-
ఈ కొరియన్ ఖవ్వాలీ విన్నారో.. వహ్వా వహ్వా..! అనక తప్పదు!
పాపులర్ ‘కె–పాప్’ మనకు సుపరిచితం. మరి ‘కె–ఖవ్వాలి అంటే?’ అని అడిగితే ‘అదేమిటీ!’ అని మిక్కిలి ఆశ్చర్యపోయేవారితో పాటు ‘ఎక్కడి ఖవ్వాలీ? ఎక్కడి కొరియా’ అని దూరాభారాలను కూడా లెక్కవేసే వాళ్లు ఉంటారు. ‘కొరియన్ సింగర్స్ సింగింగ్ ఖవ్వాలి’ ట్యాగ్లైన్తో పోస్ట్ చేసిన ఈ ‘కె –ఖవ్వాలి’ వీడియో వైరల్ అయింది. కల్చరల్ ఎక్స్చేంజ్కు అద్దం పట్టే ఈ వీడియోలో కొరియన్ గాయకులు సంప్రదాయక ఖవ్వాలి మెలోడీలను అద్భుతంగా ఆలపించే దృశ్యం, హార్మోని సుమధుర శబ్దం నెటిజనుల చేత ‘వహ్వా వహ్వా’ అనిపిస్తోంది. ‘బ్యూటీఫుల్ కల్చరల్ ఎక్స్చేంజ్’ లాంటి ప్రశంసలు కామెంట్ సెక్షన్లో కనిపించాయి. ఇవి చదవండి: ప్రముఖ కొరియన్ సింగర్ అనుమానాస్పద మరణం: షాక్లో ఫ్యాన్స్ -
Virat Kohli: ఇంటర్నెట్లో క్యూటెస్ట్ వీడియో
ఐపీఎల్ 2024లో భాగంగా పంజాబ్ కింగ్స్తో నిన్న జరిగిన మ్యాచ్లో ఆర్సీబీ 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్లో విరాట్ క్లాసీ ఇన్నింగ్స్ ఆడి ఆర్సీబీని ఒంటిచేత్తో గెలిపించాడు. విరాట్ తన మెరుపు ఇన్నింగ్స్కు ఫలితంగా ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు గెలుచుకున్నాడు. ఈ అవార్డు అందుకున్న అనంతరం విరాట్ లండన్లో ఉంటున్న తన కుటుంబంతో వీడియో కాల్ మాట్లాడాడు. Virat Kohli talking to Anushka Sharma and Vamika after won the match. - CUTEST VIDEO OF THE DAY. ❤️ pic.twitter.com/srREuiqS8u — CricketMAN2 (@ImTanujSingh) March 25, 2024 కోహ్లి తన కుటుంబంపై ముద్దుల వర్షం కురిపిస్తూ కనిపించాడు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్మీడియాలో సందడి చేస్తుంది. కోహ్లి ఇటీవలే రెండో బిడ్డకు తండ్రైన విషయం తెలిసిందే. కోహ్లి భార్య అనుష్క ఈ ఏడాది ఫిబ్రవరి 15న లండన్లో మగబిడ్డకు జన్మనిచ్చింది. కోహ్లి దంపతులు ఆ పిల్లాడికి అకాయ్ అని నామకరణం చేశాడు. కోహ్లి దంపతులకు ఇదివరకే ఓ అమ్మాయి ఉంది. ఆమె పేరు వామిక. THE VINTAGE KING KOHLI...!!!!! 🐐 One of the Greatest Post Match Interview by any Cricketer in the History - King Kohli You're the GOAT. pic.twitter.com/cZ331UXGlI — CricketMAN2 (@ImTanujSingh) March 26, 2024 ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు అందుకున్న అనంతరం ప్రజెంటేటర్ హర్షా భోగ్లేతో కోహ్లి మాట్లాడిన మాటలు కూడా ప్రస్తుతం వైరలవుతున్నాయి. గడిచిన రెండు నెలల్లో తన వ్యక్తిగత అనుభవాల (లండన్) గురించి హర్షా కోహ్లిని అడుగగా.. ఆసక్తికర విషయాలను షేర్ చేసుకున్నాడు. రెండో సారి తండ్రైనందుకు చాలా ఆనందంగా ఉంది. ఇది తనకు తన కుటుంబానికి మరపురాని అనుభూతి. కుటుంబంతో కలిసి టైమ్ స్పెండ్ చేసే అవకాశం దొరికినందుకు చాలా ఆనందంగా ఉంది. తమను గుర్తు పట్టని ప్రదేశంలో సాధారణ జీవనం గడిపే అవకాశం దొరికింది. ఇందుకు దేవుడికి కృతజ్ఞతలని కోహ్లి తెలిపాడు. క్రికెట్కు సంబంధించి కోహ్లి మాట్లాడుతూ.. అంతిమంగా గణాంకాల గురించి ఎవరూ మాట్లాడుకోరు. జ్ఞాపకాలను మాత్రమే నెమరు వేసుకుంటారు. రాహుల్ ద్రవిడ్ చెప్పేది ఇదే. ఆర్సీబీ అభిమానుల నుంచి నాకు లభిస్తున్న ప్రేమ, ప్రశంసలు, మద్దతు అద్భుతమైనవి. ఇవి నేనెప్పటికీ మరచిపోలేనని కోహ్లి అన్నాడు. ఇదే సందర్భంగా కోహ్లి మరిన్ని ఆసక్తికర అంశాల గురించి కూడా ప్రస్తావించాడు. విశ్వవ్యాప్తంగా టీ20 ఫార్మాట్ ప్రమోషన్ కోసం తన పేరు ఉపయోగపడుతుందని వ్యంగ్యంగా కామెంట్ చేశాడు. ఇది ఇంకా రెండో మ్యాచ్ మాత్రమే ఇంకా చాలా దూరం వెళ్లాల్సి ఉందని ఆర్సీబీ ఫ్యాన్స్లో జోష్ నింపాడు. హర్షా భోగ్లే విరాట్కు ఆరెంజ్ క్యాప్ అందజేశాడు. -
USA: మాస్కో ఉగ్ర దాడులు.. ట్రంప్ పాత వీడియో వైరల్
వాషింగ్టన్: రష్యా రాజధాని మాస్కోలో జరిగిన ఉగ్రవాదుల దాడులపై అమెరికా మాజీ అధ్యక్షుడు, రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ మాట్లాడినట్లుగా చెబుతున్న ఒక వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఈ వీడియోలో ట్రంప్ మాజీ అధ్యక్షుడు ఒబామాపై విమర్శల దాడి చేశారు. ‘ఒబామా ఐసిస్ ఫౌండర్. ఐసిస్ ఆయనను గౌరవిస్తోంది. ఐసిస్ కో ఫౌండర్ హిల్లరీ క్లింటన్’ అని వీడియోలో ట్రంప్ సంచలన ఆరోపణలు చేశారు. ఇది మాస్కో దాడుల తర్వాత ట్రంప్ స్పందన అని సోషల్ మీడియాలో కొందరు ప్రచారం చేస్తున్నారు. అయితే ఇది తాజా వీడియో కాదని, మాస్కో దాడులపై ట్రంప్ మాట్లాడిన వీడియో కాదని తేలింది. ఈ వీడియో 2016 అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో ట్రంప్ మాట్లాడిన వీడియో అని, దీనిని మాస్కోలో తాజాగా జరిగిన ఐసిస్ మారణహోమానికి ముడిపెట్టి మళ్లీ వైరల్ చేస్తున్నారని తేల్చారు. మాస్కోలో శనివారం(మార్చ్ 23) జరిగిన ఉగ్రవాదుల దాడుల్లో 133 మంది మరణించిన విషయం తెలిసిందే. ఈ దాడులపై ట్రంప్ ఇంకా తన స్పందన తెలియజేయలేదు. Big Statement By Donald Trump. He said, "Obama is the fuckin founder of ISIS. I'll never let you go Obama "#Russia #Moskau #MoscowAttack pic.twitter.com/4dRJRY5Phu — Umair Ali (@UmairAli_7) March 23, 2024 ఇదీ చదవండి.. అమెరికాలో నరమాంస భక్షకుడు -
ఇది ఒక సైకాలం..! ఆన్లైన్ రాక్షసులు..!!
