-
Darshini Trailer: భవిష్యత్తులో జరిగేది ముందే తెలిస్తే..?
వికాస్, శాంతి జంటగా నటించిన తాజా చిత్రం దర్శిని. డాక్టర్ ప్రదీప్ అల్లు దర్శకత్వం వహిస్తున్న ఈ సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్కి డాక్టర్ ఎల్ వి సూర్యం నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. తాజాగా ఈ మూవీ ట్రైలర్ని కే ఎల్ దామోదర్ ప్రసాద్ విడుదల చేశారు. భవిష్యత్తులో ఏం జరుగుతుందనే విషయాన్ని ముందే చూడగలిగే టెక్నాలజీ వస్తే ఎలా ఉంటుంది? దాని వల్ల ఎలాంటి ఇబ్బందులు ఎదురవుతాయనే కథాంశంతో ఈ సినిమాను తెరకెక్కించినట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా కేఎల్ దామోదర్ ప్రసాద్ మాట్లాడుతూ.. దర్శిని కాన్సెప్ట్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. తక్కువ బడ్జెట్లో చాలా మంచి సినిమా తీశారు. ఈ చిత్రం కచ్చితంగా పెద్ద విజయం సాధిస్తుందనే నమ్మకం ఉంది’ అన్నారు.‘జీవితం మీద అసంతృప్తిగా ఉన్న ముగ్గురు కి ఎలాంటి పరిస్థితులు వచ్చాయి అనేదే మా చిత్ర కథ. సినిమా చాలా బాగా వచ్చింది. మంచి కామెడీ, ఎమోషన్, లవ్ అని అంశాలు మా చిత్రాల్లో ఉన్నాయి. మే నెలలో విడుదల చేస్తాం’ ని నిర్మాత ఎల్ వి సూర్యం అన్నారు. ఈ ట్రైలర్ రిలీజ్ ఈవెంట్లో దర్శకుడు డాక్టర్ ప్రదీప్ అల్లు, హీరో వికాస్, నటుడు సత్య ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. -
ఆలోచింపజేసే కాప్
ప్రముఖ నటుడు, డబ్బింగ్ ఆర్టిస్ట్ రవిశంకర్ ప్రధాన పాత్రలో, నిఖిల్, రాజశేఖర్, తేజ హీరోలుగా రూపొందిన చిత్రం ‘కాప్’. రాధా సురేష్ సమర్పణలో మాధవన్ సురేష్ నిర్మించారు. బి. సోము సుందరం దర్శకత్వం వహించిన ఈ చిత్రం ట్రైలర్ని తిరుపతి ఎస్వీ ఇంజినీరింగ్ కాలేజ్లో విడుదల చేశారు. ఎస్వీ కాలేజ్ డైరెక్టర్ డా.యన్. సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ– ‘‘మా కళాశాల విద్యార్థి మాధవన్ సురేష్ యూఎస్ వెళ్లి అంచలంచెలుగా ఎదిగి సినిమా నిర్మించే స్థాయికి రావడం హ్యీపీ. నితిన్ కూడా మా కాలేజ్ కుర్రాడే’’ అన్నారు. ‘‘శత్రుపురం, మన్యం రాజు’ చిత్రాల తర్వాత నేను డైరెక్ట్ చేసిన మూడో చిత్రం ఇది’’ అన్నారు సోము సుందరం. ‘‘మా సినిమాని హిట్ చేయాలి’’ అన్నారు రాధా సురేష్. ‘‘పోలిటికల్ సెటైర్తో పాటు కమర్షియల్ ఎంటర్టైనర్గా రూపొందిన ఈ చిత్రంలో మంచి సందేశం ఉంది’’ అన్నారు మాధవన్ సురేష్. -
జనతా బార్ సందేశం
రాయ్ లక్ష్మి ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘జనతా బార్’. రోచిశ్రీ మూవీస్ పతాకంపై అశ్వథ్ నారాయణ సమర్పణలో రమణ మొగిలి స్వీయ దర్శకత్వంలో నిర్మించిన ఈ చిత్రం మేలో రిలీజ్కు రెడీ అవుతోంది. ఈ సందర్భంగా ఈ సినిమా ట్రైలర్ను హీరో శ్రీకాంత్ విడుదల చేశారు. రాయ్ లక్ష్మి మాట్లాడుతూ– ‘‘బార్ గర్ల్గా ప్రారంభమయ్యే నా పాత్ర సమాజంలోని మహిళలు గొప్పగా చెప్పుకునే స్థాయికి ఎలా ఎదిగింది? అన్నదే ఈ చిత్రం కథాంశం. ఈ సినిమాలో మంచి సందేశం కూడా ఉంది’’ అని అన్నారు. ‘‘కుస్తీ పోటీల నేపథ్యంలో సాగే కథ ఇది. ఈ సినిమాతో సమాజంలో స్త్రీల ప్రాధాన్యతను మరోసారి చాటి చెప్పే ప్రయత్నం చేశాం’’ అన్నారు రమణ మొగిలి -
