-
ఎన్నాళ్లో వేచిన హృదయం.. ఆ స్టార్ హీరో క్రేజ్ చూశారా?
కోలీవుడ్ స్టార్ హీరో దళపతి విజయ్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కోలీవుడ్తో పాటు తెలుగు రాష్ట్రాల్లోనూ మంచి క్రేజ్ ఉంది. అంతే కాకుండా దక్షిణాదిలో అన్ని రాష్ట్రాల్లోనూ అభిమానులు ఉన్నారు. అయితే ఇవాళ దాదాపు 14 ఏళ్ల తర్వాత దళపతి విజయ్ కేరళలో అడుగుపెట్టారు. ప్రస్తుతం గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్(గోట్) సినిమాలో నటిస్తున్నారు. ఈ చిత్రం కోసమే ఆయన తిరువనంతపురం చేరుకున్నారు. ఎయిర్ పోర్టు చేరుకున్న దళపతి విజయ్కు ఫ్యాన్స్ ఘనస్వాగతం పలికారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. తిరువనంతపురం ఎయిర్ పోర్టు నుంచి విజయ్ బయటకు రాగానే ఒక్కసారిగా అందరూ కేకలు వేస్తూ సందడి చేశారు. దళపతి.. విజయ్.. విజయ్.. అంటూ నినాదాలతో ఆ ప్రాంతమంతా మార్మోగిపోయింది. దీంతో కారులో నుంచి సన్రూఫ్ ద్వారా నిలబడి అభిమానులను విజయ్ అభివాదం చేశారు. చేతులు ఊపుతూ అభిమానులను పలకరించారు. కేరళలో విజయ్ క్రేజ్ చూసి చాలా మంది నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. విజయ్ ఫ్యాన్స్ భారీ స్థాయిలో రావడంతో ఎయిర్ పోర్ట్ పరిసరాల్లో రోడ్లు బ్లాక్ అయిపోయాయి. భారీ స్థాయిలో ట్రాఫిక్ జామ్ కావడంతో కిలోమీటర్ల వాహనాలు నిలిచిపోయాయి. కాగా.. గతంలో 2011లో కావలాన్ మూవీ షూటింగ్ కోసం చివరగా కేరళకు వెళ్లారు. మళ్లీ ఇన్నేళ్లకు అక్కడికి వెళ్లడంతో ఆయనకు స్వాగతం పలికారు. కాగా.. గోట్ సినిమాకు వెంకట్ ప్రభు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో డ్యుయల్ రోల్లో దళపతి విజయ్ నటించనున్నారు. Road block completely 🙏🙏#VijayStormHitsKeralapic.twitter.com/cjkzEGUdlk — Vijay Fans Trends 🐐 (@VijayFansTrends) March 18, 2024 HD Video of Thalapathy’s entry in Trivandrum 🥁 #VijayStormHitsKerala pic.twitter.com/Ga6Qc5KZix — Vijay Fans Trends 🐐 (@VijayFansTrends) March 18, 2024 -
దళపతి కొత్త మూవీ.. టైటిల్ అదేనంటూ వైరల్!
కోలీవుడ్ స్టార్ హీరో, దళపతి విజయ్ కథానాయకుడిగా నటిస్తున్న 68వ చిత్రం షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. లియో తర్వాత వెంకట్ ప్రభు దర్శకత్వం ఆయన నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని ఏజీఎస్ ప్రొడక్షన్స్ సంస్థ నిర్మిస్తోంది. ఈ చిత్రంలో మీనాక్షి చౌదరి హీరోయిన్గా కనిపించనుంది. అయితే తాజాగా ఈ చిత్రం గురించి పలు ఆసక్తికరమైన విషయాలు బయటకొస్తున్నాయి. ఇందులో విజయ్ తండ్రీకొడుకులుగా ద్విపాత్రాభినయం చేస్తున్నట్టు సమాచారం. ఇందులో ఒక పాత్ర కోసం విజయ్ ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో యూత్ ఫుల్గా తయారవుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇదే విధంగా ఈ చిత్రానికి బాస్ అనే టైటిల్ను నిర్ణయించినట్లు న్యూస్ తెగ వైరలవుతోంది. ఇకపోతే ఈ చిత్రం ఫస్ట్ లుక్ పోస్టర్ డిసెంబరు 31వ తేదీన విడుదల చేయడానికి యూనిట్ వర్గాలు రెడీ అయ్యాయి. దీనిపై గురించి చిత్ర ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ అర్చన తెలుపుతూ తమ చిత్రం గురించి జరుగుతున్న ప్రచారంలో ఏదీ నిజం లేదన్నారు. ముఖ్యంగా చిత్ర టైటిల్ బాస్ అని జరుగుతున్న ప్రచారంలో కొంచెం కూడా వాస్తవం లేదన్నారు. ఈ చిత్రానికి సంబంధించి వెంకట్ ప్రభు స్పెషల్గా ఆలోచించారని.. ఆ వివరాలను త్వరలోనే వెల్లడించనున్నట్లు తెలిపారు. విజయ్ తన 69, 70వ చిత్రాలకు కూడా కమిట్ అయినట్లు తెలిసింది. తన 69వ చిత్రానికి కార్తీక్ సుబ్బరాజ్, 70వ చిత్రానికి దర్శకుడు శంకర్ లేదా అట్లీ గానీ దర్శకత్వం వహించే అవకాశం ఉన్నట్లు టాక్. కాగా.. ఈ చిత్రంలో నటి స్నేహ, లైలా, రాఘవ లారెన్స్, ప్రశాంత్, మైక్ మోహన్, ప్రేమ్ జీ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. యువన్ శంకర్ రాజా సంగీతాన్ని అందిస్తున్నారు. -
విజయ్ను డైరెక్ట్ చేసే లాస్ట్ ఛాన్స్ ఆ దర్శకుడికే..
కోలీవుడ్లో వసూళ్ల రారాజు నటుడు విజయ్. ఈయన చిత్రం వస్తుందంటే ఇతర చిత్రాల నిర్మాతల్లో కలవరం. అభిమానుల్లో కోలాహలం కనిపిస్తాయి. ఆ స్థాయిలో స్టార్ డమ్ సంపాదించుకున్న దళపతి విజయ్ నటకు బ్రేక్ ఇస్తారా? ఇది జరిగే పనేనా? అంశం ప్రస్తుతం కోలీవుడ్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. విజయ్ ప్రస్తుతం లియో చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. లోకేష్ కనకరాజ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. చిత్ర షూటింగ్ చివరి దశకు చేరుకుంది. దీపావళికి థియేటర్లలో సందడి చేయడానికి సిద్ధం అవుతోంది. (ఇదీ చదవండి: అక్కడ మరొకరు ఉన్నా లిప్లాక్ చేసేదాన్ని:నటి) కాగా విజయ్ తన తదుపరి చిత్రానికి రెడీ అవుతున్నారు. ఇది ఆయన 68వ చిత్రం అవుతుంది. వెంకట్ ప్రభు దర్శకత్వం వహించనున్న ఈ చిత్రం త్వరలో సెట్ పైకి వెళ్లనుంది. దీన్ని విజయ్ 2024 మే నెలాఖరు కల్లా పూర్తి చేసి నటనకు బ్రేక్ ఇవ్వనున్నారనే ప్రచారం ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో హల్ చల్ చేస్తోంది. అంతేకాదు ఆయన రాజకీయాల్లో యాక్టివ్ కావాలని నిర్ణయించుకున్నట్లు ప్రచారం జోరందుకుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఇటీవల విజయ్ ఓటుకు నోటుపై విద్యార్థులకు, తల్లిదండ్రులకు గట్టిగానే హితబోధ చేశారు. కాగా 2025 ఏడాదంతా విజయ్ ప్రజా సంఘాలను బలోపేతం చేస్తూ సేవా కార్యక్రమాలు, రాజకీయ అంశాలపై పూర్తిగా దష్టి పెట్టనున్నట్లు టాక్. ఇక 2026 అసెంబ్లీ ఎన్నికల నాటికి క్షేత్రస్థాయిలో సత్తా చాటేలా వ్యూహాలు రచిస్తున్నట్లు సమాచారం. దీంతో విజయ్ చర్యలపై ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా పెద్దఎత్తున చర్చ సాగుతోంది. (ఇదీ చదవండి: ఓటీటీలోకి రాబోతున్న సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ) -
మళ్ళీ ట్రెండ్ సెట్ చేయబోతున్న విజయ్ దళపతి, అనిరుధ్
-
విజయ్ పాన్ ఇండియా సినిమా రవితేజ చేతుల్లోకి..!
