-
దేవరలో మరో బాలీవుడ్ భామ.. ఫ్యాన్స్కు ఇక పూనకాలే!
యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం దేవర సినిమాతో బిజీగా ఉన్నారు. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ మూవీలో శ్రీదేవి ముద్దుల కూతురు జాన్వీ కపూర్ టాలీవుడ్ ఎంట్రీ ఇస్తోంది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ సినిమాలో సైఫ్ అలీఖాన్ ప్రధాన పాత్రలో కనిపించనున్నారు. సముద్రం బ్యాక్డ్రాప్లో ఈ సినిమాను భారీ బడ్జెట్తో తెరకెక్కిస్తున్నారు. అయితే తాజాగా బాలీవుడ్ భామ ఊర్వశి రౌతేలా చేసిన పోస్ట్ నెట్టింట తెగ వైరవుతోంది. గ్లోబల్ స్టార్ తారక్ ఎంతో వినయంగా ఉంటారని తెలిపింది. మీ ప్రోత్సాహానికి నా కృతజ్ఞతలు.. మీ వ్యక్తిత్వం నిజంగా ప్రశంసనీయమని జూనియర్ను కొనియాడింది. త్వరలోనే మీతో కలిసి పనిచేయడానికి ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నానంటూ ట్విటర్లో పోస్ట్ చేసింది. ఇది చూసిన ఎన్టీఆర్ అభిమానులు క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. మరోవైపు ఊర్వశి రౌతేలా దేవర చిత్రంలో ప్రత్యేక సాంగ్లో కనిపించనుందా? అంటూ కామెంట్స్ చేశారు. గతంలో వాల్తేరు వీరయ్య, ఏజెంట్ చిత్రాల్లో స్పెషల్ సాంగ్స్ చేసిన ఊర్వశి.. దేవరలోనూ నటించనున్నట్లు తెలుస్తోంది. దీనిపై ఇంకా అధికారిక ప్రకటనైతే రావాల్సి ఉది. కాగా.. ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ బాలీవుడ్ మూవీ వార్-2 షూటింగ్లో జాయిన్ అయ్యారు. @tarak9999 garu our beloved true #GlobalSuperstar —exceptionally disciplined, honest, and refreshingly straightforward, yet so wonderfully humble. Thanks a million for your kindness and the motivation. Your lion-hearted 🦁 personality is truly admirable. Can’t wait to work with… pic.twitter.com/iysWzhpOYY — URVASHI RAUTELA🇮🇳 (@UrvashiRautela) April 15, 2024 -
ఊర్వశి రౌతేలా అలాంటి కామెంట్స్.. మండిపడ్డ నెటిజన్స్!
బాలీవుడ్ భామ వాల్తేరు వీరయ్య సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకులను అలరించింది. ఆ తర్వాత అఖిల్ నటించిన ఏజెంట్ చిత్రంలో ప్రత్యేక సాంగ్లో మెరిసింది. ప్రస్తుతం బాలీవుడ్లో జేఎన్యూ అనే చిత్రంలో నటిస్తోంది. అయితే గతంలో టీమిండియా క్రికెటర్తో ఈ భామ డేటింగ్లో ఉందంటూ చాలాసార్లు వార్తలొచ్చాయి. రిషబ్ ఆస్పత్రిలో ఉన్నప్పుడు సైతం ఊర్వశి పోస్ట్ చేయడంతో రూమర్స్ మరింత వైరలయ్యాయి. వీరిద్దరు చాలాసార్లు ముంబైలోని ప్రముఖ రెస్టారెంట్లు, పార్టీల్లో కనిపించడంతో డేటింగ్లో ఉన్నారని ఫ్యాన్స్ భావించారు. కానీ వీటన్నింటినీ రిషబ్ పంత్ కొట్టి పారేశాడు. ప్రస్తుతం రిషబ్ ఐపీఎల్లో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుకు ఆడుతున్నారు. ఎప్పుడు సినిమాలతో బిజీగా ఉండే ఊర్వశి తాజాగా ఓ వాణిజ్య ప్రకటనలో మెరిసింది. ఓ మ్యాట్రిమోనీ సైట్కు సంబంధించిన ప్రకటనలో నటించింది. అయితే ఇందులో 'ఎవరు కూడా నా అంత ఎత్తు కలిగిన వారు దొరకడం లేదంటూ' నటులు, క్రికెటర్లు, వ్యాపారవేత్తలను ఉద్దేశించి ప్రకటనలో భాగంగా చెప్పుకొచ్చింది. కానీ ఇది చూసిన కొందరు నెటిజన్స్ ఆమె రిషబ్ పంత్ను ఉద్దేశించి అలా మాట్లాడిందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. రిషబ్ పంత్ను అవమానించిందని నెటిజన్స్ కామెంట్స్ చేశారు. తాజాగా దీనిపై ఊర్వశి తన ఇన్స్టా స్టోరీస్లో రాసుకొచ్చింది. ఈ వివాదంపై వివరణ ఇచ్చింది. అయితే యాడ్ స్క్రిప్ట్ తనకు ఆ కంపెనీ అందించిందేనని.. తన వ్యాఖ్యలు ఎవరినీ ఉద్దేశించి చేయలేదని స్పష్టం చేసింది. దయచేసి పాజిటివ్ తీసుకోవాలని సూచించింది. ఒక బాధ్యతగల వ్యక్తిగా బ్రాండ్ అంబాసిడర్గా నా వల్ల ఎలాంటి ప్రభావం ఉంటుందో అర్థం చేసుకోగలను అంటూ పోస్ట్ చేసింది. కాగా.. ఊర్వశి ప్రస్తుతం జేఎన్యూ సినిమాతో ప్రేక్షకులను పలకరించనుంది. View this post on Instagram A post shared by URVASHI RAUTELA (@urvashirautela) -
కలర్ఫుల్ డ్రెస్లో మెగా కోడలు.. హోలీ వేడుకల్లో బాలీవుడ్ భామ చిల్!
కలర్ఫుల్ డ్రెస్లో కనిపించిన మెగా కోడలు.. హోలీ సంబురాల్లో బాలీవుడ్ భామ ఊర్వశి రౌతేలా.. బ్లాక్ డ్రెస్లో ఫ్యామిలీ స్టార్ బ్యూటీ మృణాల్ ఠాకూర్... గ్రీన్ శారీలో తళుక్కుమన్న అమృత అయ్యర్.. వైట్ డ్రెస్లో నోరా ఫతేహీ అలాంటి లుక్స్.. View this post on Instagram A post shared by Nora Fatehi (@norafatehi) View this post on Instagram A post shared by Amritha - Thendral (@amritha_aiyer) View this post on Instagram A post shared by URVASHI RAUTELA (@urvashirautela) View this post on Instagram A post shared by Mrunal Thakur (@mrunalthakur) View this post on Instagram A post shared by Lavanya tripathi konidela (@itsmelavanya) -
ఐటం సాంగ్స్తో రఫ్ఫాడించిన బ్యూటీ.. రాజకీయాల్లోకి?