"ఇంటర్నెట్ రాకతో ప్రపంచం కుగ్రామంగా మారింది. సోషల్ మీడియా వల్ల ప్రపంచంలో ఏ మూలనున్న వారితోనైనా స్నేహించే, సంభాషించే అవకాశం దొరుకుతోంది. మరోవైపు ముక్కూమొహం తెలియని వారిపై అసహ్యకరమైన వ్యాఖ్యలు చేసి, బాధపెట్టి ఆనందించే ట్రోల్స్ అనే ప్రత్యేక జాతిని సృష్టించింది. చక్కగా అమెరికన్ యాక్సెంట్లో ఇంగ్లిష్ మాట్లాడిన బెండపూడి విద్యార్థులను, పిల్లలని కూడా చూడకుండా విపరీతంగా ట్రోల్ చేశారు. ప్రభుత్వం నుంచి ఇంటి స్థలాన్ని పొందిన వివాహితను అసభ్య పదజాలంతో ట్రోల్ చేసి ఆమె ఆత్మహత్యకు కారణమయ్యారు. సినీ తారలు, రాజకీయ నాయకులు, సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్స్.. వారని వీరని లేదు, అందరూ ట్రోలింగ్ బారిన పడ్డవారే!" అదోరకమైన శాడిజం.. జీవితంలో ఎలాంటి గుర్తింపులేని, ఎవరూ పట్టించుకోని వ్యక్తులకు ఆన్లైన్లో ఐడెంటిటీ బయటపడకుండా మాట్లాడగలగటం ధైర్యాన్నిస్తుంది. తమను ఎవరూ పట్టుకోలేరనే ధైర్యంతోనే నోటికొచ్చినట్లు అసభ్యంగా మాట్లాడుతుంటారు. నిజానికి వీరిలో లోతైన అభద్రత ఉంటుంది. దాన్నుంచి బయట పడేందుకు, ఇతరుల అటెన్షన్ను పొందేందుకు ట్రోలింగ్ను ఒక సాధనంగా చేసుకుంటారు. ఎమోషనల్ కంట్రోల్ లేనివారు కూడా ట్రోలింగ్ను ఎంచుకుంటారు. ట్రోల్స్లో నార్సిసిజం, మాకియవెల్లియనిజం, శాడిజం ఉంటాయని అధ్యయనాలు వెల్లడించాయి. నార్సిసిజం అంటే విపరీతమైన స్వీయప్రేమ. వీరికి విపరీతమైన అటెన్షన్ కావాలి. దానికోసం ఇతరులను ట్రోల్ చేస్తుంటారు. మన రియాక్షన్ నుంచి వారికి కావాల్సిన అటెన్షన్ పొందుతారు. మాకియ వెల్లియన్ ట్రోల్స్ మానిప్యులేట్ చేయడానికి అబద్ధాలు, మోసం ఉపయోగిస్తారు. వారిలో ఎలాంటి పశ్చాత్తాపం ఉండదు. ఇతరులు బాధపడుతుంటే లేదా బాధపెట్టి ఆనందించడమే శాడిజం. శాడిస్ట్ ట్రోల్స్ సంబంధంలేని అంశాలలో కూడా చేరి బాధపెట్టి ఆనందిస్తుంటారు. బలమైన కోటను నిర్మించుకోవాలి.. పెద్ద పెద్ద సెలబ్రిటీలకు కూడా ట్రోలింగ్ తప్పలేదని, మీరు ఒంటరి కాదని గుర్తించండి. ట్రోలింగ్ ప్రవర్తనను అర్థం చేసుకోవడం ద్వారా, మీ చుట్టూ బలమైన కోటను నిర్మించుకోవడం ద్వారా మిమ్మల్ని మీరు రక్షించుకోవచ్చు. మీరు సున్నిత మనస్కులైతే సోషల్ మీడియాకు దూరంగా ఉండటం మంచిది. ఒకవేళ ఉన్నా, ట్రోలింగ్ జరుగుతున్నంతకాలం డియాక్టివేట్ చేసుకోవాలి. ట్రోల్కు ప్రతిస్పందించడమంటే మృగానికి ఆహారం అందివ్వడమే. వారు కోరుకునే గుర్తింపు వారికి అందివ్వడమే. అందువల్ల కష్టమైనప్పటికీ ట్రోల్స్ను విస్మరించడమే వారి నుంచి తప్పించుకునే మార్గం. అప్పుడే వారు నిరాయుధులవుతారు, ఆకలితో అలమటిస్తారు. ట్రోల్స్ను నిరోధించడానికి ఆన్లైన్ ప్లాట్ఫామ్లు అందించిన రిపోర్టింగ్ మెకానిజాన్ని ఉపయోగించండి. వారిని బ్లాక్ చేయండి, రిపోర్ట్ చేయండి, వారి అకౌంట్ డిలీట్ అయ్యేలా రిపోర్ట్ చేయండి. ట్రోలింగ్ మీ కంటే ట్రోల్ గురించి ఎక్కువగా వెల్లడిస్తుంది. వారి నీచ మనస్తత్వం అందరికీ తెలిసేలా చేస్తుంది. అందువల్ల ట్రోల్స్ గురించి బాధపడకండి. మిమ్మల్ని మీరు ఒంటరిగా ఉంచుకోకండి. స్నేహితులు, కుటుంబ సభ్యులు, ఆన్లైన్ గ్రూపుల మద్దతు తీసుకోండి. మీ విలువను మీకు గుర్తు చేయగల, మీకు సహాయం చేయగల వ్యక్తులతో ఎక్కువ సమయం గడపండి. ట్రోలింగ్ వల్ల ఆందోళన, నిరాశ, దిగులు, ఆత్మహత్య ఆలోచనలు వస్తుంటే ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే సైకాలజిస్టును సంప్రదించండి. ట్రోల్స్ 2 రకాలు.. ట్రోలింగ్ చేసేవారిని ట్రోల్ అంటారు. వీరు ప్రధానంగా రెండు రకాలుగా ఉంటారు. వ్యక్తిగతంగా ఇతరులను ట్రోల్ చేసి ఆనందించేవారు. వీరివల్ల కాస్తంత బాధే తప్ప ప్రమాదం ఉండదు. కానీ ఒక సంస్థ కోసమో, రాజకీయ పార్టీ కోసమో వ్యవస్థీకృతంగా ట్రోల్ చేసేవారు ప్రమాదకరంగా ఉంటారు. ఎందుకంటే వారిలో ఒకరు ట్రోలింగ్ మొదలుపెడితే వందల్లో, వేలల్లో, లక్షల్లో ట్రోల్ చేస్తారు. వారికి ఆయా సంస్థ లేదా పార్టీల మద్దతు కూడా ఉండటంతో విపరీతంగా రెచ్చిపోతారు. ఇవి కొన్నిసార్లు ఆన్లైన్ యుద్ధాలుగా మారవచ్చు. ట్రోలింగ్ సంకేతాలను గుర్తించాలి.. ట్రోల్స్ నుంచి తప్పించుకోవాలంటే ముందు వారి లక్షణాలను, ప్రవర్తనను గుర్తించాలి. అప్పుడే వారికి దూరంగా ఉండవచ్చు. అందుకే వాటిని గుర్తించడం అవసరం. మీతో గొడవపడటం, మిమ్మల్ని రెచ్చగొట్టి, బాధపడేలా చేయడమే ట్రోల్స్ లక్ష్యం. అందుకోసం అవమానకమైన భాష ఉపయోగిస్తారు వాస్తవాలను వక్రీకకరిస్తారు. తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తారు. వాస్తవ సమస్యల నుంచి పక్కదారి పట్టించి, సామాజిక ఉద్రిక్తతలను సృష్టించాలని ప్రయత్నిస్తుంటారు. చర్చను వాదనగా మారుస్తారు. మీ రూపం, విలువలు, విశ్వాసాలను కించపరుస్తూ మాట్లాడతారు. కొందరు మరింత దిగజారి బూతులు కూడా తిడతారు. — సైకాలజిస్ట్ విశేష్ (psy.vishesh@gmail.com) ఇవి చదవండి: Usha Mehta: వెండి తెర మీద రహస్య రేడియో -
