చంద్రబాబు పార్టీ వాళ్లేమో తెలంగాణలో కాంగ్రెస్ జెండా మోస్తామంటున్నారు. పవన్ మాత్రం బీజేపీ గొడుక్కిందకు వెళ్తానంటున్నాడు. విచిత్రం ఏమిటంటే తెలంగాణలో తన కేడర్ ఏ పార్టీ వైపు ఉండాలనేది చంద్రబాబు చెప్పడు. టీడీపీ అయినా జనసేన అయినా అంతా తానే అని చెప్పే పవన్ ఇంకా వ్యూహం ఖరారు చేయలేదు. పవన్, చంద్రబాబు ఎవరి మాట ఎవరు వింటారో గానీ... తెలంగాణ ఎన్నికల్లో ఒకే వ్యూహంతో వెళ్లగలరా? ఈ తరహా రాజకీయాలు కొంత గందరగోళపరుస్తున్నాయి. ఇక్కడ సెటిలర్స్ హ్యాపీ.. కానీ ఇప్పుడు ఆ నిరసనలేంటి? తెలంగాణ ఏర్పడిన రోజుల్లో స్థానికేతరుల్లో కొంత టెన్షన్ ఉన్నమాట నిజం. ఇప్పుడది లేదు. అంతా కలిసిపోయి ఉంటున్నారు. చంద్రబాబు అరెస్టు తర్వాత కొంతమంది మళ్లీ ఈ విభజన రేఖ తెస్తున్నారు. సెటిలర్స్ పేరుతో ముందుకొస్తున్నారు. దీన్ని ఓ సామాజికవర్గం నెత్తికెత్తుకోవడం విశేషం. సెటిలర్స్ అనేది మాసిపోయిన గాయం. కొంతమంది కోసం ఈ గాయాన్ని రేపుతున్నారు. పుండులా మార్చే ప్రయత్నం చేస్తున్నారు. సెటిలర్స్ పేరుతో చంద్రబాబు వ్యవహారంపై నిరసనలేంటి? సెటిలర్స్లో కమ్మవాళ్లే ఉన్నారా? అన్ని కులాల వాళ్లూ ఉన్నారని గుర్తించాలి. ఇది అందరి ప్రయోజనాలు దెబ్బతీస్తుందని తెలుసుకోవాలి. ‘చిత్రం’లోనూ మార్పులు రాజకీయాలపై సినిమా ప్రభావం కీలకం. రాజకీయాల నుంచే సినిమా వస్తుందా? సినిమా రాజకీయాలకు ప్రేరణ ఇస్తుందా? అనేది చెప్పలేం. కానీ ప్రజాజీవితాలకు దగ్గరగా ఉండే రాజకీయ సినిమాలను జనం ఆదరిస్తున్నారు. అంతే కాదు... కరుడుగట్టిన కాషాయం రంగుతో తీసిన సినిమాలు ప్లాప్ అవుతున్నాయి. అంటే మార్పును ప్రజలు స్వాగతిస్తున్నారు. తెలంగాణ రాజకీయాల్లోనూ అది కనిపిస్తోంది. రాష్ట్రం ఏర్పడ్డాక ఉపాధి అవకాశాలు పెరిగాయి. ఇది గ్లోబలైజేషన్ ఎఫెక్ట్ మాత్రమే. అలా అని నిరుద్యోగమూ పూర్తిగా పోలేదు. యువత ఆలోచనకు ఇదే కారణమైంది. రైతుబంధు ఇస్తున్నామని చెప్పే నేతలు... రూ.కోట్లు ఉన్నవాడికి కూడా ఇవ్వడం న్యాయమేనా? అనేక కష్టనష్టాలకోర్చే కౌలు రైతులకు ఇవ్వకపోవడం ధర్మమేనా? సామాజిక పరిస్థితుల నుంచే ప్రజాతీర్పు వస్తుంది. ఒకటి మాత్రం నిజం. గెలిచే వాళ్ల వైపే ప్రజలు ఉంటారు. అందుకే వామపక్షాలు ఉద్యమించే చరిత్ర ఉన్నా, ఓట్లు పొందలేకపోతున్నాయి. నేను ఒకటి చెప్పాలనుకుంటున్నాను. ప్రజలిచ్చిన అధికారం రాచరికంగా భావించే నాయకులను ఓటు ఆ«యుధంతోనే ప్రజలు బుద్ధి చెప్పాలి. వాళ్ల కోరలు పీకి వేయాల్సిందే. అసలేంటీ వైఖరి? చంద్రబాబునాయుడు స్కిల్ డెవలప్మెంట్ అవినీతి ఆరోపణల కేసులో అరెస్టు అయ్యారు. దీన్ని కొంతమంది తమ సామాజికవర్గం చుట్టూ తిప్పే ప్రయత్నం చేస్తున్నారు. చంద్రబాబు సత్య హరిశ్చంద్రుడని వాళ్ల నమ్మకం కావొచ్చు. అది కోర్టులో తేలాలి. కానీ ఆ కసి తెలంగాణ రాజకీయాలపైనా చూపించే ప్రయత్నమేంటి? ఒక సామాజికవర్గం మొత్తం గంపగుత్తగా ఓ పార్టీని సమర్థిస్తుందని ప్రచారం చేయడంలో అర్థమేంటి? టీడీపీ ఒక సామాజిక వర్గానిదేనా? అదే నిజమైతే ఎన్టీఆర్ 50 శాతం బీసీలకే టికెట్లు ఎందుకిచ్చా రు? అసలు కులం ప్రస్తావనేంటి? వాళ్లు చెప్పే కులమే అంత బలమైనది అయితే, 2014లో ఎందుకు తెలంగాణలో ఓడిపోయింది? ఇలా ప్రచారం చేయడంలో ఓ కుట్ర కనిపిస్తోంది. తెర వెనుక కీలకమైన వ్యక్తుల ప్రమేయం ఉండొచ్చు. - వనం దుర్గాప్రసాద్ -
చిరంజీవి అలాంటి సినిమాలు చేస్తే బెటర్: స్టార్ ప్రొడ్యూసర్
మెగాస్టార్ చిరంజీవి ఈ మధ్యే 'భోళా శంకర్' సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చారు. సాధారణ ప్రేక్షకులకే కాదు మెగా ఫ్యాన్స్కి కూడా ఇది నచ్చలేదు. దీంతో చిరుతో పాటు దర్శకుడు మెహర్ రమేశ్పైనా విమర్శలు చేస్తూనే ఉన్నారు. ఇప్పుడు టాలీవుడ్ దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ.. చిరు రీమేక్స్పై కౌంటర్స్ వేశారు. ప్రస్తుతం ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. సినిమా వ్యాపారమైంది 'అప్పట్లో సినిమా ఇండస్ట్రీలోకి వచ్చిన వాళ్లకు పని తప్ప మరో ఆలోచన ఉండేది కాదు. ఇప్పటికీ అలాంటి వాళ్లు ఉన్నప్పటికీ.. దాన్ని వ్యాపారంగా చూసేవాళ్లు ఎక్కువైపోయారు. కథ చెప్పమని అడిగితే అప్పట్లో రైటర్స్ సూటిగా సుత్తిలేకుండా చెప్పేవారు. ఇప్పుడేమో 'ఓపెన్ చేస్తే' అని ఎలివేషన్స్ ఇస్తున్నారు. రైటర్స్ డైరెక్టర్స్ కావడం దీనికి కారణమై ఉండొచ్చు. ప్రేక్షకులకు పనికొచ్చే అంశం, అది కూడా నేచురల్గా ఉండాలి. ఇది పక్కనబెట్టి ఏదో చేస్తే సినిమాలు ఆడవు.' (ఇదీ చదవండి: చెల్లెలిగా కీర్తి సురేశ్.. చిరు-రజనీ ఇద్దరూ బలైపోయారు!) చిరు అలా చేయాలి 'ఎన్టీఆర్, ఏఎన్నాఆర్, కృష్ణ, చిరంజీవి.. ఇలా హీరోలందరూ కెరీర్ మొదట్లో మెథడ్ యాక్టింగ్ చేసినట్లు ఉంటుంది. చిరునే తీసుకోండి. శుభలేఖ, స్వయంకృషి, రుద్రవీణ, విజేత లాంటి సినిమాలకే అద్భుతమైన రెస్పాన్స్ దక్కింది. అమిర్ 'దంగల్' లాంటి సినిమా చిరంజీవి చేసినా జనాలు చూస్తారు. భోళా శంకర్, గాడ్ ఫాదర్ లాంటివి చేసి డిసప్పాయింట్ కావడం కంటే నేచురల్ మూవీస్ చేస్తే బెటర్ అని నా అభిప్రాయం' చెప్పాలని ప్రయత్నించా 'అయితే ఇదే విషయాన్ని చిరంజీవితోనూ చెబుదామని ప్రయత్నించాను. కానీ ఎందుకో కుదరలేదు. ఒకప్పటి సినిమాల్లో చిరంజీవిని చూస్తే మన ఇంట్లో మనిషిలా కనిపించేవారు. ఇప్పుడు ఆ చిరంజీవి మళ్లీ కనిపిస్తే చూడాలని ఉంది. అలానే సినిమాలు ఆడుతాయి అనేది నా నమ్మకం' అని దర్శకనిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ చెప్పుకొచ్చారు. ఈయనే కాదు చాలామంది అభిమానులు కూడా ఇదే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మరి చిరు రాబోయే సినిమాల విషయంలో ఏం చేస్తారో చూడాలి? (ఇదీ చదవండి: సర్జరీ.. చిరంజీవి ఆరోగ్యపరిస్థితి ఇప్పుడెలా ఉందంటే?) -