Family Star Trailer HD Stills: విజయ్ చెంప చెళ్లుమనిపించిన మృణాల్.. ట్రైలర్ అదిరిపోయింది (ఫోటోలు)
-
బ్యాడ్ బాయ్స్ రెడీ
హాలీవుడ్ బ్యాడ్ బాయ్స్ మళ్లీ వస్తున్నారు. హాలీవుడ్ హిట్ ఫ్రాంచైజీలో ఒకటైన ‘బ్యాడ్ బాయ్స్’ నుంచి రానున్న తాజా చిత్రం ‘బ్యాడ్ బాయ్స్: రైడ్ ఆర్ డై’. ‘బ్యాడ్ బాయ్స్’ ఫ్రాంచైజీలో వస్తోన్న నాలుగో చిత్రం ఇది. విల్ స్మిత్, మార్టిన్ లారెన్స్ లీడ్ రోల్స్ చేస్తున్నారు. మూడో భాగానికి దర్శకత్వం వహించిన అదిల్–శ్రీశ్రీబిలాల్ దర్శకత్వ ద్వయమే ‘బ్యాడ్ బాయ్స్ 4’ను డైరెక్ట్ చేశారు. తాజాగా ఈ చిత్రం ట్రైలర్ను విడుదల చేసి, సినిమాను జూన్ 7న విడుదల చేయనున్నట్లుగా మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. సిటీలో జరుగుతున్న డ్రగ్ మాఫియా ఆగడాలను ఇద్దరు డిటెక్టివ్లు ఏ విధంగా అడ్డుకున్నారు? అనే ఇతివృత్తంతో ఈ సినిమా కథనం ఉంటుందని హాలీవుడ్ సమాచారం. -
ఆ రోజులు గుర్తొస్తున్నాయి
‘‘లక్కీ మీడియా బ్యానర్ ఎంతో అదృష్టంగా భావిస్తాను. ఈ సంస్థతో నాకున్న అనుబంధం గొప్పది. ‘రోటి కపడా రొమాన్స్’ టీమ్ను చూస్తుంటే నేనీ బ్యానర్లో సినిమా చేసిన రోజులు గుర్తుకొస్తున్నాయి. ఈ చిత్రం టీజర్ చూస్తుంటే యూత్కు బాగా కనెక్ట్ అయ్యేలా అనిపిస్తోంది. ఈ సినిమాని ప్రేక్షకులు ఆదరించాలి’’ అన్నారు హీరో శ్రీవిష్ణు. హర్ష నర్రా, సందీప్ సరోజ్, తరుణ్, సుప్రజ్ రంగా, సోనూ ఠాకూర్, నువేక్ష, మేఘా లేఖ, ఖుష్బూ చౌదరి ముఖ్య తారలుగా నటించిన చిత్రం ‘రోటి కపడా రొమాన్స్’. విక్రమ్ రెడ్డి దర్శకత్వంలో బెక్కెం వేణుగోపాల్, సృజన్ కుమార్ బొజ్జం నిర్మించిన ఈ చిత్రం ఏప్రిల్ 12న విడుదల కానుంది. ఈ చిత్రం ఎమోషనల్ డోస్ ప్రీ ట్రైలర్ను శ్రీవిష్ణు రిలీజ్ చేశారు. ‘‘కంటెంట్ను నమ్మి చేసిన సినిమా ఇది’’ అన్నారు బెక్కెం వేణుగోపాల్, సృజన్కుమార్ బొజ్జం, విక్రమ్ రెడ్డి. -
పాన్ ఇండియా సినిమా 'రికార్డ్ బ్రేక్' ట్రైలర్ లాంచ్
నిహార్, నాగార్జున, రగ్ధా ఇఫ్తాకర్, సత్య కృష్ణ, సంజన, తుమ్మల ప్రసన్న కుమార్, శాంతి తివారీ, సోనియా, కాశీ విశ్వనాథ్ కీలక పాత్రల్లో నటించిన చిత్రం ‘రికార్డ్ బ్రేక్’. చదలవాడ శ్రీనివాసరావు దర్శకత్వం వహించారు. శ్రీ తిరుమల తిరుపతి వెంకటేశ్వర ఫిలిమ్స్పై చదలవాడ పద్మావతి నిర్మించారు. ఈ సినిమా గ్లింప్స్ని ‘మాతృదేవోభవ’ ఫేమ్ దర్శకుడు అజయ్ కుమార్, టీజర్ని నిర్మాత రామ సత్యనారాయణ, ట్రైలర్ని తెలుగు ఫిలింప్రోడ్యూసర్స్ కౌన్సిల్ సెక్రటరీ టి. ప్రసన్నకుమార్ విడుదల చేశారు. చదలవాడ శ్రీనివాసరావు మాట్లాడుతూ–‘‘వేటగాడు, అడవి రాముడు, దేవదాసు’ వంటి సినిమాల స్ఫూర్తితో ఇండస్ట్రీలో అడుగు పెట్టాను. ఇప్పటి వరకు నాకున్న అనుభవంతో సమాజానికి ఉపయోగపడే ఓ మంచి కథతో సినిమా తీయాలని ‘రికార్డ్ బ్రేక్’ తీశా. ఇందులో చివరి 45 నిమిషాలు చాలా భావోద్వేగాలు ఉంటాయి. ఈ సినిమాకి విజయం అందించాలి’’ అన్నారు. ఈ కార్యక్రమంలో నటీనటులు నిహార్ కపూర్, రగ్ధ ఇఫ్తాకర్, సత్య కృష్ణ, సంజన, సోనియా, నాగార్జున, కథా రచయిత అంగిరెడ్డి శ్రీనివాస్, మ్యూజిక్ డైరెక్టర్ సాబు వర్గీస్ పాల్గొన్నారు. ఈ చిత్రానికి కెమెరా: కంతేటి శంకర్, నిర్మాణం: చదలవాడ బ్రదర్స్. -
