-
ఆ రూల్ వల్ల భారత ఆల్రౌండర్లకు చాలా నష్టపోతున్నారు: రోహిత్ శర్మ
ఐపీఎల్లో అమల్లో ఉన్న ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధనపై టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ అసంతృప్తి వ్యక్తం చేశాడు. ఈ నిబంధన వల్ల భారత ఆల్రౌండర్లు చాలా నష్టపోతున్నారని వాపోయాడు. వాషింగ్టన్ సుందర్, శివమ్ దూబే లాంటి వారు తమ బౌలింగ్ నైపుణ్యాన్ని ప్రదర్శించుకోవడానికి వీలు లేకుండా పోయిందని అన్నాడు. ఓవరాల్గా ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధనకు తాను అభిమానిని కాదని పేర్కొన్నాడు. వినోదం కోసం నిబంధనలను ఇంతలా సడలించాల్సిన అవసరం లేదని అభిప్రాయపడ్డాడు. తాజాగా జరిగిన ఓ పోడ్కాస్ట్లో హిట్మ్యాన్ ఇంపాక్ట్ ప్లేయర్ రూల్పై తన అభిప్రాయాన్ని వెల్లడించాడు. ఈ పోడ్కాస్ట్లో రోహిత్ క్రికెటర్లకు సంబంధించిన చాలా విషయాలను షేర్ చేసుకున్నాడు. కాగా, ఐపీఎల్లో ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధనను 2023 సీజన్లో ప్రవేశపెట్టారు. ఈ రూల్ వల్ల అన్ని జట్లు అవసరానికి అనుగుణంగా ఓ అదనపు ప్లేయర్ సేవలను వినియోగించుకునే అవకాశం ఉంటుంది. ఉదాహరణకు తొలుత బ్యాటింగ్ చేసే జట్టు అదనంగా ఓ బ్యాటర్ను వినియోగించుకుంటుంది. అలాగే తొలుత బౌలింగ్ చేసే జట్టుకు అదనంగా ఓ బౌలర్ సేవలు వినియోగించుకునే అవకాశం ఉంటుంది. మొత్తంగా చూస్తే 11 మంది ఆడాల్సిన క్రికెట్ ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధన వల్ల 12 మంది క్రికెట్గా మారింది. శివమ్ దూబే, వాషింగ్టన్ సుందర్ లాంటి ఆల్రౌండర్లు కేవలం బ్యాటింగ్కే పరిమితమవుతున్నారు. దీని వల్ల వారిని ఆల్రౌండర్లుగా పరిగణించలేని పరిస్థితి ఏర్పడింది. దేశానికి ప్రాతినిథ్యం వహించే సమయంలో ఆల్రౌండర్లకు డిమాండ్ ఉంటుంది. అలాంటప్పుడు వీరు ఏదో ఒక విభాగానికే పరిమితమైతే వారి కెరీర్లు ఇరుకున పడే ప్రమాదం ఉంది. -
Ind vs Eng: అతడు జడేజా కాదు కదా.. టీమిండియాకు కష్టమే
India vs England 2nd Test: ఇంగ్లండ్తో రెండో టెస్టుకు రవీంద్ర జడేజా దూరం కావడం టీమిండియాకు పెద్ద ఎదురుదెబ్బేనని భారత మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా అన్నాడు. ప్రపంచంలోనే అత్యుత్తమ ఆల్రౌండర్ జడ్డూ అని.. అతడు లేని లోటును ప్రస్తుత జట్టులోని ఏ ఆటగాడూ తీర్చలేడని పేర్కొన్నాడు. కాగా స్టోక్స్ బృందంతో ఐదు మ్యాచ్ల సిరీస్లో భాగంగా తొలి టెస్టులో రోహిత్ సేన 28 పరుగుల తేడాతో పరాజయం పాలైన విషయం తెలిసిందే. హైదరాబాద్లో జరిగిన ఈ మ్యాచ్లో తొలుత మ్యాచ్ టీమిండియా చేతిలో ఉందనిపించినప్పటికీ.. అనూహ్య రీతిలో పుంజుకున్న ఇంగ్లండ్ గెలిచి సత్తా చాటింది. మొదటి టెస్టులో అదరగొట్టాడు అయితే, ఈ మ్యాచ్లో అద్భుతంగా రాణించిన టీమిండియా ఆటగాళ్లలో స్పిన్ ఆల్రౌండర్ జడేజా పేరు ముందు వరుసలో ఉంటుందనడంలో సందేహం లేదు. ఉప్పల్ టెస్టులో మొత్తంగా ఐదు వికెట్లు తీయడంతో పాటు.. 89 పరుగులు సాధించాడు. అయితే, ఈ మ్యాచ్ సందర్భంగా తొడ కండరాలు పట్టేయడంతో జడ్డూ వైజాగ్లో జరుగనున్న రెండో టెస్టుకు దూరమయ్యాడు. అతడితో పాటు కేఎల్ రాహుల్ కూడా గాయం బారిన పడటంతో వీరి స్థానాల్లో వాషింగ్టన్ సుందర్, సర్ఫరాజ్ ఖాన్, సౌరభ్ కుమార్లకు పిలుపునిచ్చారు బీసీసీఐ సెలక్టర్లు. టీమిండియాకు కష్టమే ఈ విషయంపై స్పందించిన మాజీ ఓపెనర్ ఆకాశ్ చోప్రా.. ‘‘జడ్డూ ఉంటేనే టీమిండియాకు బలం. బ్యాటర్గా.. బౌలర్గా.. గన్ ఫీల్డర్గా అతడి సేవలను జట్టు కచ్చితంగా మిస్సవుతుంది. ప్రస్తుతం ప్రపంచం మొత్తంలో అతడే నంబర్ వన్ టెస్టు ఆల్రౌండర్ అనడంలో సందేహం లేదు. ఇంగ్లండ్తో తొలి టెస్టు మొదటి ఇన్నింగ్స్లో టీమిండియా ఆధిక్యంలో నిలిచిందంటే అందుకు కారణం జడేజానే. అతడు ఉన్నా.. మరో జడ్డూ కాలేడు కదా జట్టులో ఉంటే అతడు కనీసం రెండు నుంచి మూడు వికెట్లు తీయడం కూడా గ్యారెంటీ. జడ్డూ స్థానంలో బ్యాటింగ్ కూడా చేయగల బ్యాటర్ను తీసుకోవాలని మేనేజ్మెంట్ భావించడం సహజం. కాబట్టి వాషింగ్టన్ సుందర్కే ఆ అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అయితే, అతడు పరుగులు ఇవ్వకుండా పొదుపుగా బౌలింగ్ చేయగలడేమో గానీ వికెట్లు మాత్రం తీయలేడు. బ్యాటింగ్ పరంగా అతడు మెరుగైన ఆటగాడే. అయితే, వాషీ జడ్డూ మాత్రం కాలేడు కదా’’ అని వ్యాఖ్యానించాడు. ఏదేమైనా వాషింగ్టన్ సుందర్ను తుదిజట్టులో ఆడించినా జడ్డూ లేని లోటును మాత్రం పూడ్చలేడని ఆకాశ్ చోప్రా ఈ సందర్భంగా అభిప్రాయపడ్డాడు. కాగా టీమిండియా - ఇంగ్లండ్ మధ్య ఫిబ్రవరి 2 నుంచి వైజాగ్లో రెండో టెస్టు ఆరంభం కానుంది. చదవండి: Rishabh Pant: చచ్చిపోయానేమో అనుకున్నా.. -
టీమిండియాకు బిగ్ షాక్! రాహుల్, జడేజా దూరం: బీసీసీఐ ప్రకటన
ఇంగ్లండ్తో రెండో టెస్టుకు ముందు టీమిండియా భారీ షాక్ తగిలింది. ఈ మ్యాచ్కు భారత స్టార్ ఆటగాళ్లు కేఎల్ రాహుల్, రవీంద్ర జడేజా గాయాల కారణంగా దూరమయ్యారు. ఈ విషయాన్ని బీసీసీఐ అధికారికంగా ధృవీకరించింది. "వైజాగ్లో ఇంగ్లండ్తో జరగనున్న రెండో టెస్టుకు రవీంద్ర జడేజా, కేఎల్ రాహుల్ దూరమయ్యారు. జడేజా తొడకండరాల గాయంతో బాధపడుతున్నాడు. అదేవిధంగా రాహుల్ సైతం కుడి కాలి కండరాల నొప్పితో ఇబ్బంది పడుతున్నాడు. వీరిద్దరూ ప్రస్తుతం జట్టు వైద్య బృందం పర్యవేక్షణలో ఉన్నారని" బీసీసీఐ సోమవారం ఓ ప్రకటనలో పేర్కొంది. కాగా హైదరాబాద్ వేదికగా జరిగిన తొలి టెస్టు నాలుగో రోజు ఆటలో వేగంగా పరిగెత్తిన జడేజాకు తొడకండరాలు పట్టేశాయి. అనంతరం మైదానాన్ని ఇబ్బంది పడుతూ వీడాడు. అయితే జడేజా గాయం తీవ్రత ఎక్కువగా ఉండడంతో రెండో టెస్టుకు దూరమయ్యాడు. మరోవైపు రాహుల్ కూడా ఫీల్డింగ్లో కండరాల నొప్పితో బాధపడినట్లు తెలుస్తోంది. ఇక రెండో టెస్టుకు బీసీసీఐ సెలక్షన్ కమిటీ ముగ్గురి ఆటగాళ్లను ప్రధాన జట్టులో చేర్చింది. ఎప్పటినుంచో జట్టులో ఛాన్స్కు ఎదురుచూస్తున్న ముంబై బ్యాటర్ సర్ఫారాజ్ ఖాన్కు ఎట్టకేలకు సెలక్టర్లు పిలుపునిచ్చారు. రెండో టెస్టుకు రాహుల్, జడ్డూ దూరం కావడంతో సర్ఫారాజ్కు సెలక్టర్లు ఛాన్స్ ఇచ్చారు. అతడితో పాటు యూపీ ఆల్రౌండర్ సౌరభ్ కుమార్, వాషింగ్టన్ సుందర్ను సెలక్టర్లు ఎంపిక చేశారు. ఫిబ్రవరి 2 నుంచి వైజాగ్ వేదికగా రెండో టెస్టు ప్రారంభం కానుంది. కాగా తొలి టెస్టులో 28 పరుగుల తేడాతో భారత్ ఓటమి పాలైన సంగతి తెలిసిందే. The Men's Selection Committee have added Sarfaraz Khan, Sourabh Kumar and Washington Sundar to India's squad.#INDvENG https://t.co/xgxI8NsxpV — BCCI (@BCCI) January 29, 2024 -
‘ఫీల్డర్ ఆఫ్ ది సిరీస్’ మెడల్ కోహ్లిదే.. రోహిత్ రియాక్షన్ వైరల్