-
'వారీసు' తర్వాత మరో తెలుగు డైరెక్టర్తో విజయ్ సినిమా?
తమిళ స్టార్ హీరో దళపతి విజయ్కు తెలుగులో మాంచి ఫాలోయింగ్ ఉంది. తమిళంలో ఆయన నటించిన పలు సినిమాలు తెలుగులో డబ్ అయి ఇక్కడ కూడా ఆయనకు సూపర్ క్రేజ్ను తెచ్చిపెట్టాయి. ఇక రీసెంట్గా వారసుడు సినిమాతో తెలుగులో తొలిసారి ఎంట్రీ ఇచ్చారు విజయ్. సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. వంశీ పైడిపల్లి ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఇదిలా ఉంటే ఇప్పుడు మరోసారి తెలుగులో స్ట్రెయిట్ మూవీ చేయనున్నారట విజయ్. బాలకృష్ణతో ‘వీరసింహా రెడ్డి’ మూవీని డైరెక్ట్ చేసిన గోపీచంద్ మలినేనితో ఆయన ఓ సినిమా చేయనున్నట్లు టాక్ వినిపిస్తుంది. ఇటీవలె గోపీచంద్ మలినేని కథను వినిపించగా, విజయ్ వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. త్వరలోనే దీనికి సంబంధించిన అఫీషియల్ అనౌన్స్మెంట్ రానుంది. -
శంకర్ దర్శకత్వంలో క్రేజీ కాంబినేషన్? రూ. 900కోట్ల బడ్జెట్!
భారీ చిత్రాలకు కేరాఫ్ దర్శకుడు శంకర్ అనడంలో ఎలాంటి అతిశయోక్తి ఉండదు. కమలహాసన్, రజనీకాంత్తో భారీ చిత్రాలను నిర్మించి సక్సెస్ అయిన దర్శకుడు ఈయన. ప్రస్తుతం కమలహాసన్ కథానాయకుడిగా ఇండియన్ 2 చిత్రాన్ని పూర్తి చేసే పనిలో ఉన్నారు. అదే విధంగా తొలిసారిగా టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చి స్టార్ నటుడు రామ్చరణ్తో పాన్ ఇండియా చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ రెండు చిత్రాలపై భారీ అంచనాలు నెలకొన్నాయి. కాగా శంకర్ తరువాతి చిత్రం ఏమిటి అన్న ప్రశ్నకు ఒక ఆసక్తికరమైన సమాధానం సామాజిక మాధ్యమాల్లో హల్చల్ చేస్తోంది. ఆయన రూ.900 కోట్ల బడ్జెట్తో భారీ చిత్రాన్ని తెరకెక్కించడానికి శస్త్ర అ్రస్తాలు సిద్ధం చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. దీనికి క్రేజీ కాంబినేషన్ను సిద్ధం చేస్తున్నట్లు టాక్. ఆ క్రేజీ కాంబినేషన్ దళపతి విజయ్, బాద్షా షారుక్ ఖాన్. ఎప్పుడూ కొత్త కంటెంట్ను తీసుకునే దర్శకుడు శంకర్ ఈ చిత్రానికి అండర్ వాటర్లో జరిగే విజ్ఞానాన్ని కథగా తీసుకుంటున్నట్లు సమాచారం. కాగా ఈ భారీ బడ్జెట్ చిత్రాన్ని రెండు ప్రముఖ నిర్మాణ సంస్థలు నిర్మించడానికి ముందుకు వచ్చినట్లు సమాచారం. పాన్ ఇండియా చిత్రంగా దీన్ని రూపొందించడానికి సన్నాహాలు జరుగుతున్నట్లు టాక్. బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుక్ ఖాన్ కోలీవుడ్కు సుపరిచితుడే. ఈయన చాలా కాలం క్రితమే కమలహాసన్ కథానాయకుడిగా నటించిన హేరామ్ చిత్రంలో కీలకపాత్ర పోషించారు. తాజాగా ఈయన నటించిన పఠాన్ చిత్రం బాక్సాఫీస్ను షేక్ చేస్తోంది. ఇక దళపతి విజయ్ ఇంతకుముందే శంకర్ దర్శకత్వంలో నన్బన్ చిత్రంలో నటించారు. విజయ్ తాజాగా నటించిన వారిసు చిత్రం మంచి విజయాన్ని అందుకుంది. ఈ చిత్రం బాలీవుడ్లోనూ విడుదలైంది. ప్రస్తుతం లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో లియో అనే భారీ చిత్రంలో నటిస్తున్నారు. ఇది పాన్ ఇండియా స్థాయిలో రూపొందుతోంది. ఇకపోతే షారుక్ ఖాన్కు విజయ్కు మధ్య మంచి స్నేహ సంబంధం ఉంది. షారుక్ ఖాన్ ప్రస్తుతం నటిస్తున్న హిందీ చిత్రం జవాన్లో విజయ్ అతిథి పాత్రలో మెరవనున్నారు. దీంతో షారుక్ ఖాన్, విజయ్ కాంబినేషన్లో చిత్రం వచ్చే అవకాశాలు మెండుగా ఉన్నాయి. అయితే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. -
హీరోయిన్ ప్రియా ఆనంద్కు లక్కీ ఛాన్స్.. యమ ఖుషీలో నటి
అనుకున్నది జరగకపోవడం, ఊహించనిది జరగడమే జీవితం. అందుకే అంటారు పెద్దలు ఏం జరిగినా అంతా మన మంచికే అని. ఇక సినిమాల విషయానికి వస్తే ఇప్పుడు హాట్ టాక్గా వరిన విషయం విజయ్ 67 చిత్రం. బీస్ట్ చిత్రం నిరాశపరినా, వారీసు చిత్రంతో నటుడు విజయ్ మళ్లీ విజయబాట పట్టారు. ప్రస్తుతం తన 67వ చిత్రంలో నటిస్తున్నారు. దీనికి మాస్టర్, విక్రమ్ చిత్రాల ఫేమ్ లోకేశ్ కనకరాజ్ దర్శకత్వం వహిస్తున్నారు. 7 స్క్రీన్ స్టూడియోస్ పతాకంపై ఎస్ఎస్.