సార్వత్రిక ఎన్నికలు దగ్గరపడుతున్నాయి. ఇప్పటికే పలు రాజకీయ నాయకులు పార్టీలు మారుతున్నారు. సెలబ్రిటీలు సైతం రాజకీయ అరంగేట్రం చేస్తున్నారు. ఇప్పటికే తమిళనాడులో దళపతి విజయ్ పొలిటికల్ ఎంట్రీ ఇచ్చి ఏకంగా పార్టీ స్థాపించారు. తాగాజా ఊర్వశి రౌతేలా రాజకీయాల్లోకి రానున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఎన్నికల సమయంలో పలు పార్టీలు సినీతారలకు టికెట్స్ ఇవ్వడం కొత్తేమీ కాదు. ఇన్స్టంట్ బాలీవుడ్తో మాట్లాడిన రౌతేలా, "నాకు ఇప్పటికే టిక్కెట్ వచ్చింది. ఇప్పుడు నేను రాజకీయాల్లోకి వెళ్లాలా వద్దా అని నిర్ణయించుకోవాలి" అని అన్నారు. అయితే నేను రాజకీయాల్లోకి రావాలా వద్దా అనే విషయాన్ని అభిమానుల ద్వారా తెలుసుకోవాలనుకుంటున్నాను. మీరు కామెంట్స్ ద్వారా తెలియజేయాలని వెల్లడించింది. ఊర్వశి రౌతేలాకు ఎలక్షన్ టికెట్ ఇచ్చారని వెల్లడించింది. కానీ.. ఏ పార్టీ టికెట్ ఇచ్చింది. ఏ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తుంది, అనే విషయాలపై క్లారిటీ ఇవ్వలేదు. ఈ వీడియోపై నెటిజన్లు వివిధ రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. కొందరు రాజకీయాల్లోకి రావాలని కామెంట్స్ చేస్తుంటే.. మరి కొందరు ఇది కేవలం పబ్లిసిటీ కోసం మాత్రమే అని చెబుతున్నారు. View this post on Instagram A post shared by Instant Bollywood (@instantbollywood) -
బర్త్డేకి బంగారపు కేకు కట్ చేసిన హీరోయిన్.. ఫోటోలు వైరల్
సినీ సెలెబ్రిటీలు ఏ పని చేసినా కాస్త డిఫరెంట్గానే ఉంటుంది. వాళ్లు ధరించే దుస్తులు, మాట్లాడే తీరు.. వ్యవహార శైలీ అన్ని ఇతరుల కంటే కాస్త భిన్నంగానే ఉంటాయి. అయితే కొంతమంది మాత్రం తమ జీవనాన్ని సాదాసీదాగా కొనసాగిస్తే.. మరికొంత మంది మాత్రం చాలా రిచ్గా గడుపుతారు. రిచ్ లైఫ్ని ఎంజాయ్ చేసే వాళ్లలో ఊర్వశీ రౌతేలా ఒకరు. (Image Courtesy:Instagram) ఈ పేరు చెప్పగానే తెలుగు ప్రేక్షకులకు ఆమె ఎవరో గుర్తుకు రాకపోవచ్చు కానీ.. మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘వాల్తేరు వీరయ్య’లోని ‘బాస్ పార్టీ’ పాటకు స్టెప్పులేసిన భామ అనగానే అందరికి గుర్తొస్తుంది. ఆ పాటకు తనదైన స్టెప్పులేని అందరిని ఆకట్టుకుంది ఈ భామ. నేడు(ఫిబ్రవరి 25) ఊర్వశి బర్త్డే. ఈ సందర్భంగా గొల్డెన్ కేక్ కట్ చేసి వార్తల్లో నిలిచింది ఈ బాలీవుడ్ భామ. (Image Courtesy:Instagram) ప్రతి ఏడాది తన పుట్టిన రోజు వేడుకను చాలా గ్రాండ్గా జరుపుకోవడం ఊర్వశికీ అలవాటు. అలా ఈ ఏడాది కూడా తన బర్త్డేని స్నేహితుల సమక్షంగా గ్రాండ్గా సెలెబ్రేట్ చేసుకుంది. 24 క్యారెట్ల బంగారపు పూత పూసిన కేకును కట్ చేసి.. ఆ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఇప్పుడా ఫోటోలు వైరల్గా మారాయి. తినే కేకుకు బంగారపు పూత పూయడం అవసరమా? ఎంత డబ్బులు ఉన్నా.. బంగారంతో కేకును తయారు చేస్తారా? అవి డబ్బులా మంచి నీళ్లా? అని నెటిజన్స్ కామెంట్ చేస్తున్నారు. (Image Courtesy:Instagram) -
అలాంటి అవుట్ఫిట్లో దేవర భామ.. వాలెంటైన్ డే వైబ్లో ఊర్వశి రౌతేలా!
రెడ్ డ్రెస్లో మత్తెక్కిస్తోన్న దేవర భామ జాన్వీ కపూర్.. వాలెంటైన్ ప్రపోజ్ డే మూడ్లో ఊర్వశి రౌతేలా.. యోగాసనాలతో మైమరిపిస్తోన్న శ్రద్ధాదాస్.. గ్రీన్ డ్రెస్లో రవీనా టాండన్ హోయలు.. హాట్ ట్రీట్ ఇస్తోన్న బాలీవుడ్ భామ నిక్కి తంబోలి.. రెడ్ డ్రెస్లో రీతూ చౌదరి పోజులు.. View this post on Instagram A post shared by Janhvi Kapoor (@janhvikapoor) View this post on Instagram A post shared by Nikki Tamboli (@nikki_tamboli) View this post on Instagram A post shared by Raveena Tandon (@officialraveenatandon) View this post on Instagram A post shared by Rithu_chowdary (@rithu_chowdhary) View this post on Instagram A post shared by Shraddha Das (@shraddhadas43) View this post on Instagram A post shared by Urvashi Rautela (@urvashirautela) -
బాలీవుడ్లో టాప్ 15 అత్యంత అందమైన నటీమణులు వీరే (ఫొటోలు)
-
ఊర్వశి రౌతేలా షేర్ చేసిన వీడియో.. ట్రోల్ అవుతున్న రిషబ్ పంత్
భారత్లో క్రికెట్ ప్రపంచకప్ టోర్నీ జరుగుతోంది. అన్ని చోట్లా వరల్డ్ కప్ ఫీవర్ ఎక్కువైంది. ఈసారి భారత్ కూడా అద్భుత ప్రదర్శన చేస్తోంది. ఇప్పటి వరకు ఓటమి అనేది లేకుండా భారత్ తనదైన ప్రదర్శనదో ప్రేక్షకులను ఫిదా చేస్తుంది. భారత్ గెలుస్తుంటే, వికెట్ కీపర్ రిషబ్ పంత్ను ఈ జట్టులో చాలా మంది మిస్ అవుతున్నారు. ఇదిలా ఉంటే బాలీవుడ్ నటి ఊర్వశి రౌతేలా ఓ వీడియో చేసి సర్ ప్రైజ్ చేసింది. ఆ వీడియో చూసిన జనాలు రిషబ్ పంత్ని గుర్తుచేసుకుంటున్నారు. రోడ్డు ప్రమాదం కారణంగా సుమారు సంవత్సరం నుంచి క్రికెట్కు రిషబ్ దూరంగా ఉన్న విషయం తెలిసిందే. కొద్దిరోజుల క్రితం ఊర్వశి రౌతేలా, భారత వికెట్ కీపర్ రిషబ్ పంత్ మధ్య వివాదం జరిగిన సంగతి తెలిసిందే. వారిద్దరి మధ్య సోషల్ మీడియా వార్ కూడా భారీగానే నడిచింది. అప్పట్లో వారిద్దరూ డేటింగ్లో ఉన్నారని తర్వాత కొన్ని గొడవల వల్ల విడిపోయారని ఎన్నో వార్తలు వచ్చాయి. కానీ వాటిని ఎవరూ ఖండిచలేదు. తాజాగా ఊర్వశి చేసిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఊర్వశి రౌతేలా సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటుంది. అలాగే తనకు అనిపించిన విషయాన్ని సూటిగా చెప్పే నటి. ఊర్వశి రౌతేలా తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో ఓ వీడియో పోస్ట్ చేసింది. వైట్ అండ్ వైట్ స్టోర్ట్స్ డ్రెస్లో వికెట్ కీపింగ్ చేస్తున్న వీడియో అది. దీనితో పాటు 'కొత్త అధ్యాయం, కొత్త సినిమా' అని రాసి ఆమె పోస్ట్ చేసింది. (ఇదీ చదవండి: ‘కీడా కోలా’ మూవీ రివ్యూ) ఆ వీడియో ఇప్పుడు ట్రోల్ అవుతోంది. ఊర్వశి రౌతేలా చుట్టు ఎప్పుడూ కొంత వివాదం ఉన్న మాట నిజం. అందులో రిషబ్ పంత్తో వివాదం కూడా ఒకటి. ఆ వ్యక్తి (రిషబ్) తనకు చాలాసార్లు ఫోన్ చేశాడని ఆమె గతంలో చేసిన ప్రకటన ఇద్దరి మధ్య వాగ్వాదానికి దారి తీసింది. అనంతరం ఊర్వశి కూడా క్షమాపణలు చెప్పింది. మళ్లీ తాజాగా కొత్త సినిమా కోసమే అంటూ.. వికెట్ కీపింగ్ చేస్తున్న వీడియోను షేర్ చేసింది. దీంతో రిషబ్ పంత్ గొడవను మళ్లీ తెరపైకి తెస్తుందా..? అంటూ నెటిజన్లు తెలుపుతున్నారు. ఊర్వశి రౌతేలా తన వికెట్ కీపింగ్ వీడియోలో కీపర్ ఉపయోగించాల్సిన గ్లౌజులు కాకుండా బ్యాటింగ్ గ్లౌజులను ఉపయోగించింది. దీనిని గమనించిన నెటిజన్లు ఊర్వశి రౌతేలాను ట్రోల్ చేయడం ప్రారంభించారు. 'ఆమె బ్యాటింగ్ గ్లౌజులతోనే ఆట ఆడుతుంది.. ఎందుకంటే ఆమెకు ధైర్యం ఉంది' అంటూ ఫన్నీగా అని ఓ నెటిజన్ ట్రోల్ చేశాడు. మరోకరు రిషబ్ పంత్ రీప్లేస్ మెంట్ దొరకలేదా..? అంటూ కామెంట్ చేస్తే.. 'రిషబ్ పంత్ లైట్ వెర్షన్' అని మరొకరు వ్యాఖ్యానించారు ఊర్వశి పోస్ట్ చేసిన వీడియోతో రిషబ్ పంత్కు ఎలాంటి సంబంధం లేకున్నా ఆయన ట్రోల్ అవుతున్నాడు. View this post on Instagram A post shared by Urvashi Rautela (@urvashirautela) -
ఊర్వశి రౌతేలా చేసింది ఆరు సినిమాలు.. ఆస్తి రూ. 300 కోట్లు ఎలా?