టీమిండియా స్టార్ విరాట్ కోహ్లి మేటి బ్యాటర్ మాత్రమే కాదు.. అద్భుతమైన ఫీల్డర్ కూడా! ఈ విషయాన్ని ఇప్పటికే ఎన్నోసార్లు నిరూపించిన ఈ రన్మెషీన్.. అఫ్గనిస్తాన్తో మూడో టీ20 సందర్భంగా.. మరోసారి అసాధారణ ఫీల్డింగ్ నైపుణ్యాలతో ఆకట్టుకున్నాడు. బెంగళూరు వేదికగా నువ్వా-నేనా అన్నట్లుగా టీమిండియాతో సాగిన మ్యాచ్లో అఫ్గనిస్తాన్ అసాధారణ పోరాటం చేసిన విషయం తెలిసిందే. రెండు సూపర్ ఓవర్ల తర్వాత గానీ జద్రాన్ బృందం రోహిత్ సేన ముందు తలవంచలేదు. ఆద్యంతం అత్యంత ఆసక్తి రేకెత్తించిన ఈ మ్యాచ్ నిజానికి సూపర్ ఓవర్ దాకా వచ్చేదే కాదు. టీమిండియా విధించిన 213 లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో అఫ్గన్ ఇన్నింగ్స్ పదిహేడో ఓవర్లో కోహ్లి ఓ అద్భుతం చేశాడు. వాషింగ్టన్ సుందర్ వేసిన బంతిని.. కరీం జనత్ లాంగాన్ దిశగా సిక్సర్గా మలిచేందుకు భారీ షాట్ ఆడాడు. అయితే.. అక్కడే ఫీల్డింగ్ చేస్తున్న కోహ్లి గాల్లోకి ఎగిరి బంతిని ఒడిసిపట్టి.. బౌండరీ రోప్ దాటకుండా లోపలికి విసిరాడు. Excellent effort near the ropes! How's that for a save from Virat Kohli 👌👌 Follow the Match ▶️ https://t.co/oJkETwOHlL#TeamIndia | #INDvAFG | @imVkohli | @IDFCFIRSTBank pic.twitter.com/0AdFb1pnL4 — BCCI (@BCCI) January 17, 2024 అప్పటికి కరీం ఒక్క పరుగు మాత్రమే తీయగా.. కోహ్లి ఎఫర్ట్ వల్ల టీమిండియాకు ఐదు పరుగులు సేవ్ అయ్యాయి. అప్పటికి అఫ్గనిస్తాన్ స్కోరు 165-4. ఒకవేళ ఆ ఐదు పరుగులు వచ్చి అఫ్గన్కు వచ్చి ఉంటే మ్యాచ్ టై అయ్యేదీ కాదూ.. సూపర్ ఓవర్ల దాకా వచ్చేది కాదు! అలా కోహ్లి ప్రత్యర్థి జట్టును దెబ్బకొట్టాడన్న మాట!! ఈ నేపథ్యంలో టీమిండియా ఫీల్డింగ్ కోచ్ టి.దిలీప్ విరాట్ కోహ్లిపై ప్రశంసల జల్లు కురిపించాడు. యువ ఆటగాళ్లకు సవాల్ విసిరేలా.. మైదానంలో పాదరసంలా కదులుతున్న కోహ్లి.. అందరికీ స్ఫూర్తిదాయకమని కొనియాడాడు. ఈ క్రమంలో ‘ఫీల్డర్ ఆఫ్ ది సిరీస్’ అవార్డు విజేతగా కోహ్లిని ప్రకటించిన దిలీప్.. అతడికి మెడల్ అందజేశాడు. ఆ సమయంలో డ్రెస్సింగ్ రూంలో ఉన్న టీమిండియా క్రికెటర్లంతా చప్పట్లతో కోహ్లిని అభినందించారు. ముఖ్యంగా కెప్టెన్ రోహిత్ శర్మ అమితానందం వ్యక్తం చేస్తూ సహచర ఆటగాడి నైపుణ్యాలను మెచ్చుకున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్గా మారింది. కాగా అఫ్గనిస్తాన్తో టీ20 సిరీస్ ద్వారా అంతర్జాతీయ టీ20లలో రీఎంట్రీ ఇచ్చిన విరాట్ కోహ్లి.. వ్యక్తిగత కారణాలతో తొలి మ్యాచ్కు దూరమయ్యాడు. రెండో టీ20లో 16 బంతుల్లో 29 పరుగులు చేసిన అతడు.. బుధవారం నాటి మూడో మ్యాచ్లో మాత్రం గోల్డెన్ డకౌట్ అయ్యాడు. అయితే, ఫీల్డర్గా మాత్రం సూపర్ సక్సెస్ అయి టీమిండియా విజయంలో తన వంతు పాత్ర పోషించాడు. 𝗗𝗿𝗲𝘀𝘀𝗶𝗻𝗴 𝗥𝗼𝗼𝗺 𝗕𝗧𝗦 | 𝗙𝗶𝗲𝗹𝗱𝗲𝗿 𝗼𝗳 𝘁𝗵𝗲 𝗦𝗲𝗿𝗶𝗲𝘀 After a fantastic 3⃣-0⃣ win over Afghanistan, it's time to find out who won the much-awaited Fielder of the Series Medal 🏅😎 Check it out 🎥🔽 #TeamIndia | #INDvAFG | @IDFCFIRSTBank pic.twitter.com/N30kVdndzB — BCCI (@BCCI) January 18, 2024 చదవండి: #IndvsAus2021: మళ్లీ గోల్డెన్ డక్.. రీఎంట్రీ మర్చిపోవ్సాలిందే? -
Ind vs Afg: కావాలనే అలా చేశాం: రోహిత్ శర్మ
India vs Afghanistan, 1st T20I- Rohit Sharma Comments: టీ20 ప్రపంచకప్-2024కు సన్నద్ధమయ్యే క్రమంలో టీమిండియా యువ క్రికెటర్లు కఠిన సవాళ్లను ఎదుర్కోవాల్సి ఉంటుందని కెప్టెన్ రోహిత్ శర్మ అన్నాడు. ఇందుకోసం ఉద్దేశపూర్వకంగానే వాళ్లను కొన్నిసార్లు ఒత్తిడిలోకి నెట్టాలని నిర్ణయించుకున్నట్లు తెలిపాడు. మెగా టోర్నీకి సిద్ధమయ్యే క్రమంలో ప్రయోగాలకు వెనుకాడబోవద్దని మేనేజ్మెంట్ స్పష్టంగా చెప్పినట్లు పేర్కొన్నాడు. 14 నెలల తర్వాత రీఎంట్రీ కాగా వరల్డ్కప్నకు ముందు భారత జట్టు అఫ్గనిస్తాన్తో మూడు మ్యాచ్ల టీ20 సిరీస్ ఆడేందుకు షెడ్యూల్ ఖరారైన విషయం తెలిసిందే. సీనియర్, స్టార్ బ్యాటర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి ఈ సిరీస్ ద్వారా దాదాపు 14 నెలల విరామం తర్వాత రీఎంట్రీకి సిద్ధమయ్యారు. ఇందులో భాగంగా మొహాలీ వేదికగా జరిగిన తొలి మ్యాచ్తో రోహిత్ పునరాగమనం చేయగా.. రెండో టీ20 నుంచి కోహ్లి అందుబాటులోకి రానున్నాడు. ఇదిలా ఉంటే.. అఫ్గన్తో గురువారం మొదటి మ్యాచ్లో టీమిండియా ఆరు వికెట్ల తేడాతో గెలుపొందిన విషయం తెలిసిందే. రోహిత్, అక్షర్ పటేల్ మినహా మిగతా అంతా కుర్రాళ్లే ఆడిన ఈ టీ20లో తాము అమలు చేసిన ప్రణాళికల గురించి హిట్మ్యాన్ వివరించాడు. మ్యాచ్ అనంతరం మాట్లాడుతూ.. ‘‘ఆటలో వైవిధ్యం చూపేందుకు ప్రయోగాలు చేయాలని నిర్ణయించుకున్నాం. ముఖ్యంగా మా బౌలర్లను అన్ని రకాల పరిస్థితుల్లో మెరుగ్గా బౌలింగ్ చేసేందుకు సంసిద్ధులను చేయాలని భావించాం. అందుకే 19వ ఓవర్లో అతడి చేతికి బంతి అందులో భాగంగానే.. ఈరోజు వాషీ(వాషింగ్టన్ సుందర్) చేత 19వ ఓవర్ వేయించడం మీరంతా చూసే ఉంటారు. ఎక్కడైతే మా యంగ్ ప్లేయర్లు కాస్త వెనుకబడి ఉన్నారు?.. ఒత్తిడిలో ఉన్నపుడు నేర్పుతో అధిగమించగలరా లేదా అని పరీక్షించాలనుకున్నాం. అందుకు అనుగుణంగానే ఈరోజు మా వ్యూహాలు అమలు చేశాం. అయితే, మ్యాచ్ను మూల్యంగా చెల్లించే పరిస్థితులు మాత్రం రాకూడదని జాగ్రత్తపడ్డాం. ఏదేమైనా ఈరోజు సానుకూలంగా ముగిసింది’’ అని రోహిత్ శర్మ హర్షం వ్యక్తం చేశాడు. శివాలెత్తిన శివం దూబే కాగా మొహాలీ మ్యాచ్లో స్పిన్ ఆల్రౌండర్ అక్షర్ పటేల్ కట్టుదిట్టంగా బౌలింగ్(2/23).. మరో స్పిన్నర్ రవి బిష్ణోయి మూడు ఓవర్ల బౌలింగ్లో ఏకంగా 35 పరుగులు ఇచ్చుకున్నాడు. ఇక వాషింగ్టన్ సుందర్ 3 ఓవర్లలో 23 పరుగులు ఇచ్చాడు. అయితే, 19వ ఓవర్లోనే ఏకంగా అతడు 13 పరుగులు సమర్పించుకోవడం విశేషం. ఇదిలా ఉంటే.. అఫ్గన్ విధించిన 159 పరుగుల లక్ష్య ఛేదనలో ఆల్రౌండర్ శివం దూబే 40 బంతుల్లో 60 పరుగులతో అజేయంగా నిలిచి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. తద్వారా ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు. కాగా అఫ్గనిస్తాన్ సిరీస్ ముగిసిన తర్వాత ఐపీఎల్-2024లో ఆటగాళ్లు పాల్గొననున్నారు. ఆ తర్వాత జూన్ 4 నుంచి టీ20 ప్రపంచప్ టోర్నీ ఆరంభం కానుంది. చదవండి: Rohit Sharma: రీఎంట్రీలో రోహిత్ డకౌట్.. మరీ ఘోరంగా..! తప్పు ఎవరిది? Acing the chase 😎 Conversations with Captain @ImRo45 👌 Message for a special bunch 🤗 Hear from the all-rounder & Player of the Match of the #INDvAFG T20I opener - @IamShivamDube 👌👌 - By @ameyatilak WATCH 🎥🔽 #TeamIndia | @IDFCFIRSTBank pic.twitter.com/edEH8H3O5f — BCCI (@BCCI) January 12, 2024 -
కెప్టెన్గా వాషింగ్టన్ సుందర్.. జట్టులో ఐపీఎల్ స్టార్లు!