లలిత్ కుమార్ నిర్మిస్తున్న ఈ భారీ చిత్రానికి అనిరుద్ సంగీతాన్ని అందిస్తున్నారు. షూటింగ్ దశలో ఉన్న ఈ చిత్రంలో నటించే నటీనటుల వివరాలను నిర్మాతలు వినత్న పద్ధతిలో గంటకో నటుడి చొప్పున పరిచయం చేశారు. ముందుగా నటుడు అర్జున్ పేరును, ఆ తరువాత దర్శకుడు గౌతమ్ మీనన్, మిష్కిన్, మ్యాత్యూ థామస్, మన్సూర్ అలీఖాన్, బాలీవుడ్ నటుడు సంజయ్దత్, నృత్యదర్శకుడు శాండి, నటి ప్రియా ఆనంద్ తాజాగా బుధవారం త్రిష పేరును ప్రకటించారు. నటి త్రిష ఇంతకు ముందు విజయ్ సరసన మూడు చిత్రాల్లో నటించారు. సుమారు 14 ఏళ్ల తరువాత మళ్లీ ఇప్పుడు నటిస్తున్నారు. ఇక నటి ప్రియాఅనంద్ విషయానికి వస్తే ఈ చిత్రంలో ఈ అమ్మడికి నటించే అవకాశం వస్తుందని ఎవరూ ఊహించలేదు. ఇంకా చెప్పాలంటే ఇంత పెద్ద అవకాశం రావడం ఈమెకు ఇదే తొలిసారి అవుతుంది. వామనన్ చిత్రం ద్వారా 2009లో కథానాయకిగా పరిచయం అయిన నటి ప్రియా ఆనంద్. ఆ తరువాత పలు చిత్రాల్లో నటించినా పెద్ద స్టార్స్తో ఇప్పటి వరకూ నటించలేదు. తాజాగా విజయ్తో జత కట్టే అవకాశం రావడంతో యమ ఖుషీ అయిపోతోందట. కారణం 11 ఏళ్ల క్రితం విజయ్ సరసన తుపాకీ చిత్రంలో ఈ బ్యూటీనే నటించాల్సి ఉందట. ఆ చిత్ర దర్శకుడు ఏఆర్.మురుగదాస్ తొలి చాయిస్ కూడా ప్రియా ఆనంద్నే నట. అయితే కొన్ని కారణాల వల్ల ఆ అవకాశం చేజారిపోయింది. మళ్లీ ఇన్నాళ్లకు విజయ్తో జత కట్టే అవకాశం రావడం చెప్పలేనంత ఆనందంగా ఉందంటోంది. -
స్టార్ హీరో విజయ్తో నాకు విభేదాలు ఉన్న విషయం నిజమే : తండ్రి
కోలీవుడ్ స్టార్ హీరో విజయ్కు తండ్రి చంద్రశేఖర్తో విబేధాలు కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఆమధ్య విజయ్ తన సొంత తండ్రిపైనే ఫిర్యాదు చేయడం, అప్పట్లో కోలీవుడ్లో చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికీ వారిమధ్య విభేదాలు ఉన్నాయని ప్రచారం జరుగుతుంది. తాజాగా విషయంపై విజయ్ తండ్రి చంద్రశేఖర్ స్పందించారు. ఓ తమిళ మీడియా ఛానెల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కొడుకుతో సరిగ్గా మాటలు లేవని చెప్పారు. తండ్రీ-కొడుకుల మధ్య సాధారణంగా ఉన్నట్లే మా మధ్య కూడా చిన్నచిన్న అభిప్రాయ బేధాలు ఉన్నాయి. గత ఏడాదిన్నర కాలంగా సరిగ్గా మాటల్లేవు. కానీ విజయ్ అంటే నాకు చాలా ఇష్టం. మా ఇద్దరికీ ఒకరంటే ఒకరికి ప్రేమ, ఆప్యాయతలు ఉన్నాయి. ఆమధ్య విజయ్ ఏదో స్టేట్మెంట్ ఇచ్చాడని మీడియా రచ్చ చేసింది. కానీ నిజానికి విజయ్తో నాకు అంత తగాదాలు లేవు. దీని గురించి చర్చించాల్సిన పెద్ద విషయం కాదు. విడిపోవడం, మళ్లీ కలుసుకోవడం జరుగుతూనే ఉంటాయి. అంతెందుకు మొన్నీమధ్య విజయ్తో కలిసే వారీసు సినిమా చూశాను. ఇది చాలు కదా.. మా మధ్య ఎలాంటి అనుబంధం ఉందో చెప్పడానికి అంటూ విజయ్ తండ్రి చెప్పుకొచ్చారు. కాగా విజయ్ పొలిటికల్ ఎంట్రీపైనే తండ్రీ-కొడుకులను విభేదాలు వచ్చాయి. దీంతో తండ్రి నిర్వహించే పొలిటికల్ ఈవెంట్స్కి తనకు సంబంధం లేదని స్వయంగా విజయ్ పేర్కొన్నారు. -
పెళ్లైన స్టార్ హీరోతో కీర్తి సురేష్ ప్రేమాయణం అంటూ తమిళనాట ప్రచారం
కోలీవుడ్ స్టార్ హీరో తళపతి విజయ్ భార్య సంగీతతో విడిపోతున్నాడని, త్వరలోనే వీళ్లు విడాకులు తీసుకోనున్నారంటూ కొద్దిరోజులుగా వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఈ రూమర్స్కి బలం చేకూర్చేలా విజయ్కు సంబంధించిన ఈవెంట్స్లోనూ సంగీత ఎక్కడా కనిపించడం లేదు. 22 ఏళ్ల తమ వివాహ బంధాన్ని విజయ్ తెగదెంపులు చేసుకుంటున్నారని జోరుగా ప్రచారం జరుగుతుంది. ఇదిలా ఉంటే విజయ్ విడాకులకు స్టార్ హీరోయిన్ కీర్తిసురేష్ కారణమని తమిళ మీడియాలో వార్తలు వస్తున్నాయి. గతంలో కీర్తి సురేష్ విజయ్తో కలిసి ‘భైరవ’, ‘సర్కార్’ వంటి సినిమాల్లో నటించింది. అప్పటినుంచి వీరిద్దరి మధ్య మంచి స్నేహం ఉంది. అది ప్రేమగా మారిందని, భార్య సంగీత ఎన్నిసార్లు చెప్పినా విజయ్ కీర్తితో క్లోజ్గా ఉంటున్నాడని తమిళ మీడియాలో పలు కథనాలు వెలువడ్డాయి. భార్యతో విడాకుల తర్వాత కీర్తి సురేష్ను పెళ్లి చేసుకుంటారనే ప్రచారం కూడా జరుగుతుంది. ఈ క్రమంలో #JusticeForSangeetha (విజయ్ భార్య పేరు)అనే హ్యాష్ట్యాగ్ను నెటిజన్లు ట్రెండ్ చేస్తున్నారు. అదే విధంగా కీర్తి సురేష్ను దారుణంగా ట్రోల్స్ చేస్తున్నారు. అయితే దీనిపై విజయ్ కానీ, సంగీత కానీ, కీర్తి సురేష్ కానీ ఇప్పటి వరకు స్పందించలేదు. ఇదిలా ఉంటే వారీసు హిట్తో కొందరు ఓర్వలేక ఇలాంటివి తెరపైకి తీసుకొస్తున్నారని, కావాలనే కీర్తి సురేష్ను ఇందులోకి లాగుతున్నారంటూ ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. దీనిపై స్వయంగా విజయ్ స్పందిస్తే తప్పా ఇది ఒక కొలిక్కి వచ్చేలా కనిపించడం లేదు. Worst Ra da vijay 😤#JusticeForSangeethapic.twitter.com/CIq4q7qxKV — 🇧🇷DILLIᵀʰᵘⁿⁱᵛᵘ⚜️ (@itsdilli0700) January 22, 2023 -