బాలీవుడ్ హాట్ బ్యూటీలలో ఒకరు ఊర్వశి రౌతెలా.. సినిమాల్లో స్పెషల్ సాంగ్స్లో మెరుస్తూ యువతలో మంచి క్రేజ్ను అందుకుంది.. ఉత్తరాఖండ్కు చెందిన ఈ బ్యూటీ 15 సంవత్సరాల వయస్సులోనే తన మోడలింగ్ వృత్తిని ప్రారంభించింది. అలా మిస్ టీన్ ఇండియా 2009 టైటిల్ను కూడా గెలుచుకుంది. చైనాలో జరిగిన మిస్ టూరిజం క్వీన్ ఆఫ్ ది ఇయర్ 2011 టైటిల్ను కూడా గెలుచుకుంది, ఈ పోటీలను గెలుచుకున్న మొదటి భారతీయ మహిళగా ఆమె నిలిచింది. అలా 2013లో సింగ్ సాబ్ ది గ్రేట్ చిత్రంతో బాలీవుడ్లోకి అడుగుపెట్టింది. ఆ తరువాత ఆమె హేట్ స్టోరీ 4, గ్రేట్ గ్రాండ్ మస్తీ, సనమ్ రే, పగల్పంతి, మరెన్నో చిత్రాలలో నటించి అలరించింది. కానీ ఆమెకు పెద్దగా సినిమా ఛాన్స్లు దక్కలేదు. దీంతో చేతిలో అంతగా డబ్బులేదు.. సినిమా ఛాన్స్లు ఇస్తామని ఆమెను మోసం చేసిన వారే ఎక్కువ కావడంతో అలా ఆమె సినీ కెరీయర్ ముగిసిపోయిందని అనుకుంది. (ఇదీ చదవండి: తప్పని పరిస్థితిలో నేడు మీడియా ముందుకు హీరో రవితేజ) సరిగ్గా అదే సమయంలో ఊర్వశికి భారత క్రికెటర్ హర్థిక్ పాండ్యాతో పరిచయం కావడమే కాకుండా ఆయనతో డేట్ చేసినట్లు వార్తలు వచ్చాయి. అదే సమయంలో సినిమా ఛాన్స్ల కోసం బాలీవుడ్ నిర్మాత సమీర్ నాయర్తో కూడా ఆమె డేట్ చేస్తున్నట్లు తెరపైకి వచ్చింది. ఆమె కంటే సమీర్ వయసులో చాలా పెద్దవాడు అయినా సినిమా అవకాశాల కోసం ఆయనతో టచ్లో ఉండేదని సమాచారం. కానీ అతను మాత్రం ఆమెకు ఛాన్స్లు ఇస్తానంటూ కాలయాపన చేస్తున్నట్లు గ్రహించిన ఊర్వశి నెమ్మదిగా అతనికి గుడ్బై చెప్పేసింది. ఎలాగైనా బాలీవుడ్లో ఒక్క ఛాన్స్ వస్తే తన టాలెంట్తో లైఫ్లో సెటిల్ కావచ్చని ఆమె కలలు కనేది. అలా టీ సిరీస్ అధినేత భూషణ్ కుమార్తో ఆమెకు పరిచయం ఏర్పడింది. ఆయన ఊర్వశికి పాగల్ పంథీ సినిమాలో ఒక హీరోయిన్గా ఛాన్స్ ఇచ్చాడు. ఆ సినిమా ప్లాప్ అయినా వారిద్దరి మధ్య మంచి సాన్నిహిత్యం ఏర్పడింది. అలా ఆయనతో కూడా ఊర్వశి డేట్ చేసినట్లు ఇండస్ట్రీలో ప్రచారం జరిగింది. సినిమా గ్లామర్ ఫీల్డ్లో ఎంజాయ్ చేస్తున్న ఆమెకు రిషబ్ పంత్ ఒక ఫంక్షన్లో పరిచయం కావడం ఆపై కొంత కాలం డేట్ చేసినట్లు వార్తలు వచ్చినా రిషబ్ తిప్పికొట్టాడు. మొదట రిషబ్ తన సోషల్ మీడియాలో ఊర్వశిని బ్లాక్ చేయడంతో వీరిద్దరూ మీడియాలో ప్రధాన వార్తలుగా మిగిలారు. తర్వాత కొద్దిరోజుల పాటు ఇద్దరూ పరోక్షంగా ఒకరిపైమరొకరు సోషల్ మీడియాలో కామెంట్లు,స్టేటస్లు పెట్టుకోవడంతో వారిద్దరి మధ్య ఎఫైర్ నిజమేనని వార్తలు వచ్చాయి. సాధారణ దిగువ మధ్యతరగతి కుటుంబానికి చెందిన ఊర్వశి రౌతెలా ఇప్పటి వరకు ప్రధాన హీరోయిన్గా కేవలం 6 సినిమాలు మాత్రమే చేసింది. అవి కూడా అంతగా చెప్పుకోతగినవి కాదు. అడపాదడపా ఐటమ్ సాంగ్స్లలో కనిపించేది. దీంతో ఆమెకు పెద్దగా ఇన్కమ్ సోర్స్ కనిపించలేదు. కానీ సినిమా ఇండస్ట్రీకి వచ్చి 11 ఏళ్లలోనే ఆమె రూ. 150 కోట్లు పెట్టి ముంబైలో ఒక పెద్ద బంగ్లా కొనింది. ఈ డబ్బంతా దుబాయ్,యూకే,కెనడా వంటి దేశాల్లో ఈ బ్యూటీ గ్లామర్తో కొల్లగొట్టిందని ప్రచారం ఉంది. అందాల పోటీల్లో పాల్గొన్న అమ్మాయిలకు దుబాయ్లో ఎక్కువ క్రేజ్ అట. అక్కడి షేక్స్ కూడా ఎక్కువగా వారినే ఇష్టపడి ట్రాప్ చేస్తారట. అలా అందాల పోటీల్లో పాల్గొన్న అమ్మాయిల్ని దక్కించుకునేందుకు వారు ఎంత డబ్బు అయినా ఖర్చు చేస్తారట. ఇలా ఊర్వశి కేవలం 11 ఏళ్ల సినిమా కెరియర్లో సంపాదించలేనిది కేవలం రెండు సంవత్సరాల్లోనే సుమారు రూ. 300 కోట్లు వెనుకేసినట్లు వార్తలు వచ్చాయి. తాజాగా సినిమా ఛాన్స్ల కోసం ఆమె శ్రీదేవి భర్త బోణీ కపూర్తో డేట్ చేస్తున్నట్లు బాలీవుడ్ ఇండస్ట్రీలో వైరల్ అవుతుంది. వీరిద్దరూ కలిసి పార్టీలు,వెకేషన్లు అంటూ చక్కర్లు కొడుతున్నట్లు సమాచారం. -
ఫోన్ ఇచ్చేస్తా అంటూ ఊర్వశి రౌతేలాకు కండీషన్ పెట్టిన అజ్ఞాతవాసి
బాలీవుడ్ బ్యూటీ ఊర్వశి రౌతేలా పేరు గత కొద్దిరోజులుగా సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. వాల్తేరు వీరయ్య, ఏజెంట్ చిత్రాలలో ప్రత్యేక సాంగ్తో అలరించిన ఈ మ్యూటీ తెలుగువారికి బాగా దగ్గరైంది. ప్రస్తుతం బాలీవుడ్ సినిమాలతో బిజీగా ఉన్న ఈ బ్యూటా ఇటీవల జరిగిన భారత్-పాకిస్తాన్ వన్డే వరల్డ్ కప్ మ్యాచ్లో తన ఖరీదైన ఫోన్ పోగొట్టుకుంది. అహ్మదాబాద్లోని నరేంద్ర మోడీ స్టేడియంలో జరిగిన మ్యాచ్లో ఈ సంఘటన చోటు చేసుకున్న విషయం తెలిసిందే. (ఇదీ చదవండి: 'భగవంత్ కేసరి'లో బిగ్బాస్-7 బ్యూటీ.. ఏకంగా మంత్రిగానే కీ రోల్) దీంతో పోలీస్స్టేషన్లో కూడ ఫిర్యాదు చేసింది. కానీ తన ప్రయత్నంగా తన ఫోన్ తిరిగి ఇచ్చినవారికి రివార్డ్ ఇస్తానని ఊర్వశి ప్రకటించింది. ఈ మేరకు నా తన ఇన్స్టా స్టోరీస్లో పోస్ట్ చేసింది. అంతే కాకుండా ఫోన్ లాస్ అయిన లోకేషన్ను కూడా షేర్ చేసింది. ఊర్వశి రౌతేలా చేసిన ట్వీట్కు ఫలితం దక్కింది. ఒక అజ్ఞాతవ్యక్తి నుంచి ఆమెకు మెసేజ్ వచ్చింది. 