Syed Mushtaq Ali Trophy 2023-24: టీమిండియా ఆల్రౌండర్ వాషింగ్టన్ సుందర్ దేశవాళీ టీ20 క్రికెట్ జట్టుకు సారథ్యం వహించనున్నాడు. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ 2023-24 సీజన్కు గానూ తమిళనాడు జట్టుకు కెప్టెన్గా వ్యవహరించనున్నాడు. ఇందుకు సంబంధించి తమిళనాడు క్రికెట్ అసోసియేషన్ ప్రకటన చేసింది. వాషీకి సాయి సుదర్శన్ డిప్యూటీగా వ్యవహరిస్తాడని పేర్కొంది. ఈ మేరకు సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో భాగమయ్యే 15 మంది ఆటగాళ్ల పేర్లను బుధవారం వెల్లడించింది. కాగా అక్టోబరు 16 నుంచి ఈ దేశవాళీ టీ20 టోర్నమెంట్ ఆరంభం కానుంది. ఈ పొట్టి ఫార్మాట్లో ఈవెంట్ చరిత్రలో తమిళనాడుకు మంచి ట్రాక్ రికార్డు ఉంది. ఇప్పటి వరకు మూడుసార్లు ట్రోఫీ గెలిచిన ఘనత తమిళనాడు సొంతం. తాజా సీజన్లో వాషింగ్టన్ సుందర్ సారథ్యంలో సాయి సుదర్శన్, వరుణ్ చక్రవర్తి, కుల్దీప్ సేన్, నారాయణ్ జగదీశన్, విజయ్ శంకర్, షారుఖ్ ఖాన్, టి.నటరాజన్ తదితర ఐపీఎల్ స్టార్లు ఆడనున్నారు. కాగా వన్డే వరల్డ్కప్-2023 జట్టులో సుందర్కు స్థానం దక్కలేదన్న విషయం తెలిసిందే. స్పిన్ ఆల్రౌండర్ అక్షర్ పటేల్ గాయం కారణంగా అతడి స్థానంలో చెన్నై వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్తో పోటీ పడ్డ వాషీకి మొండిచేయి ఎదురైంది. అనుభవానికి పెద్దపీట వేసిన బీసీసీఐ సెలక్టర్లు అశూ వైపే మొగ్గుచూపారు. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ 2023 తమిళనాడు జట్టు: వాషింగ్టన్ సుందర్ (కెప్టెన్), సాయి సుదర్శన్ (వైస్ కెప్టెన్), నారాయణ్ జగదీశన్, విజయ్ శంకర్, సి హరి నిశాంత్, జి.అజితేష్, బాబా అపరాజిత్, ఆర్. సంజయ్ యాదవ్, ఎం. మహ్మద్, ఆర్.సాయి కిషోర్, వరుణ్ చక్రవర్తి, టి. నటరాజన్, కుల్దీప్ సేన్, సందీప్ వారియర్. -
WC 2023: బహుశా నాకు ఇదే చివరి వరల్డ్కప్ కావొచ్చు: టీమిండియా స్టార్
ICC ODI World Cup 2023: అనుకోకుండా కొన్ని కొన్ని.. అలా జరిగిపోతూ ఉంటాయంతే! టీమిండియా వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ విషయంలో ఒకటి కాదు ఏకంగా రెండుసార్లు ఇలాగే జరిగింది. అనూహ్యరీతిలో టీ20 వరల్డ్కప్-2022 జట్టులో చోటు దక్కించుకున్న ఈ చెన్నై బౌలర్.. వన్డే ప్రపంచకప్-2023 టీమ్లోనూ ఊహించని రీతిలో స్థానం సంపాదించాడు. గత ఆరేళ్లలో కేవలం ఐదు వన్డేలు మాత్రమే ఈ స్పిన్ ఆల్రౌండర్కు అక్షర్ పటేల్ గాయం రూపంలో ఐసీసీ ఈవెంట్ ఆడే అవకాశం దక్కింది. అది కూడా సొంతగడ్డపై మెగా టోర్నీలో భాగమయ్యే అదృష్టం వరించింది. అక్షర్ గాయం.. అశ్విన్ పాలిట వరంగా.. ఆసియా వన్డే కప్-2023లో బంగ్లాదేశ్తో మ్యాచ్ సందర్భంగా అక్షర్ గాయపడటంతో తొలుత ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్కు ఎంపికయ్యాడు అశ్విన్. అయితే, ఈ గుజరాతీ బౌలర్ ఇంకా కోలుకోకపోవడంతో అతడి స్థానాన్ని భర్తీ చేసే క్రమంలో ఆఫ్ స్పిన్నర్ అశ్విన్కు మేనేజ్మెంట్ పిలుపునిచ్చింది. ఇలా అనుకోకుండా సువర్ణావకాశం లభించడంపై స్పందించిన అశ్విన్ హర్షం వ్యక్తం చేశాడు. విధి, పరిస్థితుల ప్రభావం వల్లే తాను ప్రపంచకప్ ఈవెంట్లో భాగం అవుతున్నానని పేర్కొన్నాడు. అయితే, తనకు ఇదే ఆఖరి వరల్డ్కప్ కూడా కావొచ్చని అశ్విన్ పరిమిత ఓవర్ల క్రికెట్కు గుడ్ బై చెప్పనున్నాడనే సంకేతాలు ఇచ్చాడు. ప్రపంచకప్-2023 వార్మప్ మ్యాచ్లో భాగంగా గువాహటి వేదికగా టీమిండియా- ఇంగ్లండ్ శనివారం తలపడేందుకు సిద్ధమయ్యాయి. ఈ క్రమంలో జట్టుతో పాటు అక్కడికి చేరుకున్న అశ్విన్.. దినేశ్ కార్తిక్తో మాట్లాడుతూ.. ‘‘జీవితంలో ఎన్నో ఆశ్చర్యకర సంఘటనలు జరుగుతూ ఉంటాయి. అదొక్కటే ధ్యేయం నిజానికి నువ్వు జోక్ చేస్తున్నావే అనుకున్నా. అస్సలు ఇక్కడ ఈరోజు నేనిలా ఉంటానని ఊహించలేదు. మేనేజ్మెంట్ నాపై నమ్మకం ఉంచింది. ఇలాంటి టోర్నీల్లో ఒత్తిడిని జయిస్తేనే మనం ముందుకు సాగగలం. ఆటను ఆస్వాదిస్తూ సానుకూల దృక్పథంతో ముందడుగు వేయాల్సి ఉంటుంది. బహుశా టీమిండియా తరఫున నాకిదే చివరి ప్రపంచకప్ టోర్నీ కావొచ్చు. కాబట్టి టోర్నమెంట్ను నేను ఎంతగా ఎంజాయ్ చేస్తాననేదే ముఖ్యం’’ అని చెప్పుకొచ్చాడు. కాగా 37 ఏళ్ల అశ్విన్కు పరిమిత ఓవర్ల క్రికెట్లో వాషింగ్టన్ సుందర్ రూపంలో యువ ఆఫ్ స్పిన్నర్ నుంచి పోటీ ఉంది. టీమిండియా యంగ్ గన్ తిలక్ వర్మ కూడా బ్యాటర్గా రాణించడంతో పాటు ఆఫ్ స్పిన్ బౌలింగ్ చేయగలడు. అశూ రిటైర్ అయ్యే అవకాశం కాబట్టి వచ్చే ఏడాది జరుగనున్న టీ20 ప్రపంచకప్లో అతడు ఆడే అవకాశాలు తక్కువే. మరోవైపు.. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి వంటి స్టార్లు సైతం పొట్టి ఫార్మాట్లో యువకులకు అవకాశం ఇచ్చే క్రమంలో తమ స్థానాలను త్యాగం చేసేందుకు సన్నద్ధమవుతున్నారు. కాబట్టి అశూకు ఇదే ఆఖరి వరల్డ్కప్ కావొచ్చు. అదృష్టం వెంటపడితే మాత్రం మళ్లీ ఏదో మ్యాజిక్ జరిగి జట్టులోకి వచ్చినా రావొచ్చు!! లేదంటే వన్డే వరల్డ్కప్ తర్వాత అంతర్జాతీయ వన్డే, టీ20 క్రికెట్కు వీడ్కోలు పలికే అవకాశాలను కూడా కొట్టిపడేయలేం!! చదవండి: వరల్డ్కప్ జట్టు సెలక్షన్పై యువరాజ్ అసహనం.. అతడిని ఎందుకు ఎంపిక చేశారు? -
టాస్ గెలిచిన ఆసీస్.. తుది జట్లు ఇవే.. అశ్విన్, ఇషాన్ అవుట్..