ఓటీటీలోకి వచ్చేస్తున్న విజయ్ 'వారీసు'.. స్ట్రీమింగ్ ఎక్కడంటే
తమిళ స్టార్ హీరో విజయ్ హీరోగా నటించిన తాజా చిత్రం వారీసు. తెలుగులో వారసుడు పేరుతో ఈ సినిమాను తెరకెక్కించారు. వంశీ పైడిపల్లి రూపొందించిన ఈ చిత్రంలో రష్మిక మందన్నా హీరోయిన్గా నటించింది. కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ చిత్రం కోలీవుడ్ సహా తెలుగులోనూ పాజిటివ్ రెస్పాన్స్ను సొంతం చేసుకుంది. కాగా ఈ సినిమా డిజిటల్ రైట్స్ను అమెజాన్ ప్రైమ్ సంస్థ సొంతం చేసుకున్నట్లు సమాచారం. విజయ్కు ఉన్న ఫాలోయింగ్ దృష్ట్యా భారీ ధరకు అమెజాన్ వారీసు డిజిటల్ రైట్స్ను దక్కించుకున్నట్లు తెలస్తోంది. తాజాగా అందుతున్న సమాచారం మేరకు ఫిబ్రవరి 10న ఈ చిత్రం అమెజాన్ ప్రైమ్లో అందుబాటులో ఉండనున్నట్లు టాక్ వినిపిస్తుంది. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన రానుంది. -
సంక్రాంతి బరినుంచి తప్పుకున్న వారీసు? నెట్టింట జోరుగా ప్రచారం
తమిళ స్టార్ హీరో విజయ్ నటిస్తున్న తాజాచిత్రం వారీసు. తెలుగులో వారసుడు పేరుతో రిలీజ్ కాబోతుంది. వంశీ పైడిపల్లి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను తెలుగు, తమిళంలో ఏకకాలంలో రిలీజ్ చేయనున్నారు. రష్మిక మందన్నా విజయ్కు జోడీగా నటించింది.సంక్రాంతి కానుకగా బరిలోకి దిగుతున్న ఈ సినిమా ఈనెల 11న విడుదల కాబోతుంది. దిల్రాజు భారీ బడ్జెట్తో నిర్మించిన ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ క్రమంలో ఈ సినిమాకు సంబంధించిన ఓ వార్త నెట్టింట తెగ వైరల్ అవుతుంది. పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి కాకపోవడంతో వారీసు సినిమా సంక్రాంతి బరి నుంచి తప్పుకుందని నెట్టింట జోరుగా ప్రచారం జరుగుతుంది. తాజాగా ఈ వార్తలపై స్పందించిన మూవీ టీం రిలీజ్ డేట్పై క్లారిటీ ఇచ్చారు. ముందుగా ప్రకటించినట్లుగానే వారీసు విడుదల అవుతుందని, పుకార్లను నమ్మవద్దంటూ పోస్టర్ను విడుదల చేశారు. Meet THE BOSS’s family in 3 days in theatres near you nanba 🤩#3DaysForVarisu#Thalapathy @actorvijay sir @directorvamshi @MusicThaman @iamRashmika @Lyricist_Vivek @7screenstudio @TSeries #Varisu #VarisuPongal pic.twitter.com/RbAsoqrpNS — Sri Venkateswara Creations (@SVC_official) January 8, 2023 -
అజిత్ వర్సెస్ విజయ్.. సూపర్స్టార్ ఎవరు? కోలీవుడ్లో ఫ్యాన్స్ రచ్చ
తమిళసినిమా: సూపర్స్టార్ ఎవరన్న విషయంపై కోలీవుడ్లో పెద్ద వివాదం జరుగుతున్న విషయం తెలిసిందే. విజయ్ కథానాయకుడిగా వారిసు చిత్రాన్ని నిర్మించిన దిల్రాజు విజయ్కు అజిత్ కంటే ఎక్కువ మాస్ ఫాలోయింగ్ ఉందని, ఆయనే నంబర్వన్ అని ఆ చిత్రం ఆడియో ఆవిష్కరణ కార్యక్రమంలో పేర్కొన్నారు. అదే వేదికపై నటుడు శరత్కుమార్ మాట్లాడుతూ.. భవిష్యత్తు సూపర్స్టార్ విజయ్ అని తాను సూర్యవంశం విజయోత్సవ వేదికపైనే చెప్పానని.. అది నిజమైందని పేర్కొన్నారు. అది ఇప్పుడు సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. సామాజిక మాధ్యమాల్లో డిబేటింగ్ వరకు వెళ్లింది. ఇలాంటి పరిస్థితుల్లో రజనీకాంత్ ఉన్నంత వరకు ఆయనే సూపర్స్టార్ అని సీనియర్ నటుడు, నిర్మాత కె.రాజన్ పేర్కొన్నారు. నామ్ తమిళర్ పార్టీ నేత సీమాన్ మాత్రం నేటి సూపర్స్టార్ విజయ్ అని తెలిపారు. ఈ చర్చ ఇప్పట్లో ఆగేలా కనిపించడం లేదు. కాగా ఈ విషయమై నటుడు శరత్కుమార్ ఒక చానల్లో మాట్లాడుతూ.. తాను విజయ్ సూపర్స్టార్ అని సంబోధించానే కాని రజనీకాంత్, అజిత్ సూపర్స్టార్లు కాదని చెప్పలేదన్నారు. రజనీకాంత్తో పాటు అజిత్, అమితాబచ్చన్, షారూక్ఖాన్ వీళ్లంతా సూపర్స్టార్లేనని శరత్కుమార్ తన వ్యాఖ్యలను సమర్థించుకునే ప్రయత్నం చేశారు. అదే విధంగా సూపర్స్టార్ అన్నది ఒక టైటిల్ కాదని పేర్కొన్నారు. దీని గురించి ఇకపై వివాదం చేయాలన్న ఆలోచన లేదని, దీనిని వివరించాల్సిన అవసరం తనకు లేదని స్పష్టం చేశారు. అదే విధంగా తాను విజయ్ ముఖ్యమంత్రి అవుతారనో, మంత్రి అవుతారనో చెప్పలేదని, సూపర్స్టార్ అవుతారని చెప్పానని అన్నారు. జీవితంలో గొప్ప విజయాలు సాధించిన వారంతా సూపర్స్టార్లే అని పేర్కొన్నారు. సూర్యవంశం చిత్ర వేడుకలలో చెప్పిందే ఇప్పుడూ చెబుతున్నానని, రియల్ సూపర్స్టార్ అంటే ఎప్పటికీ ఎంజీఆర్నే అని శరత్కుమార్ పేర్కొన్నారు. -