'మీ ఫోన్ నా దగ్గరే ఉంది. అది మీకు దక్కాలంటే క్యాన్సర్తో బాధపడుతున్న నా సోదరుడిని కాపాడుకోవడంలో సాయం చేయండి.' అని ఆ వ్యక్తి కండీషన్ పెట్టాడు. దీంతో ఊర్వశి రౌతేలా కూడా సరే అనేలా థంబ్స్ అప్ గుర్తు పెట్టింది. ఈ విషయాన్ని ఆమె తన ఇన్స్టాగ్రామ్లో షేర్ చేసింది. మరీ ఒప్పందం ప్రకారం ఆ అజ్ఞాతవాసి ఆమెకు ఫోన్ తెచ్చి ఇస్తాడా లేదా అనేది తెలియాల్సి ఉంది. -
ఊర్వశి రౌతేలా బంగారు ఐఫోన్.. రివార్డ్ ప్రకటించిన భామ!
మెగాస్టార్ మూవీ వాల్తేరు వీరయ్యతో తెలుగు ప్రేక్షకులను పలకరించిన బ్యూటీ ఊర్వశి రౌతేలా. అఖిల్ మూవీ ఏజెంట్లోనూ ప్రత్యేక సాంగ్తో అలరించింది. ప్రస్తుతం బాలీవుడ్ సినిమాలతో బిజీగా ఉంది. అయితే ఇటీవల జరిగిన భారత్-పాకిస్తాన్ వన్డే వరల్డ్ కప్ మ్యాచ్లో హాజరైన ముద్దుగుమ్మ తన ఖరీదైన ఫోన్ పోగొట్టుకుంది. అహ్మదాబాద్లోని నరేంద్ర మోడీ స్టేడియంలో జరిగిన మ్యాచ్లో ఈ సంఘటన చోటు చేసుకుంది. (ఇది చదవండి: చిన్నప్పుడే అమ్మ చనిపోయింది.. ఆమె నా తల్లి అని చెప్పారు: రాజేంద్రప్రసాద్) అయితే తాజాగా తన ఫోన్ తిరిగి ఇచ్చినవారికి రివార్డ్ ఇస్తానని ఊర్వశి ప్రకటించింది. ఈ మేరకు నా తన ఇన్స్టా స్టోరీస్లో పోస్ట్ చేసింది. అంతే కాకుండా ఫోన్ లాస్ అయిన లోకేషన్ను కూడా షేర్ చేసింది. అహ్మదాబాద్లోని మాల్లో ఉన్నట్లు లోకేషన్ను పంచుకుంది. ఇప్పటికే అహ్మదాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేయగా.. ఇప్పటికే ఈ సంఘటనపై ఆరా తీస్తున్నారు. కాగా.. ఊర్వశి రౌతేలా.. సాబ్ ది గ్రేట్ మూవీతో బాలీవుడ్లోకి అడుగుపెట్టింది. ఆమె సన్నీ డియోల్ సరసన ప్రధాన పాత్రలో నటించింది. ఆ తరువాత ఆమె సనమ్ రే, హేట్ స్టోరీ 4, పాగల్పంటి వంటి చిత్రాలలో నటించింది. ప్రస్తుతం వినీత్ కుమార్ సింగ్, అక్షయ్ ఒబెరాయ్లతో కలిసి దిల్ హై గ్రేలో నటించనుంది. అంతేకాకుండా బ్లాక్ రోజ్ అనే తెలుగు సినిమాలో కూడా కనిపించనుంది. (ఇది చదవండి: నయని ఎలిమినేషన్తో బిగ్బాస్ అగ్రిమెంట్ గుట్టు విప్పిన అర్జున్ కల్యాణ్ ) 📱 Lost my 24 carat real gold i phone at Narendra Modi Stadium, Ahmedabad! 🏟️ If anyone comes across it, please help. Contact me ASAP! 🙏 #LostPhone #AhmedabadStadium #HelpNeeded #indvspak@modistadium @ahmedabadpolice Tag someone who can help pic.twitter.com/2OsrSwBuba — URVASHI RAUTELA🇮🇳 (@UrvashiRautela) October 15, 2023 -
IND Vs Pak మ్యాచ్: గోల్డ్ ఐఫోన్ పోగొట్టుకున్న బాలీవుడ్ బ్యూటీ
బాలీవుడ్ బ్యూటీ ఊర్వశి రౌతేలాకు పెద్ద కష్టమే వచ్చింది. శనివారం నాడు ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ చూసేందుకు అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియానికి వెళ్లిందీ బ్యూటీ. ఈ క్రమంలో సదరు స్టేడియంలో తన ఫోన్ పోగొట్టుకుంది. అది 24 క్యారెట్ల బంగారంతో తయారు చేసిన గోల్డ్ ఐ ఫోన్ అని సోషల్ మీడియాలో రాసుకొచ్చింది. దొరికినవాళ్లు దయచేసి తనకు తిరిగివ్వాలని కోరింది. ఈ విషయంలో సహకరించాల్సిందిగా కోరుతూ అహ్మదాబాద్ పోలీసులను ట్యాగ్ చేసింది. మరి ఆ జనసంద్రంలో ఊర్వశి పోగొట్టుకున్న ఐ ఫోన్ తిరిగి దొరుకుతుందో, లేదో చూడాలి! కాగా నిన్న జరిగిన మ్యాచ్లో పాకిస్తాన్పై భారత్ ఘన విజయం సాధించింది. ప్రపంచకప్లో పాక్కు వరుసగా ఎనిమిదోసారి ఓటమి రుచి చూపించింది. ఇక ఊర్వశి రౌతేలా విషయానికి వస్తే.. 'సింగ్ సాబ్ ద గ్రేట్' సినిమాతో బాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చింది. ఈ మూవీలో ఆమె సన్నీడియోల్కు జంటగా నటించింది. సనమ్ రే, హేట్ స్టోరీ 4, పాగల్పంతి వంటి పలు చిత్రాల్లో నటించి ప్రేక్షకులకు దగ్గరైంది. టాలీవుడ్ ప్రేక్షకులకు మాత్రం ఐటం సాంగ్స్ ద్వారానే సుపరిచితురాలైంది. 'వాల్తేరు వీరయ్య'లో బాస్ పార్టీ, 'ఏజెంట్'లో వైల్డ్ సాలా, 'బ్రో'లో మై డియర్ మార్కండేయ, 'స్కంద'లో కల్ట్ మామా.. ఇలా వరుసగా ఐటం సాంగ్స్ చేస్తోంది. ప్రస్తుతం ఊర్వశి హిందీలో 'దిల్ హై గ్రే' అనే సినిమా చేస్తోంది. View this post on Instagram A post shared by Urvashi Rautela (@urvashirautela) చదవండి: ఎట్టకేలకు ఓటీటీలోకి కింగ్ ఆఫ్ కొత్త హిందీ వర్షన్.. ఎప్పుడు? ఎక్కడంటే? -
నిమిషానికి రూ.కోటి రెమ్యునరేషన్.. నటి రియాక్షన్ అదిరిపోయింది!