# RCB: మేమేం ఏడ్వటం లేదు... అబ్బే ఇవి కన్నీళ్లుకావు!
ఆర్సీబీ.. ఆర్సీబీ.. ఆర్సీబీ... నెట్టింట ఎక్కడ చూసినా ఇదే పేరు దర్శనమిస్తోంది. పదహారేళ్లుగా రాయల్ చాలెంజర్స్ బెంగళూరు పురుషుల జట్టుకు సాధ్యం కాని ఘనతను మహిళా జట్టు సాధించింది. వుమెన్ ప్రీమియర్ లీగ్ రెండో సీజన్లోనే ట్రోఫీ గెలిచి.. ‘‘ఇస్ సాలా కప్ నమదే’’ అని ప్రతి ఏడాది సందడి చేసే బెంగళూరు ఫ్యాన్స్.. ‘‘ఇస్ సాలా కప్ నమ్దూ’’ అంటూ సగర్వంగా తలెత్తుకునేలా చేసింది. సమిష్టి కృషితో ఆర్సీబీని టైటిల్ విజేతగా నిలిపింది స్మృతి మంధాన సేన. No we’re not crying, you are 😭pic.twitter.com/Nb9TKf5NFw — Royal Challengers Bangalore (@RCBTweets) March 17, 2024 ఈ నేపథ్యంలో బెంగళూరు వుమెన్ టీమ్పై ప్రశంసల వర్షం కురుస్తోంది. ఆర్సీబీ స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి సహా గ్లెన్ మాక్స్వెల్, దినేశ్ కార్తిక్ తదితరులు స్మృతి సేన సాధించిన విజయాన్ని సెలబ్రేట్ చేసుకుంటూ సంతోషాన్ని పంచుకుంటున్నారు. ఆర్సీబీ సైతం.. ‘‘మేమేం ఏడ్వటం లేదు... అబ్బే ఇవి కన్నీళ్లుకావు’’ అన్నట్లుగా వీడియోను షేర్ చేసింది. Going down in the history books 📙🏆 pic.twitter.com/OrQkgRailK — Royal Challengers Bangalore (@RCBTweets) March 17, 2024 మరోవైపు.. అదే సమయంలో అభిమానులు మాత్రం.. ‘‘లేడీస్ ఫస్ట్’ అనే నానుడిని ఆర్సీబీ మహిళలు నిజం చేశారు.. ఇక మిగిలింది మెన్స్ టీమ్’’ అంటూ ఫాఫ్ డుప్లెసిస్ బృందానికి తమ కర్తవ్యాన్ని గుర్తు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కొంతమంది నెటిజన్లు.. తమదైన శైలిలో మీమ్స్ సృష్టించి ఆర్సీబీ పురుషుల జట్టును ట్రోల్ చేస్తున్నారు. నెట్టింట నవ్వులు పూయిస్తున్న ఆ మీమ్స్పై మీరూ ఓ లుక్కేయండి!! 18 🤝 18 📸: JioCinema pic.twitter.com/0SDwzLHvRM — Royal Challengers Bangalore (@RCBTweets) March 17, 2024 RCB fans entering the office tomorrow#WPL2024 #WPLFinal #RCB pic.twitter.com/SKbaWNwqbN — ನಗಲಾರದೆ 𝕏 ಅಳಲಾರದೆ (@UppinaKai) March 17, 2024 Oreyy 😂 pic.twitter.com/FyEMLpAWws — Likhit MSDian (@LIKHITRTF) March 17, 2024 pic.twitter.com/93FufawCOn — t-riser (@techsaturation) March 17, 2024 కాగా ఢిల్లీ క్యాపిటల్స్తో ఆదివారం జరిగిన ఫైనల్ మ్యాచ్లో ఆర్సీబీ మహిళా జట్టు ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఢిల్లీ వేదికగా జరిగిన ఈ మ్యాచ్లో ప్రత్యర్థిని తొలుత 113 పరుగులకే కట్టడి చేసిన ఆర్సీబీ.. 19.3 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించింది. తద్వారా ఎనిమిది వికెట్ల తేడాతో ఢిల్లీని ఓడించి WPL 2024 చాంపియన్గా అవతరించింది. చదవండి: WPL 2024: ప్రియుడితో కలిసి ట్రోఫీతో ఫోజులిచ్చిన మంధాన.. ఫోటో వైరల్ Every RCB Fan right now 🥺😭pic.twitter.com/CLS1MDrEeZ — Vikas (@VikasKA01) March 17, 2024 -
బ్యూటిఫుల్ లవ్లీ ఫ్యామిలీ
పెళ్లి వేడుకలో వధూవరుల తల్లిదండ్రులు క్షణం తీరిక లేకుండా ఉంటారు. పెళ్లికి వచ్చిన అతిథులను పలకరించడం, పెళ్ళి పనులు చూసుకోవడంతోనే సరిపోతుంది. ‘టైమే బంగారమాయెనే’ అనుకునే సమయం లోనూ ఒక పెళ్లిలో వధువు తల్లిదండ్రులు చేసిన డ్యాన్స్ వీడియో వీర లెవెల్లో వైరల్ అయింది. స్టైలిష్ బ్లాక్ అండ్ గోల్డెన్ చీరలో వధువు తల్లి, స్మార్ట్ త్రీ పీస్ సూట్లో తండ్రి వేదికపై వివిధ హావభావాలతో చేసిన డ్యాన్స్ ‘వావ్’ అనిపించింది. స్టేజీ బ్యాక్గ్రౌండ్లో బాల్యం నుంచి కాలేజీ స్టూడెంట్ వరకు వధువుకు సంబంధించిన రకరకాల విజువల్స్ కనిపిస్తూ కనువిందు చేస్తుంటాయి. ‘బ్యూటీఫుల్... లవ్లీ ఫ్యామిలీ’ లాంటి కామెంట్స్ ఎన్నో యూజర్ల నుంచి వెల్లువెత్తాయి. -
అయింది వేలల్లో...వేసింది మాత్రం లక్షల్లో!
మనం రెస్టారెంట్కి వెళ్లితే బిల్ తోపాటు బాగా సర్వింగ్ చేసిన వ్యక్తికి కాస్త టిప్ ఇస్తాం. ఇది సహజం. కానీ ఇక్కడొక కస్టమర్ తాను బిల్లు చేసింది వేలల్లో అయితే టిప్పి మాత్రం ఏకంగా లక్షలు ఇచ్చాడు. ఎక్కడ జరిగిందంటే ఈ ఘటన.. ఈ ఆశ్చర్యకర ఘటన అమెరికాలో చోటు చేసుకుంది. యూస్లోని మిచిగాన్లో ఉన్న ది మాసన్ జార్ కేఫ్ అనే రెస్టారెంట్కి మార్క్ అనే వ్యక్తి బ్రేక్ ఫాస్ట్ చేయడానికి వచ్చాడు. అయితే అతడు అక్కడ తిన్న బ్రేక్ ఫాస్ట్కి అయ్యిన ఖర్చు కేవలం రూ. 2,500/- మాత్రమే అయ్యింది. కానీ అతను ఏకంగా రూ. 8 లక్షలు టిప్ చెల్లించాడు. దీంతో అవాక్కయిన సర్వర్ ఈ విషయం మేనేజర్కి చెప్పడంతో వారంతా ఆశ్చర్యపోయారు. ఈ మేరకు సదరు రెస్టారెంట్ ఈ విషయాన్ని ఫేస్బుక్లో వివరిస్తూ..ఆ వ్యక్తి విశాల హృదయానికి ధన్యావాదాలు తెలిపింది. అతను ఇచ్చిన డబ్బును సహోద్యోగులు సమంగా పంచుకున్నారని, ప్రతి ఒక్కరూ రూ. 90 వేల చొప్పున ఇంటికి తీసుకువెళ్లారని అన్నారు. ఆయన తన బిల్లు కంటే ముప్పై వేల రెట్టు చెల్లించాడని రెస్టారెంట్ మేనేజర్ అన్నారు. అతనికి ఎన్ని విధాలుగా కృతజ్ఞతలు చెప్పినా అది తక్కువే అని భావోద్వేగంగా అన్నాడు. నిజానికి డిజిటల్ టిప్పింగ్ కల్చర్ సర్వే ప్రకారం..యూఎస్లోని వ్యక్తులు భోజనం చేసేటప్పుడు వారి బిల్లులో సగటున అంటే.. 16% టిప్పుగా ఇస్తారు. కానీ మార్క్ దాతృత్వం చాలా దయతో చేసిన చర్య అని కొనియాడారు. View this post on Instagram A post shared by Mason Jar Cafe (@masonjarcafe_) (చదవండి: ఫుల్గా తాగితే తాగితే చిరుత అయినా అంతేనా! ఇలానే ఉంటుందా..?) -
చీరకట్టులో జిమ్ వర్క్ఔట్స్!
ఇటీవల కాలంలో చీర ధరించడాన్నే ట్రెండీగా ఫాలో అవుతోంది యువత. అందులోనూ చీర కట్టులో స్కూటర్ నడపడం, లేదా వ్యాయామాలు చేసి ఆశ్చర్యపరుస్తున్నారు. నెటింట కూడా అలాంటి వీడియోలకే మంచి ఆదరణ ఉందని చెప్పొచ్చు. అంతేగాదు చీర కట్టులో ఎలాంటి పనులైన సునాయాసంగా చెయ్యొచ్చని నిరూపిస్తున్నారు. ఇక్కడ కూడా ఓ ఫిటెనెస్ కోచ్ చీరకట్టులో వర్క్ఔట్లు చేసి అందర్నీ ఆకర్షించింది. శారీ వర్కవుట్ వీడియోలతో ఇంటర్నెట్లో ఫేమ్ అయింది ఫిట్నెస్ కోచ్ రీనాసింగ్. చీరకట్టుతో ఫుష్–అప్స్, పుల్–అప్స్, స్వ్కాట్స్, జంప్స్లాంటి ఎక్సర్సైజులు చేస్తూ నెటిజనులను ఆకట్టుకొంటుంది. పాత, కొత్తా అనే తేడా లేకుండా ఆమె వీడియోలు వైరల్ అవుతూనే ఉంటాయి. రీనాసింగ్ తాజా వీడియో ఇన్స్టాగ్రామ్లో 21.3 మిలియన్ల వ్యూస్ను సాధించింది. ‘వర్కవుట్ల సమయంలో సౌకర్యవంతమైన దుస్తులు ధరించాలని సిఫారసు చేసినప్పటికీ సౌకర్యంగా అనిపిస్తే చీర ధరించి వ్యాయామాలు చేయడం పొరపాటేమీ కాదు. అయితే గ్రిప్ తప్పకుండా ఉండడానికి అవసరమైన ఫుట్వేర్ ధరించాలి’ అంటుంది యోగా ట్రైనర్ అనూష రామ్. View this post on Instagram A post shared by Reena Singh (@reenasinghfitness) (చదవండి: మీరు ప్రేమిస్తున్న వ్యక్తి నిజంగా ప్రేమిస్తున్నారో లేదో తెలుసుకోవాలంటే..!) -
బిగ్బాస్ ఫైనలిస్టుని సన్మానించిన ఎస్ఐకి బదిలీ
యశవంతపుర: బిగ్బాస్ రియాలిటీ షో లో ఫైనల్స్కు చేరిన వర్తూరు సంతోష్ను బెంగళూరులో ఎస్ఐగా పని చేసే తిమ్మరాయప్ప సన్మానించారు. ఇది సబబు కాదంటూ పోలీసు కమిషనర్ దయానంద.. ఆ ఎస్ఐని వర్తూరు పీఎస్ నుంచి ఆడుగోడికి బదిలీ కానుక ఇచ్చారు. బిగ్బాస్లో పేరుగాంచిన సంతోష్కు అనేక మంది అభిమానులు ఉన్నారు. గతంలో మెడలో పులిగోరు వేసుకోవడంతో అతనిపై కేసు కూడా అయి జైలుకెళ్లి వచ్చాడు. అలాంటి వ్యక్తికి యూనిఫాంలో ఉన్న ఎస్ఐ గంధమాల వేసి మైసూరు పేటాతో సత్కరించడం, ఆ వీడియోలు, ఫోటోలు వైరల్ కాగా అనేకమంది ఎస్ఐని తప్పుబట్టారు. -
మసూద్ అజార్ హతం?