నేటి భారతం
ఒకే ఒక్క పాత్రతో సామాజిక సందేశంతో రూపొందిన చిత్రం ‘నేటి భారతం’. యర్రా శ్రీధర్ రాజు నటించి, నిర్మించిన ఈ సినిమాకు భరత్ పారేపల్లి దర్శకత్వం వహించారు. త్వరలోనే ఈ చిత్రం విడుదల కానుంది. ఈ సందర్భంగా ఈ సినిమా ట్రైలర్ను విడుదల చేశారు. ‘‘కరోనా తర్వాత ఏర్పడ్డ ఆర్థిక, సామాజిక, రాజకీయ అంశాల నేపథ్యంలో ఈ సినిమా కథనం ఉంటుంది. ఇందులో నేను జర్నలిస్టు పాత్ర చేశాను. సింగిల్ క్యారెక్టర్తో వస్తోన్న మా సినిమాను ప్రేక్షకులు ఆదరించాలి’’ అన్నారు శ్రీధర్. -
యుద్ధానికి పిలుపు
అమెరికన్ ఫిల్మ్స్ ‘గాడ్జిల్లా’ ఫ్రాంచైజీలో వస్తున్న తాజా చిత్రం ‘గాడ్జిల్లా వర్సెస్ కాంగ్: ది న్యూ ఎంపైర్’ (2024). రెబెక్కా హాల్, బ్రియాన్ టైరీ హెన్రీ, డన్ స్టీవెన్స్, కైలీ హోట్లీ, అలెక్స్ ఫెర్న్స్, ఫలా చెన్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి ఆడమ్ విన్గార్డ్ దర్శకుడు. భారీ బడ్జెట్తో లెజండరీ పిక్చర్స్ నిర్మించిన ఈ సినిమాను వార్నర్ బ్రదర్స్ రిలీజ్ చేస్తున్నారు. ‘గాడ్జిల్లా వర్సెస్ కాంగ్: ది న్యూ ఎంపైర్’ చిత్రం అంతర్జాతీయంగా మార్చి 27న, యునైటెడ్ స్టేట్స్లో మార్చి 29న, జపాన్లో ఏప్రిల్ 26న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ‘గాడ్జిల్లా వర్సెస్ కాంగ్: ది న్యూ ఎంపైర్’ నుంచి లేటెస్ట్ ట్రైలర్ను విడుదల చేశారు. ‘మేము ఓ సిగ్నల్ని కనుగొన్నాం’, ‘ఏదో ఊహించనది జరగబోతోంది’, ‘అది కేవలం సిగ్నల్ మాత్రమే కాదు.. యుద్ధానికి పిలుపు’ వంటి డైలాగ్స్ ట్రైలర్లో ఉన్నాయి. ఇక 2021లో వచ్చిన ‘గాడ్జిల్లా వర్సెస్ కాంగ్’కి సీక్వెల్గా ‘గాడ్జిల్లా వర్సెస్ కాంగ్: ది న్యూ ఎంపైర్’ చిత్రం తెరకెక్కింది. -
స్పైడర్ మేన్ను దాటిన డెడ్ పూల్!
హాలీవుడ్ సూపర్ హీరోస్ ఫిల్మ్స్లో ‘డెడ్ పూల్’ ఫ్రాంచైజీ ఒకటి. 2016లో వచ్చిన ‘డెడ్ పూల్’, 2018లో వచ్చిన ‘డెడ్ పూల్ 2’ సినిమాలు బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు రాబట్టాయి. ప్రేక్షకులను అమితంగా అలరించాయి. తాజాగా ‘డెడ్ పూల్’ సిరీస్లోని మూడో భాగం ‘డెడ్ పూల్ అండ్ వోల్వరైన్’ విడుదలకు సిద్ధమవుతోంది. ర్యాన్ రేనాల్డ్స్, హ్యూ జాక్మెన్ ప్రధాన పాత్రల్లో, ఎమ్మా కొరిన్, మోరెనా బక్కరిన్, రాబ్ డెలానీ కీలక పాత్రల్లో నటించారు. షాన్ లెవీ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. జూలై 26న ‘డెడ్ పూల్ అండ్ వోల్వరైన్’ చిత్రం విడుదల కానుంది. ఈ సందర్భంగా ఇటీవల ఈ సినిమా ట్రైలర్ను విడుదల చేశారు మేకర్స్. ట్రైలర్ విడుదలైన 24 గంటల్లో 365 మిలియన్ వ్యూస్ను సాధించింది. 24 గంటల్లో ఇన్ని వ్యూస్ రావడంతో ఇదే ప్రపంచ రికార్డు అని మేకర్స్ పేర్కొన్నారని హాలీవుడ్ అంటోంది. గతంలో ఈ రికార్డు 2021లో విడుదలైన ‘స్పైడర్మేన్: నో వే హోమ్’ ట్రైలర్ పేరిట ఉండేది. 24 గంటల్లో ‘స్పైడర్ మేన్: నో వే హోమ్’ ట్రైలర్ 355.5 మిలియన్ వ్యూస్ సాధించింది. ఇప్పుడు ‘డెడ్ పూల్ అండ్ వోల్వరైన్’ ట్రైలర్ రాకతో ‘స్పైడర్మేన్: నో వే హోమ్’ సెకండ్ ప్లేస్లోకి వెళ్లింది. - పోడూరి నాగ ఆంజనేయులు -
ఏంట్రా ఒక్కదానికేనా?.. రేపు పెళ్లయ్యాక ఏం చేస్తావ్?.. ఆసక్తిగా ట్రైలర్!