ఎలక్షన్స్ చూస్తుంటే నవ్వాలో ఏడ్వాలో తెలియడం లేదు: తమ్మారెడ్డి
-
TFCC Election: సంతోషపడాలో, సిగ్గు పడాలో తెలియట్లేదు..తమ్మారెడ్డి
తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ (టీఎఫ్సీసీ)ఎన్నికలపై ప్రముఖ నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల వాతావరణం చూస్తుంటే చాంబర్ ఎదిగిందని సంతోష పడాలో లేదా జనరల్ ఎలెక్షన్స్లాగా ఉందని సిగ్గుపడాలో తెలియట్లేదన్నారు. సభ్యులు దేనికి పోటీ పడుతున్నారో? ఎందుకు కొట్టుకుంటున్నారో తెలియడం లేదన్నారు. ‘నేను కూడా చాలా ఎలెక్షన్స్ చూశాను.ఫిల్మ్ చాంబర్ ప్రెసిడెంట్గా కూడా గెలిచాను. కానీ ఇలాంటి వాతావరణం ఎప్పుడూ లేదు. ప్రస్తుతం ఎలెక్షన్స్ కాంపెయిన్ చూస్తుంటే భయమేస్తుంది. భవిష్యత్తులో ఇలాంటివి జరగకూడదని కోరుకుంటున్నాను’అని తమ్మారెడ్డి అన్నారు. కాగా, టీఎఫ్సీసీ ఎన్నికల పోలింగ్ వాడివేడిగా జరుగుతోంది. రెండేళ్లకు ఒక్కసారి జరిగే ఎన్నికల్లో ఈ సారి అధ్యక్ష బరిలో దిల్ రాజు, సీ. కల్యాణ్ పోటీ పడుతున్నారు. ఈ రోజు(జులై 30) ఉదయం 8 గంటలకు ప్రారంభమైన పోలింగ్.. మధ్యాహ్నం 3 గంటలకు ముగుస్తుంది. ప్రొడ్యూసర్ సెక్టార్, డిస్ట్రిబ్యూషన్ సెక్టార్, స్టూడియో సెక్టార్, ఎగ్జిక్యూటివ్ సెక్టార్ ఇలా నాలుగు సెక్టార్లలోని సభ్యులు ఇందులో ఓటర్లుగా ఉంటారు. మొత్తం 1600 మంది సభ్యులు ఉన్నారు. దాదాపు 900 వరకు ఓట్లు నమోదయ్యే అవకాశం ఉంది. సాయంత్రం 4 గంటలకు కౌంటింగ్ ప్రారంభమై, 6 గంటల తర్వాత ఫలితాలు వెల్లడిస్తారు. -
అలా చేస్తే ఆర్ నారాయణమూర్తి ఇప్పటికీ నెంబర్ వన్ స్టార్గానే ఉండేవాడు
ఆర్ నారాయణ మూర్తి గురించి తెలుగు రాష్ట్రాల ప్రజలందరికి తెలిసిందే. విప్లవ సినిమాలు తీస్తూ పీపుల్స్ స్టార్గా ఎదిగాడు. కేవలం సినిమాల్లో నటించడమే కాదు.. కథ, కథనం, దర్శకత్వం, సంగీతం, గానం, నిర్మాణం..ఇలా 24శాఖలను తన భూజన వేసుకొని సూపర్ హిట్ చిత్రాలను అందించగల సమర్థుడు. ఈ మధ్యకాలంలో ఆయనకు సరైన హిట్ పడలేదు కానీ, ఒకప్పుడు ఆయన సినిమాలు టాలీవుడ్లో సంచలనం సృష్టించాయి. బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించాయి. అలాంటి గొప్ప నటుడిపై దర్శకనిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ తాజాగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నమ్మిన సిద్దాంతం కోసం స్టార్డమ్ని, కోట్ల రూపాయలను వదులుకున్న ఏకైన నటుడు ఆర్ నారాయణమూర్తి అని ప్రశంసించారు. తాజాగా ఓ యూట్యూబ్ చానెల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తమ్మారెడ్డి మాట్లాడుతూ.. ‘తెలుగు సినిమాకు ఒక డిఫరెంట్ స్టేటస్ తీసుకొచ్చిన గొప్ప వ్యక్తి ఆర్ నారాయణమూర్తి. విప్లవాన్ని నమ్ముకొని.. విప్లవం కోసమే జీవితాన్ని అంకితం చేశాడు. తన కథలతో ప్రేక్షకుల ఆలోచనలు ప్రభావితం చేస్తూ, కొంతకాలం పాటు అతనే నెంబర్ వన్ స్టార్ అయ్యాడు కూడా. స్టార్ డమ్ వచ్చిన తరువాత కూడా తాను నమ్ముకున్న సిద్ధాంతాన్ని వదలకుండా అదే తరహా సినిమా చేస్తూ వచ్చాడు. సిద్దాంతం కోసం తన స్టార్ స్టేటస్ని వదులుకున్నాడు కానీ తన పంథా మార్చుకోలేదు. తన పంథా మార్చుకొని ఉంటే ఈ రోజుకి కూడా ఆర్ నారాయణమూర్తి నెంబర్ వన్ స్టార్గానే ఉండేవాడు. ‘మీ సిద్ధాంతం వదలకుండా మీరు సినిమా చేసే విధానం మార్చుకోండి’ అని నేను చాలాసార్లు చెప్పానుగానీ ఆయన వినిపించుకోలేదు. ఆయన ఏ సినిమా తీసినా అది విప్లవ పంథాలోనే ఉంటుంది. సూపర్ హిట్లు ఇచ్చాడు .. ఎంతో సంపాదించాడు. అయినా రోడ్లపై నడుచుకుంటూనే తిరుగుతూ ఉంటాడు. అంత సింపుల్ గా బ్రతికే మనిషిని గురించి ఎంత చెప్పినా సరిపోదు’ అని తమ్మారెడ్డి చెప్పుకొచ్చారు. -
'నాటునాటు'కు ఆస్కార్ రావడంపై స్పందించిన తమ్మారెడ్డి
-
తెలుగు సినిమాకు ఆస్కార్ రావడం గర్వంగా ఉంది: తమ్మారెడ్డి
టాలీవుడ్ సీనియర్ దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ ఈ మధ్య ఎక్కువగా వార్తల్లో నిలుస్తున్నారు. ఆస్కార్ ప్రమోషన్స్ కోసం ఆర్ఆర్ఆర్ టీమ్ రూ.80 కోట్లు ఖర్చు చేసిందని, ఆ డబ్బు తమకిస్తే 8 సినిమాలు తమ్మారెడ్డి చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపిన సంగతి తెలిసిందే. తెలుగు సినిమా గురించి ప్రపంచమంతా మాట్లాడుతుంటే తెలుగువాళ్లై ఉండి ఇలాంటి కామెంట్స్ చేయడం ఏంటని తమ్మారెడ్డిపై పలువురు సినీ ప్రముఖులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదిలా ఉంటే తాజాగా 95వ ఆస్కార్ అవార్డుల వేడుకలో బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో నాటునాటు పాట ఆస్కార్ పురస్కారాన్ని సొంతం చేసుకుంది. హాలీవుడ్ పాటలను తలదన్ని నాటునాటు విజయకేతనం ఎగరవేసింది. తెలుగోడి ప్రతిభకు ఆస్కార్ పట్టం కట్టింది. దీంతో ఆర్ఆర్ఆర్ చిత్ర బృందానికి యావత్ సినీ, రాజకీయ ప్రముఖులు నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలో తమ్మారెడ్డి భరద్వాజ స్పందన కోసం నెటిజన్లు తెగ సెర్చ్ చేస్తున్నారు. తాజాగా నాటునాటు పాటకు ఆస్కార్ రావడంపై తమ్మారెడ్డి భరద్వాజ స్పందించారు. ఆయన ఏమన్నారంటే.. 