India vs Australia, 3rd ODI: ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్ను 2-0తో గెలిచిన టీమిండియా నామమాత్రపు మూడో వన్డేకు సిద్ధమైంది. ప్రస్తుతం మూడు ఫార్మాట్లలోనూ నంబర్ 1గా ఉన్న రోహిత్ సేన ఆసీస్ను వైట్వాష్ చేసి రెట్టించిన ఉత్సాహంతో ప్రపంచకప్-2023 బరిలో నిలవాలని పట్టుదలగా ఉంది. మరోవైపు.. కనీసం ఒక్క వన్డేలోనైనా గెలిచి ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలని ఆస్ట్రేలియా భావిస్తోంది. అశ్విన్, ఇషాన్ అవుట్.. సుందర్ ఎంట్రీ గుజరాత్లోని రాజ్కోట్ వేదికగా బుధవారం నాటి మ్యాచ్లో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా కెప్టెన్ ప్యాట్ కమిన్స్ తొలుత బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఇక ఈ మ్యాచ్తో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ సహా విరాట్ కోహ్లి, కుల్దీప్ యాదవ్ తదితరులు తిరిగి జట్టుతో కలిశారు. ఇక గత రెండు వన్డేల్లో భాగమైన టీమిండియా వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ స్థానంలో వాషింగ్టన్ సుందర్ మూడో వన్డేతో ఎంట్రీ ఇచ్చాడు. మరోవైపు.. వైరల్ ఫీవర్ కారణంగా ఇషాన్ కిషన్ జట్టుకు దూరమయ్యాడు. తుది జట్లు ఇవే టీమిండియా: రోహిత్ శర్మ(కెప్టెన్), విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, సూర్యకుమార్ యాదవ్, రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ ఆస్ట్రేలియా మిచెల్ మార్ష్, డేవిడ్ వార్నర్, స్టీవ్ స్మిత్, మార్నస్ లబుషేన్, అలెక్స్ క్యారీ, గ్లెన్ మ్యాక్స్వెల్, కామెరూన్ గ్రీన్, ప్యాట్ కమిన్స్(కెప్టెన్), మిచెల్ స్టార్క్, తన్వీర్ సింగ్, జోష్ హేజిల్వుడ్. చదవండి: 314 పరుగులు.. టీ20 చరిత్రలో నేపాల్ సంచలనం! ప్రపంచ రికార్డులు బద్దలు 🚨 Toss Update 🚨 Australia elect to bat in the third and final #INDvAUS ODI. Follow the Match ▶️ https://t.co/H0AW9UXI5Y#TeamIndia | @IDFCFIRSTBank pic.twitter.com/16zilN2M5b — BCCI (@BCCI) September 27, 2023 -
ఆసియా కప్ ఫైనల్లో అశూ ఆడాల్సింది.. అతడికి వీలు కాలేదనే సుందర్కు ఛాన్స్
India vs Australia, 1st ODI: ఆస్ట్రేలియాతో తొలి వన్డేలో వాషింగ్టన్ సుందర్ను కాదని.. రవిచంద్రన్ అశ్విన్కు చోటు ఇవ్వడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఆసియా కప్-2023 ఫైనల్లో మైదానంలో దిగిన వాషీకి ఆసీస్తో తుదిజట్టులో చోటు దక్కుతుందని అంతా అనుకున్నారు. దాదాపు ఏడాదిన్నర తర్వాత జట్టులోకి అశూ రీఎంట్రీ ఇస్తున్న తరుణంలో సుందర్ వైపే మొగ్గుచూపుతారని హర్భజన్ సింగ్ వంటి మాజీలు కూడా అభిప్రాయపడ్డారు. ఆసియా కప్ ఫైనల్లో ఆడించారు కాబట్టి తొలి వన్డేలో అతడికి ప్రాధాన్యం ఉంటుందని పేర్కొన్నారు. అక్షర్ పటేల్ గాయం కారణంగా ఆశల పల్లకిలో కాగా అక్షర్ పటేల్ గాయం కారణంగా చెన్నై ఆఫ్ స్పిన్నర్లు రవిచంద్రన్ అశ్విన్, వాషింగ్టన్ సుందర్ వరల్డ్కప్-2023 ఆశలు సజీవంగా నిలిచిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆసీస్తో మూడు మ్యాచ్ల వన్డే సిరీస్లో రాణిస్తే ఐసీసీ ఈవెంట్లో అడుగుపెట్టే అవకాశం ముంగిట నిలిచారు. ఈ నేపథ్యంలో మొహాలీ వేదికగా శుక్రవారం మొదలైన తొలి మ్యాచ్లో అశూకు చోటు దక్కగా.. వాషీకి మొండిచేయి ఎదురైంది. దీంతో మేనేజ్మెంట్ తీరుపై అభిమానులు ఫైర్ అవుతున్నారు. వాషీని పరిగణనలోకి తీసుకోనపుడు ఎందుకు శ్రీలంకకు పంపించారని ప్రశ్నిస్తున్నారు. ఆసియా కప్ ఫైనల్కు ఫస్ట్ ఛాయిస్ అశూనే ఈ క్రమంలో.. దినేశ్ కార్తిక్ ఆసక్తికర విషయాలు వెల్లడించాడు. అక్షర్ పటేల్ స్థానంలో ఆసియా కప్-2023 శ్రీలంకతో ఫైనల్కు తొలి ఛాయిస్ అశ్వినే అని పేర్కొన్నాడు. అశూ కుదరదన్నాడు కాబట్టే వాషీని ఫ్లైట్ ఎక్కించారని తనకు తెలిసిందన్నాడు. ఈ మేరకు క్రిక్బజ్ షోలో డీకే మాట్లాడుతూ.. ‘‘నాకు తెలిసిన అంతర్గత సమాచారం ప్రకారం.. ఈ విషయంలో రోహిత్, అజిత్, రాహుల్ ద్రవిడ్లను నేను సమర్థిస్తాను. ఆసియా కప్ ఫైనల్కు ముందుగా వాళ్లు అశ్విన్కే పిలుపునిచ్చారు. ఆ తర్వాతే అశూను ఎంపిక చేశారు అయితే, తాను మ్యాచ్ ఆడేందుకు సిద్ధంగా లేనని అశ్విన్ చెప్పాడు. అంతేకాదు.. తనకు బదులు లోకల్ మ్యాచ్లు ఆడి రిథమ్లో ఉన్న వాషింగ్టన్ సుందర్ను పంపిస్తే బాగుంటుందని సూచించాడు. దీంతో ఎన్సీఏలోనే ఉన్న సుందర్ను శ్రీలంకకు పంపించారు. ఆ తర్వాత అశ్విన్ రెండు క్లబ్ మ్యాచ్లు ఆడాడు. ఆ తర్వాతే ఆసీస్తో సిరీస్కు అతడిని ఎంపిక చేశారు. అసలు విషయం ఇదే. వాళ్ల మొదటి ప్రాధాన్యం అశ్విన్కే. వాషింగ్టన్ ఈ విషయంలో కాస్త నిరాశకు గురికావొచ్చు. అయితే, వాళ్లు మాత్రం అశ్విన్ వైపే మొగ్గుచూపారు’’ అని చెప్పుకొచ్చాడు. వరల్డ్కప్ జట్టులోనూ.. కాగా గత ఆరేళ్ల వ్యవధిలో అశ్విన్ రెండే రెండు వన్డేలు ఆడిన విషయం తెలిసిందే. ఇక అక్షర్ గనుక కోలుకోకపోతే అక్టోబరు 5 నుంచి మొదలయ్యే వన్డే వరల్డ్కప్ టోర్నీలో ఈ 2011 ప్రపంచకప్ విజేతకు చోటు ఖాయమే అనిపిస్తోంది. ఇదిలా ఉంటే ఆసీస్తో తొలి వన్డేలో అశూ ఒక వికెట్ తీశాడు. మార్నస్ లబుషేన్ వికెట్ తన ఖాతాలో వేసుకున్నాడు. చదవండి: అవును.. నాకు ధోనితో విభేదాలున్నాయి.. కానీ! గంభీర్కు స్ట్రాంగ్ కౌంటర్? WC: అలాంటి వాళ్లకు నో ఛాన్స్! అందుకే అతడిని ఎంపిక చేయలేదు: చీఫ్ సెలక్టర్ -
అశ్విన్కు నో ఛాన్స్.. తుది జట్టులో అతడే! భజ్జీ అంచనా తలకిందులు