సూర్య, ధన్య బాలకృష్ణ జంటగా రాబోతున్న చిత్రం రామ్(ర్యాపిడ్ యాక్షన్ మిషన్). దేశభక్తి కథాంశంగా ఈ చిత్రాన్ని మిహిరామ్ వైనతేయ తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీతో డైరెక్టర్గా ఎంట్రీ ఇస్తున్నారు. దీపిక ఎంటర్టైన్మెంట్ బ్యానర్పై ఓఎస్ఎం విజన్తో దీపికాంజలి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమాతో సూర్య హీరోగా పరిచయం కానున్నారు. ఇప్పటికే చిత్రం నుంచి విడుదల చేసిన పోస్టర్లు, పాటలు అందరినీ ఆకట్టుకుంటున్నాయి. తాజాగా ఈ చిత్రం నుంచి ట్రైలర్ను విడుదల చేశారు మేకర్స్. సైంధవ్ డైరెక్టర్ ముఖ్య అతిథిగా హాజరై ట్రైలర్ను విడుదల చేశారు. ట్రైలర్ చూస్తే ఈ సినిమాలో దేశభక్తి చాటి చెప్పే కథాంశంగా తెరకెక్కించారు. ఈ సినిమాలో దేశ భక్తిని చాటే ఎన్నో డైలాగ్స్ చాలా ఉన్నాయని ట్రైలర్ చూస్తేనే అర్థమవుతోంది. త్రివర్ణ పతాకాన్ని చూపించే గన్ షాట్ గూస్ బంప్స్ తెప్పిస్తోంది. ట్రైలర్లోని సన్నివేశాలు చూస్తే ఈ సినిమాపై ఆసక్తిని పెంచుతున్నాయి. కాగా.. ఈ చిత్రంలో భాను చందర్, సాయి కుమార్, రోహిత్, శుభలేఖ సుధాకర్, రవివర్మ, మీనా వాసు, అమిత్ కుమార్ తివారీ, భాషా ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి ఆశ్రిత్ అయ్యంగార్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రాన్ని త్వరలోనే విడుదల చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. -
మహేశ్ బాబు ‘గుంటూరు కారం, HD మూవీ స్టిల్స్
-
‘గుంటూరు కారం’ ట్రైలర్తో హార్ట్ బీట్ పెంచిన మహేశ్ బాబు
‘‘మీరు మీ పెద్దబ్బాయిని అనాథలా వదిలేసారని అంటున్నారు.. దానికి మీరు ఏం చెబుతారు..’ (రమ్యకృష్ణకు ఎదురయ్యే ప్రశ్న)’ అనే డైలాగ్తో ‘గుంటూరు కారం’ సినిమా ట్రైలర్ మొదలవుతుంది. ‘అతడు, ఖలేజా’ చిత్రాల తర్వాత హీరో మహేశ్ బాబు, దర్శకుడు త్రివిక్రమ్ కాంబినేషన్ లో రూపొందిన చిత్రం ‘గుంటూరు కారం’. శ్రీలీల, మీనాక్షీ చౌదరి హీరోయిన్స్ గా నటించారు. సూర్యదేవర రాధాకృష్ణ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 12న విడుదల కానుంది. ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్ను ఆదివారం విడుదల చేశారు. ‘చూడంగానే మజా వచ్చిందా’, ‘హార్ట్ బీట్ పెరిగిందా’, ‘ఈల వేయాలనిపించిందా’, ‘ఆట చూస్తావా..! అంటూ మహేశ్ బాబు చెప్పే డైలాగులు ట్రైలర్లో ఉన్నాయి. రమ్యకృష్ణ, జగపతిబాబు, ప్రకాష్రాజ్, జయరాం కీలక పాత్రల్లో నటించిన ఈ సినిమాకు తమన్ సంగీతం అందించారు. -
సంక్రాంతికి సైంధవ్ అసలైన ట్రీట్
‘‘సైంధవ్’ ట్రైలర్ అద్భుతంగా వచ్చింది. సినిమా కూడా అందరికీ బాగా నచ్చుతుంది. సంక్రాంతికి సినిమా రిలీజ్ చేస్తున్నాం. ఎప్పటిలానే మీ (ప్రేక్షకులు, అభిమానులు) అందరి ప్రేమ, అభిమానం, ్ర΄ోత్సాహం కావాలి. నా కెరీర్లో 75వ చిత్రంగా ‘సైంధవ్’ చేయడం అదృష్టంగా భావిస్తున్నాను’’ అని హీరో వెంకటేశ్ అన్నారు. శైలేష్ కొలను దర్శకత్వంలో వెంకటేశ్, శ్రద్ధా శ్రీనాథ్ జంటగా నటించిన చిత్రం ‘సైంధవ్’. నవాజుద్దీన్ సిద్ధిఖీ, ఆర్య, రుహానీ శర్మ, ఆండ్రియా, బేబీ సారా, జయప్రకాశ్ కీలక ΄ాత్రల్లో నటించారు. వెంకట్ బోయనపల్లి నిర్మించిన ఈ సినిమా ఈ నెల 13న విడుదలవుతోంది. ఈ సందర్భంగా హైదరాబాద్లో ‘సైంధవ్’ ట్రైలర్ని విడుదల చేశారు. ఈ వేడుకలో వెంకటేశ్ మాట్లాడుతూ– ‘‘న్యూ ఏజ్ థ్రిల్లర్ చేయాలని ఎప్పట్నుంచో అనుకుంటున్నాను. ‘సైంధవ్’తో అది నెరవేరింది. ఈ సినిమా ప్రేక్షకులకు వైవిధ్యమైన అనుభూతిని ఇస్తుంది. నా కెరీర్లో బెస్ట్ ఫిల్మ్. సంక్రాంతికి అసలైన ట్రీట్. తప్పకుండా అలరిస్తుంది’’ అన్నారు. శైలేష్ కొలను మాట్లాడుతూ– ‘‘వెంకటేశ్గారి 75వ చిత్రం ‘సైంధవ్’ నేను చేయడం నా అదృష్టం. ఇది నా బెస్ట్ ఫిల్మ్. నాకు వచ్చిన ఫిల్మ్ మేకింగ్ అంతా ఈ సినిమా కోసం వాడేశా. ఈ పండక్కి మా సినిమా అందర్నీ ఎంటర్టైన్ చేస్తుంది’’ అన్నారు. ‘‘వెంకటేశ్గారితో సినిమా చేయడం నా కల నెరవేరినట్లయింది. మా సినిమా విందు భోజనంలా ఉంటుంది’’ అన్నారు వెంకట్ బోయనపల్లి. -