బాలీవుడ్ భామ ఊర్వశి రౌతేలా పరిచయం అక్కర్లేని పేరు. బాస్ పార్టీ అంటూ మెగాస్టార్ వాల్తేరు వీరయ్య సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకులను పలకరించింది. ఆ తర్వాత అఖిల్ నటించిన ఏజెంట్ చిత్రంలోనూ ప్రత్యేక సాంగ్లో మెరిసింది. ఇటీవలే ఫ్రాన్స్లోని పారిస్లో ఈఫిట్ టవర్ను వన్డే వరల్డ్ కప్ను ఆవిష్కరించిన ముద్దుగుమ్మ మరోసారి వార్తల్లో నిలిచింది. ఇలాంటి అరుదైన అవకాశం దక్కించుకున్న ఏకైక నటిగా స్థానం దక్కించుకుంది. అయితే తాజాగా ఒక్క నిమిషానికి రూ. కోటి రూపాయల రెమ్యునరేషన్ వసూలు చేస్తోందని గత కొద్ది రోజులుగా ఆమెపై రూమర్స్ వస్తున్నాయి. అంతే కాదు ఆమెపై నెటిజన్స్ సైతం ట్రోల్స్ కూడా చేశారు. (ఇది చదవండి: స్టార్ హీరో కేసులో హైకోర్టు కీలక తీర్పు.. ఆ డబ్బు!) ఈ నేపథ్యంలో తాజాగా ఓ ఈవెంట్కు హాజరైన ఊర్వశికి ఇలాంటి ప్రశ్నే ఎదురైంది. మీరు ఒక నిమిషానికి రూ. కోటి రూపాయలు వసూలు చేస్తున్నారు? దీనిపై మీరేమంటారని ప్రశ్నించారు. దీనికి బదులిస్తూ.. నాలాంటి సెల్ఫ్ మేడ్ నటులు ఎవరైనా సరే ఇలాంటి విజయాలు సాధించాలని కోరుకుంటున్నా అంటూ సమాధానమిచ్చారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది. ఇది చూసిన నెటిజన్స్ సైతం క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. గతంలో చాలాసార్లు ఇందతా అబద్ధమంటూ నెటిజన్స్ ఆమెపై ట్రోల్స్ చేశారు. ఊర్వశి రౌతేలా సాబ్ ది గ్రేట్ మూవీతో బాలీవుడ్లోకి అడుగుపెట్టింది. ఆమె సన్నీ డియోల్ సరసన నటించింది. ఆ తర్వాత సనమ్ రే, హేట్ స్టోరీ- 4, పాగల్పంటి వంటి చిత్రాలలో నటించింది. ప్రస్తుతం వినీత్ కుమార్ సింగ్, అక్షయ్ ఒబెరాయ్లతో కలిసి దిల్ హై గ్రేలో నటించనుంది. అలాగే మరో తెలుగు సినిమాలో కూడా కనిపించనుంది. (ఇది చదవండి: కేవలం రూ.7 కోట్ల సినిమా.. బాక్సాఫీస్ను షేక్ చేసేసింది!) View this post on Instagram A post shared by F I L M Y G Y A N (@filmygyan) -
అరుదైన ఛాన్స్ కొట్టేసిన రౌతేలా.. ఆ విషయంలో తొలి నటి ఆమెనే!
బాలీవుడ్ భామ ఊర్వశి రౌతేలా గురించి పరిచయం చేయాల్సిన పనిలేదు. మెగాస్టార్ చిరంజీవి మూవీ వాల్తేరు వీరయ్యతో తెలుగు అభిమానులను మెప్పించింది. బాస్ పార్టీ అంటూ సాగే సాంగ్తో ఉర్రూతలూగించింది. ఆ తర్వాత కూడా అఖిల్ అక్కినేని చిత్రంలో ఓ స్పెషల్ సాంగ్లో మెరిసింది. సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ అభిమానులతో టచ్లో ఉంటోంది. అయితే తాజాగా ఈ భామ అరుదైన అవకాశాన్ని అందుకుంది. అదేంటో తెలుసుకుందాం. (ఇది చదవండి: 'స్నానం చేస్తుండగా వీడియోలు తీసేవాడు'.. హీరోయిన్ తీవ్ర ఆరోపణలు! ) ఇండియా వేదికగా ఈ ఏడాది అక్టోబర్లో వన్డే వరల్డ్ కప్ జరగనున్న సంగతి తెలిసిందే. టోర్నీ ప్రారంభానికి ముందు ట్రీఫీ చాలా దేశాలను చుట్టేసి వస్తోంది. ఈ నేపథ్యంలోనే తాజాగా ఫ్రాన్స్లోని ప్రతిష్ఠాత్మక ఈఫిల్ టవర్ ముందు ఐసీసీ ప్రపంచ కప్ -2023ను ఆవిష్కరించారు. అయితే ఈ ట్రోఫీని బాలీవుడ్ భామ ఊర్వశి రౌతేలా ఆవిష్కరించింది. ఈ అరుదైన అవకాశం దక్కించుకున్న తొలి నటిగా ఉర్వశి నిలిచింది. ఈ విషయాన్ని ఊర్వశి తన ఇన్స్టాలో పోస్ట్ చేసింది. వరల్డ్ కప్ ముందు ఫోటోలకు పోజులిచ్చింది. పంచుకుంది. ఈ అవకాశమిచ్చిన ఐసీసీకి కృతజ్ఞతలు తెలిపింది. ఇది చూసిన అభిమానులు ఊర్వశిపై క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. మిమ్మల్ని చూసి దేశం గర్విస్తోందని ఓ నెటిజన్ పోస్ట్ చేశారు. మరో నెటిజన్ రాస్తూ.. 'రిషబ్ భయ్యా దృష్టిలో పడేందుకేనా..' అంటూ కామెంట్స్ చేశాడు. మరో నెటిజన్ ఊర్వశి రౌతేలా వరల్డ్ కప్ పట్టుకుందంటే.. ఇక నెక్స్ట్ రిషబ్ భయ్యా వంతు అంటూ పోస్ట్ చేశాడు. ఇప్పుడు గెలవాల్సింది ఒకటి కాదు.. రెండు ట్రోఫీలు అంటూ ఫన్నీగా రాసుకొచ్చాడు. రిషభ్ పంత్తో డేటింగ్ రూమర్స్ క్రికెట్ ప్రియులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న వరల్డ్ కప్-2023 అక్టోబర్ 5 నుంచి నవంబర్ 19 వరకు జరగనుంది. కాగా.. గతంలో భారత వికెట్ కీపర్ రిషబ్ పంత్తో ఊర్వశి రౌతేలా డేటింగ్లో ఉందంటూ రూమర్స్ వచ్చిన సంగతి తెలిసిందే. మరీ ఈ ఫోటో చూసిన రిషబ్ పంత్ ఎలా స్పందిస్తాడో వేచి చూడాల్సిందే. (ఇది చదవండి: ప్రేమ పెళ్లి.. డిప్రెషన్లో నటుడు.. 10 ఏళ్ల బంధానికి స్వస్తి!) -
లుక్ మార్చేసిన కృతి.. తెలుగు పిల్ల వయ్యారాలు
టెంప్టింగ్ పోజుల్లో కృతిశెట్టి వయ్యారాలు ఒలకబోస్తున్న తెలుగు పిల్ల మోడ్రన్ డ్రస్లో ఈషా హ్యాపీ మోడ్ ఒరకంట చూస్తు నవ్వుతున్న రీతూ 'ఖుషి' ఈవెంట్ ఫొటోలు.. సామ్ స్మైల్ టైట్ డ్రస్లో హీట్ పెంచుతున్న అనన్య బిగ్ బాస్ దివి వానలో క్యూట్ స్టిల్స్ View this post on Instagram A post shared by Krithi Shetty (@krithi.shetty_official) View this post on Instagram A post shared by Priyanka Jawalkar (@jawalkar) View this post on Instagram A post shared by Eesha Rebba (@yourseesha) View this post on Instagram A post shared by Ritu Varma (@rituvarma) View this post on Instagram A post shared by Samantha (@samantharuthprabhuoffl) View this post on Instagram A post shared by Ananya 💛💫 (@ananyapanday) View this post on Instagram A post shared by Divi Vadthya (@actordivi) View this post on Instagram A post shared by Urvashi Rautela (@urvashirautela) View this post on Instagram A post shared by Rithu_chowdary (@rithu_chowdhary) View this post on Instagram A post shared by MEHREEN 🌟🧿 (@mehreenpirzadaa) -