ఇస్లామాబాద్: కాందహార్ విమానం హైజాక్ సూత్రధారి మసూద్ అజార్ బాంబు పేలుడులో హతయ్యాడంటూ సామాజిక మాధ్యమాల్లో పోస్టులు వైరల్గా మారాయి. సోమవారం ఉదయం 5 గంటల సమయంలో పాకిస్తాన్లోని భావల్పూర్ మసీదు నుంచి వస్తుండగా బాంబు పేలిన ఘటనలో అతడు హతమైనట్లు ధ్రువీకరించని ట్వీట్ల ద్వారా తెలుస్తోంది. పేలుడుకు సంబంధించిన వీడియో ఒకటి సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది. అనంతరం పాక్ ఆర్మీ దావూద్ ఇబ్రహీం సహా పలువురు ఉగ్రవాదులపై దాడులు చేపట్టినట్లు సామాజిక మాధ్యమాల్లో వస్తోంది. భారత్లో మోస్ట్ వాంటెడ్గా ఉండి పాకిస్తాన్లో తలదాచుకుంటున్న అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం తదితర రెండు డజన్ల మంది వరకు ఉగ్రవాదులు అనుమానాస్పద పరిస్థితుల్లో మృతి చెందినట్లు వార్తలు వెలువడిన నేపథ్యంలోనే తాజా పరిణామం చోటుచేసుకోవడం గమనార్హం. 2001 పార్లమెంట్పై దాడి ఘటనకు సంబంధించిన కేసుల్లో అజార్ను భారత్ వాంటెడ్గా ప్రకటించింది. 2008లో నేపాల్ నుంచి భారత్కు బయలుదేరిన ఇండియన్ఎయిర్ లైన్స్ విమానాన్ని ఉగ్రవాదులు హైజాక్ చేసి, అఫ్గానిస్తాన్లోని కాందహార్కు తీసుకెళ్లారు. హైజాకర్ల డిమాండ్ మేరకు జైళ్లలో ఉన్న అజార్ సహా ముగ్గురు కరడుగట్టిన ఉగ్రవాదులను భారత్ ప్రభుత్వం విడిచిపెట్టింది. విమాన ప్రయాణికుల్లో ఒకరిని పొడిచి చంపిన ఉగ్రవాదులు, మరికొందరిని గాయపరిచారు. వారంపాటు కొనసాగిన తీవ్ర ఉత్కంఠ అనంతరం అందులోని 176 మందిని ఉగ్రవాదులు సురక్షితంగా విడిచిపెట్టారు. -
హాయిగా నడుస్తూ వెళ్తున్న వ్యక్తికి హఠాత్తుగా పులి ఎదురైతే?
సింహం, పులి, చిరుత.. వీటి పేర్లు వినగానే మన మనసులో ఎక్కడో భయం నెలకొంటుంది. ఒకవేళ ఈ అటవీ జంతువులు ఎదురైతే ఎవరైనా సరే ఒక్క ఉదుటున పరుగులందుకుంటారు. ఈ ప్రమాదకరమైన జంతువులకు సంబంధించిన వీడియోలు తరచూ ఇంటర్నెట్లో దర్శనమిస్తుంటాయి. వీటిలో కొన్ని ఒళ్లు గగుర్పొడిచేలా ఉంటాయి. తాజాగా ఇలాంటి వీడియో ఒకటి వైరల్గా మారింది. ఆ వీడియోలో తొలుత ఒక వ్యక్తి రహదారి గుండా హాయిగా నడుచుకుంటూ వెళుతున్నట్లు కనిపిస్తాడు. ఇంతలో అకస్మాత్తుగా ఒక పులి అతని ముందు నుంచి వేగంగా పరుగులు తీస్తూ వెళుతుంది. దానిని చూసి ఆ వ్యక్తి షాకవుతాడు. ఈ వీడియోను ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ ఆఫీసర్ పర్వీన్ కస్వాన్ సోషల్ మీడియా ప్లాట్ఫారమ్ ఎక్స్లో షేర్ చేశారు. వీడియోను షేర్ చేసిన ఆయన దాని క్యాప్షన్లో ఇలా రాశారు. ‘ఇతను అందరికన్నా అదృష్టవంతుడైన వాడా? టైగర్ అతనిని చూసి అస్సలు స్పందించలేదు..’ అని రాశారు. కేవలం 41 సెకన్ల పాటు ఉన్న ఈ వీడియోను డిసెంబర్ 8న ఎక్స్లో షేర్ చేయగా, దీనిపై వ్యూవర్స్ రకరకాలుగా తమ స్పందనలు వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటి వరకు ఈ వీడియోను 4 లక్షల 76 వేల మంది వీక్షించగా, 5 వేల మందికి పైగా వ్యూవర్స్ ఈ వీడియోను లైక్ చేశారు. ఒక యూజర్.. ‘సర్, ఇది ఉత్తరాఖండ్ ప్రజలకు సాధారణమైన అంశం’ అని రాశారు. మరొకరు ‘ఆ టైగర్ ఉపవాస దీక్షలో ఉంది’ అని రాశారు. ఇది కూడా చదవండి: ఆ మూడు రాష్ట్రాలకు ముఖ్యమంత్రులెవరు? సస్పెన్స్ వీడేదెన్నడు? Is he the luckiest man alive. Tiger seems least bothered. From Corbett. pic.twitter.com/ZPOwXvTmTL — Parveen Kaswan, IFS (@ParveenKaswan) December 8, 2023 -
రైల్లో సీటు కింద... విమానంలో నెత్తి మీద
‘కౌన్ బనేగా కరోడ్పతి’ తాజా సీజన్ లో కోల్కతాకు చెందిన ఒక గృహిణి తాను నవ్వడమే కాక అమితాబ్ను విపరీతంగా నవ్వించింది. కేబీసీ వల్ల మొదటిసారి విమానం ఎక్కిన ఆమె రైల్లోలాగా చీటికి మాటికి సీటు కింద చూసుకుంటూ లగేజీ ఉందా లేదాననే హైరానా విమానంలో లేకపోవడం తనకు నచ్చిందని చెప్పింది. ఇంకా సరదా కబుర్లు చెప్పి అమితాబ్ను నవ్వించిన అలోకిక భట్టాచార్య వైరల్ వీడియో గురించి.... సోనీ టీవీలో ప్రసారమవుతున్న ‘కౌన్ బనేగా కరోడ్పతి’ తాజా సిరీస్ తాజా ఎపిసోడ్లో కోల్కటాకు చెందిన అలోకిక భట్టాచార్య అనే గృహిణి అమితాబ్నే కాక ప్రేక్షకులను చాలా నవ్వించింది. ఆమె క్లిప్పింగ్ను అమితాబ్తో పాటు ఇతరులు ‘ఎక్స్’లో షేర్ చేయడంతో నెటిజన్లు ముచ్చటపడుతున్నారు. గత 17 ఏళ్లుగా ప్రయత్నిస్తే ఇప్పటికి కేబీసీలో పాల్గొనే అవకాశం దొరికిన అలోకిక ‘జై కేబీసీ’ నినాదంతో హాట్సీట్లో కూచుంది. ‘మీ ప్రయాణం ఎలా సాగింది?’ అని అమితాబ్ అడిగితే ‘కేబీసీ పుణ్యమా అని మొదటిసారి విమానం ఎక్కాను. మాలాంటి వాళ్లం రైలెక్కి ప్రతి పది నిమిషాలకూ ఒకసారి సీటు కింద లగేజ్ ఉందా లేదా చూసుకుంటాం. అర్ధరాత్రి మెలకువ వచ్చినా మొదట సీటు కిందే చూస్తాం. విమానంలో ఆ బాధ లేదు. లగేజ్ నెత్తి మీద పెట్టారు. పోతుందనే భయం వేయలేదు’ అనేసరికి అమితాబ్ చాలా నవ్వాడు. ‘కేబీసీ వాళ్లు ఎలాంటి ప్రశ్నలు వెతికి ఇస్తున్నారంటే నేనసలు ఏమైనా చదువుకున్నానా అని సందేహం వస్తోంది’ అని నవ్వించిందామె. ‘నువ్విలా నువ్వుతుంటే మీ అత్తగారు ఏమీ అనదా?’ అంటే ‘అంటుంది. కాని నేను నా జీవితంలో జరిగిన మంచి విషయాలు గుర్తు తెచ్చుకుని ఎప్పుడూ నవ్వుతుంటాను. అదే నా ఆరోగ్య రహస్యం. మూడు పూటలా అన్నం, పప్పు, చేపలు తింటూ కూడా సన్నగా ఎలా ఉన్నానో చూడండి. ఫ్రీగా. కొంతమంది ఇలా ఉండటానికి డబ్బు కట్టి జిమ్ చేస్తుంటారు’ అని నవ్వించిందామె. అలోకిక ఈ ఆటలో పన్నెండున్నర లక్షలు గెలిచి ఆట నుంచి విరమించుకుంది. ఆ మొత్తం ఆమెకు చాలా ముఖ్యమైనదే. కాని అమితాబ్తో నవ్వులు చిందించడం అంతకంటే ముఖ్యంగా ఆమె భావించింది. This clip of #KBC is so very endearing! Her innocent, Joyous State of being is infectious. @SrBachchan Sahab is equally amazing.. Now Watch it and get infected with Joy! pic.twitter.com/5ylvrUGhlH — Adil hussain (@_AdilHussain) December 1, 2023 -
రష్మిక డీప్ ఫేక్ వీడియో: కీలక పరిణామం, ఇది వాడి పనేనా?