నవరసాల రాఘవ రెడ్డి
శివ కంఠమనేని హీరోగా, రాశి, నందితా శ్వేత ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘రాఘవ రెడ్డి’. సంజీవ్ మేగోటి దర్శకత్వం వహించారు. స్పేస్ విజన్ నరసింహా రెడ్డి సమర్పణలో లైట్ హౌస్ సినీ మ్యూజిక్ బ్యానర్పై కేఎస్ శంకర్ రావ్, జి. రాంబాబు యాదవ్, ఆర్. వెంకటేశ్వరరావు నిర్మించిన ఈ సినిమా జనవరి 4న విడుదల కానుంది. ఈ సినిమా ట్రైలర్ను నటుడు, నిర్మాత మురళీ మోహన్ విడుదల చేశారు. సంజీవ్ మేగోటి మాట్లాడుతూ– ‘‘యాక్షన్, డ్రామా, థ్రిల్లర్ అంశాలతో ఫ్యామిలీ ఎంటర్టైనర్గా ఈ సినిమాను తెరకెక్కించాం’’ అన్నారు. ‘‘మధురపూడి గ్రామం అనే నేను’ చిత్రంలో నా పాత్ర రగ్డ్గా ఉంటుంది. ‘రాఘవ రెడ్డి’లో సిన్సియర్, స్ట్రిక్ట్ ప్రోఫెసర్గా నటించాను. చక్కటి విందు భోజనంలా నవరసాలున్న సినిమా ఇది’’ అన్నారు శివ కంఠమనేని. ‘‘మా బ్యానర్ నుంచి వస్తోన్న మూడో సినిమా ఇది. మా చిత్రాన్ని ప్రేక్షకులు ఆదరించాలి’’ అన్నారు వెంకటేశ్వరరావు. ఈ ట్రైలర్ విడుదల వేడుకలో నటి అన్నపూర్ణ, దర్శకుడు నీలకంఠ, సంగీతదర్శకుడు సుధాకర్ మారియో, ఎడిటర్ ఆవుల వెంకటేశ్, వరా ముళ్లపూడి, నటుడు అజయ్ ఘోష్ మాట్లాడారు. ఈ చిత్రానికి సంగీతం: సంజీవ్ మేగోటి– సుధాకర్ మారియో, ఎగ్జిక్యూటివ్ప్రోడ్యూసర్: ఘంటా శ్రీనివాసరావు. -
రాసి పెట్టుకోండి.. అందర్నీ నవ్విస్తాం
‘‘నటుడిగా నా 21 ఏళ్ల కెరీర్లో ‘ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్’ నా 32వ సినిమా. నేను చేసిన మంచి పాత్రల్లో ఈ చిత్రం నంబర్ వన్ అవుతుంది. వక్కంతం వంశీగారు కథ అందించిన ‘కిక్, రేసు గుర్రం, టెంపర్’ సినిమాలన్నీ హిట్ అయ్యాయి. ఈ చిత్రాలకు ఏ మాత్రం తగ్గకుండా ‘ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్’ మూవీ ఉంటుంది. ప్రేక్షకులందర్నీ నాన్ స్టాప్గా నవ్విస్తాం’’ అని హీరో నితిన్ అన్నారు. వక్కంతం వంశీ దర్శకత్వంలో నితిన్, శ్రీలీల జంటగా నటించిన చిత్రం ‘ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్’. శ్రేష్ఠ్ మూవీస్, ఆదిత్య మూవీస్ అండ్ ఎంటర్టైన్మెంట్స్, రుచిర ఎంటర్టైన్ మెంట్స్పై సుధాకర్ రెడ్డి, నికితా రెడ్డి నిర్మించిన ఈ చిత్రం డిసెంబర్ 8న విడుదల కానుంది. హైదరాబాద్లో నిర్వహించిన ఈ సినిమా ట్రైలర్ విడుదల వేడుకలో నితిన్ మాట్లాడుతూ– ‘‘ఈ మూవీలో స్క్రీన్ ప్లే కొత్తగా ఉంటుంది. మంచి కథ, పాటలు, చక్కని డ్యాన్స్ కూడా ఉంటాయి. డిసెంబర్ 8న హిట్ సాధించబోతున్నాం.. ఇది కచ్చితం.. రాసి పెట్టుకోండి’’ అన్నారు. ‘‘ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్’ ట్రైలర్ రిలీజ్ ఈవెంట్కి మమ్మల్ని సపోర్ట్ చేయటానికి వచ్చిన అభిమానులు, ప్రేక్షకులకు థ్యాంక్స్’’ అన్నారు ఎన్. సుధాకర్ రెడ్డి. ‘‘అద్భుతమైన ఔట్పుట్ ఇవ్వటానికి నేను, నితిన్ రెండేళ్లు కష్టపడ్డాం. అందర్నీ ఎంటర్టైన్ చేయాలని రెండేళ్లు కష్టపడి చాలా జాగ్రత్తగా ఒళ్లు దగ్గర పెట్టుకుని పని చేశాం’’ అన్నారు వక్కంతం వంశీ. -
నవ్వులే నవ్వులు
చంద్రశేఖర్, సోనాలి పాణిగ్రాహి, అశోక్ వర్ధన్ , యాదమ్మ రాజు, అప్పారావు, బేబీ ప్రేక్షిత ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘ప్లాంట్ మ్యాన్’. కె.సంతోష్ బాబు దర్శకత్వం వహించారు. డీఎం యూనివర్సల్ స్టూడియోస్పై పన్నా రాయల్ నిర్మించిన ఈ సినిమా డిసెంబర్లో విడుదలకానుంది. ఈ సినిమా ట్రైలర్ను రిలీజ్ చేశారు. పన్నా రాయల్ మాట్లాడుతూ–‘‘కుటుంబ సమేతంగా చూడదగ్గ సినిమా ‘ప్లాంట్ మ్యాన్’. ప్రారంభం నుంచి చక్కని వినోదం ఉంటుంది. ఒక కొత్త అంశం కూడా ఉంది.. అందుకే ఈ సినిమాకి ‘ప్లాంట్ మ్యాన్ ’ అనే టైటిల్ నిర్ణయించాం. ఈ చిత్రం తర్వాత కూడా మా బేనర్లో కొత్తవారిని పరిచయం చేస్తూ సినిమాలు నిర్మిస్తాం’’ అన్నారు. ఈ చిత్రానికి కెమెరా: పీఎస్. మణికర్ణన్ , నేపథ్య సంగీతం: వినోద్ యాజమాన్య, సంగీతం: ఆనంద బాలాజీ, నిర్మాత–దర్శకత్వ పర్యవేక్షణ: పన్నా రాయల్. -
అక్కడ మొదలైంది వేట!