'మన తెలుగు పాటకు ఆస్కార్ రావడం చాలా ఆనందంగా, గర్వంగా ఉంది. నాకే కాదు, ప్రతి భారతీయుడు, సినిమాను ప్రేమించే వాళ్లకు ఇది గర్వకారణం. తెలుగు సంగీతాన్ని, తెలుగుదనాన్ని ఇప్పటికీ తమ సినిమాల్లో పొందుపరుస్తున్న అతికొద్దిమందిలో కీరవాణి, చంద్రబోస్ ఒకరు. వాళ్లిద్దరి కాంబినేషన్లో వచ్చిన నాటునాటు పాటకు ఆస్కార్ రావడం చాలా అద్భుతమైన విషయం. ఈ సందర్భంగా ఆర్ఆర్ఆర్ టీంకి నా అభినందలు తెలియజేస్తున్నాను' అంటూ తమ్మారెడ్డి పేర్కొన్నారు. -
నేను నోరు విప్పితే.. మీరు ఎవరెవరి కాళ్లు పట్టుకున్నారో చెప్పనా?: తమ్మారెడ్డి
ఆర్ఆర్ఆర్ మూవీ వివాదంపై ప్రముఖ దర్శక-నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ స్పందించారు. ఆస్కార్ బరిలో నిలిచిన ఆర్ఆర్ఆర్ మూవీపై ఇటీవల ఆయన సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఇటీవల రవీంద్ర భారతిలో జరిగిన ఓ కార్యక్రమానికి హాజరైన ఆయన మాట్లాడుతూ ఆస్కార్ అవార్డు కోసం ట్రిపుల్ ఆర్ టీం రూ. 80 కోట్లు ఖర్చు చేసిందంటూ షాకింగ్ కామెంట్స్. దీంతో ఆయనపై సినీ ప్రముఖులతో పాటు నెటిజన్లు విరుచుకుపడుతున్నారు. చదవండి: దిల్ రాజు కొడుకుని చూశారా? ఎంత క్యూట్గా ఉన్నాడో.. ఇక తనపై వస్తున్న నెగిటివిటీ చూసి తమ్మారెడ్డి నేరుగా స్పందించారు. ఈ మేరకు ఓ వీడియో షేర్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తాను ఏ తప్పు చేయలేదని, క్షమాపణలు చెప్పనన్నారు. తాను చిన్న సినిమాలపై మూడు గంటలు మాట్లాడితే కేవలం ఓ క్లిప్పింగ్ ఆధారంగా విమర్శలు చేయడం సరికాదన్నారు. రాజమౌళిని చూసి ఈర్ష్యతో అలా అన్నానని కొందరు అంటున్నారని, ఆయన తనకు సమకాలీకుడు కాదంటూ కౌంటర్ ఇచ్చారు. రెండ్రోజుల కింద ‘ఆర్ఆర్ఆర్’ను ప్రశంసిస్తూ మాట్లాడానని.. దాని గురించి ఎవరూ పట్టించుకోలేదే? అని ప్రశ్నించారు. ‘నేను ఇండస్ట్రీకి వివరణ ఇచ్చుకోవాలి అనుకున్నా. కానీ ఇప్పుడు ఆ అవసరం నాకు లేదు. కానీ పెద్దవాళ్లు అందరు మాట్లాడాకా నేను దానికి సమాధానం కూడా చెప్పనక్కర్లేదు. అసలు వీడికేం లెక్కలు తెలుసంటున్నారు కొందరు. నాకు లెక్కలు తెలియనక్కర్లేదు. అయితే చాలా మంది అకౌంట్స్ నాకు తెలుసు. ఎవరెవరు ఏ అవార్డులు, పదవుల కోసం ఎవరెవరిని అడుక్కున్నారో, ఎవరెవరి కాళ్లు పట్టుకున్నారో అన్నీ నాకు తెలుసు. నేనెప్పుడూ వీటి గురించి మాట్లాడను. నేను మాట్లాడితే ఇండస్ట్రీ పరువు పోతుంది. ఇండస్ట్రీ నా తల్లి. ఇండస్ట్రీని గౌరవిస్తా. అందుకే ఈరోజుకీ సంయమనంగానే మాట్లాడుతున్నా’ అని తమ్మారెడ్డి చెప్పుకొచ్చారు. చదవండి: ఆర్ఆర్ఆర్పై తమ్మారెడ్డి సంచలన వ్యాఖ్యలు.. నిర్మాతపై నెటిజన్ల ఆగ్రహం ‘కొందరు నన్ను అసభ్యంగా, నీచంగా తిడుతున్నారు. నాకు నీతిగా బతకడం, నిజం చెప్పడం తెలుసు. ఎక్కడైన నేను నిజాలు మాట్లాడగలను. మీరు ధైర్యంగా నిజం చెప్పగలరా? నన్ను ఇంతగా తిడుతూ విమర్శిస్తున్నా మీకు నన్ను అనే హక్కు ఉందా? గతంలో రాజమౌళిని అభినందిస్తూ మాట్లాడాను అది చూడలేదా? ఇప్పుడు ఎవరో ఏదో క్లిప్ పెట్టేసరికి మీకు తెలిసిందా? మూడు గంటల చిన్న సినిమా గురించి మాట్లాడాను. మీరు ఓ చిన్న సినిమా కోసం టైం కెటాయించగలరా? ఎప్పుడు ఎవరో ఒకరి కాళ్లు పట్టుకోవాలని, ఎంతసేపు వాళ్లకు వీళ్లకు మర్దన చేయాలా? అని చూసే మీరా నా గురించి మాట్లాడేది. నన్ను అనే హక్కు మీకుందా? ఆకాశాన్ని చూసి ఉమ్మేస్తే తిరిగి మొహం మీదే పడుతుంది’ అంటూ తమ్మారెడ్డి ఫైర్ అయ్యారు. -
దారుణమైన కామెంట్లు.. అసహ్యంగా, బాధగా ఉంది: తమ్మారెడ్డి
తెలుగు ఖ్యాతినే కాదు యావత్ భారతదేశ ఖ్యాతిని పెంచిన సినిమా ఆర్ఆర్ఆర్. వందల కోట్లు ఖర్చు పెట్టి తీసిన ఈ కళాఖండానికి వేల కోట్ల కలెక్షన్లు వచ్చిపడ్డాయి. ఈ సినిమా నుంచి నాటునాటు పాట ఆస్కార్ రేసులో పోటీపడుతున్న విషయం తెలిసిందే! ఆర్ఆర్ఆర్ టీమ్ పడ్డ కష్టానికి తగ్గ ప్రతిఫలం దక్కిందంటూ అందరూ చప్పట్లు కొడుతుంటే ప్రముఖ నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ మాత్రం వ్యంగ్యాస్త్రాలు సంధించాడు. ట్రిపుల్ ఆర్ ఆస్కార్ బరిలో నిలిచేందుకు రూ.80 కోట్లు ఖర్చు పెట్టిందని, ఆ డబ్బు తనకిస్తే ఎనిమిది సినిమాలు తీసి ముఖాన కొడతానంటూ కామెంట్లు చేశాడు. ఆయన వ్యాఖ్యలపై దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు సహా పలువురు సెలబ్రిటీలు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో ఈ వివాదంపై స్పందించాడు తమ్మారెడ్డి భరద్వాజ. 'నేను ఒక సెమినార్లో పాల్గొని అక్కడి యంగ్ డైరెక్టర్స్తో దాదాపు మూడు గంటలు మాట్లాడాను. అందులో ఒక నిమిషం క్లిప్ విని ఎవరెవరో రియాక్ట్ అవుతున్నారు. ప్రస్తుతం చిన్న సినిమాల గురించి మాట్లాడుతూ ఆర్ఆర్ఆర్ ఆస్కార్ ప్రమోషన్ బడ్జెట్పై మాట్లాడాను. దీనిపై కొందరు చాలా దారుణంగా కామెంట్లు చేయడం బాధ కలిగించింది. ఒకరేమో అకౌంట్స్ సమాచారం అడుగుతారు. మరొకరేమో బూతులు తిడుతున్నారు. చాలా బాధగా, అసభ్యంగా, అసహ్యంగా ఉంది. వాళ్ల సంస్కారం వాళ్లది, నా సంస్కారం నాది. నేనేమీ గుర్తింపు కోసం పాకులాడటం లేదు. బహుశా నన్ను టార్గెట్ చేసకుఉని వాళ్లు గుర్తింపు కోరుకుంటున్నారో తెలీదు. నేను కొన్ని రోజుల ముందు రాజమౌళిని అభినందిస్తూ వీడియో పోస్ట్ చేశాను. మరి అప్పుడు ఏ ఒక్కరూ మాట్లాడలేదే?' అని విమర్శించాడు. -