స్టార్ హీరోయిన్ రష్మిక మందన్నా డీప్ ఫేక్ వీడియో ఘటనలో కీలక పరిణామంచోట చేసుకుంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న ఢిల్లీ పోలీసులు బిహార్కు చెందిన 19 ఏళ్ల యువకుడిని ప్రశ్నించారు. విచారణలో భాగంగా ఆ యువకుడిని ప్రశ్నించినట్టు అధికారులు బుధవారం వెల్లడించారు. నిందిత యువకుడి సోషల్ మీడియా ఖాతానుండే అప్లోడ్ అయినట్లు పోలీసులు గుర్తించారు. ఆ తరువాత ఇతర ప్లాట్ఫామ్స్లో షేర్ చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆ యువకుడికి పోలీసులు నోటీసులు కూడా ఇచ్చారు. అయితే, ఈ కేసులో ఇప్పటివరకూ ఎవరినీ అరెస్ట్ చేయలేదు. మరోవైపు విచారణ సందర్భంగా వేరే ఇన్స్టా ఖాతానుంచి ఆ వీడియోను తాను డౌన్లోడ్ చేసుకున్నట్లు యువకుడు చెప్పినప్పటికీ, విచారణ కొనసాగుతుందని సంబంధిత సీనియర్ అధికారులు తెలిపారు. (వర్క్ ఫ్రం హోం, ఆదాయంపై సంచలన సర్వే:ఆ దిగ్గజాలు ఇపుడేమంటాయో?) మొబైల్ ఫోన్తో సహా బిహార్కు చెందిన యువకుడిని ఐఎఫ్ఎస్ఓ యూనిట్ ముందు హాజరుకావాలని పోలీసులు అదేశించారు. అలాగే FIR నమోదు చేసిన వెంటనే, IFSO యూనిట్ కూడా నిందితుడిని గుర్తించడానికి URL ఇతర వివరాల కోసం సోషల్ మీడియా దిగ్గజం, ఫేస్బుక్ మాతృసంస్థ మెటాకు లేఖ రాసింది. ఇది ఇలా ఉంటే ఈ ఘటనలో నవంబర్ 10న, ఇంటెలిజెన్స్ ఫ్యూజన్ అండ్ స్ట్రాటజిక్ ఆపరేషన్స్ (IFSO)లో ఇండియన్ పీనల్ కోడ్ సెక్షన్ 465 (ఫోర్జరీకి శిక్ష) , 469 (పరువుకు భంగం కలిగించే ఉద్దేశ్యంతో ఫోర్జరీ) , ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టంలోని సెక్షన్లు 66C , 66E కింద ఢిల్లీ పోలీస్ స్పెషల్ సెల్ యూనిట్ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. (దీపావళి తరువాత పసిడి పరుగు: డాలర్ ఢమాల్) కాగా నటి రష్మిక డీప్ ఫేక్ వీడియో ఆన్లైన్లో మహిళల సెక్యూరిటీపై ఆందోళన రేపింది. బిగ్బీ అమితాబ్ సహా పలువురు నటీ నటులు, ఇతర సెలబ్రిటీలు ఈ ఘటనకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. చివరికి కేంద్ర ఐటీ శాఖ కూడా స్పందించి మరోసారి సోషల్ మీడియా సంస్థలు ఐటీ నిబంధనల్ని కఠినంగా అమలు చేయాలని గుర్తు చేసింది. (చాలా బాధ కలిగింది, ప్రతీదీ నిజం కాదు..ఇందులో నా ప్రమేయం ఏమీ లేదు!) -
వారానికి 70 గంటల పని: ఇన్ఫో ‘సిస్’ వీడియో వైరల్.. మీ పొట్ట చెక్కలే!
70 hour work week remark hilarious video viral భారతీయు యువత వారానికి 70 గంటలు పని పనిచేయాలన్న ఇన్ఫోసిస్ నారాయణమూర్తి వ్యాఖ్యలు పెను దుమారాన్నే రాజేశాయి. కొంతమంది కంపెనీల ప్రతినిధులు, నెటిజన్లు ఆయనపై విమర్శలు గుప్పించగా, పలువురు ఐటీ దిగ్గజాలు ఇన్ఫీ మూర్తికి మద్దతుగా నిలిచారు. ఇవన్నీ ఒక ఎత్తయితే ప్రధానంగా ఇండస్ట్రీలో మహిళా ఉద్యోగులపై వివక్షపై ఎక్కువ చర్చ నడిచింది. ఇంటా బయటా మహిళా ఉద్యోగుల పనిగంటలు, వారికి లభిస్తున్న గుర్తింపు, అందుతున్న వేతనం తదితర విషయాలు చర్చనీయాంశమైనాయి. ఈ నేపథ్యంలోనే ఇంటర్నెట్లో ఒక వీడియో చక్కర్లు కొడుతోంది. ఇన్ఫీ ‘సిస్’ పేరుతో వైరల్ అవుతున్న ఈ వీడియోను వ్యాపారవేత్త హర్ష గోయెంకా ఎక్స్(ట్విటర్)లో షేర్ చేశారు. 70-80-90 గంటలు పనిచేస్తున్నారు గృహిణులు దగ్గర మొదలు పెట్టి.. నారాయణ ..నారాయణ.. అంటూ ఇన్ఫో ‘సిస్’ మీకు ఇన్ఫో ఇస్తోంది బ్రో.. అంటూ తనదైన యాక్సెంట్తో సాగిన ఈ వీడియో నెట్టింట్ హల్చల్ చేస్తోంది. ఈ హిలేరియస్ వీడియోపై నెటిజన్లు స్పందిస్తున్నారు. వావ్.. నిజం చెప్పారు. గృహిణులు 70 నుండి 80 గంటలు పని చేస్తారు.. లవ్ యూ ఫర్ అండర్ స్టాండింగ్ .. ఇన్ఫో ‘సిస్’ అని ఒక యూజర్ కమెంట్ చేశారు. ఇది నూటికి నూరు శాతం, ఈ వీడియోను ఇన్ఫీ మూర్తి అంకుల్ చూడాలి అని మరొకరు వ్యాఖ్యానించడం విశేషం Info sis giving you info on 70 hour week! 😂😂 pic.twitter.com/rh6Jw1n2TD — Harsh Goenka (@hvgoenka) November 6, 2023 -
HYD: పోలీస్ వాహనంతో ప్రీ వెడ్డింగ్ షూట్ !
సాక్షి, హైదరాబాద్: పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో జరిగిన ప్రీ వెడ్డింగ్ షూట్ ఇప్పుడు వార్తల్లోకి ఎక్కింది. పోలీస్ వాహనంతో.. అదీ విధి నిర్వహణలో ఉండగానే ఇద్దరు పోలీస్ అధికారులు షూట్లో పాల్గొన్నారు. దీనిపై సోషల్ మీడియాలో విమర్శలు వినిపిస్తున్నాయి ఇప్పుడు. ఎస్సై భావనతో ఏఆర్ ఎస్సై రావూరి కిషోర్ వివాహం ఆగష్టు 26వ తేదీన జరిగింది. అయితే.. వివాహానికి ముందు ఈ జంట వెడ్డింగ్ షూట్ నిర్వహించింది. రకరకాల లొకేషన్లో షూట్లో పాల్గొంది ఆ టైంలో ఆ కాబోయే జంట. అంత వరకు పర్వాలేదు. అయితే షూట్ ఆరంభంలోనే.. మూడు సింహాలను చూపించి, ఇద్దరూ సినిమా లెవల్లో వాహనాల నుంచి కిందకు దిగి.. పీఎస్ బయట షూట్లో పాల్గొన్నారు. దీంతో యూనిఫాంలో అదీ పోలీస్ వాహనంతో ప్రీ వెడ్డింగ్ షూట్ చేయడంపై విమర్శలు మొదలయ్యాయి. విధి నిర్వహణలో అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారంటూ కొందరు కామెంట్లు చేస్తున్నారు. అయితే.. దీనిపై ఉన్నతాధికారుల స్పందన తెలియాల్సి ఉంది. -
కాలం కలిసి వస్తే డంప్యార్డ్ కూడా నందనవనం అవుతుంది!
కాలం కలిసే వస్తే... కంపు కొట్టే డంపు యార్డ్ కూడా కనుల విందు చేసే పార్క్ అవుతుంది. రాజస్థాన్లోని రాజ్గఢ్లో ఒక డంప్ యార్డ్ ఉండేది. దుర్వాసన వల్ల ఆ చుట్టుపక్కల నుంచి నడిచి వెళ్లాలంటే జనాలు జడుసుకునేవారు. అలాంటి చోటుకు ఇప్పుడు జనాలు వెదుక్కుంటు వస్తున్నారు. దీనికి కారణం ఈ డంప్యార్డ్ను మున్సిపాలిటీ సిబ్బంది అందమైన పార్క్గా తయారుచేయడమే. వాటర్ ఫౌంటెన్లు, పచ్చటి గడ్డితో ఈ పార్క్ కనువిందు చేస్తోంది. ఇండియన్ ఫారెస్ట్ ఆఫీసర్ సవిత దావియా ఈ క్లిప్ను ట్విట్టర్లో షేర్ చేశారు. ‘ఎన్నో పట్టణాలలో ఎన్నో డంప్యార్డ్లు భయపెడుతున్నాయి. అవి కూడా ఇలాగే నందనవనంలా మారితే ఎంత బాగుంటుంది’ అంటూ ఒక ఎక్స్ యూజర్ స్పందించాడు. A former dumpyard converted to this public park on Municipality land by #ForestDept #Churu in 3 months#Motivation - Kids like mine hv a place to go, staff learnt new skill, dept got recognition & a public asset created 🌿#urban #Forestry@ParveenKaswan@RajGovOfficial pic.twitter.com/SG0OVigORS — God's Favourite Child (@Savi_IFS) September 7, 2023 (చదవండి: బహుముఖ ప్రజ్ఞాశాలి! ఒకటి రెండు కాదు!.. ఏకంగా 34 సబ్జెక్టుల్లో టాపర్) -
ఈ ఇల్లు చూస్తే నిజంగా అదృష్టవంతులం అనుకుంటారు! ఎందుకంటే..