Ind vs Aus 1st ODI: వన్డే వరల్డ్కప్-2023కి ముందు టీమిండియా ఆస్ట్రేలియాతో సిరీస్కు సిద్దమైంది. కంగారూ జట్టుతో మూడు వన్డేల సిరీస్ను శుక్రవారం ఆరంభించనుంది. పంజాబ్లోని మొహాలీలో గల పంజాబ్ క్రికెట్ అసోసియేషన్ ఐఎస్ బింద్రా స్టేడియంలో తొలి మ్యాచ్ ఆడేందుకు సన్నద్ధమైంది. ఈ క్రమంలో ఇప్పటికే దాదాపు ఏడాదిన్నర తర్వాత వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ వన్డే జట్టుకు ఎంపికయ్యాడు. ఆసియా కప్-2023 సూపర్-4లో బంగ్లాదేశ్తో మ్యాచ్ సందర్భంగా గాయపడ్డ అక్షర్ పటేల్ స్థానంలో ఆసీస్తో ఆడే జట్టులో చోటు దక్కించుకున్నాడు. అయితే, తుది జట్టులో అశూకు స్థానం ఉంటుందా? లేదంటే వాషింగ్టన్ సుందర్ వైపు మొగ్గు చూపుతారా అనే చర్చ మొదలైంది. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఆసీస్తో తొలి వన్డేలో సుందర్ ఆడే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని పేర్కొన్నాడు. భజ్జీ అంచనా తలకిందులు ‘‘బ్యాటింగ్ ఆర్డర్లో ఎనిమిదో స్థానంలో వాషింగ్టన్ సుందర్ లేదంటే రవిచంద్రన్ అశ్విన్ ఆడతారు. అయితే ఇద్దరిలో ఎవరికి ఆ ఛాన్స్ వస్తుందనేదే ప్రశ్న. నా అభిప్రాయం ప్రకారం.. వాషింగ్టన్ సుందర్కే అవకాశం వస్తుంది. ఎందుకంటే.. ఆసియా కప్ ఫైనల్ ఆడేందుకు అతడిని పిలిపించారు. కానీ అక్కడ అతడికి ఆడే ఛాన్స్ రాలేదు. కాబట్టి ఈసారి పరీక్షించే అవకాశం ఉంది’’ అని భజ్జీ అభిప్రాయపడ్డాడు. కాగా అక్షర్ పటేల్ గాయం నేపథ్యంలో ప్రపంచకప్ జట్టులో ఆఫ్ స్పిన్నర్ అశ్విన్కు చోటు దక్కే అవకాశాలున్న నేపథ్యంలో హర్భజన్ సింగ్ ఈ మేరకు వ్యాఖ్యలు చేయడం గమనార్హం. అయితే, భజ్జీ అంచనా తలకిందులైంది. తుది జట్టులో అశ్విన్కు స్థానం దక్కగా.. వాషింగ్టన్ సుందర్కు మొండిచేయి ఎదురైంది. ఇక సెప్టెంబరు 24, 27 తేదీల్లో టీమిండియా- ఆస్ట్రేలియా మధ్య మలి రెండు వన్డేలు జరుగనున్నాయి. తొలి రెండు మ్యాచ్లకు రోహిత్ శర్మ, హార్దిక్ పాండ్యాలకు విశ్రాంతినిచ్చిన నేపథ్యంలో కేఎల్ రాహుల్ జట్టును ముందుండి నడిపించనున్నాడు. ఇదిలా ఉంటే.. అక్టోబరు 5 నుంచి ప్రపంచకప్-2023 టోర్నీ ఆరంభం కానుంది. ఆసీస్తో తొలి వన్డేకు భారత తుది జట్టు శుభ్మన్ గిల్, రుతురాజ్ గైక్వాడ్, శ్రేయాస్ అయ్యర్, లోకేష్ రాహుల్ (కెప్టెన్), ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్, రవీంద్ర జడేజా (వైస్ కెప్టెన్), రవిచంద్రన్ అశ్విన్, శార్దూల్ ఠాకూర్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ షమీ. -
అదేంటో.. వరల్డ్కప్కి ముందే గుర్తుకొస్తాడు! తుదిజట్టులో ఉండాలి: మాజీ ఓపెనర్
India vs Australia ODI Series 2023: ‘‘అదేంటో.. ప్రతిసారి ప్రపంచకప్ టోర్నీ ఆరంభానికి ముందే ఇలా జరుగుతూ ఉంటుంది. గత రెండు.. మూడు ఐసీసీ ఈవెంట్లను గమనిస్తే.. అది టీ20 లేదంటే వన్డే.. ఏదైనా కావొచ్చు.. అప్పటికప్పుడు అతడిని ఎంపిక చేస్తారు. సరిగ్గా మెగా టోర్నీకి ముందే.. భారత క్రికెట్ మేనేజ్మెంట్కు అశ్విన్ గుర్తుకు వస్తాడు’’ అని టీమిండియా మాజీ ఓపెనర్ ఆకాశ్ చోప్రా అన్నాడు. ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్ నేపథ్యంలో భారత జట్టులో వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్కు చోటు దక్కడంపై ఈ విధంగా స్పందించాడు. వాషింగ్టన్ సుందర్తో పాటు సొంతగడ్డపై... వన్డే వరల్డ్కప్-2023 ఆరంభానికి ముందు టీమిండియా ఆస్ట్రేలియాతో మూడు వన్డేలు ఆడనుంది. ఈ క్రమంలో అనూహ్యంగా సెలక్టర్ల నుంచి అశ్విన్కు పిలుపు వచ్చింది. ఆసియా కప్-2023 సందర్భంగా బంగ్లాదేశ్తో మ్యాచ్లో అక్షర్ పటేల్ గాయపడిన నేపథ్యంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే శ్రీలంకతో ఫైనల్లో అక్షర్ స్థానాన్ని భర్తీ చేసిన వాషింగ్టన్ సుందర్తో పాటు ఈ వెటరన్ ఆఫ్ స్పిన్నర్కు కూడా చోటిచ్చారు. ఈ నేపథ్యంలో కామెంటేటర్ ఆకాశ్ చోప్రా.. అశ్విన్ రీఎంట్రీ గురించి మాట్లాడుతూ.. తుదిజట్టులో ఉండాలి ‘‘ప్రపంచకప్నకు ఎంపిక చేసిన జట్టులో ఆఫ్ స్పిన్నర్ లేడు. ఇప్పుడు అక్షర్ పటేల్ గాయం కారణంగా అకస్మాత్తుగా ఖాళీ ఏర్పడింది. వాషింగ్టన్ సుందర్తో పాటు అశ్విన్ కూడా రేసులోకి దూసుకొచ్చాడు. అయినా.. ప్రతిసారి అశ్విన్కు ఇలా హఠాత్తుగా పిలుపు రావడం చూస్తూనే ఉన్నాం. ఏదేమైనా ఆస్ట్రేలియాతో తుది జట్టులో అతడికి స్థానం ఇవ్వాలి. వాషీ కంటే ఎంతో అనుభవజ్ఞుడైన అశ్విన్కే పెద్దపీట వేస్తారని భావిస్తున్నా’’ అని పేర్కొన్నాడు. అప్పుడు కూడా అలాగే.. 2017 తర్వాత ఆరేళ్ల వ్యవధిలో కేవలం రెండు వన్డేలు ఆడిన అశ్విన్.. అక్షర్ గాయం కారణంగా ఆసీస్తో సిరీస్ సందర్భంగా జట్టులోకి వచ్చాడు. ఫార్మాట్లకు అతీతంగా వికెట్లు తీయగల నైపుణ్యం ఉన్న అశూకు.. ఒకవేళ ఈవెంట్ ఆరంభం నాటికి అక్షర్ కోలుకోకపోతే ఆఫ్ స్పిన్నర్గా వరల్డ్కప్ జట్టులో చోటు ఖాయం కావొచ్చు కూడా! కాగా అంతర్జాతీయ టీ20 కెరీర్ ముగిసిందనుకున్న తరుణంలో గతేడాది ఆస్ట్రేలియాలో వరల్డ్కప్ ఆడిన జట్టులో ఈ చెన్నై స్పిన్ ఆల్రౌండర్కు చోటు దక్కిన విషయం తెలిసిందే. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ మాటల్ని బట్టి.. ఈసారి కూడా అదే రిపీట్ అయ్యే అవకాశాలను కొట్టిపారేయలేం! కాగా ఎన్సీఏలో ఇటీవల వైట్బాల్తో ప్రాక్టీస్ చేస్తున్న వీడియోను అశూ సోషల్ మీడియాలో షేర్ చేయగా.. ‘వరల్డ్కప్ నాటికి జట్టులోకి అన్న రావడం ఫిక్స్’ అంటూ అభిమానులు అప్పటి నుంచే కామెంట్లు చేస్తున్నారు. చదవండి: వరల్డ్కప్కు ముందు మహ్మద్ షమీకి బిగ్ రిలీఫ్.. బెయిల్ మంజూరు My kinda day 🤩🤩. The capacity to learn is a gift. The ability to learn is a skill. However, the willingness to learn is a CHOICE. #cricketlife Thank you for the help @SairajBahutule @VVSLaxman281 pic.twitter.com/4nK7V5IthS — Ashwin 🇮🇳 (@ashwinravi99) September 15, 2023 -
ప్రపంచకప్ జట్టులో అశ్విన్..!
టీమిండియా వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్కు ప్రపంచకప్-2023 జట్టుకు ఎంపికయ్యేందుకు ఇంకా దారులు మూసుకుపోలేదు. అతనితో పాటు స్పిన్ బౌలింగ్ ఆల్రౌండర్ వాషింగ్టన్ సుందర్కు వరల్డ్కప్కు ఎంపికయ్యే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఈ విషయంపై జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ ఆసియా కప్ -2023 ముగిసిన అనంతరం క్లూ ఇచ్చాడు. ముందుగా ప్రకటించిన ప్రొవిజనల్ జట్టులోని సభ్యుడు, స్పిన్ బౌలింగ్ ఆల్రౌండర్ అక్షర్ పటేల్ ఆసియా కప్లో బంగ్లాదేశ్తో జరిగిన సూపర్-4 మ్యాచ్ సందర్భంగా గాయపడిన విషయం తెలిసిందే. అక్షర్ స్థానంలో వాషింగ్టన్ సుందర్ హుటాహుటిన జట్టులో చేరి ఆసియా కప్ ఫైనల్ ఆడాడు. అక్షర్ గాయం తీవ్రత ఎక్కువగా ఉండటంతో అతను వరల్డ్కప్ ఫస్ట్ హాఫ్ మ్యాచ్లకు దూరమవుతాడని తెలుస్తుంది. ఒకవేళ ఇదే జరిగితే అక్షర్ స్థానాన్ని వాషింగ్టన్ సుందర్ లేదా అశ్విన్లలో ఎవరో ఒకరితో భర్తీ చేసే అవకాశం ఉంది. సుందర్తో పోలిస్తే అశ్విన్ అనుభవజ్ఞుడు కావడంతో అతనికే అవకాశాలు ఉంటాయి. మరోవైపు అక్షర్ త్వరలో ఆస్ట్రేలియాతో జరుగనున్న వన్డే సిరీస్కు కూడా అందుబాటులో ఉండడని సమాచారం. భారత సెలెక్టర్లు ఒకవేళ అశ్విన్ను ప్రపంచకప్ జట్టులో చేర్చుకోవాలని భావిస్తే, ఆసీస్ సిరీస్ కోసం ఇవాళ ప్రకటించే భారత జట్టులో అతని చోటు ఇస్తారు. కాగా, ముందుగా ప్రకటించిన భారత ప్రొవిజనల్ వరల్డ్కప్ స్క్వాడ్లో స్పిన్ బౌలర్లుగా అక్షర్ పటేల్తో పాటు రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్లను ప్రకటించిన విషయం తెలిసిందే. చివరి నిమిషంలో ఈ ప్రొవిజనల్ జట్టులో మార్పులు జరిగే అవకాశాలు లేకపోలేదు. ఎవరైనా ఆటగాడు గాయం బారిన పడితే, అతని స్థానాన్ని ఇంకొకరితో భర్తీ చేసే అవకాశం ఉంది. ఇదిలా ఉంటే, ఆసీస్తో ఈ నెల 22, 24, 27 తేదీల్లో జరిగే మూడు మ్యాచ్ల వన్డే సిరీస్ కోసం భారత జట్టును ఇవాళ ప్రకటిస్తారు. ఈ జట్టుకు ఎంపికైన ఆటగాళ్లు దాదాపుగా ప్రపంచకప్ జట్టులో ఉంటారు. ఆసియా కప్ సందర్భంగా గాయపడిన అక్షర్ స్థానంలో సెలెక్టర్లు ఎవరిని తీసుకుంటారోనన్నది ఆసక్తికరంగా మారింది. ఈ సిరీస్ ముగిశాక అక్టోబర్ 5 నుంచి వన్డే ప్రపంచకప్ ప్రారంభమవుతుంది. అక్టోబర్ 8న ఆస్ట్రేలియాతో జరిగే మ్యాచ్తో టీమిండియా వరల్డ్కప్ జర్నీ స్టార్ట్ అవుతుంది. అక్టోబర్ 14న భారత్.. చిరకాల ప్రత్యర్ధి పాకిస్తాన్ను ఢీకొంటుంది. -
#lndVsSL: టాస్ గెలిచిన శ్రీలంక.. అక్షర్ అవుట్.. వాషీ ఇన్! తుదిజట్లు ఇవే
Asia Cup Final 2023- ndia vs Sri Lanka Playing XI: ఆసియా కప్-2023 ఫైనల్కు రంగం సిద్ధమైంది. కొలంబో వేదికగా ఆర్. ప్రేమదాస స్టేడియంలో టీమిండియా- శ్రీలంక టైటిల్ పోరులో తలపడనున్నాయి. ఈ క్రమంలో టాస్ గెలిచిన శ్రీలంక తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. అక్షర్ పటేల్ అవుట్.. వాషీ ఇన్ ఇక ఆదివారం నాటి మ్యాచ్లో టీమిండియా స్టార్లు విరాట్ కోహ్లి, హార్దిక్ పాండ్యా, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, కుల్దీప్ యాదవ్ ఎంట్రీ ఇచ్చారు. బంగ్లాదేశ్తో మ్యాచ్ సందర్భంగా అక్షర్ పటేల్ గాయం కారణంగా దూరంకాగా యువ స్పిన్ ఆల్రౌండర్ వాషింగ్టన్ సుందర్కు తుదిజట్టులో చోటు దక్కింది. తీక్షణ స్థానంలో అతడే మరోవైపు.. స్టార్ స్పిన్నర్ మహీశ్ తీక్షణ గాయంతో వైదొలగడంతో దుషాన్ హేమంతను జట్టులోకి తీసుకున్నట్లు లంక సారథి దసున్ షనక వెల్లడించాడు. ఆరంభంలో పిచ్ బ్యాటింగ్కు అనుకూలించే విధంగా ఉన్న నేపథ్యంలో తొలుత బ్యాటింగ్ చేయాలనుకున్నట్లువెల్లడించాడు. కాగా రోహిత్ శర్మ సైతం.. తాము టాస్ గెలిస్తే బ్యాటింగ్ ఎంచుకునే వాళ్లమని పేర్కొన్నాడు. కాగా ఆసియా వన్డే కప్-2023లో కొలంబో వేదికగా ఇప్పటి వరకు జరిగిన ఆరు మ్యాచ్ల్లో తొలుత బ్యాటింగ్కు దిగిన జట్టు ఐదుసార్లు గెలవడం విశేషం. తుదిజట్లు ఇవే టీమిండియా: రోహిత్ శర్మ(కెప్టెన్), శుబ్మన్ గిల్, విరాట్ కోహ్లి, కేఎల్ రాహుల్, ఇషాన్ కిషన్, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్, జస్ప్రీత్ బుమ్రా, కుల్దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్. శ్రీలంక: కుశాల్ పెరీరా, కుశాల్ మెండిస్(వికెట్ కీపర్), సదీర సమరవిక్రమ, చరిత్ అసలంక, ధనంజయ డిసిల్వా, దసున్ షనక(కెప్టెన్), దునిత్ వెల్లలగే, దుషన్ హేమంత, ప్రమోద్ మదుషన్, మతీషా పతిరానా. చదవండి: బంగ్లా చేతిలో ఓడిపోయారు.. శ్రీలంకపై గెలవాలంటే: పాక్ మాజీ క్రికెటర్ The stage is set! It's the FINAL battle for Asian supremacy! 💥 Who'll come out on top - #India or #SriLanka? Tune-in to the final, #INDvSL in #AsiaCupOnStar Today | 2 PM | Star Sports Network #Cricket pic.twitter.com/k2FJk5egJz — Star Sports (@StarSportsIndia) September 17, 2023 -
టీమిండియాకు షాక్.. ఫైనల్కు ఆల్రౌండర్ దూరం! లంకకు యువ క్రికెటర్..
Asia Cup 2023 Final: ఆసియా కప్-2023 ఫైనల్కు ముందు టీమిండియాకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. స్టార్ ఆల్రౌండర్ అక్షర్ పటేల్ గాయం కారణంగా జట్టుకు దూరమైనట్లు తెలుస్తోంది. యువ క్రికెటర్ వాషింగ్టన్ సుందర్తో ఈ స్పిన్ ఆల్రౌండర్ స్థానాన్ని భర్తీ చేసేందుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి నిర్ణయించినట్లు సమాచారం. లంకకు బయల్దేరిన యువ క్రికెటర్ ఈ క్రమంలో చెన్నై ఆటగాడు సుందర్ ఇప్పటికే శ్రీలంకు బయల్దేరినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ విషయం గురించి బీసీసీఐ వర్గాలు పీటీఐతో మాట్లాడుతూ.. ‘‘అక్షర్ను గాయాలు వేధిస్తున్నాయి. చిటికిన వేలికి గాయమైంది. ముంజేయికి కూడా దెబ్బతగిలింది. వాషీని ఎయిర్పోర్టులో చూశానన్న డీకే అంతేకాదు.. తొడ కండరాలు పట్టేశాయి కూడా. అందుకే వాషింగ్టన్ను శ్రీలంకకు పిలిపిస్తున్నారు’’ అని పేర్కొన్నాయి. ఇదిలా ఉంటే.. టీమిండియా వెటరన్ వికెట్ కీపర్ బ్యాటర్ దినేశ్ కార్తిక్ సైతం సుందర్ ప్రయాణం గురించి హింట్ ఇచ్చాడు. ‘‘ఎయిర్పోర్టులో అనుకోకుండా.. నాకు వాషింగ్టన్ సుందర్ తారసపడ్డాడు. అతడికి ఎక్కడికి వెళ్తున్నాడో గెస్ చేయండి’’ అని ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశాడు. ఇదిలా ఉంటే.. బంగ్లాదేశ్తో మ్యాచ్ తర్వాత విలేకరులతో మాట్లాడిన టీమిండియా ఓపెనర్ శుబ్మన్ గిల్.. అక్షర్ గాయాలు అంత తీవ్రమైనవి కావని పేర్కొనడం గమనార్హం. బంగ్లాదేశ్తో మ్యాచ్లో అక్షర్ పోరాటం కాగా ఆసియా కప్-2023 సూపర్-4లో ఆఖరి మ్యాచ్లో భారత జట్టు ఓడిపోయిన విషయం తెలిసిందే. బంగ్లాదేశ్తో మ్యాచ్లో చివరి బంతి వరకు ఉత్కంఠ రేపిన శుక్రవారం నాటి మ్యాచ్లో అక్షర్ పటేల్ 34 బంతుల్లో 42 పరుగులతో రాణించాడు. అంతకుముందు బంగ్లా ఇన్నింగ్స్లో 9 ఓవర్ల బౌలింగ్లో 47 పరుగులు ఇచ్చి ఒక వికెట్ తీశాడు. ఇదిలా ఉంటే.. గాయాల తీవ్రత ఎక్కువైతే మాత్రం వన్డే వరల్డ్కప్-2023కి కూడా అక్షర్ పటేల్ దూరమయ్యే అవకాశాలు ఉన్నాయి. వన్డేల్లో సుందర్ గణాంకాలు ఇక యువ స్పిన్ ఆల్రౌండర్ వాషింగ్టన్ సుందర్ టీమిండియా తరఫున ఇప్పటి వరకు 16 వన్డేలు ఆడాడు. 16 వికెట్లు తీయడంతో పాటు 233 పరుగులు సాధించాడు. ఈ ఏడాది జనవరిలో న్యూజిలాండ్తో చివరిగా వన్డే ఆడాడు. కాగా ఆదివారం (సెప్టెంబరు 17) టీమిండియా- శ్రీలంక మధ్య ఫైనల్ మ్యాచ్ జరుగనుంది. చదవండి: అతడిని కాదని నీకు ఛాన్స్.. ‘రాక రాక’ వచ్చిన అవకాశం! ఇకనైనా మారు.. -
ఆసియా కప్ జట్టులో చోటు దక్కకున్నా.. వరల్డ్కప్ టోర్నీలో ఎంట్రీ ఖాయం!