షాకింగ్.. భార్యకు విడాకులు ఇవ్వనున్న విజయ్? ఫ్యాన్స్ ఆందోళన
కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ తన భార్య సంగీతకు విడాకులు ఇవ్వనున్నారంటూ నెట్టింట వార్తలు గుప్పుమంటున్నాయి. కొంతకాలంగా ఇద్దరికి విభేదాలు తలెత్తాయని, ప్రస్తుతం వీరిద్దరు విడివిడిగా ఉన్నారంటూ కోలీవుడ్ మీడియా కోడై కూస్తుంది. నిజానికి విజయ్కు సంగీత వీరాభిమాని. పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్నారు. ఎంతో చూడముచ్చటగా ఉండే ఈ జంట ఇలా అర్థాంతరంగా విడాకులు తీసుకోవడం ఏంటని విజయ్ ఫ్యాన్స్ షాకయ్యారు. ఈ విడాకుల రూమర్స్ ఎలా వచ్చాయంటే.. రీసెంట్గా వారీసు ప్రీ రిలీజ్ ఈవెంట్కు సంగీత రాకపోవడం, ఆమధ్య డైరెక్టర్ అట్లీ భార్య ప్రియ సీమంతం వేడకలోనూ విజయ్ ఒక్కడే వెళ్లడంతో వీరిద్దరికి విబేధాలు తలెత్తాయంటూ తమిళవర్గాల్లో వార్తలు ఊపందుకున్నాయి. అయితే ఇందులో నిజం లేదని విజయ్ సన్నిహితవర్గాలు తేల్చేశాయి. ప్రస్తుతం పిల్లలతో కలిసి సంగీత అమెరికాలో ఉందని, త్వరలోనే ఆమె ఇండియాకు రానున్నట్లు తెలిపారు. ఇలాంటి ఫేక్ న్యూస్ను నమ్మకండి అంటూ రూమర్స్కి చెక్ పెట్టారు. మరోవైపు వారీసు రిలీజ్ నేపథ్యంలో కొందరు కావాలనే ఇలాంటి అవాస్తవాలు పుట్టిస్తున్నారంటూ విజయ్ ఫ్యాన్స్ మండిపడుతున్నారు. -
ఆసక్తి రేపుతున్న విజయ్ మీటింగ్.. ఫ్యాన్స్తో ముచ్చటించిన హీరో
నటుడు విజయ్ మంగళవారం ఉదయం చెన్నైలో అభిమానులతో సమావేశయ్యారు. ఆయన కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం వారీసు. తమిళం, తెలుగు భాషల్లో ఈ చిత్రం సంక్రాంతి సందర్భంగా విడుదలకు సిద్ధమవుతోంది. రష్మిక మందన్నా హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రాన్ని వంశీ పైడిపల్లి దర్శకత్వంలో దిల్రాజు నిర్మిస్తున్నారు. తెలుగులో వారసుడు పేరుతో విడుదల కానుంది. కాగా ఇదే సమయంలో కథానాయకుడుగా నటిస్తున్న తుణివు చిత్రం కూడా విడుదల కానుంది. అభిమానులు పోటీగా భావిస్తున్న సమవుజ్జీలు అయిన ఇద్దరు స్టార్ నటులు నటిస్తున్న భారీ చిత్రాలు ఒకేసారి విడుదల కావడంతో సినీ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. అదీ కాకుండా విజయ్ చిత్రం వారిసు గురించి ఇప్పటికే చర్చ జరుగుతున్న విషయం తెలిసిందే. ఇలాంటి పరిస్థితుల్లో విజయ్ మంగళవారం ఉదయం చెన్నై, పనైయూర్లోని తన కార్యాలయంలో అభిమానులతో సమావేశమయ్యారు. ఇందులో అరియలూర్, పెరంబలూర్ మూడు జిల్లాలకు చెందిన అభిమానులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా విజయ్ వారితో వారిసు చిత్ర విడుదల తదితర అంశాలతో సుదీర్ఘంగా చర్చించారు. ఇదేవిధంగా ఇటీవల మరికొన్ని జిల్లాలకు చెందిన విజయ్ మక్తల్ ఇరుక్కం ముఖ్య నిర్వాహకులతో సమావేశమైన విషయం తెలిసింది. Actor vijay meets his fans again in chennai panaiyur residence | #Vijay #VijayFansMeet @actorvijay pic.twitter.com/zmTmqxanHO — Flash Venkat (@flashvenkat7) December 13, 2022 -
'వారిసు' చిత్ర వివాదం.. అభిమానులతో విజయ్ భేటీపై సర్వత్రా ఆసక్తి
తమిళ సినిమా: సూపర్స్టార్ రజినీకాంత్ తర్వాత ఆస్థాయిలో అభిమానులను కలిగిన నటుడు విజయ్. ఈయన తన అభిమాన సంఘాల ద్వారా తమిళ ప్రజలకు పలు సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. అంతేకాకుండా విజయ్కి రాజకీయరంగ ప్రవేశం చేయాలనే ఆసక్తి ఉన్నట్లు చాలా కాలంగా ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం ఆయన నేరుగా రాజకీయాల్లోకి ఎంటర్ అవ్వకపోయినా ఆయన అభిమానులు కొందరు తమిళనాడులోని పలు నియోజకవర్గాల్లో ఆ మధ్య జరిగిన లోకల్ బాడీ ఎన్నికల్లో పోటీ చేసి గెలుపొందారు. ఇకపోతే విజయ్ తన అభిమానులను కనీసం ఏడాదికి ఒకసారైనా కలుస్తూ ఉంటారు. అలాంటిది కరోనా కారణంగా గత నాలుగేళ్లుగా ఆయన తన అభిమానులతో ప్రత్యేకంగా భేటీ కాలేదు. దీంతో ఆదివారం మధ్యాహ్నం విజయ్ స్థానిక పనైయూర్లోని తన కార్యాలయంలో అభిమాన సంఘ నిర్వహకులు, కార్యకర్తలతో సమావేశమయ్యారు. ఈ భేటీ ప్రాధాన్యతను సంతరించుకుంది. కారణం విజయ్ తాజాగా నటిస్తున్న వారిసు చిత్ర తమిళం, తెలుగు భాషల్లో సంక్రాంతి సందర్భంగా విడుదలకు సిద్ధమవుతోంది. కాగా అదే సందర్భంగా చిరంజీవి నటిస్తున్న భోళాశంకర్, బాలకృష్ణ నటించిన వీరసింహారెడ్డి చిత్రాలు విడుదలకు రెడీ అవుతున్నాయి. దీంతో థియేటర్ల సమస్య ఏర్పడే పరిస్థితి నెలకొనడంతో తెలుగు సినీ నిర్మాతల మండలి పండగ రోజుల్లో తెలుగు చిత్రాలకే ప్రాధాన్యత ఇవ్వాలనే ప్రకటనను ఇటీవల చేసింది. ఇది తమిళ చిత్రశ్రమంలో తీవ్ర చర్చకు దారితీస్తోంది. నామ్ తమిళర్ కట్చి పార్టీ నేత సీమాన్ వంటి వారు తెలుగు నిర్మాతల మండలి నిర్ణయాన్ని తీవ్రంగా ఖండిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల మధ్య నటుడు విజయ్ తన అభిమానులతో భేటీ కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈ సమావేశంలో ఏఏ విషయాలను గురించి చర్చిస్తారు? ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారు? వారిసు చిత్ర విడుదల వివాదం గురించి అభిమానులతో చర్చిస్తారా..? ఈ వ్యవహారంలో వారు ఎలా వ్యవహరించాలనే సూచనలు చేస్తారా? వంటి పలు ప్రశ్నలు తలెత్తుతున్నాయి. కాగా, వారిసు చిత్రాన్ని సంక్రాంతికి విడుదల చేస్తున్నట్లు నిర్మాత ఆదివారం తన ట్విట్టర్లో స్పష్టం చేయడం గమనార్హం. -
వారసుడు సినిమా వివాదంపై స్పందించిన అల్లు అరవింద్
-
‘దళపతి’ విజయ్ కేసును ముగించిన హైకోర్టు
సినీ హీరో విజయ్కి చెందిన కారు టాక్స్ కేసులో మద్రాస్ హైకోర్టు తీర్పు వెలువరించింది. 2019 జనవరి నాటికి ఎంట్రీ టాక్స్ చెల్లించకపోతే జరిమానా చెల్లించాల్సిందేనని ఆదేశించింది. వివరాల్లోకి వెళితే నటుడు విజయ్ 2005లో రూ. 63 లక్షల ఖరీదైన కారును విదేశం నుంచి దిగుమతి చేసుకున్నారు. అయితే దీనికి రాష్ట్ర ఎంట్రీ టాక్స్ను చెల్లించకపోవడంతో వివాదానికి దారి తీసింది. వాణిజ్యశాఖాదికారులు ఎంట్రీ టాక్స్ను చెల్లించాలంటూ విజయ్కు నోటీసులు జారీ చేశారు. దీనిపై విజయ్ చెన్నై హైకోర్టును ఆశ్రయించారు. చదవండి: వాళ్లు ఉన్నంత కాలం సినీ పరిశ్రమ మునిగిపోతుంది: డైరెక్టర్ సాధారణంగా కారును దిగుమతి చేసుకున్న నెల నుంచి రెండు శాతం జరిమానా మాత్రమే చెల్లించాల్సి ఉండగా తన కారుకు 40 శాతం జరిమానా విధించారని పిటిషన్లో పేర్కొన్నారు. దీనిపై పలు మార్లు కోర్టులో విచారణ జరిగింది. కాగా గురువారం న్యాయమూర్తి సురేశ్ కుమార్ తుది తీర్పును వెల్లడించారు. అందులో విదేశం నుంచి దిగుమతి చేసుకున్న కారుకు 2019 జనవరిలోగా విజయ్ పూర్తిగా ఎంట్రీ టాక్స్ చెల్లించినట్లయితే జరిమానా చెల్లించాల్సిన అవసరం లేదని, చెల్లించని ఎడల జరిమానా చెల్లించాల్సిందేనని ఉత్తర్వులు జారీ చేస్తూ.. కేసు విచారణను ముగించారు. -
విజయ్ బర్త్డే: వారసుడు నుంచి విజయ్ సెకండ్ లుక్ పోస్టర్
తమిళ స్టార్ దళపతి విజయ్ బర్త్డే సందర్భంగా సోషల్ మీడియాలో ఆయనకు శుభాకాంక్షలు వెల్లువెత్తున్నాయి. ఇక తమిళనాట అయితే విజయ్ పుట్టిన రోజు వేడుకలను ఫ్యాన్స్ గ్రాండ్ సెలబ్రెట్ చేస్తున్నారు. విజయ్కి పలువురు సినీ ప్రముఖులు సైతం విషెస్ తెలుపుతున్నారు. అంతేకాదు ఆయన బర్త్డే సందర్భంగా విజయ్ సినిమాలకు సంబంధించిన వరుస అప్డేట్స్ వస్తున్నాయి. ఈ నేపథ్యంలో వంశీ పైడిపల్లి దర్శకత్వంతో తెరకెక్కుతున్న విజయ్ 66 మూవీకి సంబంధించిన మరో అప్డేట్ను తాజాగా వదిలారు మేకర్స్. నిన్న ఈమూవీ టైటిల్తో పాటు విజయ్ ఫస్ట్లుక్ను రిలీజ్ చిత్రం బృందం రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. చదవండి: Vijay As Varisu: వారసుడుగా వస్తోన్న దళపతి విజయ్ వారిసు(తెలుగులో వారసుడు) అని టైటిల్ ఖారారు చేశారు ఈ మూవీకి. తాజాగా ఈ చిత్రంలోని విజయ్కి సంబంధించిన మరోలుక్ వదిలారు. చూట్టూ పిల్లలు, గాలి పటాలు, చెరుకు గడలు మధ్య ఎండ్ల బండిలో పడుకుని ఆకాశం వైపు చూస్తూ కనిపించాడు విజయ్. ఈ సెకండ్ లుక్ పోస్టర్ చూస్తుంటే సంక్రాంతిని గుర్తు చేస్తుంది. అంటే ఇందులో విజయ్ పలు షేడ్స్లో కనిపించనున్నాడని తెలుస్తోంది. కాగా ఇందులో సరదాగా నవ్వుతూ కనిపించిన విజయ్ లుక్కు అతడి ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. దీంతో విజయ్ కొత్తలుక్ పలు సోషల్ మీడియాల్లో షేర్ చేస్తూ వైరల్ చేస్తున్నారు ఫ్యాన్స్. చదవండి: ఓటీటీకి అంటే సుందరానికి, స్ట్రీమింగ్ డేట్, టైం ఫిక్స్.. ఎక్కడంటే! Sankranthi 2023 is going to be special with the arrival of #Vaarasudu #VaarasuduSecondLook#Vaarasudu#Varisu#HBDDearThalapathyVijay Thalapathy @actorvijay sir @directorvamshi @iamRashmika @MusicThaman @Cinemainmygenes @KarthikPalanidp pic.twitter.com/GySYHlT488 — Sri Venkateswara Creations (@SVC_official) June 22, 2022 -
స్టార్ హీరో విజయ్ ఆఫీసులో మృతదేహం కలకలం, ఏం జరిగింది?