చిరిగిన జీన్స్లో ఐటం బ్యూటీ, పెంపుడు కుక్క బర్త్డేకు పార్టీ ఇచ్చిన ఊర్వశి
► చిరిగిన జీన్స్లో ఐటం బ్యూటీ ► డ్యాన్స్తో ఇరగదీసిన శ్వేతానాయుడు ► సిడ్నీ నగరాన్ని చుట్టేస్తోన్న అరియానా గ్లోరీ ► ఆమ్స్టర్డామ్ యాత్రలో యాంకర్ నేహా చౌదరి ► కుక్కకు నెక్లెస్ వేసి బర్త్డే పార్టీ చేసిన ఊర్వశి రౌతేలా View this post on Instagram A post shared by Nora Fatehi (@norafatehi) View this post on Instagram A post shared by Ritika Singh (@ritika_offl) View this post on Instagram A post shared by Ariyana Glory (@ariyanaglory) View this post on Instagram A post shared by Lasya Manjunath (@lasyamanjunath) View this post on Instagram A post shared by Anchor Neha (@chowdaryneha) View this post on Instagram A post shared by Radhika Pandit (@iamradhikapandit) View this post on Instagram A post shared by Urvashi Rautela (@urvashirautela) View this post on Instagram A post shared by mon (@imouniroy) View this post on Instagram A post shared by Sakshi Agarwal|Actress (@iamsakshiagarwal) View this post on Instagram A post shared by Priya Prakash Varrier✨ (@priya.p.varrier) View this post on Instagram A post shared by Aditi Rao Hydari (@aditiraohydari) View this post on Instagram A post shared by Aditi Shankar (@aditishankarofficial) -
Urvashi Rautela: వైట్ డ్రెస్లో పాలరాతి శిల్పంలా మెరుస్తోన్న ఐటం బ్యూటీ (ఫొటోలు)
-
BRO Movie HD Wallpapers: సాయి ధరమ్ తేజ్ ‘బ్రో’ మూవీ మూవీ స్టిల్స్
-
ఇండియాలోనే అత్యధిక పారితోషికం తీసుకుంటున్న హీరోయిన్!
హీరోలతో సమానమైన పారితోషికం మాకెక్కడిది? అని పెదవి విరిచే హీరోయిన్లు చాలామంది ఉన్నారు. నిజమే, హీరోలతో సమానంగా రెమ్యునరేషన్ అందుకునేవాళ్లు చాలా అరుదుగా ఉంటారు. అయితే కొన్ని సందర్భాల్లో మాత్రం హీరోయిన్లు తీసుకున్నంత పారితోషికాన్ని హీరోలు కూడా అందుకోలేరు.. అవును, సినిమా మొత్తానికి ఓ సాధారణ హీరో రూ.2 కోట్లు తీసుకున్నా అందులో ఐటం సాంగ్ చేసిన హీరోయిన్కు అంతకన్నా ఎక్కువే ముట్టజెపుతారు నిర్మాతలు. వారు అడిగినంత ఇచ్చేందుకు కూడా వెనుకాడరు. ఐటం సాంగ్స్కు కేరాఫ్ అడ్రస్గా మారిపోయిన ఊర్వశి రౌతేలా కెరీర్ ఇప్పుడు పీక్స్లో ఉంది. బాలీవుడ్లో మంచి గుర్తింపు ఉన్న ఈమె వాల్తేరు వీరయ్య సినిమాలో ఐటం సాంగ్ బాస్ పార్టీలో తళుక్కుమని మెరిసింది. ఈ చిత్రానికి గానూ ఆమెకు రెండు కోట్లు ముట్టాయట. ఈ మూవీ, ఆ పాట రెండూ బ్లాక్బస్టర్ హిట్ కొట్టడంతో బ్యూటీకి మార్కెట్లో డిమాండ్ పెరిగింది. ఆ తర్వాత ఏజెంట్లో వైల్డ్ సాలా పాటలో తన ఒంపుసొంపులను ప్రదర్శించింది. అలాగే పవన్ కల్యాణ్, సాయిధరమ్తేజ్ల బ్రో సినిమాలోనూ మై డియర్ మార్కండేయ అంటూ స్పెషల్ సాంగ్లో స్టెప్పులేసింది. ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని స్కంధ సినిమాలో కూడా ఓ పాటలో మెరుపు తీగలా వచ్చిపోనుంది. అయితే ఈ చిత్రంలో మూడు నిమిషాల పాటకుగానూ మూడు కోట్లు డిమాండ్ చేసిందంటూ ఓ వార్త వైరల్ అవుతోంది. ఈ లెక్కన ఆమె నిమిషానికి కోటి రూపాయలు తీసుకుందన్నమాట! ఇదెంతవరకు నిజమో తెలియదు కానీ కాలం కలిసొచ్చినప్పుడే కోట్లు కూడబెట్టుకోవాలి అనే ఫార్ములాను ఊర్వశి గట్టిగానే ఫాలో అవుతోందంటున్నారు అభిమానులు. చదవండి: అల్లర్ల మధ్య హోటల్లో బిక్కుబిక్కుమంటూ గడిపిన ఊర్వశి రౌతేలా -
అల్లర్ల మధ్య హోటల్లో బిక్కుబిక్కుమంటూ గడిపిన ఊర్వశి!
వాల్తేరు వీరయ్య 'బాస్ పార్టీ'తో బాగా ఫేమస్ అయింది ఊర్వశి రౌతేలా. ఐటం సాంగ్లతోనే అభిమానుల హృదయాలను కొల్లగొట్టే ఈ బ్యూటీకి తాజాగా పారిస్లో చేదు అనుభవం ఎదురైంది. పారిస్ ఫ్యాషన్ వీక్లో పాల్గొన్న ఆమె అక్కడ ఓ హోటల్లో బస చేసింది. అయితే పారిస్ నగరంలో అల్లర్లు చోటు చేసుకున్నాయని, హోటల్ గది నుంచి బయటకు రావాలంటేనే భయం వేస్తోందంటూ ఇన్స్టాగ్రామ్ స్టోరీలో ఓ వీడియో షేర్ చేసింది నటి. తన గది కిటికీ నుంచి తీసిన ఈ వీడియోలో.. వీధుల్లో నెలకొన్న ఉద్రిక్తత వాతావారణం స్పష్టంగా కనిపిస్తోంది. గన్ పేల్చిన శబ్ధాలు కూడా వినిపిస్తున్నాయి. ఇలాంటి భయానక వాతావరణంలో ఊర్వశి చిక్కుకోవడంతో అభిమానులు ఆందోళన చెందుతున్నారు. తను వీలైనంత త్వరగా తన పని ముగించుకుని క్షేమంగా ఇండియాకు తిరిగిరావాలని కోరుకుంటున్నారు. ఇకపోతే బాలీవుడ్లో హేట్ స్టోరీ-4, గ్రేట్ గ్రాండ్ మస్తీ, సనమ్ రే, పాగల్ పంటి లాంటి చిత్రాల్లో తళుక్కుమని మెరిసిన ఊర్వశి 2015లో 'యంగెస్ట్ మోస్ట్ బ్యూటిఫుల్ ఉమెన్' టైటిల్ను కైవసం చేసుకుంది. ఇటీవల 'వరల్డ్స్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలరెట్' టైటిల్ను కూడా గెలుచుకుంది. View this post on Instagram A post shared by Urvashi Rautela (@urvashirautela) చదవండి: 61 ఏళ్ల వ్యక్తితో శృంగారం.. స్పందించిన హీరోయిన్ బుల్లితెర నటుల ఇంట్లో చోరీ.. లక్ష విలువైన.. -
పుష్ప-2లో ఐటం సాంగ్.. రెమ్యునరేషన్ అన్ని కోట్లా!
అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఐకాన్ స్టార్ మూవీ 'పుష్ప-2: ది రూల్'. సుకుమార్ డైరెక్షన్లో తెరకెక్కుతోన్న ఈ చిత్రంపై ఫ్యాన్స్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే పుష్ప పార్ట్-2 బాక్సాఫీస్ వద్ద పలు రికార్డులు బద్దలు కొట్టగా.. ఈ చిత్రం అంతకుమించి ఉంటుందని తెలుస్తోంది. పుష్పలో సమంత చేసిన ఐటమ్ సాంగ్ 'ఊ అంటా మావ.. ఉఊ అంటావా మావ' క్రేజ్ మామూలుగా లేదు. ఆ పాటకు డ్యాన్స్ చేయకుండా ఉండలేని వారు ఉండరంటే అతియోశక్తి కాదేమో. అంతలా సినీ ప్రేక్షకులను ఊపేసింది. (ఇది చదవండి: భార్య కోసం ఏకంగా ఆస్పత్రినే బుక్ చేసిన స్టార్ హీరో! ) అయితే పుష్ప-2లోనూ అదిరిపోయే ఐటమ్ సాంగ్ను తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ ఐటమ్ సాంగ్లో బాలీవుడ్ భామ ఊర్వశి రౌతేలా కనిపించనుంది. ఈ నేపథ్యంలో దీనికి సంబంధించిన ఓ క్రేజీ న్యూస్ సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. ఓ మీడియా కథనం ప్రకారం ఈ మూడు నిమిషాల ఐటమ్ సాంగ్ కోసం ఆమె ఏకంగా రూ.6 నుంచి రూ.7 కోట్లు వసూలు తీసుకుంటున్నట్లు రూమర్స్ వినిపిస్తున్నాయి. అయితే ఊర్వశి కూడా అంతకంటే ఎక్కువే రెమ్యూనరేషన్ డిమాండ్ చేసినట్లు సమాచారం. కాగా.. పుష్ప: ది రైజ్ డిసెంబర్ 17, 2021న థియేటర్లలో విడుదలై ప్రభంజనం సృష్టించింది. అల్లు అర్జున్, రష్మిక మందన్నా జంటగా నటించారు.బాలీవుడ్ నటుడు ఫహద్ ఫాసిల్ కీలక పాత్రలో కనిపించారు. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో ఈచిత్రాన్ని సుకుమార్ తెరకెక్కించారు. గతంలో బన్నీ బర్త్ డే సందర్భంగా పుష్ప-2 ఫస్ట్లుక్ పోస్టర్ను రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ మూవీ రిలీజ్ తేదీని త్వరలోనే ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే రిలీజైన పుష్ప-2 గ్లింప్స్ వీడియోతో ఈ చిత్రంపై అంచనాలు మరింత పెరిగాయి. (ఇది చదవండి: ఆ హీరోకి తల్లిగా చేయమన్నారు.. యాక్టింగ్ వదిలేశా: మధుబాల) -
Paris Fashion Week: బ్లాక్ నెట్ డ్రెస్లో మెరిసిపోతున్న ఊర్వశి రౌతేలా (ఫోటోలు)
-
వాల్తేరు వీరయ్య భామకు అరుదైన అవార్డ్.. ఆడేసుకుంటున్న నెటిజన్స్!
బాలీవుడ్ భామ ఊర్వశి రౌతేలా పరిచయం అక్కర్లేని పేరు. టాలీవుడ్లో మెగాస్టార్ వాల్తేరు వీరయ్య, అఖిల్ ఏజెంట్ సినిమాల్లో ప్రత్యేక సాంగ్స్తో అదరగొట్టింది. అంతే కాకుండా రిషబ్ పంత్తో డేటింగ్లో ఉన్నట్లు రూమర్స్ కూడా వినిపించాయి. బాలీవుడ్లో హేట్ స్టోరీ-4, గ్రేట్ గ్రాండ్ మస్తీ, సనమ్ రే, పాగల్ పంటి లాంటి చిత్రాల్లో పనిచేసింది. అంతే కాకుండా 2015లో 'యంగెస్ట్ మోస్ట్ బ్యూటిఫుల్ ఉమెన్' టైటిల్ను కైవసం చేసుకుంది. తాజాగా 'వరల్డ్స్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలరెట్' టైటిల్ను గెలుచుకుంది. దీనికి సంబంధించిన వీడియోను ఊర్వశి తన ఇన్స్టాలో పోస్ట్ చేసింది. (ఇది చదవండి: టూమచ్ ఓవరాక్షన్ అని చెడామడా తిట్టాడు, రాత్రంతా నిద్రపోలే: నటుడు) ఊర్వశి రౌతేలా తన ఇన్స్టాలో రాస్తూ.. 'ప్రపంచంలోని మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలొరెట్ అవార్డుకు ఎంపిక చేసినందుకు ఐడబ్ల్యూఎం బజ్ సంస్థకు నా కృతజ్ఞతలు. ఈ అద్భుతమైన ప్రయాణంలో భాగమైనందుకు మీ అందరికీ ధన్యవాదాలు. మన ప్రేమ, కలలు సాకారమయ్యే క్షణాలను ఇలా జరుపుకుంటూనే ఉంటాం. ' అంటూ పోస్ట్ చేసింది. నెటిజన్స్ ట్రోల్స్ ఊర్వశి రౌతేలాకు అవార్డ్ రావడంతో ఆమె కొన్ని ఫోటోలను గ్లామరస్ పిక్స్ తన ఇన్స్టాలో పంచుకుంది. అయితే ఆ ఫోటోలను బాగానే ఎడిట్ చేసిందంటూ కామెంట్స్ చేశారు. మరికొందరేమో ఐఐటీ, ఐఐఎంలో చదివిన మోస్ట్ బ్యూటిఫుల్ మిస్ యూనివర్స్ ఫోటోలను అత్యుత్తమంగా ఎడిట్ చేశారంటూ ఎద్దేవా చేశారు. మరొకరు రాస్తూ ప్రపంచంలోనే అత్యంత భ్రమలు కలిగించే వుమెన్ ఊర్వశినే అంటూ రాసుకొచ్చాడు. (ఇది చదవండి: 'ది కేరళ స్టోరీ' సినిమాకు ఓటీటీ కష్టాలు.. కారణం అదేనా?) View this post on Instagram A post shared by Urvashi Rautela (@urvashirautela) -
ఫ్లైట్లో పోగొట్టుకున్నా.. ప్లీజ్ తెచ్చి ఇవ్వండి: ఊర్వశి రౌతేలా
బాలీవుడ్ నటి ఊర్వశి రౌతేలా ప్రస్తుతం సోషల్ మీడియాలో అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది. తన అంద చందాలతో నెట్టింట కుర్రకారుకు హీటెక్కిస్తుంది ఈ బీ టౌన్ చిన్నది. ఈ నటి ఇటీవలే ప్రపంచంలోనే మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ అవార్డును కూడా అందుకుంది. ఈ విషయాన్ని ఊర్వశి స్వయంగా సోషల్ మీడియా ద్వారా అభిమానులకు చెప్పింది. తాజాగ మరోసారి సోషల్ మీడియాలో ఆమె చర్చనీయాంశమైంది. (ఇదీ చదవండి: పెద్ద కూతురి కోసం చిరంజీవి సంచలన నిర్ణయం!) ఇటీవల విమానంలో దూర ప్రయాణం చేసిన ఊర్వశి తన వద్దనున్న రెండు ఐఫోన్లను ఫ్లైట్లోనే మరచిపోయి వచ్చేసిందట. అది వెతికేందుకు సహాయం కోరుతూ ఇన్స్టా వేదికగా ఓ పోస్ట్ను ఇలా పెట్టింది. 'డియర్ విస్తారా నేను నా రెండు ఐఫోన్లను యూకే 772 విమానంలో మరచిపోయాను. వాటి వాల్ పేపర్లో మా తల్లిదండ్రుల ఫొటో ఉంటుంది. దయ చేసి మీరు దాన్ని వెతికేందుకు సహాయం చేస్తారా' అంటూ రాసుకొచ్చింది. కొద్దిరోజుల నుంచి టాలీవుడ్ సినిమాల్లోనూ మెరుస్తూ సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. వాల్తేరు వీరయ్యలో చిరు సరసన 'బాసు.. వేర్ ఈజ్ ద పార్టీ' అంటూ స్టెప్పులేస్తూ.. యూత్ ఫాలోయింగ్ను పెంచుకుంది . ప్రస్తుతం ఆమె లో బోయపాటి-రామ్ పోతినేని సినిమాతో పాటు 'బ్రో' లాంటి సినిమాల్లో స్పెషల్ సాంగ్స్లో మెరవనుంది. (ఇదీ చదవండి: రాధికా ఆప్టేతో రోమాన్స్ చేసిన ఈ నటి గురించి తెలుసా?) -
ఐఐటీయన్గా హీరోయిన్.. నెటిజన్స్ దారుణ ట్రోల్స్!