‘‘ఓపెన్ చేస్తే ఓ పెద్ద సముద్రాన్ని చూపిస్తున్నాం. అందులో ఒక బుల్లి చేప. దాని వయసు పదేళ్లు. ఈ బుల్లి చేప.. అమ్మ చేప కోసం ఓ కన్నం వేసింది. అక్కడ మొదలైంది బుల్లి చేప వేట.. ఎండ్రకాయకో కన్నం, రొయ్యకో కన్నం, మొసలికో కన్నం... కన్నాల మీద కన్నాలేసి ఆ బుల్లి చేప ఓ పెద్ద తిమింగలమైపోయింది’’ అంటూ మొదలైంది ‘జపాన్ ’ సినిమా తెలుగు ట్రైలర్. కార్తీ హీరోగా రాజు మురుగన్ దర్శకత్వంలో ఎస్ఆర్ ప్రకాశ్బాబు, ఎస్ఆర్ ప్రభు నిర్మిస్తున్న చిత్రం ఇది. అనూ ఇమ్మాన్యుయేల్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో సునీల్, విజయ్ మిల్టన్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ‘జపాన్ ’ సినిమా దీపావళి సందర్భంగా విడుదల కానుంది. కార్తీ కెరీర్లో 25వ సినిమా తెరకెక్కుతోన్న ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ వేడుక చెన్నైలో జరిగింది. తెలుగు వెర్షన్ ను అన్నపూర్ణ స్టూడియోస్ విడుదల చేస్తోంది. ట్రైలర్ రిలీజ్ వేడుకలో హీరోలు సూర్య, విశాల్, ఆర్య, ‘జయం’ రవి, దర్శకులు లోకేశ్ కనకరాజ్, పా. రంజిత్ పాల్గొన్నారు. ఈ చిత్రానికి సంగీతం: జీవీ ప్రకాశ్కుమార్. -
‘గుణసుందరి కథ’కు ఆడవాళ్లు కనెక్ట్ అవుతారు: ఓం ప్రకాశ్ మార్త
నేటి సమాజంలో స్త్రీ ఎదురుకుంటున్న సమస్యల నేపథ్యంలో ‘గుణ సుందరి కథ’ సినిమాను తెరకెక్కించామని అన్నారు చిత్ర దర్శకుడు ఓం ప్రకాశ్ మార్త. సునీత సద్గురు, కార్తీక్ సాహస్, రేవంత్, ఆనంద చక్రపాణి, అశోక్ చంద్ర ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రం అక్టోబర్ 13న విడుదల కాబోతుంది. ఈ నేపథ్యంలో చిత్ర దర్శక నిర్మాత ఓం ప్రకాశ్ మాట్లాడుతూ.. ఇటీవలే సెన్సార్ పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని ముందుగా సెన్సార్ వారు అభినందించడం మా మొదటి విజయంగా భావిస్తున్నాం అన్నారు. అలాగే ఇప్పుడిప్పుడే ఇండస్ట్రీ లో నిలదోక్కుకుంటున్న నటినటులతో చేసిన ఈ ప్రయత్నం అందరికి మంచి పేరు.. గుర్తింపు తెస్తుందన్న ఆశాభావం వ్యక్తం చేసారు. సీరియస్ కంటెంట్ తో వస్తున్న ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులను ముఖ్యంగా ఆడవాళ్లకు బాగా కనెక్ట్ అవుతుందని నమ్మకంతో ఉన్నామన్నారు. అక్టోబర్ 13 న రిలీజ్ కాబోతున్న గుణ సుందరి కథ చిత్రాన్ని అందరూ ఆదరించాలని, అలాగే కంటెంట్ ని నమ్ముకుని చేసే మాలాంటి చిన్న చిత్రాలను కూడా అందరూ సపోర్ట్ చేయాలని కోరారు. -
హారర్ కామెడీ
శివ, గోవా జ్యోతి, స్వర్ణలత, పూజిత, సుమన్ శెట్టి, అప్పారావు ముఖ్య పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘యజ్ఞ’. చిత్తజల్లు ప్రసాద్ దర్శకత్వంలో ఆర్ఆర్ మూవీ క్రియేషన్స్పై చిలుకోటి రఘురామ్, చలపల్లి విఠల్ గౌడ్, చిత్తజల్లు ప్రసాద్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ట్రైలర్, పాటల విడుదల వేడుకలో తెలంగాణ ఫిలిం చాంబర్ ఆఫ్ కామర్స్ చైర్మన్ ప్రతాని రామకృష్ణ గౌడ్, జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్, ఎమ్మెల్యే క్రాంతి కిరణ్, నిర్మాత సాయివెంకట్, సరస్వతీ ఉపాసకులు దైవజ్ఞ శర్మ పాల్గొన్నారు.‘‘వినోదం, ప్రేమ, యాక్షన్ నేపథ్యంలో ఈ మూవీ రూపొందుతోంది’’అన్నారు చిత్తజల్లు ప్రసాద్. ‘‘మా చిత్రంలోని నటీనటులకు మంచి పేరు వస్తుంది’’ అన్నారు నిర్మాతలు. ఈ చిత్రానికి సమర్పణ: దేశ్పాండే, సుభాష్, రావ్(దొర) ముళ్లవరం, కెమెరా: జి.కృష్ణనాయుడు, సంగీతం: లక్ష్మణ సాయి. -
'అమెరికాలో అందరూ ఇండియన్ అని అనుకుంటున్నారు'.. ఆసక్తిగా ట్రైలర్!