Dead Body Found in Vijay Party Office: తమిళ స్టార్ హీరో దళపతి విజయ్కి సంబంధించిన ఓ కార్యాలయంలో మృతదేహం లభ్యమైంది. మృతుడు కాంట్రాక్ట్ ఉద్యోగి ప్రభాకరన్గా పోలీసులు గుర్తించారు. కాగా విజయ్ రాజకీయాల్లోకి రాకపోయిన ఆయనకు విజయ్ మక్కల్ ఇయక్కం పేరుతో పార్టీ ఉన్న సంగతి తెలిసిందే. దీనికి సంబంధించిన ఆఫీసు చెన్నై పనైయార్ శివార్లలో ఉంది. అయితే ఆ పార్టీ ఆఫీసుతో విజయ్కి నేరుగా ఎలాంటి సంబంధం లేకపోయిన అతడి ఫ్యాన్స్ ఆఫీసు వ్యవహరాలను చూసుకుంటున్నారు. చదవండి: ‘విక్రమ్’ మూవీలో విలన్స్తో ఫైట్ చేసిన ఈ పని మనిషి ఎవరో తెలుసా? అయితే ఈ పార్టీ ఆఫీసుల ద్వారానే విజయ్ పలు సేవ కార్యక్రమాలు చేపడుతుంటాడు. ఈ నేపథ్యంలో గత శుక్రవారం ఉదయం కార్యాలయంలో పెయింటర్ ప్రభాకరన్ శవమై తేలడం కలకలం రేపుతోంది. ఇటీవల ఈ పార్టీ ఆఫీసును ఆధునికరించేందుకు ప్రభాకరన్ అనే పెయింటర్ను నియమించారు. అయితే ఇటీవల సొంతూరు వెళ్లొచ్చిన ప్రభాకరన్.. పనిలో భాగంగా గురువారం రాత్రి పార్టీ ఆఫీసుకు వచ్చాడు. ఆ సమయంలో అతడు మద్యం సేవించి ఉన్నట్లు తెలుస్తోంది. చదవండి: సాయి పల్లవికి చీర పెట్టిన సరళ కుటుంబ సభ్యులు ఈ క్రమంలో ఆకలిగా ఉందని పార్టీ ఆఫీసు సుపర్ వైజర్ను రూ. 100 అడిగాడట. ఆ డబ్బుతో ప్రభాకరన్ పరోటా తీసుకుని వచ్చాడు. ఏమైందో తెలియదు కానీ శుక్రవారం ఉదయం అతడు శవమై కనిపించాడు. అంతే కాకుండా తన చేతిలో, నోటిలో పరోటా ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. అయితే ఆకలితో ఉన్న ప్రభాకరన్.. వేగంగా పరోటాను తినడంతో ఊపిరాడక చనిపోయి ఉండోచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. ప్రస్తుతం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
విజయ్, రష్మికల షూటింగ్ ఫొటోలు లీక్.. డైరెక్టర్ అప్సెట్
తమిళ స్టార్ హీరో దళపతి విజయ్, వంశీ పైడిపల్లి దర్శకత్వంలో విజయ 66వ మూవీ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. నేషనల్ క్రష్ రష్మిక మందన్నా హీరోయిన్గా నటిస్తున్న ఈ మూవీ ఇటీవల హైదరాబాద్ షూటింగ్ షెడ్యూల్ను పూర్తి చేసుకుంది. అయితే ఈ మూవీ షూటింగ్ లోకేషన్స్కు సంబంధించిన పలు ఫొటోలు బయటకు వచ్చాయి. హైదరాబాద్లోని ఓ నర్సరీలో చిత్రికరించిన సన్నివేశాలకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు లీకయ్యాయి. దీంతో దర్శకుడు వంశీ పైడిపల్లి ఆసంతృప్తి చెందినట్లు తెలుస్తోంది. దీంతో మూవీ బృందానికి స్ట్రిక్ట్ కండిషన్స్ పెట్టాడట. ఇకపై ఇలాంటి తప్పు జరగకుండా ఉండేందుకు షూటింగ్ స్పాట్లో ఎవరిని మొబైల్ ఫోన్స్ అనుమతించడం లేదని సమాచారం. చదవండి: వెకేషన్లో చరణ్, ఉపాసన.. క్యూట్ పిక్ షేర్ చేసిన మెగా హీరో హైదరాబాద్లో రోడ్డు పక్కనే ఉన్న ఓ నర్సరీలో విజయ్, రష్మికలకు సంబంధించిన సన్నివేశాలకు సంబంధించిన చిత్రీకరణ జరిగింది. ఇందులో విజయ్ క్యాజువల్ డ్రెస్లో ఉండగా.. రష్మిక పోట్టి ఫ్రాక్లో కనిపించింది. ఆ నర్సరీ రోడ్డు పక్కనే ఉండటంతో వాహనదారులంతా ఆగి మరి షూటింగ్ను ఆసక్తిగా తిలకిస్తున్నారు. కాగా ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా వంశీ రూపొందిస్తున్న ఈ సినిమాకు దిల్ రాజు, శిరీష్ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమాలో ప్రకాశ్ రాజ్, శరత్ కుమార్, యోగి బాబు, ప్రభు, జయసుధ, శ్రీకాంత్, సంగీత క్రిష్ తదితరులు నటిస్తున్నారు. తమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా 2023 ఆరంభంలో విడుదల కానుంది. చదవండి: ఆ హీరో నన్ను అలా పిలవడం ఇష్టం లేదు: రష్మిక షాకింగ్ కామెంట్స్ #Thalapathy66 - Exclusive Pic 💥🔥 pic.twitter.com/RDFXA0EGdl — M∆HI - Infinity Plus YouTube (@MahilMass) June 10, 2022 #Thalapathy66 Shooting Spot Full Size Image 😍🔥#Beast @actorvijay pic.twitter.com/0JvsS91yHg — Vijay Fans Page (@VijayKWoodKing) June 9, 2022 #Thalapathy66 leaked 🥳 pic.twitter.com/DuhRm1WEbs — Kings😎 (@ikarthik7744) June 8, 2022 -
సంక్రాంతికి వచ్చేస్తున్న విజయ్- రష్మిక
హీరో విజయ్ సంక్రాంతికి సై అంటున్నారు. ఆయన నటిస్తున్న ద్విభాషా (తెలుగు, తమిళం) చిత్రం సంక్రాంతికి విడుదల కానుంది. రష్మికా మందన్నా హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాకు వంశీ పైడిపల్లి దర్శకుడు. ‘దిల్’రాజు, శిరీష్, పరమ్ వి. పొట్లూరి, పెరల్ వి.పొట్లూరి నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే మొదలైంది. ప్రస్తుతం హైదరాబాద్లోని ఓ ప్రముఖ స్టూడియోలో ప్రధాన తారాగణంపై కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. ఈ చిత్రంలో ప్రకాష్రాజ్, శరత్కుమార్, ప్రభు, జయసుధ కీలక పాత్రలు చేస్తున్నట్లు చిత్రయూనిట్ ఆదివారం అధికారికంగా ప్రకటించింది.. అంతేకాదు.. ఈ సినిమాని 2023 సంక్రాంతికి రిలీజ్ చేస్తున్నట్లు వెల్లడించింది. హర్షిత్ రెడ్డి, హన్షిత రెడ్డి సహ నిర్మాతలుగా ఉన్న ఈ సినిమాకు తమన్ మ్యూజిక్ డైరెక్టర్. -
విజయ్ సినిమాలో ఛాన్స్ .. గుడ్న్యూస్ షేర్ చేసిన రష్మిక
నేషనల్ క్రష్ రష్మిక మందన్నా తెలుగుతో పాటు పాన్ ఇండియా లెవల్లో సత్తా చాటుతోంది. గతేడాది సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన పుష్ప సినిమాతో శ్రీవల్లిగా ఆకట్టుకున్న రష్మిక వరుస అవకాశాలతో ఫుల్ బిజీ అవుతుంది. పుష్ప సీక్వెల్గా వస్తోన్న పుష్ప ది రూల్ సినిమాతో పాటు మరో క్రేజీ పాన్ ఇండియా సినిమా ఛాన్స్ కొట్టేసింది. కోలీవుడ్ స్టార్ విజయ్ నటిస్తున్న ఫస్ట్ స్ట్రెయిట్ మూవీలో రష్మిక నటించనుంది. టాలీవుడ్ ప్రముఖ నిర్మాత దిల్రాజు నిర్మించబోతున్న ఈ పాన్ ఇండియా సినిమాకు వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించనున్నారు. ఈ ప్రాజెక్ట్కు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వచ్చేసింది. దీనిపై సంతోషం వ్యక్తం చేసిన రష్మిక ఇంతకంటే బెస్ట్ బర్త్డే గిఫ్ట్ ఏముంటుందంటూ ట్వీట్ చేసింది. మంగళవారం(ఏప్రిల్5) రష్మిక బర్త్డే అన్న సంగతి తెలిసిందే. కాగా గతంలో ఈ ప్రాజెక్ట్లో రష్మిక స్థానంలో వేరే హీరోయిన్ల పేర్లు తెరపైకి వచ్చినా అవి ఒట్టి పుకార్లేనని అర్థమైపోయింది. What can possibly be a better birthday gift? 🌸@directorvamshi @svc_official @actorvijay#thalapathy66 pic.twitter.com/FvNUkUcgOl — Rashmika Mandanna (@iamRashmika) April 5, 2022 -
పాన్ ఇండియా మూవీ నుంచి రష్మికను సైడ్ చేశారా?