Asia Cup- ICC ODI World Cup 2023: ‘‘వాషింగ్టన్ సుందర్.. అతడి పేరునే పరిగణనలోకి తీసుకోలేదు. ఆసియా కప్ జట్టులో అతడికి చోటు ఇవ్వలేదు. నిజానికి జట్టులో ఆఫ్ స్పిన్నర్ లేడు. కాబట్టి సుందర్ గురించి చర్చ జరగడం సబబే. జట్టులో ఒకటీ అరా మార్పులు ఉండవచ్చు’’ అని టీమిండియా మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా అన్నాడు. యువ స్పిన్ ఆల్రౌండర్ వాషింగ్టన్ సుందర్కు వన్డే వరల్డ్కప్-2023 జట్టులో వైల్డ్కార్డ్ ఎంట్రీ లభించవచ్చని జోస్యం చెప్పాడు. ఆఫ్ స్పిన్నర్ అవసరం ఉన్న వేళ మెగా ఈవెంట్ సమయానికి సుందర్కు పిలుపు రావొచ్చని అభిప్రాయపడ్డాడు. వరల్డ్కప్ టోర్నీలో ఎంట్రీ ఖాయం.. ఎందుకంటే ప్రత్యర్థి జట్టులో లెఫ్టాండర్లను ఎదుర్కొనేందుకు టీమిండియాకు తప్పక ఆఫ్ స్పిన్నర్ల అవసరం ఉంటుందని తన వ్యాఖ్యలను సమర్థించుకున్నాడు. కాగా 2017లో టీమిండియా తరఫున టీ20 మ్యాచ్తో అరంగేట్రం చేసిన తమిళనాడు క్రికెటర్ వాషింగ్టన్ సుందర్. రైట్ ఆర్మ్ ఆఫ్ బ్రేక్ స్పిన్నర్ అయిన వాషీ.. ఇప్పటి వరకు అంతర్జాతీయ స్థాయిలో 4 టెస్టులు(6 వికెట్లు), 16 వన్డేలు(16 వికెట్లు), 37 టీ20 మ్యాచ్లు(29 వికెట్లు) ఆడాడు. బౌలింగ్తో పాటు లోయర్ ఆర్డర్లో రాణించడం అతడికి ఉన్న అదనపు అర్హత. వాళ్లంతా ఆసియా కప్ జట్టులో అయితే, ఇటీవలి కాలంలో పెద్దగా ఆకట్టుకోలేకపోతున్న వాషింగ్టన్ సుందర్కు ఆసియా కప్-2023 జట్టులో చోటు దక్కలేదు. 17 మంది సభ్యుల జట్టులో స్పిన్ విభాగంలో ఆల్రౌండర్ రవీంద్ర జడేజాతో పాటు కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్లను ఎంపిక చేశారు. రోహిత్ శర్మ చెప్పాడు కదా! ఇక ఆసియా కప్ జాబితా నుంచే వరల్డ్కప్ జట్టును ఎంపిక చేస్తామని చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ పేర్కొన్న విషయం తెలిసిందే. అయితే, అదే సమయంలో రవిచంద్రన్ అశ్విన్, యుజువేంద్ర చహల్, వాషింగ్టన్ సుందర్లకు దారులు మూసుకుపోలేదని కెప్టెన్ రోహిత్ శర్మ స్పష్టం చేశాడు. ఈ నేపథ్యంలో కామెంటేటర్ ఆకాశ్ చోప్రా మాట్లాడుతూ.. వాషింగ్టన్ సుందర్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘‘ఆఫ్ స్పిన్ బౌలింగ్తో వికెట్లు తీయడంతో పాటు జట్టుకు అవసరమైన సమయంలో పరుగులు రాబట్టడం అతడికి ఉన్న ప్లస్ పాయింట్. ఒకవేళ సుందర్ గనుక మెగా ఈవెంట్కు ముందు ఆడే మ్యాచ్లలో ఆల్రౌండర్గా తనను తాను నిరూపించుకుంటే తప్పక వైల్డ్ కార్డ్ ఎంట్రీ దక్కుతుంది. ప్రస్తుతం జట్టులో ఉన్న టెంప్టింగ్ ఆప్షన్ తనే’’ అని పేర్కొన్నాడు. ఐర్లాండ్ పర్యటనలో కాగా ప్రస్తుతం ఐర్లాండ్ పర్యటనలో ఉన్న 23 ఏళ్ల వాషింగ్టన్ సుందర్.. తొలి రెండు మ్యాచ్లలో ఒక్క వికెట్ కూడా తీయలేకపోయాడు. డబ్లిన్లో బుధవారం జరిగే ఆఖరి టీ20లో గనుక సత్తా చాటితేనే అతడి పేరును సెలక్టర్లు పరిగణనలోకి తీసుకునే అవకాశం ఉంది. అంతేకాదు.. ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్లో చోటు దక్కించుకుని మెరుగ్గా రాణిస్తేనే సుందర్ వరల్డ్కప్ ఆశలు సజీవంగా ఉంటాయి. చదవండి: హీత్ స్ట్రీక్ అరుదైన రికార్డులు.. తొలి మ్యాచ్లో నో వికెట్! నాడు టీమిండియాను ఓడించి.. కోహ్లి తానే బెస్ట్ బౌలర్ అనుకుంటాడు.. అతడి బౌలింగ్ అంటే మాకు భయం: భువీ -
Asia Cup: వరల్డ్కప్లో వాళ్లకు చోటు! ఆ ముగ్గురికి రోహిత్ శర్మ గుడ్న్యూస్..
Asia Cup Squad- Chahal Dropped- Rohit Sharma Reveals BIG reason: ఆసియా కప్-2023 టోర్నీకి భారత క్రికెట్ నియంత్రణ మండలి సోమవారం జట్టును ప్రకటించింది. రోహిత్ శర్మ సారథ్యంలో 17 మంది సభ్యులతో కూడిన జట్టు శ్రీలంకకు వెళ్లనున్నట్లు తెలిపింది. ఈ మెగా ఈవెంట్తో కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్ రీఎంట్రీ ఇస్తుండగా.. హైదరాబాదీ స్టార్ తిలక్ వర్మకు కూడా చోటు దక్కింది. వరల్డ్కప్ ప్రొవిజినల్ టీమ్! ఇక ఆసియా వన్డే కప్ నేపథ్యంలో ప్రకటించిన జట్టునే వన్డే వరల్డ్కప్ టోర్నీకి ప్రొవిజినల్ టీమ్గా భావిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో స్పిన్నర్లు రవిచంద్రన్ అశ్విన్, యజువేంద్ర చహల్, వాషింగ్టన్ సుందర్ల గురించి క్రీడా వర్గాల్లో చర్చ మొదలైంది. ఆసియా కప్ జట్టులో ఆల్రౌండర్ రవీంద్ర జడేజాతో పాటు అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్లకు చోటు దక్కగా.. అశ్విన్, చహల్, సుందర్లకు మొండిచేయి ఎదురైంది. ఈ నేపథ్యంలో ఈ ముగ్గురి ప్రపంచకప్ అవకాశాలు కూడా గల్లంతయినట్లేనన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఆ ముగ్గురికి గుడ్న్యూస్! అయితే, టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ మాత్రం ఈ ముగ్గురికి ఓ శుభవార్త చెప్పాడు. జట్టు ప్రకటన సందర్భంగా మీడియా అడిగిన ప్రశ్నలకు బదులిస్తూ... ‘‘17 మందికి మాత్రమే జట్టులో చోటు ఉంది. అందుకే చహల్ను తీసుకోలేకపోయాం. రవి అశ్విన్, చహల్, సుందర్లతో పాటు వరల్డ్కప్ ఆడే క్రమంలో ఎవరికీ దారులు మూసుకుపోలేదు’’ అని హిట్మ్యాన్ చెప్పుకొచ్చాడు. చైనామన్ స్పిన్నర్కు ప్రాధాన్యం కాగా ఇటీవలి కాలంలో ఆల్రౌండర్లుగా జడ్డూ, అక్షర్ దూసుకుపోతుండగా.. చైనామన్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ వెస్టిండీస్ పర్యటనలో అద్భుతంగా రాణించాడు. విండీస్తో మూడు వన్డేల్లో కలిపి ఏడు వికెట్లు పడగొట్టి సత్తా చాటాడు. ఈ క్రమంలో ఆసియా కప్ జట్టులో అతడికి చోటు దక్కడం గమనార్హం. అయితే, చహల్ను పరిగణనలోకి తీసుకోకపోవడంతో ‘కుల్చా’ ద్వయాన్ని చూడాలనుకున్న అభిమానులకు నిరాశే ఎదురైంది. ఇదిలా ఉంటే.. అక్షర్ పటేల్ ఇప్పటి వరకు ఆరు వన్డేల్లో మూడు వికెట్లు తీశాడు. అయితే, చహల్ అనుభవజ్ఞుడైనప్పటికీ లోయర్ ఆర్డర్లో బ్యాటింగ్ చేయగల అక్షర్ వైపే మేనేజ్మెంట్ మొగ్గు చూపింది. కాగా ఆగష్టు 30 నుంచి ఆసియా కప్ ఆరంభం కానున్న విషయం తెలిసిందే. చదవండి: Asia Cup: అయ్యర్, రాహుల్ వచ్చేశారు.. తిలక్ వర్మకు ఛాన్స్.. పాపం సంజూ! -
హైపర్ ఆదితో పెళ్లి? క్లారిటీ ఇచ్చేసిన వర్షిణి!
నటి, యాంకర్ వర్షిణి గురించి కొత్తగా పరిచయం అక్కర్లేదు. ఎందుకంటే సినిమాల్లో చిన్న చితకా పాత్రలు చేస్తున్న రానీ గుర్తింపు టీవీ షోలతో సంపాదించింది. ఢీ డ్యాన్స్ షోతో పాటు పలు కామెడీ ప్రోగ్రామ్స్కి యాంకరింగ్ చేస్తూ పేరు తెచ్చుకుంది. అయితే ఈమె ప్రేమ గురించి ఎప్పటికప్పుడు ఏదో ఓ న్యూస్ వస్తూనే ఉంది. ఇప్పుడు అలానే ప్రశ్న ఎదురవగా దానిపై క్లారిటీ ఇచ్చేసింది. హైపర్ ఆదితో పెళ్లి? గతంలో కమెడియన్ హైపర్ ఆదితో కలిసి వర్షిణి.. డ్యాన్స్ షోలో యాంకరింగ్ చేసింది. అలా వీరిద్దరి మధ్య కెమిస్ట్రీ వర్కౌట్ కావడంతో నిజంగానే రిలేషన్లో ఉన్నారని అంతా అనుకున్నారు. కానీ గతంలో ఓ ఇంటర్వ్యూలో వర్షిణి మాట్లాడుతూ అలాంటిదేం లేదని క్లారిటీ ఇచ్చింది. కానీ మొన్నీ మధ్య మరోసారి వర్షిణిని హైపర్ ఆది పెళ్లి చేసుకోబోతున్నాడనే టాక్ వచ్చింది. దీనిపై తాజాగా ఇన్స్టా వేదికగా స్పందించిన వర్షిణి.. ఎమోజీలు పోస్ట్ చేసి అలాంటిదేం లేదని చెప్పకనే చెప్పేసింది. (ఇదీ చదవండి: అమలా పాల్ ఒక చెత్త హీరోయిన్: యంగ్ హీరో) అమ్మతో మాట్లాడు..! ఇకపోతే ఇదే చాట్ డిస్కషన్లో భాగంగా ఓ నెటిజన్.. పెళ్లి చేసుకుందామని వర్షిణితో అన్నాడు. దీనిపై ఫన్నీగా స్పందించిన ఈభామ.. తన అమ్మతో మాట్లాడమని చెప్పింది. ఇదంతా పక్కనబెడితే గతంలో ఎన్నడూ లేనంతగా ఈ మధ్య వర్షిణి పెళ్లి ఎక్కువగా డిస్కషన్లోకి వస్తుంది. ఎందుకంటే ఐపీఎల్ టైంలో హైదరాబాద్ జట్టుకు ఆడుతున్న వాషింగ్టన్ సుందర్తో షికార్లు చేసిందని మాట్లాడుకున్నారు. ఇక ఇప్పుడేమో పలు ఎంటర్ టైన్మెంట్ షోలు చేసే డైరెక్టర్తో యాంకర్ వర్షిణి ప్రేమలో ఉందని నెటిజన్స్ మాట్లాడుకుంటున్నారు. త్వరలో వీరిద్దరూ పెళ్లి కూడా చేసుకోబోతున్నారని అందుకే ఈ మధ్య కాలంలో వర్షిణి పెళ్లి గురించి తెగ రూమర్స్ వస్తున్నాయని అంటున్నారు. ఈ మొత్తం వ్యవహారంపై క్లారిటీ రావాలంటే కొన్నాళ్లు ఆగితే గానీ అసలు విషయం ఏంటో తెలీదు. (ఇదీ చదవండి: మెగాస్టార్కు సర్జరీ.. సినిమాలకు బ్రేక్?!) -
క్రికెటర్తో ప్రేమలో యాంకర్ వర్షిణి? బహుత్ 'సుందర్' హై!