బాలీవుడ్ భామ ఊర్వశి రౌతేలా బీ టౌన్తో పాటు టాలీవుడ్కు కూడా సుపరిచితమే. మెగాస్టార్ మూవీ వాల్తేరు వీరయ్యలో స్పెషల్ సాంగ్లో అదరగొట్టింది. వేర్ ఈజ్ ది పార్టీ టాలీవుడ్ సినీ ప్రేక్షకులను అలరించింది. ఇటీవలే విడుదలైన అఖిల్ మూవీ ఏజెంట్లోనూ స్పెషల్ సాంగ్ వైల్ట్ సాలా అంటూ అభిమానులను ఊర్రూతలుగించింది. అయితే గతంలో టీమిండియా క్రికెటర్ రిషబ్ పంత్తో డేటింగ్లో ఉన్నట్లు రూమర్స్ వినిపించిన సంగతి తెలిసిందే. (ఇది చదవండి: ఘనంగా బుల్లితెర నటి సీమంతం.. సోషల్ మీడియాలో వైరల్!) సినీ తారలపై ట్రోల్స్ ఏ స్థాయిలో ఉంటాయో మనందరికీ తెలిసిందే. తాజాగా ఊర్వశి రౌతేలా మరోసారి ట్రోల్స్కు గురైంది. ఎందుకంటే తన సోషల్ మీడియా ఖాతాలో ఐఐటీయన్ అని పేర్కొనడంపై నెటిజన్స్ ట్రోల్ చేస్తున్నారు. ఆమెకు కొత్త కారు, కొత్త ఇల్లు ఉండొచ్చు.. కానీ ఆమె ఐఐటీయన్ అని చెప్పుకోవడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసిందంటూ కామెంట్స్ పెడుతున్నారు. అయితే ఇదంతా ఆమె గతంలో తన ఇన్స్టాగ్రామ్ ఖాతా బయోలో ఐఐటీయన్గా పేర్కొంది. ఇది చూసిన కొందరేమో ఆమె అప్పట్లో ఐఐటీలో చేరాలనుకున్నది అంటూ పోస్ట్ చేశారు. ఆ తర్వాత ఐఐటీయన్ అన్న ట్యాగ్ను సోషల్ మీడియా ఖాతా నుంచి తొలగించింది. కానీ ఆమె అధికారిక వెబ్సైట్లో మాత్రం ఇప్పటికీ ఐఐటీయన్గానే చూపిస్తోంది. కాగా.. గతంలో ఊర్వశి ఓ ఈవెంట్లో మాట్లాడుతూ తాను సైన్స్ గ్రాడ్యుయేట్ అని తెలిపింది. అంతే కాకుండా ఐఐటీ ఎంట్రన్స్ను క్లియర్ చేశానని చెప్పింది. ఆ తర్వాత తాను ఐఏఎస్ కోసం కూడా సిద్ధమైనట్లు వివరించింది. చివరికీ ఏరోనాటికల్ ఇంజనీర్ కావాలనుకుంది.. కానీ ఆమె మోడలింగ్ వైపు అడుగులు వేసింది. మిస్ యూనివర్స్ పోటీల్లోనూ పాల్గొంది. ఆ తర్వాత సన్నీ డియోల్, అమృతా రావుతో కలిసి సింగ్ సాబ్ ది గ్రేట్తో బాలీవుడ్ అరంగేట్రం చేసింది. (ఇది చదవండి: సుశాంత్ ఆత్మహత్యపై కంగనా సంచలన ఆరోపణలు..!)
Pagination
ఓటర్ మిత్రమా.. జాగ్రత్త! ఆ సౌండ్ వస్తేనే మీరు ఓటేసినట్టు!
ఇది కదా క్రేజ్ అంటే.. సీఎం జగన్ ఇంటర్వ్యూకి మిలియన్ల వ్యూస్
Sakshi.com ఇప్పుడు సరికొత్తగా మీ ముందుకు
కాపులు, ముస్లింలకు రిజర్వేషన్లు అక్కర్లేదు: పవన్కళ్యాణ్
రైతు కుమార్తె విజయం.. రిషబ్ శెట్టి అభినందనలు
పులివెందుల ప్రజలకు ఇద్దరిపైనా ప్రేమే: వైఎస్ భారతి
RCB Vs PBKS: కోహ్లి అరుదైన రికార్డు.. ఐపీఎల్ చరిత్రలోనే తొలి క్రికెటర్గా
Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో బిగ్ ట్విస్ట్..
బిజీగా ఉండటం ఇంత డేంజరా! హెచ్చరిస్తున్న సైకాలజిస్ట్లు
కారులో వాసన బాగుందని తెగ పీల్చుకుంటున్నారా.?
ఓటు హక్కు వినియోగించుకున్నతర్వాత సీఎం జగన్ రియాక్షన్
అందుకే శిల్పా రవికి మద్దతు ఇచ్చాను: అల్లు అర్జున్
ఓటు హక్కు వినియోగించుకున్న అల్లు అర్జున్, ఎన్టీఆర్
గుండెపోటుతో ప్రిసైడింగ్ అధికారి మృతి
ఓటేసిన సీఎం జగన్
'ఆమె ధర్మపత్ని'! గృహస్థాశ్రమ వైశిష్ట్యం!!
పోలింగ్ ప్రారంభం.. పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరిన ఓటర్లు..
నాలుగో దశ ఎలక్షన్స్.. ఆసక్తికర విషయాలు
మన లక్ష్యం ఏమిటి? అందుకు చేయవలసిన పనేమిటి?
అందరూ తప్పకుండా ఓటు వేయండి..సీఎం జగన్ ట్వీట్
తప్పక చదవండి
- గుండెపోటుతో ప్రిసైడింగ్ అధికారి మృతి
- నోటాకు 50 శాతం కంటే ఎక్కువ ఓటింగ్ వస్తే.. ఏమవుతుందో తెలుసా?
- నయవంచనకు చెక్ పెడదాం
- ఈసీ ద్వంద్వ వైఖరి
- జనస్వామ్యమా! జయీభవ!!
- మంత్రి బొత్సపై చంద్రబాబు కొత్త కుట్ర
- ఐరాస కాంక్షించే అభివృద్ధికి ఏపీయే వేదిక
- పేదింటి పిల్లలకు వర్సిటీ చదువులు ఉచితం
- ఓటర్ మిత్రమా.. జాగ్రత్త! ఆ సౌండ్ వస్తేనే మీరు ఓటేసినట్టు!
- జగన్ ఒక నిజం... ఒక భావోద్వేగం
Advertisement