ఆర్ఆర్ఆర్పై తమ్మారెడ్డి సంచలన వ్యాఖ్యలు.. నిర్మాతపై నెటిజన్ల ఆగ్రహం
టాలీవుడ్ సంచలనం ఆర్ఆర్ఆర్ మూవీపై సీనియర్ దర్శక-నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ్ చేసిన కామెంట్స్ ప్రస్తుతం ఇండిస్ట్రీలో తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఇటీవల జరిగిన ఓ కార్యక్రమంలో తమ్మారెడ్డి మాట్లాడుతూ.. ఆర్ఆర్ఆర్ మూవీపై సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఆస్కార్ అవార్డు కోసం ఆర్ఆర్ఆర్ టీం రూ. 80 కోట్లు ఖర్చు చేశారంటూ తీవ్ర ఆరోపణలు చేశారు. దీంతో ఆయన వ్యాఖ్యలపై పలువురు టాలీవుడ్ సినీ దిగ్గజాలు, సినీ ప్రియులు అభ్యంతరం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చదవండి: జేమ్స్ కెమెరూన్ డబ్బు తీసుకొని పొగుడుతున్నారా? లెక్కలున్నాయా?: కె. రాఘవేంద్రరావు సూటి ప్రశ్న దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు స్పందిస్తూ తమ్మారెడ్డి వ్యాఖ్యలను తప్పుబట్టారు. మిత్రుడు భరద్వాజ్కి.. తెలుగు సినిమాకు, తెలుగు సాహిత్యానికి, తెలుగు దర్శకుడికి, తెలుగు నటులకు ప్రపంచవేదికలపై మొదటిసారి వస్తున్న పేరు చూసి గర్వపడాలి కానీ, రూ.80 కోట్ల ఖర్చు అని చెప్పడానికి నీ దగ్గర అకౌంట్స్ ఇన్ఫర్మేషన్ ఏమైనా ఉందా? అని ప్రశ్నించారు. జేమ్స్ కామెరూన్, స్పీల్ బర్గ్ లాంటి వారు డబ్బు తీసుకుని మన సినిమా గొప్పతనాన్ని పొగుడుతున్నారని నీ ఉద్దేశమా? అంటూ ట్వీట్ చేశారు. ఇక దర్శకేంద్రుడి మద్దతుగా నెటిజన్లు, ఆరఆర్ఆర్ ఫ్యాన్స్ కామెంట్ చేస్తూ తమ్మారెడ్డి భరద్వాజ్పై విమర్శలు గుప్పిస్తున్నారు. ‘శత్రువులు ఎక్కడో ఉండరు మన పక్కనే తిరుగుతారు. 80 కోట్ల రూపాయలు ఉంటే పది సినిమాలు తీస్తారు సరే.. అందులో ఒకటైన ఆస్కార్కు వెళుతుందనే గ్యారంటీ ఇస్తారా? భరద్వాజ గారు’ అంటూ ఓ నెటిజన్ ఆయనకు కౌంటర్ ఇచ్చాడు. అలాగే మరో నెటిజన్ స్పందిస్తూ ‘విచిత్రమైన మనిషి, విచిత్రమైన కామెంట్స్’ అసహనం వ్యక్తి చేశాడు. చదవండి: ఆస్కార్ కోసం 'ఆర్ఆర్ఆర్' ఫ్లైట్ ఖర్చులతో పది సినిమాలు తీయొచ్చు : తమ్మారెడ్డి కాగా రీసెంట్గా రవింద్ర భారతీలో జరిగిన ఓ కార్యక్రమానికి హాజరైన తమ్మారెడ్డి భరద్వాజ మాట్లాడుతూ.. ‘రూ.200 కోట్లు పెట్టి బాహుబలి తీశారు. ఆ రోజుల్లో అది చాలా ఎక్కువ బడ్జెట్. ఆ తర్వాత రూ.600 కోట్లు ఖర్చు పెట్టి ఆర్ఆర్ఆర్ మూవీ తీశారు. ఇప్పుడు వచ్చే ఆస్కార్ కోసం రూ.80 కోట్లు పెట్టారు. ఆ డబ్బులు నాకు ఇస్తే 8 సినిమాలు తీసి వాళ్ల మొఖాన కొడతాను’ అంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు. Satruvulu ekkada undaru andi mana pakkane tirugutuntaru. 80crores unte 10 cinemalu teesukovachu correct ye. aah 10 cinemalu lo okatyna oscar vastundi aney gaurantee isthara bharadwaj garu. — Challapalli Anurag 🇮🇳 (@anurough) March 9, 2023 పాపం భరద్వాజులు గారు చల్లగా Attention తీసుకుని జారుకుందాం అనుకున్నారు కానీ తెలుగు జాతిని గర్వపడేలా చేసిన @RRRMovie & @ssrajamouli గారి మీద రాయి వేసి జారుకుందాం అని చుస్తే, తెలుగు వారు తెలుగు ప్రముఖుల గమ్ముగా వుంటారని భావించి నట్లు ఉన్నారు. — CMA Monesh (@Cmamonesh) March 9, 2023 -
RRR Movie: నీ దగ్గర లెక్కలున్నాయా భరద్వాజ్: కె. రాఘవేంద్రరావు ఫైర్
'ఆర్ఆర్ఆర్' సినిమా ఆస్కార్ బరిలో నిలిచేందుకు దాదాపు 80 కోట్లు ఖర్చు పెట్టిందని, అమెరికా వెళ్లేందుకు ఫ్లైట్లకు గానూ అంతగా ఖర్చు పెడుతున్నారంటూ తమ్మారెడ్డి భరద్వాజ కామెంట్లు చేసిన విషయం తెలిసిందే. అంతేకాక ఆ 80 కోట్లు తనకు ఇస్తే ఎనిమిది సినిమాలు తీసి మీ మొఖాన కొడతామంటూ తమ్మారెడ్డి చేసిన కామెంట్ నేపథ్యంలో తనపై నెటిజన్లతో పాటు పలువురు సినీ ప్రముకుల నుంచి సైతం విమర్శల వర్షం కురుస్తోంది. తాజాగా ఇదే విషయంపై దర్శకేంద్రుడు కే రాఘవేంద్రరావు స్పందించారు. మిత్రుడు భరద్వాజకి అంటూ మొదలు పెట్టిన ఆయన తెలుగు సినిమాకు, తెలుగు సాహిత్యానికి, తెలుగు దర్శకుడికి మొదటి సారి వస్తున్న పేరుని చూసి గర్వపడాలి, అంతేగాని 80 కోట్లు ఖర్చు చేశారు అనడానికి నీ దగ్గర అకౌంట్స్ ఇన్ఫర్మేషన్ ఏదైనా ఉందా..? హాలీవుడ్ దర్శకులు స్పీల్ బర్గ్, జేమ్స్ కెమెరూన్ వంటి వారు కూడా డబ్బు తీసుకొని 'ఆర్ఆర్ఆర్'చిత్రం గొప్పతనాన్ని పొగుడుతున్నారని నీ ఉద్దేశమా..? అంటూ తమ్మారెడ్డిని సూటిగా ప్రశ్నించారు. ఈ మేరకు గురువారం రాత్రి ఆయన ట్విట్టర్లో ట్వీట్ చేశారు. pic.twitter.com/wy5FcWjs0W — Raghavendra Rao K (@Ragavendraraoba) March 9, 2023 -
ఆస్కార్ కోసం 'ఆర్ఆర్ఆర్' ఫ్లైట్ ఖర్చులతో పది సినిమాలు తీయొచ్చు : తమ్మారెడ్డి