కలర్స్ స్వాతి, నవీన్ చంద్ర జంటగా నటించిన చిత్రం మంత్ ఆఫ్ మధు. ఈ చిత్రానికి శ్రీకాంత్ దర్శకత్వం వహిస్తున్నారు. త్రిపుర సినిమాలో జంటగా నటించిన వీరిద్దరు మరోసారి ప్రేక్షకులను అలరించనున్నారు. తాజాగా ఈ మూవీ ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్. ట్రైలర్ చూస్తే భార్య, భర్తల మధ్య జరిగే గొడవలే కథాశంగా తెరకెక్కించినట్లు తెలుస్తోంది. అంతే కాకుండా సరికొత్త కాన్సెప్ట్ కూడా ఈ చిత్రంలో ఉన్నట్లు అర్థమవుతోంది. ఇప్పటికే టీజర్ రిలీజ్ కాగా పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. ఈ చిత్రంలో శ్రేయ నవిలే, మంజుల ఘట్టమనేని, హర్ష చెముడు, జ్ఞానేశ్వరి కాండ్రేగుల, రాజా చెంబోలు, రాజా రవీంద్ర, రుద్ర రాఘవ్, రుచితా సాదినేని, మౌర్య సిద్దవరం, కంచెరపాలెం కిషోర్ కీలక పాత్రలు పోషించారు. కాగా.. మంత్ ఆఫ్ మధు అక్టోబర్ 6న ప్రేక్షకుల ముందుకు రానుంది. -
అష్టదిగ్బంధనం.. ఓ పజిల్
‘‘అష్టదిగ్బంధనం’ పవర్ఫుల్ టైటిల్. ట్రైలర్లో మంచి సస్పెన్స్ కనపడుతోంది. అలాగే ప్రేక్షకులను అష్టదిగ్బంధనం చేసే అంశాలు ఈ చిత్రంలో చాలానే ఉన్నాయి’’ అని ‘బేబీ’ మూవీ డైరెక్టర్ సాయి రాజేష్ అన్నారు. సూర్య, విషిక జంటగా బాబా పీఆర్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘అష్టదిగ్బంధనం’. ఎంకేఏకేఏ ఫిలిం ్ర΄÷డక్షన్స్ సమర్పణలో మనోజ్ కుమార్ అగర్వాల్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 22న విడుదల కానుంది. ఈ చిత్రం ట్రైలర్ని సాయి రాజేష్ రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా బాబా పీఆర్ మాట్లాడుతూ– ‘‘నా మొదటి సినిమా ‘సైదులు’.. రెండో చిత్రం ‘అష్టదిగ్బంధనం’. క్రైమ్, యాక్షన్, థ్రిల్, పజిల్ లాంటి సినిమా ఇది’’ అన్నారు. ‘‘కథను నమ్మి ఈ సినిమా నిర్మించాను’’ అన్నారు మనోజ్ కుమార్ అగర్వాల్. ‘‘సినిమా పక్కా హిట్ అని నమ్ముతున్నాం’’ అన్నారు సూర్య. -
‘సిరివెన్నెల’ చివరి పాట మా సినిమాలో ఉండడం అదృష్టం: నిర్మాత
‘‘ప్రేక్షకుడిగా నేనో సినిమా చూసినప్పుడు కథలో కొత్తదనం ఉండాలని కోరుకుంటాను. ‘బెదురులంక 2012’ కథలో అలాంటి కొత్తదనాన్ని చూపించారు క్లాక్స్’’ అని నిర్మాత బెన్నీ ముప్పానేని అన్నారు. కార్తికేయ గుమ్మకొండ, నేహా శెట్టి జంటగా క్లాక్స్ దర్శకత్వం వహించిన చిత్రం ‘బెదురులంక 2012’. సి. యువరాజ్ సమర్పణలో రవీంద్ర బెనర్జీ (బెన్నీ) ముప్పానేని నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 25న విడుదలవుతోంది. ఈ సందర్భంగా బెన్నీ ముప్పానేని మాట్లాడుతూ– ‘‘సినిమాలపై ఉన్న ఆసక్తితో సాఫ్ట్వేర్ ఉద్యోగం వదిలి, నిర్మాతగా మారాను. ఓ ఊహాజనిత గ్రామంలో 2012లో 21 రోజులు ఏం జరిగింది? అనేది ‘బెదురులంక 2012’ చిత్రకథ. మనం చని΄ోతాం అని తెలిస్తే చివరి క్షణాల్లో ఎలా ఉంటాం? అనేది సినిమా కోర్ పాయింట్. కార్తికేయ చాలా ప్రొఫెషనల్. అతనితో మరో సినిమా చేద్దామనుకుంటున్నాం. నేహా శెట్టి పల్లెటూరి అమ్మాయి పాత్రలో ఒదిగి΄ోయారు. మణిశర్మగారు అద్భుతమైన సంగీతం ఇచ్చారు. ‘సిరివెన్నెల’ సీతారామశాస్త్రిగారు రాసిన చివరి పాట మా సినిమాలో ఉండటం మా అదృష్టం. మా సినిమా ట్రైలర్ రిలీజ్ చేసిన రామ్చరణ్గారు కథని అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుతం మా బ్యానర్లో మూడు ్రపాజెక్ట్స్ ఓకే చేశాం’’ అన్నారు. -
జాతి రత్నాలు తర్వాత ఒత్తిడికి గురయ్యాను
