Sakshi News home page

జర్నీ టు అయోధ్య

Published Thu, Apr 18 2024 1:38 AM

Chitralayam Studios announces The Journey to Ayodhya - Sakshi

శ్రీరామ నవమిని పురస్కరించుకుని చిత్రాలయం స్టూడియోస్‌ బ్యానర్‌ అధినేత వేణు దోనేపూడి ‘జర్నీ టు అయోధ్య’ (వర్కింగ్‌ టైటిల్‌) పేరుతో సినిమా ప్రకటించారు. ప్రస్తుతం గోపీచంద్‌ హీరోగా ‘విశ్వం’ చిత్రాన్ని నిర్మిస్తున్న ఈ బేనర్లో ‘జర్నీ టు అయోధ్య’ రెండో సినిమా. దర్శకుడు వీఎన్‌ ఆదిత్య ఈ చిత్రానికి కథ అందిస్తున్నారు.

‘‘అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో పాన్‌ ఇండియా స్థాయిలో ఈ చిత్రం రూపొందనుంది. ప్రస్తుతం ప్రీ ్ర΄÷డక్షన్‌ పనులు జరుగుతున్నాయి. ఇప్పటికే వీఎన్‌ ఆదిత్య నేతృత్వంలో అయోధ్య సహా పలు చోట్ల లొకేషన్స్‌ పరిశీలిస్తున్నారు. ఒక యంగ్‌ డైరెక్టర్‌ తెరకెక్కించనున్న ఈ సినిమాలోని నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలు త్వరలో తెలియజేస్తాం’’ అన్నారు మేకర్స్‌. ఈ చిత్రానికి దర్శక– నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ నిర్మాణ సారధ్యం వహిస్తున్నారు. 

Advertisement
Advertisement