ఆర్ఆర్ఆర్ సినిమాతో తెలుగు సినిమా స్థాయిని ప్రపంచ స్థాయికి తీసుకెళ్లిన దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి. ఇప్పటికే పలు ప్రతిష్టాత్మక అవార్డులను సొంతం చేసుకున్న ఈ సినిమా ఇప్పుడు ఆస్కార్ బరిలో నిలిచిన సంగతి తెలిసిందే. బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో ఈ చిత్రం నుంచి ‘నాటు నాటు’ పాట నామినేట్ అయ్యింది. ప్రస్తుతం ఆస్కార్ వేడుకలు ఉండటంతో ఆర్ఆర్ఆర్ టీం అమెరికాలో సందడి చేస్తుంది. వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ సినిమాను మరింత ప్రమోట్ చేస్తున్నారు. ఆర్ఆర్ఆర్కు ఆస్కార్ రావాలని ప్రతి తెలుగువాళ్ళతో పాటు భారతీయులంతా కోరుకుంటున్నారు. ఈ నేపథ్యంలో సినీ దర్శకుడు, నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ ఆర్ఆర్ఆర్ యూనిట్పై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. ఆస్కార్ అవార్డు కోసం ఆర్ఆర్ఆర్ టీం రూ. 80 కోట్లు ఖర్చు పెట్టింది. అదే డబ్బుతో మేం 8-10 సినిమాలు తీసి ముఖాన కొడతాం.కేవలం వారు ఫ్లైట్ టికెట్స్ కోసమే కోట్లు ఖర్చుపెడుతున్నారు. ఇవన్నీ మాట్లాడుకోవడం కూడా టైమ్ వేస్ట్ అంటూ కాంట్రవర్సీ కామెంట్స్ చేశారు. తమ్మారెడ్డి చేసిన వ్యాఖ్యలపై నెటిజన్లు మండిపడుతున్నారు. తెలుగు సినిమా గురించి ప్రపంచం మొత్తం మాట్లాడుతుంటే ఇలా మనవాళ్లే ఇలా మాట్లాడటం సిగ్గుచేటని దుయ్యబడుతున్నారు. -
ఆ సినిమా నా వల్లే పోయింది: తమ్మారెడ్డి భరద్వాజ ఆసక్తికర వ్యాఖ్యలు
ప్రముఖ తెలుగు దర్శక-నిర్మాతల్లో తమ్మారెడ్డి భరద్వాజ ఒకరు. ఆయన ఎన్నో సినిమాలకు దర్శకత్వం వహించారు. అందులో రామ్మా చిలకమ్మా ఒకటి. ఇందులో సుమంత్, లయ జంటగా నటించిన ఈ సినిమా పరాజయం పాలైంది. దీనిపై తాజాగా ఆయన స్పందించారు. ఇటీవల ఓ యూట్యూబ్లో చానల్తో ముచ్చటించిన ఆయన తన సినిమాల ప్లాప్ గురించి ప్రస్తావించారు. ఈ నేపథ్యంలో తన దర్శకత్వంలో వచ్చిన ఓ సినిమా పరాజయానికి తానే కారణమంటూ ఆసక్తిర వ్యాఖ్యలు చేశారు. చదవండి: సూపర్ స్టార్ కృష్ణ గురించి అప్పట్లో మహాకవి శ్రీశ్రీ ఏమన్నారో తెలుసా? రామ్మా చిలకమ్మాకు సుమంత్ బాగుంటాడని తీసుకుంటాడని తీసుకున్నా. నాగార్జునన కూడా పది ఫ్లాపుల తర్వాత సూపర్స్టార్ అయ్యాడు. అందువలనే ఈ సినిమాను సుమంత్తో చేయోచ్చని ట్రై చేసిన సినిమా అది’ అన్నారు. ఆ తర్వాత ‘‘రామ్మా చిలకమ్మా’.. ‘స్వర్ణముఖి’.. ‘ఉర్మిళ’’ ఈ మూడు సినిమాలు కూడా నా మనసుకు దగ్గరగా ఉన్నవే. కానీ ఈ సినిమాలేవి బాగా ఆడలేదు. కాకపోతే ఇప్పటికీ మళ్లీ తీయదగిన కథ వాటిలో ఉంది. ఇక ‘ఎంతబాగుందో’ సినిమా విషయానికి వస్తే.. ఆ సినిమాకి వక్కంతం వంశీ కథను అందించాడు. చదవండి: ఈ నాలుగు కోరికలు తీరకుండానే కన్నుమూసిన సూపర్ స్టార్ మంచి పాయింట్ ఉన్న కథ అది. ఆ సినిమా ఫ్లాప్ కావడంలో ఎవరి తప్పు లేదు. డైరెక్టర్గా నేను కాకుండా వేరే వారు ఉన్నట్టయితే ఇది మంచి సినిమా అయ్యుండేది. ఆ సినిమాను నేను మిస్ హ్యాండిల్ చేశాను. నా వల్లే సినిమా పోయిందని అనుకునే సినిమాల్లో అది ఒకటిగా చెబుతాను. మిగతా సినిమాలు ఎందుకు ఫ్లాప్ అయ్యాయో అడిగితే చెప్పలేను. కానీ, ఈ సినిమా మాత్రం నా మిస్ హ్యాండిలింగ్ వల్లనే పోయిందని ఒప్పుకుంటాను. ఇక ఇక్కడ సక్సెస్ వస్తే చేసిన తప్పులన్నీ దాంట్లో కొట్టుకుపోతాయి. ఫ్లాప్ వస్తే తప్పులను గురించి మాత్రమే మాట్లాడుకుంటారు’’ అంటూ చెప్పుకొచ్చారు. -
విశ్వక్ సేన్, అర్జున్ వివాదంపై స్పందించిన తమ్మారెడ్డి భరద్వాజ
యాక్షన్ కింగ్ అర్జున్ సర్జా-యంగ్ హీరో విశ్వక్ సేన్ల వివాదం ప్రస్తుతం ఇండస్ట్రీలో హాట్టాపిక్గా మారింది. విశ్వక్ సేన్ షూటింగ్కు హాజరు కాకుండ ఇబ్బంది పెట్టాడంటూ అర్జున్ సర్జా ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. అర్జున్ ఆరోపణలపై విశ్వక్ స్పందిస్తూ.. తన అభిప్రాయాలకు ఎలాంటి ప్రాధాన్యత లేదని, ఈ సినిమా షూటింగ్ సమయంలో తన ప్రవర్తన బాలేదని ఒక్క లైట్ బాయ్ చెప్పిన ఇండస్ట్రీ నుంచి వెళ్ళిపోతానంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఇదిలా ఉంటే తాజాగా ఈ వివాదంపై ప్రముఖ దర్శక-నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ స్పందించారు. చదవండి: కోలుకుంటున్న ‘బుట్టబొమ్మ’ పూజా హెగ్డే తాజాగా ఓ యూట్యూబ్ చానల్తో ముచ్చటించారు. ఈ సందర్భంగా ఈ విషయంపై మాట్లాడుతూ.. ‘సినిమా మొదలు పెట్టేముందు హీరోలు మనకు ఇష్టం ఉందా? లేదా? ఆ నిర్మాత ఇష్టమా? హీరోకు ఇష్టమా అన్నది లేదా పారితోషికం లాంటి వివిధ విషయాలను ముందే మాట్లాడుకోవాలి. సినిమా మొదలయ్యాక కాదు. సినిమా షూటింగ్ మొదలయ్యాక ఇలాంటి మాట్లాడుకోవడం ఎంతవరకు న్యాయం, ధర్మమో చూస్తే.. ఎన్టీ రామారావుగారు ఎవరి దర్శకత్వంలో చేసినా, ఆయన దర్శకుడు చెప్పినట్టుగా చేసేవారు. దర్శకుడికి సంబంధించిన విషయాల్లో ఆయన జోక్యం చేసుకునేవారు కాదు. ఇదే నిబద్ధతను నేను బాలకృష్ణగారిలో కూడా చూశాను. ఇచ్చిన కాల్షీట్ ప్రకారం బాలకృష్ణ సెట్లో ఉండేవారు. కానీ ఈ గొడవలో అర్జున్ గారు షూటింగు మొదలుపెట్టేశారు. విశ్వక్ సేన్ కొంతవరకూ చేశారు. ‘నాకు నచ్చని విషయాలు కొన్ని ఉన్నాయి. వాటిని గురించి మాట్లాడుకున్నాక మొదలెడదాం’ అని అన్నట్టుగా విశ్వక్ చెబుతున్నాడు’’ అన్నారు. ‘ఇక అర్జున్ విషయానికి వస్తే ఆయనకు దర్శకుడిగా కూడా మంచి అనుభవం