‘‘ఒక యాక్సిడెంట్లో గాయాలైన ఒక మహిళా అభిమాని డిప్రెషన్ నుంచి కోలుకునేందుకు నా ‘జాతి రత్నాలు’ సినిమాని రోజూ చూస్తానని చెప్పింది. ఇంతకంటే సంతృప్తి నటుడిగా నాకు దొరకదు. అందుకే ‘జాతి రత్నాలు’ హిట్ తర్వాత ఎలాంటి సినిమా చేయాలా అని ఒత్తిడికి గురయ్యాను. ఆ క్రమంలో మహేశ్ చెప్పిన కథ చాలా ఎగ్జయిట్ చేసింది. మానవ సంబంధాల మీద మంచి ఎంటర్టైనింగ్ స్టోరీ రాసుకున్నాడు మహేశ్. స్టాండప్ కామెడీ క్యారెక్టర్తో ఫుల్ లెంగ్త్ సినిమా తెలుగులో రాలేదు. అది నచ్చింది. అలాగే అనుష్క హీరోయిన్ అనగానే హ్యాపీ ఫీలయ్యా’’ అన్నారు నవీన్ పొలిశెట్టి. మిస్ శెట్టిగా అనుష్కా శెట్టి, మిస్టర్ పొలిశెట్టిగా నవీన్ పొలిశెట్టి నటించిన చిత్రం ‘మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి’. మహేష్ బాబు పి. దర్శకత్వంలో వంశీ, ప్రమోద్ నిర్మించిన ఈ చిత్రం సెప్టెంబర్ 7న తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో రిలీజ్ కానుంది. సోమవారం ఈ చిత్రం ట్రైలర్ని విడుదల చేశారు. ‘‘పెళ్లి ఒక్కటే కాదు.. ప్రతి రిలేషన్లో యువత ఆలోచించే తీరు ఎలా ఉంటుంది? అనేది ఈ సినిమాలో చూపిస్తున్నాం’’ అన్నారు పి. మహేశ్ బాబు. -
అందుకే గాండీవధారి అర్జున చేశాను – వరుణ్ తేజ్
‘‘ప్రవీణ్ సత్తారు ‘గాండీవధారి అర్జున’ కథ చెప్పినప్పుడు బాగా నచ్చేసింది. ఓ సమస్య గురించి సినిమా తీస్తున్నప్పుడు ఓ నటుడిగా అలాంటి సినిమా చేయటం నా బాధ్యత అనిపించింది.. అందుకే ఈ మూవీ చేశాను’’ అని హీరో వరుణ్ తేజ్ అన్నారు. ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో వరుణ్ తేజ్, సాక్షీ వైద్య జంటగా నటించిన చిత్రం ‘గాండీవధారి అర్జున’. బాపినీడు .బి సమర్పణలో ఎస్వీసీసీ బ్యానర్పై బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 25న విడుదల కానుంది. గురువారం జరిగిన ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ వేడుకలో వరుణ్ తేజ్ మాట్లాడుతూ– ‘‘గాండీవధారి అర్జున’ ట్రైలర్ చూసి యాక్షన్ మాత్రమే ఉంటుందనుకోవద్దు.. మంచి ఎమోషన్స్ ఉంటాయి. దేశానికి వచ్చే సమస్య ఏంటి? అనేది చూపించాం’’ అన్నారు. ‘‘వరుణ్ తేజ్తో మేం చేసిన మొదటి సినిమా ‘తొలి ప్రేమ’, సాయితేజ్తో చేసిన ‘విరూ పాక్ష’ హిట్ అయ్యాయి. ఇప్పడు ‘గాండీవధారి అర్జున’ కూడా సూపర్ హిట్ అవుతుంది’’ అన్నారు బీవీఎస్ఎన్ ప్రసాద్. ‘‘భూమిపై ఉన్న వనరులను ఇష్టానుసారం వాడేస్తున్నాం. భవిష్యత్ తరాల గురించి ఆలోచించటం లేదు. పర్యావరణ పరిరక్షణ గురించి ఈ సినిమా తీశాం’’ అన్నారు ప్రవీణ్ సత్తారు.
Pagination
స్టార్ హీరోలతో యాక్టింగ్.. ఆ కమెడియన్ ఇలా అయిపోయాడేంటి!
భర్తతో విడిపోయిన హీరోయిన్.. కూతురితో కలిసి..
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
రాజంపేట లో అశేష ప్రజా స్పందన
కూటమిని నమ్మి మోసపోతే.. పేదలకు మళ్లీ కష్టాలు తప్పవు
భారత టాప్ రెజ్లర్పై సస్పెన్షన్ వేటు
గత ఐదేళ్ళలో ఏ ఏ వర్గాల ప్రజల సంపద ఎలా పెరిగింది... వాస్తవాలు
పెత్తందార్ల కూటమిని వ్యతిరేకించండి: సీఎం జగన్
కేజ్రీవాల్ పిటిషన్ను వ్యతిరేకించిన ఈడీ.. సుప్రీంలో అఫిడవిట్ దాఖలు
సీఎం జగన్ మాస్ ఎంట్రీ @ రాజంపేట
ఇదేమి ఊచకోత.. ఫస్ట్ బ్యాటింగ్ చేసుంటే ‘300’ కొట్టేవాళ్లేమో: సచిన్
కన్నప్పలో అడుగుపెట్టిన ప్రభాస్.. ఫోటో వైరల్
మోదీ, రాహుల్ గాంధీలకు ‘బహిరంగ చర్చ’ ఆహ్వానం
తప్పక చదవండి
- కేజ్రీవాల్పై ఛార్జ్ షీట్ దాఖలు చేయనున్న ఈడీ
- టీడీపీ, బీజేపీ, జనసేన కుట్రతో పేదలకు నష్టం: సీఎం జగన్
- రౌడీ హీరో విజయ్ దేవరకొండ ఫిట్నెస్ సీక్రెట్ ఇదే..!
- Rashmika Mandanna: గుడ్ న్యూస్ చెప్పిన రష్మిక
- బాబు, లోకేష్కు కొడాలి నాని స్ట్రాంగ్ కౌంటర్
- భారతదేశంలో బ్యాన్ చేసిన ఆహార పదార్థాలు ఇవే..!
- SRH: కాస్త ఓపిక పట్టు.. నీకూ టైమ్ వస్తుంది: యువీ పోస్ట్ వైరల్
- కేఎల్ రాహుల్పై లక్నో ఓనర్ ఫైర్.. చెప్పేది విను! వీడియో
- సీఎం నితీష్కు షాకిచ్చి.. లాలూ చెంతకు బడా నేత!
Advertisement