Tiny 1 BHK Flat In Mumbai: భారతదేశంలోని అత్యంత ఖరీదైన నగరాల్లో ముంబయి (Mumbai) అగ్రస్థానంలో ఉంది. దేశ ఆర్థిక రాజధానిగా పిలిచే ముంబై నగరంలో ఇళ్లు చాలా ఖరీదైనదని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇక్కడ ఇల్లు కొన్నాలన్నా, అద్దెకు తీసుకోవాలన్నా చాలా కష్టం. అందుకే ఇక్కడ ప్రజలు అత్యంత ఇరుకు అపార్ట్మెంట్లలో నివసిస్తుంటారు. ఇటీవల ఒక ఇన్స్టాగ్రామ్ (Instagram) యూజర్ ముంబైలోని వన్ బీహెచ్కే (1 BHK) ఫ్లాట్ హౌస్ టూర్ వీడియోను షేర్ చేశాడు. ఈ వీడియో చూసిన యూజర్లు.. ఇదెక్కడి ఇల్లురా బాబూ.. అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. అలాంటి ఇంట్లో ఉండనందుకు నిజంగా చాలా అదృష్టమంతులమంటూ కామెంట్లు చేస్తున్నారు. సుమిత్ పాల్వే అనే యువకుడు ఇన్స్టాగ్రామ్లో ఈ హౌస్ టూర్ వీడియోను షేర్ చేశాడు. ఇది సౌత్ బాంబే కాబట్టి ఇరుకు ఇళ్లకు రాజీ పడాల్సిందే అంటూ ఆ వీడియో ప్రారంభంలోనే పేర్కొన్నాడు. అత్యంత చిన్నది, ఇరుకైనది అయిన ఆ ఇంటిని చూపించడానికి చాలా కష్టపడ్డాడు ఆ యువకుడు. అత్యంత ఖరీదైన దక్షిణ ముంబైలో రూ. 2.5 కోట్లు పెట్టి కొనే అపార్ట్మెంట్లు కూడా ఇలాగే ఇరుగ్గా ఉంటాయని, రాజీ పడక తప్పదని వివరించాడు. View this post on Instagram A post shared by SUMIT PALVE (@me_palve) -
ఐఫోన్ కావాలంటే కొనుక్కోవాలికానీ కొరికితే ఎలా? వింత చోరీ వీడియో వైరల్!
iPhone theft: యాపిల్ ఐఫోన్ (Apple iPhone)15 త్వరలో లాంచ్ కాబోతోంది. యమా క్రేజ్ ఉండే ఐఫోన్లు ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో ట్రెండింగ్లో ఉంటున్నాయి. అయితే ఇది అప్డేట్లకు సంబంధించినది కాదు.. ఐఫోన్ చోరీకి సంబంధించినది. ఖరీదైన ఐఫోన్ల చోరీల గురించి తరచూ వింటుంటాం. ఈమధ్య ఈ ఫోన్ల దొంగతనాలు సృజనాత్మకంగా మారాయి. అలాంటిదే చైనాలో ఒకటి తాజాగా జరిగింది. ఆ చోరీకి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ నివేదిక ప్రకారం.. చైనాలోని ఓ యాపిల్ స్టోర్లో సుమారు రూ. 80,000 విలువ చేసే ఐఫోన్ 14 ఫ్లస్ (iPhone 14 Plus)ని చాకచక్యంగా దొంగిలించింది ఓ మహిళ. స్టోర్లో డిస్ప్లేకు ఉంచిన ఫోన్ను యాంటీ-థెఫ్ట్ కేబుల్ను కొరికేసి తన బ్యాగులో వేసుకుంది. అలారం స్టోర్ సిబ్బంది గుర్తించలేకపోయారు. చోరీ జరిగిన అరగంట తర్వాత చూసుకున్న సిబ్బంది పోలీసులకు సమాచారం అందించడంతో వారు ఆ మహిళను అరెస్ట్ చేశారు. VIDEO: MUJER SE ROBA UN IPHONE A MORDIDAS Una cámara de seguridad captó el momento en que mujer roba un #iPhone de exhibición a mordidas en una Apple Store en #China. En las imágenes se puede apreciar a la fémina acercándose de manera disimulada a la mesa donde se encontraban… pic.twitter.com/eC7E6poeUy — El Dato Noticias Morelos (@eldatomx) September 2, 2023 -
మెట్రోలో జిమ్నాస్టిక్ స్టైల్లో యువతి స్టంట్స్.. వీడియో వైరల్..
నగరాల్లో వేగంగా, సురక్షితంగా ప్రయాణించడానికి మెట్రో ప్రయాణం సులభతరం. అలాంటి మెట్రోలో డ్యాన్సులు చేస్తూ తోటి ప్రయాణీకులకు ఇబ్బంది కలిగిస్తున్న వీడియోలు ఇటీవల వెలుగులోకి వచ్చాయి. సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడానికి మెట్రోలో ఏదో ఒక విచిత్రమైన పని చేసి వార్తల్లోకి ఎక్కుతున్నారు. తాజాగా ఇలాంటి ఓ ఘటనే వెలుగులోకి వచ్చింది. మెట్రో ప్రయాణీకులతో రద్దీగా ఉంది. కొందరు ప్రయాణీకులు నిలబడి ఉన్నారు. అందరూ చూస్తుండగానే ఓ యువతి జిమ్నాస్టిక్ స్టైల్లో స్టంట్స్ చేసింది. ఎంతో నైపుణ్యం కలిగినట్లుగా చాకచక్యంగా ప్రదర్శన ఇచ్చింది. ఈ దృశ్యాలను చూస్తున్న ప్రయాణికులు కళ్లార్పకుండా చూస్తూ ఉండిపోయారు. యువతి ప్రదర్శన చేస్తుండగా.. మరో వ్యక్తి ఫొన్లో ఆ దృశ్యాలను రికార్డ్ చేశాడు. View this post on Instagram A post shared by MISHA SHARMA 🇮🇳 (@mishaa_official_) ఈ వీడియోను మిశా శర్మా అనే యూజర్ తన ఇన్స్టాలో పోస్టు చేసింది. ఇది కాస్త వైరల్ అయింది. 5.2 లక్షల వ్యూస్ వచ్చాయి. 45 వేల లైక్స్ వచ్చాయి. ఈ వీడియోలోని ఘటన ఎక్కడ జరిగిందని పలువురు నెటిజన్లు ప్రశ్నలు వేయగా.. ఓ వ్యక్తి రాజస్థాన్ అని తెలపారు. దీనిపై మరో యూజర్ స్పందిస్తూ.. బెంగళూరులో జరిగిందని వెల్లడించారు. ఆ వీడియో తీసే క్రమంలో తాను మెట్రోలోనే ఉన్నట్లు పేర్కొన్నాడు. ఇండియా తరుపన ఆడితే మెడల్ తేవొచ్చు.. ఇక్కడ చేస్తూ టైం వేస్టు చేయొద్దని మరో వ్యక్తి కామెంట్ పెట్టాడు. ఇదీ చదవండి: రాహుల్ గాంధీ బైక్ రైడ్.. ధన్యవాదాలు తెలిపిన కేంద్ర మంత్రులు.. -
ఇదేందిది.. ఒక్క బైక్పై ఏడుగురా?.. ఆఖరోడు అలా కూర్చున్నాడేంటి?
రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రభుత్వ లేక్కలేనన్ని చర్యలు చేపడుతోంది. అయినా కొందరు ప్రభుత్వ నిబంధనలు ఉల్లంఘించి, వాహనాలను ఇష్టమొచ్చినట్లు నడుపుతున్నారు. తాజగా సోషల్ మీడియాలో ఒక వీడియో వైరల్గా మారింది. ఈ వీడియోను చూసినవారంతా ఆశ్చర్యంతో నోరెళ్లబెడుతున్నారు. ఈ బైక్పై ఒకరో, ఇద్దరో కాదు ఏకంగా ఏగుగురు కుర్రాళ్లు రయ్యిమని దూసుకుపోతున్నారు. పైగా వారు తామేదో ఘనకార్యం చేశామన్నట్టు ఫీలవుతున్నారు. ఈ వీడియో యూపీలోని హాపూర్కు చెందినదని తెలుస్తోంది. ఏడుగురు కుర్రాళ్లు నిర్భయంగా బైక్పై కూర్చుని ప్రయాణించడాన్ని వీడియోలో చూడవచ్చు. వారిలో చివరనున్న కుర్రాడు ముందునున్న కుర్రాడిపై ఎక్కి కూర్చున్నాడు. 22 సెకెన్లపాటు ఉన్న ఈ వీడియోలో బైక్పై కూర్చున్న కుర్రాళ్ల తీరు చూస్తే ఎవరికైనా ఆందోళన కలుగుతుంది. అయితే ఆ బైక్పై ఉన్నవారితో కించిత్తు ఆందోళన కూడా లేకపోవడం విశేషం. ఈ వీడియోను చూసినవారంతా ఆ కుర్రాళ్లపై పోలీసులు చర్యలు చేపట్టాలని కోరుతున్నారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియోను @Akshara117 అనే ట్విట్టర్ అకౌంట్లో షేర్ చేశారు. ఇది కూడా చదవండి: పంద్రాగస్టుకు ఇంటికి మువ్వన్నెల జెండా.. ఫ్రీ డెలివరీ.. బుకింగ్ ఇలా.. Video of 7 people riding a bike in #Hapur goes viral, raising questions on the working style of Hapur police. #Viralvideo pic.twitter.com/wfMfjkOkdF — Akshara (@Akshara117) August 9, 2023 -
మణిపూర్ హింస.. సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన బాధిత మహిళలు
ఇంఫాల్: మణిపూర్లో నగ్నంగా ఊరేగించిన ఇద్దరు మహిళలు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. సుప్రీంకోర్టు ఈ కేసును సుమోటోగా స్వీకరించి న్యాయబద్ధమైన, నిష్పక్షపాత ధోరణిలో విచారణ జరిపించాలని అభ్యర్ధించారు. మణిపూర్ అల్లర్లు మొదలైన మరుసటి రోజున ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకుని వలసపోతున్న ఇద్దరు మహిళలను మొదట వివస్త్రులను చేసి తర్వాత వారిపై అత్యాచారానికి పాల్పడిన సంఘటన దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ సంఘటన జరిగి రెండు నెలలు దాటినా కూడా వీడియో బయటకు వచ్చేంతవరకు దర్యాప్తు ప్రారంభం కాకపోవడమే అనేక అనుమానాలకు తావిస్తోంది. సుప్రీంకోర్టు కూడా వీడియో విషయంపై చాలా సీరియస్ అయ్యింది. ఇది పూర్తిగా రాజ్యాంగ వైఫల్యమేనని జస్టిస్ డివై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం పేర్కొంది. మణిపూర్ సంఘటన తీవ్రంగా కలచివేసింది. ప్రభుత్వం వెంటనే స్పందించాలి. మీకు చేతకాకపోతే చెప్పండి మేమే రంగంలోకి దిగుతామని హెచ్చరించింది కూడా. రాష్ట్రంలో మహిళల భద్రత విషయమై మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలని.. ఎప్పటికప్పుడు అక్కడి పురోగతి గురించి తమకు తెలపాలని కూడా సుప్రీం కోర్టు కేంద్రాన్ని ఆదేశించింది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం కలిపి మణిపూర్ వీడియో కేసును సీబీఐకి బదిలీ చేయాలని కోరుతూ సుప్రీం కోర్టును కోరగా ఈ రోజు అత్యున్నత న్యాయస్థానంలో దీనిపై విచారణ జరగాల్సి ఉంది. ఈ కేసులో ఇప్పటికే ఏడుగురిని అదుపులోకి తీసుకున్నారు మణిపూర్ పోలీసులు. ఇదిలా ఉండగా నగ్నంగా ఊరేగించబడిన మహిళలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై పిటిషన్ దాఖలు చేయడం సంచలనంగా మారింది. ఇది కూడా చదవండి: కేరళలో దారుణం.. ఐదేళ్ల బాలిక రేప్, హత్య.. -
రద్దీ రోడ్లపై చక్కర్లు కొడుతున్న డ్రైవర్లెస్ కారు.. నెటిజన్లు ఫిదా..!
బెంగళూరు: బెంగళూరు రోడ్లపై డ్రైవర్ లేకుండా నడుస్తున్న ఓ వింత ఆకారంలో ఉన్న వాహనం స్థానికుల్నిఆశ్చర్యానికి గురిచేసింది. ఇదేదో బాలీవుడ్ మూవీలో కారు ఆకారంలో ఉన్న వాహనంలా ఉందని ఓ యూజర్ సామాజిక మాధ్యమాల్లో పంచుకున్నాడు. ఆన్ ద స్ట్రీట్స్ ఆఫ్ బెంగళూరు అనే క్యాప్షన్ను జతచేసి పోస్టు చేశాడు. ఈ కారును చూసిన నెటిజన్లు ఇదేంటీ ఇలా ఉందని? ప్రశ్నించారు. డ్రైవర్ లేకుండా ఎలా ఇంత ట్రాఫిక్లో నడుస్తోందని ఆశ్చర్యానికి గురయ్యారు. ఈ కారుని జీప్యాడ్ అని అంటారని ఓ యూజర్ క్లారిటీ ఇచ్చాడు. సెల్ఫ్ డ్రైవింగ్ కారుని మైనస్ జీరో అనే అంకుర సంస్థ రిలీజ్ చేసినట్లు తెలుస్తోంది. ఈ అంశాన్ని మైనస్ జీరో సంస్థ తన ఇన్స్టా పేజీలో వివరంగా పేర్కొంది. ఇప్పటికే రెండు సార్లు ఈ వాహనం రోడ్లపై కనిపించిందని బెంగుళూరు వాసులు తెలిపారు. టెస్టింగ్లో భాగంగానే ఇలా రోడ్లపై కారు ప్రత్యక్షమైనట్లు సమాచారం. ఇది భారతదేశంలోనే మొట్ట మొదటి అటానమస్ వాహనం. On the streets of Bengaluru. @peakbengaluru pic.twitter.com/VtahXpa6Mh — anirudh ravishankar (@anrdh89) July 22, 2023 అయితే.. సంప్రదాయ కార్లకు భిన్నంగా ఉండే ఈ జీప్యాడ్కు స్టీరింగ్ ఉండదు. హై రిజల్యూషన్ కెమెరాలతో ట్రాఫిక్లోనూ నడుస్తోంది. ఈ కారులో మొత్తం 6 కెమెరాలు అమర్చారు. వీటి సాయంతో చుట్టూరా ఉన్న పరిస్థితులను ఎప్పటికప్పుడు అంచనావేస్తుంది. ప్రమాదం అనిపిస్తే వెంటనే వాహనం నిలిచిపోతుంది. ట్రాఫిక్ సమస్యను, రోడ్డు ప్రమాదాలను తగ్గించటంలో భాగంగానే దీన్ని తీసుకొచ్చినట్లు మైనస్ జీరో తెలిపింది. ఇదీ చదవండి: శుభకార్యాల్లో సినిమా పాటలు.. కాపీ రైట్ కిందకు వస్తుందా..? కేంద్రం ఏం చెప్పింది..? -
Viral Video: ఆంటీలు ముచ్చట్లు పెడితే అట్లుంటది మరి..
Viral Video: హోరువాన కురుస్తుంటే వెంటనే ఏ చెట్టు కిందకో గూడు కిందకో పరిగెడతాం. కానీ ఇక్కడో కాలనీలోని మహిళలు జోరుగా వాన పడుతుంటే ఏమాత్రం పట్టించుకోకుండా తీరికగా కబుర్లు చెబుతూ కనిపంచారు. ఈ దృశ్యాన్ని ఎవరో వీడియో తీసి ఇంటర్నెట్లో పోస్ట్ చేయడంతో నిముషాల్లో వైరల్ అయ్యింది. దేశ వ్యాప్తంగా హోరువానలు జోరుగా కురుస్తున్నాయి. ఎక్కడపెడితే అక్కడ వరదలు బీభత్సాన్ని సృష్టిస్తున్నాయి. ఉత్తర భారతదేశంలో చాలా ప్రాంతాలైతే వర్షం ఉధృతికి చెల్లాచెదురయ్యాయి. ఒకపక్క దేశంలో ఇంతటి విపత్కర పరిస్థితులు నెలకొంటూ ఉంటే.. ఓ కాలనీలోని అపార్ట్మెంట్ వారు మాత్రం ఈ వర్షాలు మనల్నేమి చేస్తాయిలే వదినా..? అంటూ సీరియల్ కబుర్లు చెప్పుకుంటూ వర్షంలో ఒళ్ళు మర్చిపోయి తడుస్తూ కనిపించారు. సాధారణంగా ఆడవాళ్ళ గుంపు ఒకచోట చేరిందంటే ఆ ముచ్చట అంత తొందరగా తేలదని అంటూ ఉంటారు. ఈ దృశ్యాన్ని చూస్తే అది నిజమేనేమో అనిపించక మానదు. వీడియోలో ముగ్గురు ఆడవాళ్లు కింద కూర్చుని మాట్లాడుకుంటూ ఉంటే.. ఇద్దరు మాత్రం వెనుక బెంచి మీద కూర్చుని మాట్లాడుకుంటున్నారు.. ఒక చిన్న పిల్లాడైతే చెంగు చెంగున దూకుతూ అక్కడే ఆడుకుంటున్నాడు. Tez baarish bhi iss prakar ke data transfer ko nahi rok sakti 👏pic.twitter.com/r3kaGXxwx2 — SwatKat💃 (@swatic12) July 20, 2023 ఇది కూడా చదవండి: అది ఒకప్పటి వీడియో, రాజీనామా చేసేది లేదు.. -
2015లో తన నటనతో కన్నీళ్లు తెప్పించిన ఈ చిన్నది గుర్తుందా..?
బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ నటించిన ‘బజరంగీ భాయిజాన్’ అప్పట్లో పెద్ద సంచలనం. విజయేంద్ర ప్రసాద్ ఈ సినిమాకు కథ అందించగా కబీర్ ఖాన్ ఈ సినిమాకు దర్శకత్వం అందించారు. 2015లో విడుదలైన ఈ సినిమా ప్రేక్షకుల మనసులతో పాటు బాక్సాఫీసునూ కొల్లగొట్టింది. పాకిస్తాన్కు చెందిన ఓ మూగ, చెవిటి చిన్నారిని.. కన్నవారి వద్దకు చేర్చేందుకు ఓ భారతీయ యువకుడు (సల్మాన్ ఖాన్) ఎన్ని కష్టాలు ఎదుర్కొన్నాడనేది ఈ సినిమా కథ. (ఇదీ చదవండి: 'గుంటూరు కారం'లో హాట్ బ్యూటీ.. బిగ్ అప్డేట్ రివీల్ చేసేసింది) ఇందులో మూగ,చెవిటి చిన్నారి పాత్రలో హర్షాలీ మల్హోత్రా (మున్నీ)గా మెప్పించింది. అప్పటికి ఆమె వయసు 7 ఏళ్లు మాత్రమే. కానీ అందులో సల్మాన్తో పోటీగా నటించి మెప్పించింది. తన అమాయకమైన ముఖంతో ప్రేక్షకులకు కన్నీరు తెప్పించిన ఆమెను అంత త్వరగా ఎవరూ మర్చిపోలేరు. ఆ సినిమాకు గాను ఫిల్మ్ ఫేర్ అవార్డుకు కూడా హర్షాలీ నామినేట్ అయింది. అప్పట్లో తనకు సుమారు రూ. 3 లక్షలు రెమ్యునరేషన్ ఇచ్చారని టాక్. తాజాగా ఆమె ఇప్పుడెలా ఉందో తెలుపుతూ ఒక వీడియో వైరల్ అయింది. ఆ తర్వాత తను ఎలాంటి సినిమాల్లో మళ్లీ నటించలేదు. ప్రస్తుతం చదువుకుంటూ సంగీతం నేర్చుకుంటుంది. కానీ సల్మాన్తో మాత్రం ఇప్పటికీ టచ్లోనే ఉంటున్నట్లు చెప్పుకొచ్చింది. తను సంగీతం నేర్చుకునేందుకు వెళ్తుండగా కొందరు ఫోటో గ్రాఫర్లు హర్షాలీ మల్హోత్రాను కెమెరాలతో క్లిక్ మనిపించారు. ఆ ఫోటోనే ఇప్పుడు సోషల్ మీడియా వైరల్ అవుతుంది. View this post on Instagram A post shared by F I L M Y G Y A N (@filmygyan) (ఇదీ చదవండి: బిగ్బాస్లోకి ఈ జంట ఎంట్రీ ఖాయం.. వాళ్లకు బిగ్ సపోర్ట్ ఎవరో తెలిస్తే) -
నటి 'వామిక గబ్బి' కారు కొనేసిందోచ్.. ధర ఎన్ని లక్షలంటే?
సాధారణంగా సెలబ్రిటీలు, పారిశ్రామిక వేత్తలు, క్రికెటర్లు ఎప్పటికప్పుడు తమకు నచ్చిన కార్లను కొనుగోలు చేస్తూ ఉంటారు. ఇలాంటి నేపథ్యంలో భాగంగానే పంజాబీ, హిందీ, తమిళం, మలయాళం, తెలుగు భాషల్లో నటించిన 'వామిక గబ్బి' (Wamiqa Gabbi) ఇటీవల అమెరికన్ బ్రాండ్ కారుని కొనుగోలు చేసింది. దీనికి సంబంధించిన ఒక వీడియో ఆమె ఇన్స్టాగ్రామ్ పేజీలో పోస్ట్ చేసింది. భలే మంచి రోజు సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన వామిక ఎక్కువగా పంజాబీ సినిమాల్లో కనిపించింది. దీంతో బహుశా తెలుగు ప్రేక్షకులకు ఈమె గురించి పెద్దగా తెలిసి ఉండకపోవచ్చు. కాగా ఈ భామ ఇటీవల కొనుగోలు చేసిన కారు జీప్ కంపెనీకి చెందిన మెరిడియన్. దీని ధర రూ. 40 లక్షల వరకు ఉంటుందని తెలుస్తోంది. జీప్ మెరిడియన్ డెలివరీ తీసుకునే సమయంలో వామిక ముంబైలోని కంపెనీ డీలర్షిప్లో ఎంతో ఉత్సాహాన్ని ప్రదర్శించింది. ఇదే ఆమె మొదటి కారు కావడం ఇక్కడ విశేషం. వీడియో పోస్ట్ చేస్తూ నా తల్లితండ్రులు సహకారంతో.. అభిమానుల ఆదరాభిమానాలతో ఇది సాధ్యమైందని వెల్లడించింది. (ఇదీ చదవండి: ఆ ప్రదేశం చూడగానే ఆకర్షిస్తుంది.. ఒక రాత్రి అక్కడ ఉండగలనా అంటే!) జీప్ మెరిడియన్.. ఇక జీప్ మెరిడియన్ విషయానికి వస్తే.. వామికా కొనుగోలు చేసిన కారు వెల్వెట్ రెడ్ షేడ్లో చూడచక్కగా ఉంది. గత ఏడాది భారతీయ మార్కెట్లో అడుగుపెట్టిన ఈ SUV అతి తక్కువ కాలంలోనే అత్యంత ప్రజాదరణ పొందగలిగింది. ఇది దేశీయ మార్కెట్లో టయోటా ఫార్చ్యూనర్ వంటి వాటికి ప్రధాన ప్రత్యర్థిగా ఉంటుంది. ఇది అద్భుతమైన ఫీచర్స్ కలిగి.. ఫ్లోటింగ్-టైప్ ఇన్ఫోటైన్మెంట్ స్క్రీన్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు వంటి ఆధునిక ఫీచర్స్ ఉన్నాయి. (ఇదీ చదవండి: 11 ఏళ్లకే హల్దిరామ్స్ ఆలోచన.. ప్రపంచ స్నాక్స్ రంగాన్నే షేక్ చేసిన ఇండియన్!) ఇందులోని 2.0-లీటర్ టర్బోచార్జ్డ్ డీజిల్ ఇంజన్ 170 హార్స్ పవర్ 350 ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇంజిన్ 6 స్పీడ్ మాన్యువల్ లేదా 9 స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్తో లభిస్తుంది. ఈ కారు ప్రారంభ ధర రూ. 32.95 లక్షలు (ఎక్స్-షోరూమ్). అయితే ఎంచుకునే వేరియంట్ ఆధారంగా ధరలు మారుతాయి. వామిక ఏ వేరియంట్ కొనుగోలు చేసిందనే విషయం తెలియాల్సి ఉంది. View this post on Instagram A post shared by Wamiqa Gabbi (@wamiqagabbi)
Pagination
ఆ బీప్ సౌండ్ వస్తేనే.. మీ ఓటు వేసినట్టు
ఇది కదా క్రేజ్ అంటే.. సీఎం జగన్ ఇంటర్వ్యూకి మిలియన్ల వ్యూస్
Sakshi.com ఇప్పుడు సరికొత్తగా మీ ముందుకు
కాపులు, ముస్లింలకు రిజర్వేషన్లు అక్కర్లేదు: పవన్కళ్యాణ్
రైతు కుమార్తె విజయం.. రిషబ్ శెట్టి అభినందనలు
పులివెందుల ప్రజలకు ఇద్దరిపైనా ప్రేమే: వైఎస్ భారతి
RCB Vs PBKS: కోహ్లి అరుదైన రికార్డు.. ఐపీఎల్ చరిత్రలోనే తొలి క్రికెటర్గా
Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో బిగ్ ట్విస్ట్..
బిజీగా ఉండటం ఇంత డేంజరా! హెచ్చరిస్తున్న సైకాలజిస్ట్లు
కారులో వాసన బాగుందని తెగ పీల్చుకుంటున్నారా.?
ముగిసిన పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ ప్రక్రియ
శ్రీరామానంద స్వామిజీ పాదయాత్ర
కుంభకోణాలకు చట్టబద్ధత కల్పించింది బీజేపీయే
No Headline
‘దేవర’ చిత్ర యూనిట్ను వదలని తేనెటీగలు
హోరెత్తిన ఎన్నికల ప్రచారం
సంక్షేమ ప్రభుత్వానికి ప్రజల మద్దతు
మన్యంలో మోసగాడు
పశువుల కోసం వెళ్లి గోదావరిలో పడి విద్యార్థి మృతి
హైరిస్క్ గర్భిణుల గుర్తింపు
తప్పక చదవండి
- ఐపీఎల్ మధ్యలోనే దుబాయ్ వెళ్లిన సన్రైజర్స్ కెప్టెన్..
- ఫోటో తీస్తే కవిత రాసే కెమెరా.. ఇది కదా టెక్నాలజీ అంటే!
- అయ్యయ్యో సేతిలో డబ్బులు పోయెనే.. జేబులు ఖాళీ ఆయనే
- పాపం బ్రెజిల్.. ఎటు చూసినా వరదలే..
- కష్టాల్లో 'పద్మ శ్రీ మొగిలయ్య'.. సాయం చేసిన బుల్లితెర నటి
- మేనిఫెస్టోకు, విశ్వసనీయతకు అర్థం చెప్పింది మీ బిడ్డే: సీఎం జగన్
- ‘ కృష్ణమ్మ’ మూవీ రివ్యూ
- టీడీపీ అడ్డంగా బుక్కైంది: సజ్జల కీలక వ్యాఖ్యలు
- వివేకా కేసు: సునీత దంపతులకు ఎదురుదెబ్బ
- ఆ బీప్ సౌండ్ వస్తేనే.. మీ ఓటు వేసినట్టు
Advertisement