ఉంది. చాలా సూపర్ హిట్లు ఇచ్చారు. ఆయన అవుట్ డేటెడ్ అనుకుంటే విశ్వక్ ముందుగానే మానుకోవలసింది. సినిమా ఒప్పుకున్నాక మాటలు బాగోలేదు .. పాటలు బాగోలేదు అంటే ఎలా? నిజం చెప్పాలంటే ఈ మధ్య కాలంలో చాలా మంది హీరోలు ప్రతి విషయంలోను జోక్యం చేసుకుంటున్నారు. ఈ కారణంగానే ఎక్కువ సినిమాలు ఫ్లాప్ అవుతున్నాయి కూడా. కొత్త నిర్మాతలు .. కొత్త దర్శకులు .. వివిధ రకాల కథలతో వస్తున్నారు. చదవండి: ‘బింబిసార’ బ్లాక్బస్టర్.. మరో వైవిధ్యమైన కథతో వస్తున్న కల్యాణ్ రామ్ కానీ హీరోలు చెప్పినట్టు చేయడం వలన ఆ సినిమాలన్నీ ఒకేరకంగా ఉంటున్నాయనేది నా ఉద్దేశం’ అని తన అభిప్రాయం వ్యక్తం చేశారు. అనంతరం ‘కొత్తగా వచ్చిన హీరోలంతా దర్శకుడి పనిలో జోక్యం చేసుకుంటున్నారు. ఫంక్షన్స్లో ఇష్టానుసారంగా మాట్లాడుతూ ప్రేక్షకులను ఇరిటేట్ చేస్తున్నారు. అర్జున్ గారు అన్నట్టుగా చాలామంది నిర్మాతలు ఇలాంటి హీరోల విషయంలో ఇబ్బందులు పడుతున్నారు. యంగ్ హీరోలంతా ఈ పద్ధతిని మార్చుకోవలసిన అవసరం ఉంది. విశ్వక్ సేన్ చేసిన పని అర్జున్ గారికి మాత్రమే కాదు. నిర్మాత అనే ప్రతి ఒక్కరికీ.. దర్శకుడు అనే ప్రతి ఒక్కరికీ కూడా అవమానమే’’ అంటూ తమ్మారెడ్డి షాకింగ్ కామెంట్స్ చేశారు. ఒక్క విశ్వక్ సేన్ మాత్రమే కాదు ప్రస్తుతం యంగ్ హీరోల వల్ల చాలామంది దర్శక-నిర్మాతలు ఇబ్బంది పడుతున్నారని, ఇప్పటికైన తమ ధోరణి మార్చుకోవాలని ఆయన పేర్కొన్నారు. -
లైగర్ వివాదం.. పూరీ డబ్బులివ్వాల్సిన పని లేదు: తమ్మారెడ్డి
విజయ్ దేవరకొండ కథానాయకుడిగా తెరకెక్కిన లైగర్ సినిమా ఫ్లాప్ పూరీ జగన్నాథ్కు కొత్త చిక్కులు తెచ్చిపెట్టిన విషయం తెలిసిందే! భారీ స్థాయిలో నష్టాలు రావడంతో డిస్ట్రిబ్యూటర్స్ తమకు కొంత డబ్బు వెనక్కు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇందుకు పూరీ ఒక నెల రోజులు గడువు కోరినప్పటికీ కొంతమంది డిస్ట్రిబ్యూటర్స్ మాత్రం పూరీ ఆఫీస్ ముందు ధర్నా చేసేందుకు రెడీ అయ్యారు. ఈ విషయం తెలిసిన పూరీ జగన్నాథ్ తన పరువు తీయాలని ప్రయత్నిస్తే ఒక్క పైసా ఇవ్వనని వార్నింగ్ ఇచ్చాడు. ఈమేరకు ఓ ఆడియోకాల్ సోషల్ మీడియాలో వైరల్గా మారింది. తాజాగా ఈ వ్యవహారంపై ప్రముఖ నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ స్పందించాడు. 'పూరీ జగన్నాథ్ డిస్ట్రిబ్యూటర్లకు తిరిగి డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు. లైగర్ హక్కులు కొనమని వాళ్ల ఇంటికి వెళ్లి అడిగాడా? లేదు కదా! కొనుక్కునేవాడిదే తప్పు. అంతకుముందు విజయ్ దేవరకొండ నటించిన రెండు సినిమాలు ఫ్లాప్ అయినప్పుడు అంత పెద్ద మొత్తానికి కొనడం ఎందుకు? నష్టాలు వచ్చాయని డబ్బులు డిమాండ్ చేయడం ఎందుకు? లాభాలొస్తాయని పెద్ద సినిమాలు కొన్నప్పుడు నష్టం వచ్చినా భరించాలి' అని చెప్పుకొచ్చాడు. చదవండి: సినిమా చూడమని ఇంటింటికీ వెళ్లి అడుక్కోవాలా? అమ్మ ఆరోగ్యానికి రిస్క్ అని తెలిసినా నాన్న లెక్కచేయలేదు: శ్రీదేవి కూతురు -
'ఇండియాను షేక్ చేస్తా అన్నాడు.. ఫ్లాప్ చేశాడు'.. తమ్మారెడ్డి షాకింగ్ కామెంట్స్
విజయ్ దేవరకొండ- పూరి జగన్నాథ్ కాంబినేషన్లో తెరకెక్కిన సినిమా 'లైగర్'. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా అనుకోని రీతిలో డిజాస్టర్గా మిగిలిపోయింది. రిలీజ్ అయిన తొలిరోజు నుంచి నెగిటివ్ టాక్ రావడంతో బాక్సాఫీస్ వద్ద చతికిలపడిందీ సినిమా. దీంతో నిర్మాతలకు, డిస్ట్రిబ్యూటర్లకు నష్టాలను మిగిల్చింది. ఈ క్రమంలో పూరి జగన్నాథ్, విజయ్ దేవరకొండపై కొందరు సినీ ప్రముఖులు విమర్శలు గుప్పిస్తున్నారు. తాజాగా దర్శకనిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ లైగర్ రిజల్ట్పై షాకింగ్ కామెంట్స్ చేశారు. 'మన యాక్షన్ని బట్టే ప్రేక్షకుల రియాక్షన్ఉంటుంది. ఎగిరెగిరిపడితే ఇలాంటి అనుభవాలే ఎదురవుతాయి. సినిమాను చూడండి అని ప్రమోట్ చేసుకోవాలి. నువ్వు చిటికెలు వేస్తే రియాక్షన్ ఇలాగే ఉంటుంది. హీరోలు ఊరికే ఎగిరెగిరి పడటం మంచిది కాదు. అలాగే ఇష్టం వచ్చినట్లు ''ఊపేస్తాం.. తగలెడతాం.. అని స్టేట్మెంట్లు ఇస్తే ఇలాగే ప్రేక్షకులు మనల్ని తగలెడతారు' అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇక ఈ సినిమా డిజాస్టర్కు కారణాలు ఏమై ఉంటాయి అని ప్రశ్నించగా.. ఈ సినిమా గురించి ఎక్కువ మాట్లాడను. నేను పూరి జగన్నాథ్ అభిమానినే. కానీ లైగర్ ట్రైలర్ చూసినప్పుడే మూవీ చూడలనిపించలేదు. భవిష్యత్తులో కుదిరితే చూస్తా అని తమ్మారెడ్డి భరద్వాజ పేర్కొన్నారు. -
పాన్ ఇండియా చిత్రాలకు ఎందుకన్ని వందల కోట్లు?: తమ్మారెడ్డి భరద్వాజ్