నేషనల్ క్రష్ రష్మిక మందన్నా ఇప్పుడు వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది. రీసెంట్గా పుష్పతో బ్లాక్ బస్టర్ హిట్ను సొంతం చేసుకున్న రష్మిక ఈ సినిమా విజయంతో పాన్ ఇండియా క్రేజ్ను సంపాదించుకుంది. అటు తెలుగుతో పాటు హిందీలోనూ వరుస సినిమాలు చేస్తోన్న రష్మిక త్వరలోనే కోలీవుడ్ స్టార్ విజయ్తో ఓ సినిమా చేయనుందంటూ వార్తలు వినిపించిన సంగతి తెలిసిందే. విజయ్ నటిస్తున్న తొలి తెలుగు స్ట్రైట్ సినిమా కావడంతో తెలుగులో మరింత హైప్ నెలకొంది. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో దిల్ రాజు నిర్మించనున్న ఈ పాన్ ఇండియా సినిమాలో ముందుగా రష్మికను తీసుకున్నట్లు టాక్ వినిపించింది. అయితే తాజా సమాచారం ప్రకారం రష్మికను సైడ్ చేసి కృతిసనన్ను హీరోయిన్గా ఫైనల్ చేశారట. ప్రస్తుతం ఈ భామ ఆదిపురుష్ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. -
విజయ్తో పుదుచ్చేరి సీఎం భేటీ
సాక్షి, చెన్నై: సినీ నటుడు విజయ్తో పుదుచ్చేరి సీఎం ఎన్ రంగస్వామి భేటీ అయ్యారు. చెన్నై పయనూర్లోని విజయ్ ఇంట్లో శుక్రవారం సాయంత్రం గంటపాటు ఇద్దరూ సమావేశమయ్యారు. రాష్ట్రంలో జరుగుతున్న నగర పాలక సంస్థల ఎన్నికల్లో ఆయన అభిమాన సంఘం విజయ్ మక్కల్ ఇయక్కం నుంచి అభ్యర్థులు పోటీలో ఉన్నారు. ఈ క్రమంలో విజయ్ను కలవడం చర్చకు దారితీసింది. భేటీ అనంతరం వెలుపలకు వచ్చిన రంగ స్వామిని మీడియా ప్రశ్నించగా, మర్యాద పూర్వకంగానే కలిసినట్లు వ్యాఖ్యానించారు. విజయ్ తనకు మంచి మిత్రుడని, ఆయనపై అభిమానంతోనే వచ్చినట్లు పేర్కొన్నారు. రాజకీయంగా చర్చనీయాంశం ఈ భేటీ ప్రస్తుతం రాజకీయంగా చర్చకు దారి తీసింది. పుదుచ్చేరిలో ఎన్ఆర్ కాంగ్రెస్– బీజేపీ నేతృత్వంలోని ప్రభుత్వం అధికారంలో ఉంది. సీఎం పగ్గాలు చేపట్టినానంతరం ప్రధాని మోదీని రంగన్న ఇంత వరకు కలవలేదు. అయితే విజయ్ను కలిసేందుకు పుదుచ్చేరి నుంచి రావడం, తనకు మంచి మిత్రుడు అని వ్యాఖ్యానించడాన్ని రాజకీయ వర్గాలు నిశితంగానే పరిశీలిస్తున్నాయి. విజయ్ మక్కల్ ఇయక్కంను పర్యవేక్షిస్తున్న పుదుచ్చేరికి చెందిన పి. ఆనంద్ ఈ భేటీకి ఏర్పాట్లు చేసినట్లు ప్రచారం జరుగుతోంది.
Pagination
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
మిస్టర్ అండ్ మిసెస్ మహీ చిత్రంలో జాన్వీ.. ధోనిపై ఆసక్తికర కామెంట్స్ చేసిన భామ (ఫొటోలు)
దాక్షాయణి బర్త్ డే.. పుష్ప మేకర్స్ స్పెషల్ అప్డేట్!
దేవర బర్త్ డే ట్రీట్.. అప్డేట్ అదిరిపోయింది!
‘బీజేపీకి ఓటేస్తే నేను జైలుకే’.. కేజ్రీవాల్ ఆసక్తికర వ్యాఖ్యలు
కాంగ్రెస్ రైతు వ్యతిరేక చర్యలు.. రాష్ట్రవ్యాప్త నిరసనకు కేసీఆర్ పిలుపు
మాజీ గవర్నర్ కమలా బెనివాల్ కన్నుమూత
ఇండియా కూటమి గెలిస్తే మద్దతిస్తాం: మమతా బెనర్జీ
కేజ్రీవాల్కు మధ్యంతర బెయిల్.. సాధారణ తీర్పు కాదన్న అమిత్ షా
కాబోయేవాడు ఎలా ఉండాలంటే?.. జాన్వీ కపూర్ ఆసక్తికర కామెంట్స్!
స్లొవేకియా ప్రధానిపై కాల్పులు
తప్పక చదవండి
- ఇండియా కూటమి గెలిస్తే మద్దతిస్తాం: మమతా బెనర్జీ
- పనిమనిషి ఇంట్లో నోట్ల గుట్టలు.. జార్ఖండ్ మంత్రి అలంగిర్ అరెస్టు
- మెగాస్టార్ చిత్రంలో మరో సీనియర్ నటి.. ఆ కాంబో రిపీట్!
- స్టార్ క్రికెటర్ ప్రపోజ్.. హీరోయిన్ ఏమన్నారంటే!
- పంచాయత్ సీజన్ 3 ట్రైలర్ విడుదల
- వడదెబ్బ మరణాలు.. ఐదో వంతు భారత్లోనే !
- సచిన్ టెండూల్కర్ సెక్యూరిటీ గార్డు ఆత్మహత్య!
- అతడి కంటే చెత్త కెప్టెన్ ఎవరూ లేరు.. పైగా హార్దిక్ను అంటారా?
- పల్నాడు ప్రమాదంపై సీఎం జగన్ దిగ్భ్రాంతి
- BCCI: టీమిండియా హెడ్కోచ్గా వాళ్లిద్దరిలో ఒకరు?
Advertisement