Tammareddy Bharadwaja Shocking Comments On Pan India Movies: అడివి శేష్ నటించిన మేజర్ మూవీపై ప్రముఖ నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ్ ప్రశంసలు కురిపించాడు. మేజర్ సినిమా చూసిన ఆయన ఓ వీడియో విడుదల చేశాడు. ‘‘నిన్ననే మేజర్ సినిమా చూశాను. సినిమా చాలా బాగా తీశారు. నటీనటులందరూ చక్కగా నటించారు. నిర్మాణ విలువలు కూడా బాగున్నాయి. చిత్రబృందం మొత్తానికి నా అభినందనలు’ అని చెప్పుకొచ్చారు. అనంతరం పాన్ ఇండియా చిత్రాలపై స్పందించారు. ‘‘ఈ మధ్య మనం ఎక్కువగా పాన్ ఇండియా ప్రాజెక్ట్, పాన్ ఇండియా సినిమా అని చెబుతున్నాం. నిజంగా చెప్పాలంటే మేజర్ పాన్ ఇండియా కథ. అయితే కొంతమంది ‘మాది పాన్ ఇండియా ప్రాజెక్ట్. బడ్జెట్ భారీగా అయ్యింది, లాస్లు వస్తున్నాయి కాబట్టి మేము సినిమా టికెట్ రేట్లు పెంచుకునేలా అవకాశం కల్పించండి’ అని ముఖ్యమంత్రులను కోరారు. అలాంటి పాన్ ఇండియా ప్రాజెక్ట్లకు మేజర్ సినిమా ఏమాత్రం తీసిపోదు. చదవండి: పక్షవాతం బారిన స్టార్ సింగర్.., లైవ్ వీడియో వైరల్ టెక్నికల్, క్వాలిటీపరంగా సినిమా చాలా బాగుంది. ఈ చిత్రాన్ని కేవలం రూ. 25 కోట్లలోపే పూర్తి చేశారు. పాన్ ఇండియా సినిమాగా రిలీజ్ చేసి మంచి విజయం సాధించారు. మరి మిగిలిన ప్రాజెక్ట్లకు ఎందుకు వందల కోట్లు ఖర్చు చేస్తున్నారు. మేజర్ లాంటి చిత్రానికి ఖర్చు అవ్వలేదు మీకు ఎందుకు అవుతుంది? నిర్మాతలు, హీరోలు ఆలోచించాలి. షూటింగ్ అని చెప్పి క్యారవాన్లో కూర్చుంటున్నారా? సినిమా చేస్తే ప్యాషన్తో చేయాలి. సమయాన్ని వేస్ట్ చేసి డబ్బులని వృథా చేస్తున్నారు’’ అని ఆయన వ్యాఖ్యానించారు. చదవండి: Vignesh Shivan-Nayanthara: ‘ఆ కంగారులో చూసుకోలేదు క్షమించండి’ -
అలాంటివారికి మేమున్నాం అని చెప్పేందుకే ఈ వేడుక
‘తెలుగు పరిశ్రమలోని 24 శాఖలతో కలిసి మే డే ఉత్సవాలను నిర్వహించాలనుకుంటున్నాం. కరోనా టైమ్లో కార్మికులు ఇబ్బందులు పడ్డారు... సొంత ఊర్లకు వెళ్లిపోయారు. అలాంటి వారికి మేమున్నాం అని చెప్పేలా ఈ వేడుక చేస్తున్నాం. ఈ వేడుకలో చిరంజీవిగారు ముఖ్య అతిథిగా, ఆయనతో పాటు కిషన్ రెడ్డిగారు, తలసాని శ్రీనివాస్ యాదవ్గారు, సబితా ఇంద్రారెడ్డిగారు, భట్టి విక్రమార్కగారు, ఏపీకి చెందిన పలువురు మంత్రులు కూడా పాల్గొంటారు’’ అని తెలుగు చలన చిత్ర కార్మికుల సంఘం అధ్యక్షుడు అనిల్ కుమార్ వల్లభనేని అన్నారు. మే 1న ఫిలిం ఫెడరేషన్ కార్మిక దినోత్సవ సంబరాలను జరపనున్నారు. గురువారం జరిగిన సమావేశంలో ఈ వేడుకలకు సంబంధించిన బ్రోచర్ని తెలుగు చలన చిత్ర వాణిజ్య మండలి అధ్యక్షుడు కొల్లి రామకృష్ణ, ఈవెంట్ టీ షర్ట్స్ను దర్శక–నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ విడుదల చేశారు. var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_881252745.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); చదవండి: అజయ్ దేవగణ్, సుదీప్ల ట్విటర్ వార్పై సోనూసూద్ ఆసక్తికర వ్యాఖ్యలు -
సమస్యలన్నీ పరిష్కారమవుతాయ్..
బంజారాహిల్స్: సినీ పరిశ్రమ సమస్యలన్నీ ఒకటి, రెండు నెలల్లో పరిష్కారమవుతాయని ప్రముఖ సినీ దర్శకుడు తమ్మారెడ్డి భరద్వాజ ఆశాభావం వ్యక్తం చేశారు. ఫిలిం చాంబర్లో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. త్వరలో జరగనున్న సమావేశంతో అన్ని సమస్యలు కొలిక్కి వస్తాయని తెలిపారు. కూర్చొని చర్చించుకుంటే ప్రతి సమస్యకూ పరిష్కారం లభిస్తుందన్నారు. గతంలో ఎక్కువ ధరకు టికెట్లు విక్రయించారని, అయితే పన్నులు మాత్రం చెల్లించలేదన్నారు. ఇక ముందు అంతా పారదర్శకంగా ఉండాలని కోరుకుంటున్నట్టు చెప్పారు. టికెట్ల రేట్లు పెంచితే డబ్బులొస్తాయనడం భ్రమని, దానికి మద్దతివ్వకూడదని చెప్పారు. అఖండ సినిమా పుష్పకంటే పెద్ద హిట్ అయినా.. పుష్ప సినిమానే ఎక్కువ కలెక్షన్లు వసూలు చేసిందని వెల్లడించారు. ఎక్కువ స్క్రీన్లు వేస్తే డబ్బులొస్తాయన్నారు. ఐదో షో వేసి చిన్న సినిమాలను ఆడిస్తే బాగుంటుందని అభిప్రాయపడ్డారు. విభజన తర్వాత రెండు తెలుగు రాష్ట్రాల్లో సినీ అవార్డులు ఇవ్వకపోవడంపై ఆవేదన వ్యక్తం చేశారు. చిన్న సినిమాలకు, ఆంధ్రప్రదేశ్లో షూటింగ్ చేసుకున్న సినిమాలకు సబ్సిడీ ఇవ్వాలని కోరారు. మినీ థియేటర్లను ప్రోత్సహించాలని, అవి వస్తేనే రెవెన్యూ పెరుగుతుందన్నారు. సినీ కార్మికులు ఈఎస్ఐ, పీఎఫ్ సమస్యలను ఎదుర్కొంటున్నారని, ఈ రెండూ చెల్లిస్తే వారి భవిష్యత్తు బాగుంటుందని చెప్పారు. కరోనా కారణంగా థియేటర్లు మూతబడినందున మినిమం విద్యుత్ చార్జీలనే వసూలు చేయాలని తమ్మారెడ్డి విజ్ఞప్తి చేశారు. -
ఏపీ ప్రభుత్వానికి ఆ హక్కు ఉంది: తమ్మారెడ్డి భరద్వాజ
Producer Tammareddy Bharadwaj Interesting Comments On Movie Ticket Rates: ‘‘సినిమా టికెట్ ధరలు పెంచుకోవ డానికి తెలంగాణ ప్రభుత్వానికి హక్కు ఉన్నట్లే.. టికెట్ ధరలు తగ్గించుకోవడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి హక్కు ఉంటుంది’’ అని దర్శక–నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ అన్నారు. బుధవారం జరిగిన విలేకరుల సమావేశంలో భరద్వాజ మాట్లాడుతూ.. ‘‘థియేటర్స్కు బీ ఫామ్ అనేది ఒకటి ఉంది. ఆ ప్రకారం రేట్లు ఉంటాయి. తప్పా.. ఒప్పా అనేది తర్వాతి విషయం. కానీ ప్రభుత్వ నియమ నిబంధనల ప్రకారం ప్రభుత్వం చేస్తున్నది కరెక్ట్. అది చట్టపరంగా వారికి రాజ్యాంగం ద్వారా వచ్చిన హక్కు. అయితే థియేటర్స్వారికి కూడా రాజ్యాంగం ప్రకారం హక్కులు ఉంటాయి. కానీ చట్టపరంగా వాటిని తెచ్చుకోవాల్సిన పరిస్థితులు ఉన్నాయి. చదవండి: ‘నా థైస్లో కాదు.. మీ కళ్లలోనే ఉంది’ అంటూ అషు బోల్డ్ కామెంట్, పోస్ట్ వైరల్ లీగల్గా తెచ్చుకునే వరకూ హక్కు లేదు. ఈ విషయాన్ని వివాదం చేయడం కంటే పరిష్కరించుకోవడం మంచిది. ఎవరిపైనా ఆరోపణలు చేయడం కరెక్ట్ కాదు. ఏపీలో టికెట్ ధరల గురించి చాంబర్, ప్రొడ్యూసర్ కౌన్సిల్ నుంచి రిక్వెస్ట్ చేశాం. ఇటీవల మీటింగ్ జరిగిందని తెలిసింది. త్వరలో మరో మీటింగ్ జరిగి, ఈ సమస్యలు పరిష్కారమవుతాయనే నమ్మకం ఉంది. ఇక తమిళనాడు, కర్ణాటక, ముంబై వంటి రాష్ట్రాల్లో థియేటర్స్లో ఫిఫ్టీ పర్సెంట్ ఆక్యుపెన్సీ ఉండటం, మరికొన్ని రాష్ట్రాల్లో థియేటర్స్ క్లోజ్ చేసి ఉండటం, కరోనా థర్డ్ వేవ్ ముప్పు వంటి కారాణాల చేతనే ‘ఆర్ఆర్ఆర్’,‘రాధేశ్యామ్’ వాయిదా పడ్డాయి. ఈ విషయంలో ఏపీలోని టికెట్ ధరల ప్రభావం కేవలం ఒక శాతం మాత్రమే’’ అన్నారు. చదవండి: స్పెషల్ సాంగ్తో పేరొస్తుందని చెప్పి బన్నీ ఒప్పించాడు: సమంత ఇంకా మాట్లాడుతూ.. ‘‘ఫిలిం చాంబర్ మాట్లాడుతుందనే పెద్ద నిర్మాతలు కామ్గా ఉండి ఉండొచ్చు. అంతమాత్రాన వారి గురించి రకరకాలుగా మాట్లాడటం కరెక్ట్ కాదు. ఎగ్జిబిటర్స్, డిస్ట్రిబ్యూటర్స్, థియేటర్ ఓనర్స్.. ఇలా అన్ని సెక్టార్ల వారు చాంబర్ పరిధిలో ఉన్నారు. అయితే ‘మా’, ఫెడరేషన్ చాంబర్ పరిధిలోకి రావు. అవి ఇండిపెండెంట్ బాడీలు. అలాగే థియేటర్స్ టికెట్ ధరలతో మూవీ ఆరిస్ట్స్ అసోసియేషన్కి సంబంధం లేదు. అయితే చిరంజీవి, మోహన్బాబు, మహేశ్బాబు, పవన్కల్యాణ్ వంటి వారు నిర్మాతలుగా కూడా ఉన్నారు కాబట్టి టికెట్ ధరల గురించి మాట్లాడవచ్చు. కానీ ఆర్టిస్టులుగా వారికి ఆ అధికారం నాకు తెలిసి లేదు’’ అన్నారు. -
ఆడ సింహం అంటూ అదిరిపోయే బ్యానర్ : తమ్మారెడ్డి
కొత్త తరహా చిత్రాలను నిర్మించేందుకు నిర్మాత జి.ఆర్.జి.ఎన్ రాజు సొంతంగా 'లేడి లయన్ క్రియేషన్స్ బ్యానర్' పేరిట సొంత నిర్మాణ సంస్థను ప్రారంభించారు. సహా నిర్మాత గోవింద రాజులు బ్యానర్ లాంచ్ కార్యక్రమం సోమవారం ప్రసాద్ లాబ్స్ లో జరిగింది. ఈ వేడుకకు ముఖ్య అతిధులుగా ప్రముఖ నిర్మాత కె ఎస్ రామారావు, రమేష్ ప్రసాద్, తమ్మారెడ్డి భరద్వాజ, దర్శకుడు వీర శంకర్, తెలంగాణ సాంస్కృతిక శాఖ చైర్మన్ మామిడి హరికృష్ణ, మాదాల రవి, నాగబాల సురేష్ కుమార్ లతో పాటు తదితర చిత్ర యూనిట్ సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్బంగా బ్యానర్ లోగో ను కె ఎస్ రామారావు విడుదల చేయగా, టీజర్ ను తమ్మారెడ్డి భరద్వాజ విడుదల చేసారు. ఈ సందర్భంగా తమ్మారెడ్డి భరద్వాజ మాట్లాడుతూ .. ఆడ సింహం అంటూ అదిరిపోయే బ్యానర్ ని మొదలెట్టిన నిర్మాత రాజు గారికి, దర్శకుడు చల్లా భానులకు అభినందనలు. ఈ బ్యానర్ పై సరికొత్త తరహా చిత్రాలు రావాలని కోరుకుంటున్నాను. తప్పకుండా ఇండస్ట్రీ లో ఈ బ్యానర్ తనకంటూ ఓ మార్క్ క్రియేట్ చేయాలనీ కోరుతున్నాను అన్నారు. నిర్మాత రాజు మాట్లాడుతూ .. లేడి లయన్ బ్యానర్ పై సరికొత్త తరహా చిత్రాలు తెరకెక్కించే ఉద్దేశంతో ఈ బ్యానర్ ని మొదలెట్టాం. సినిమాలే కాకుండా ఓటిటి కోసం వెబ్ సిరీస్ లను కూడా నిర్మిస్తున్నాం. చల్లా భాను కిరణ్ దర్శకత్వంలో మా ప్రయత్నంగా లవ్ యూ ఎనిమి అనే వెబ్ సిరీస్ త్వరలో విడుదల అవుతుంది అన్నారు. -
అన్నాచెల్లెళ్ల అనుబంధం
పలు సీరియల్స్, సినిమాల ద్వారా సుపరిచితుడైన నందకిశోర్ హీరోగా పరిచయమవుతోన్న చిత్రం ‘నరసింహపురం’. శ్రీరాజ్ బళ్ళా దర్శకత్వంలో పి.ఆర్. క్రియేషన్స్ సమర్పణలో శ్రీరాజ్ బళ్ళా, టి.ఫణికుమార్ గౌడ్, నందకిశోర్ ధూళిపాల నిర్మించారు. ఈ సినిమా ఫస్ట్ లుక్ని దర్శక–నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ విడుదల చేశారు. ‘‘వాస్తవ పరిస్థితులకు అద్దం పడుతూ, అన్నాచెల్లెళ్ల అనుబంధం నేపథ్యం లో ఈ సినిమా ఉంటుంది’’ అని దర్శక–నిర్మాతలు తెలిపారు. ‘‘ఈ సినిమా మా అందరికీ మంచి పేరు తెస్తుందనే నమ్మకం ఉంది’’ అన్నారు నందకిశోర్.
Pagination
మళ్లీ చరిత్ర సృష్టిస్తున్నాం
చేతులు కాలాక ఆకులు పట్టుకున్న ఈసీ
ఓటీటీలోకి వచ్చేసిన మిడిల్ క్లాస్ మూవీ.. స్ట్రీమింగ్ అందులోనే?
వరల్డ్కప్ జట్టులో నో ఛాన్స్: రోహిత్పై కేఎల్ రాహుల్ కామెంట్స్ వైరల్
ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు అలెర్ట్.. మారిన విత్ డ్రా నిబంధనలు
ఎన్ఆర్ఐతో విధి ఆడిన వింత నాటకం.. విషాదం
స్వాతి మలివాల్ డ్రామా.. బీజేపీ కుట్రే ఇదంతా: సంచలన వీడియో బయట పెట్టిన ఆప్
Heeramandi Jewellery ఎవరీ సినిమా నగల స్పెషలిస్ట్ జంట
దేవుడా.. నీవే దిక్కు !
విజయోత్సవ ర్యాలీలకు అనుమతి లేదు
పెండింగ్ పనులను త్వరగా పూర్తి చేయాలి
జూన్ 4 తర్వాత వచ్చేది వైఎస్సార్సీపీ ప్రభుత్వమే
24న డీఈఈ సెట్
యంత్రంలో ఫలితాలు.. బెట్టింగ్ల జోరు
గదులు నిర్మించండి
రైతులకు ఇబ్బంది కలిగిస్తే చర్యలు
బదిలీలతో బరితెగింపు
Lok Sabha Election 2024: బీజేపీ అభ్యర్థుల్లో... నాలుగోవంతు ఫిరాయింపుదారులే
తప్పక చదవండి
- AP: అంతా ప్రీ ప్లాన్డ్గానే.. సిట్ నివేదికలో సంచలన విషయాలు!
- Telangana: రూ.500కు గ్యాస్ సిలిండర్ కొందరికే ..!
- ఐదో దశ ఓటింగ్పై ఎన్నికల సంఘం ఆందోళన?
- 24 నుంచి ‘పది’ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు
- ఓ మదీ మేలుకో..!
- టీడీపీ నేత బంధువు కారులో రూ.68.40 లక్షలు స్వాధీనం
- ఆహా ఏమి రుచి.. అనరా మైమరచి
- సానుకూల సంకేతాలు
- Enforcement Directorate; ఆప్కు అక్రమంగా రూ. 7.08 కోట్ల విదేశీ నిధులు!
- జూన్ 8న చేప ప్రసాదం పంపిణీ
Advertisement