బుల్లితెర యాంకర్ వర్షిణి ఈ మధ్య వార్తల్లో బాగా హైలైట్ అవుతోంది. కారణం తను ఉప్పల్ స్టేడియంకు వెళ్లడం.. వెళ్లిన ప్రతిసారి ఎస్ఆర్హెచ్ ఓడిపోవడం. దీంతో ఎస్ఆర్హెచ్ అభిమానులు ఇదివరకే ఆమెను ఓ ఆటాడేసుకున్నారనుకోండి అది వేరే విషయం. అయితే ఆమె అలా పదేపదే మ్యాచ్కు వెళ్లడానికి ఓ బలమైన కారణం ఉందట. సన్రైజర్స్ హైదరాబాద్ యువ ఆల్రౌండర్ వాషింగ్టన్ సుందర్ కోసమే తను పదేపదే స్టేడియంకు వెళ్లిందంటూ ఓ వార్త వైరల్ అవుతోంది. వీరిద్దరూ ప్రేమలో పడ్డారని, ఛాన్స్ దొరికితే చాలు చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్నారంటూ పుకార్లు షికార్లు చేస్తున్నాయి. దీనిపై అటు సుందర్, ఇటు వర్షిణి ఎవరూ ఇంతవరకు స్పందించలేదు. అయితే వర్షిణిని మాత్రం మళ్లీ చెడుగుడు ఆడేసుకుంటున్నారు నెటిజన్లు. సోషల్ మీడియాలో ఏ ఫోటో పోస్ట్ చేసినా క్రికెటర్ గురించే గుచ్చి గుచ్చి అడుగుతున్నారు. తాజాగా ఇన్స్టాగ్రామ్లో వర్షిణి గ్లామర్ ఫోటోలు షేర్ చేయగా దాని కింద అందరూ వాషింగ్టన్ సుందర్ గురించే ఆరా తీస్తున్నారు. 'ఏంటి, సుందర్తో డేటింగ్ అంటగా..', 'బహుత్ సుందర్ హై', 'నీ డ్రెస్ చాలా బాగా వాషింగ్ చేసుకున్నావ్.. బహుత్ సుందర్ హై' అంటూ కామెంట్లతో చెలరేగిపోతున్నారు. కొందరైతే ఏకంగా క్రికెటర్ను పెళ్లి చేసుకోమని సలహా ఇస్తున్నారు. బుల్లితెరపై ఎంత అందాలు ఆరబోసినా రాని గుర్తింపు క్రికెటర్ భార్య అయితే వస్తుందని సలహా ఇస్తున్నారు. క్రికెటర్లను పెళ్లి చేసుకున్న సినీతారల జాబితాలో చేరిపోమని సూచిస్తున్నారు. View this post on Instagram A post shared by Varshini Sounderajan (@varshini_sounderajan) View this post on Instagram A post shared by Varshini Sounderajan (@varshini_sounderajan) చదవండి: గ్రాండ్గా ఆర్ఆర్ఆర్ నిర్మాత దానయ్య ఇంట పెళ్లి -
సన్రైజర్స్కు బిగ్ షాక్.. స్టార్ ఆటగాడు టోర్నీ మొత్తానికి దూరం!
ఐపీఎల్-2023లో ఓటుముల బాధలో ఉన్న సన్రైజర్స్ హైదరాబాద్కు భారీ షాక్ తగిలింది. ఆ జట్టు స్టార్ ఆల్రౌండర్ వాషింగ్టన్ సుందర్ మోకాలి గాయం కారణంగా మిగిలిన టోర్నీ మొత్తానికి దూరమయ్యాడు. ఈ విషయాన్ని ఎస్ఆర్హెచ్ ట్విటర్ వేదికగా వెల్లడించింది. "మోకాలి గాయం కారణంగా ఐపీఎల్-2023 సీజన్ నుంచి తప్పుకున్నాడు" అని ఎస్ఆర్హెచ్ ట్విటర్లో పేర్కొంది. కాగా ఢిల్లీ క్యాపిటల్స్లో జరిగిన మ్యాచ్లో వాషింగ్టన్ అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు. బౌలింగ్లో మూడు వికెట్లు పడగొట్టిన సుందర్.. బ్యాటింగ్లో 24 పరుగులు చేశాడు. అయితే ఇప్పటి వరకు 7 మ్యాచ్లు ఆడిన సుందర్ మూడు వికెట్లతో పాటు 60 పరుగులు సాధించాడు. కాగా తొలి ఆరు మ్యాచ్ల్లో పేలవ ప్రదర్శన కనబరిచిన సుందర్.. ఢిల్లీ మ్యాచ్తో అద్భుతమైన కమ్బ్యాక్ ఇచ్చాడు. అయితే అంతలోనే అతడు గాయం కారణంగా దూరం కావడం ఎస్ఆర్హెచ్కు గట్టి ఎదురు దెబ్బ అనే చెప్పుకోవాలి. 🚨 INJURY UPDATE 🚨 Washington Sundar has been ruled out of the IPL 2023 due to a hamstring injury. Speedy recovery, Washi 🧡 pic.twitter.com/P82b0d2uY3 — SunRisers Hyderabad (@SunRisers) April 27, 2023 చదవండి: Ind Vs Aus WTC 2023: డబ్ల్యూటీసీ ఫైనల్కు ముందు టీమిండియాకు గుడ్న్యూస్! -
హమ్మయ్య.. ఎట్టకేలకు సాధించాడు! సన్రైజర్స్కు ఇక చాలు
ఐపీఎల్-2023లో సన్రైజర్స్ హైదరాబాద్ ఆల్రౌండర్ వాషింగ్టన్ సుందర్ ఎట్టకేలకు అద్భుత ప్రదర్శన కనబరిచాడు. ఈ మెగా ఈవెంట్లో భాగంగా ఉప్పల్ వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్తో జరుగుతున్న మ్యాచ్లో నాలుగు ఓవర్లు బౌలింగ్ చేసిన సుందర్..28 పరుగులిచ్చి మూడు వికెట్లు పడగొట్టాడు. ఆ మూడు వికెట్లు కూడా ఒకే ఓవర్లో పడగొట్టడం విశేషం. ఢిల్లీ ఇన్నింగ్స్ 8 ఓవర్ వేసిన సుందర్.. డేవిడ్ వార్నర్, సర్పరాజ్ ఖాన్ అమాన్ ఖాన్ను పెవిలియన్కు పంపాడు. తన తొలి ఓవర్లో 13 పరుగులిచ్చిన సుందర్.. ఆతర్వాత అద్భుతమైన కమ్బ్యాక్ ఇచ్చాడు. కాగా ఈ ఏడాది సీజన్లో సుందర్ వికెట్లు పడగొట్టడం ఇదే తొలి సారి కావడం గమానార్హం. తొలి ఆరు మ్యాచ్ల్లో సుందర్ ఒక్క వికెట్ కూడా సాధించలేకపోయాడు. ఇక వరుసగా విఫలమకావడంతో సుందర్పై సన్రైజర్స్ అభిమానులు తీవ్ర విమర్శల వర్షం కురిపించారు. అయితే ఇప్పుడు సుందర్ తన స్థాయికి తగ్గట్టు ప్రదర్శన చేయడంతో ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. దీంతో # వాషింగ్టన్ సుందర్ అనే కీవర్డ్ ట్విటర్లో ట్రెండ్ అవుతోంది. చదవండి: IPL 2023: ఐపీఎల్లో భువనేశ్వర్ అరుదైన రికార్డు.. రెండో బౌలర్గా 3 gifts in a single over for Washington Sundarpic.twitter.com/Bk4nuPPAs8 — Gappa Cricket (@GappaCricket) April 24, 2023 -
IPL 2023: సన్రైజర్స్ ఆల్రౌండర్ చెత్త రికార్డు
ఐపీఎల్-2023లో భాగంగా చెన్నై సూపర్కింగ్స్తో నిన్న (ఏప్రిల్ 21) జరిగిన మ్యాచ్లో సన్రైజర్స్ హైదరాబాద్ అన్ని విభాగాల్లో దారుణంగా విఫలమై ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. ఈ మ్యాచ్లో సన్రైజర్స్ ఆల్రౌండర్ వాషింగ్టన్ సుందర్ ఓ చెత్త రికార్డు తన ఖాతాలో వేసుకున్నాడు. ప్రస్తుత ఎడిషన్లో వికెట్ పడగొట్టకుండా అత్యధిక ఓవర్లు వేసిన బౌలర్గా రికార్డుల్లోకెక్కాడు. సుందర్.. ఇప్పటివరకు ఆడిన 6 మ్యాచ్ల్లో 13.4 ఓవర్లు వేసి ఒక్క వికెట్ కూడా పడగొట్టకుండా 118 పరుగులు సమర్పించుకున్నాడు. సుందర్ తర్వాత సీఎస్కే బౌలర్ దీపక్ చాహర్ (9 ఓవర్లలో 94), లక్నో బౌలర్ జయదేవ్ ఉనద్కత్ (8 ఓవర్లలో 92), రాజస్థాన్ రాయల్స్ పేసర్ కేఎం ఆసిఫ్ (7 ఓవర్లలో 69), గుజరాత్ బౌలర్ యశ్ దయాల్ (6 ఓవర్లలో 95)లు వికెట్ లేకుండా (కనీసం 6 ఓవర్లు వేసి) చెత్త గణాంకాలతో లీగ్లో కొనసాగుతున్నారు. కాగా, సన్రైజర్స్తో నిన్న జరిగిన మ్యాచ్లో రవీంద్ర జడేజా (4-0-22-3), డెవాన్ కాన్వే (77 నాటౌట్) సత్తా చాటడంతో సీఎస్కే 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ గెలుపుతో సీఎస్కే 8 పాయింట్లు (0.355) సాధించి, పాయింట్ల పట్టికలో మూడో స్థానానికి ఎగబాకింది. రాజస్థాన్ రాయల్స్ (1.043), లక్నో సూపర్ జెయింట్స్ (0.709) సైతం ఎనిమిదే పాయింట్లతో తొలి రెండు స్థానాల్లో నిలిచాయి. సన్రైజర్స్ ఈ సీజన్లో ఇప్పటివరకు ఆడిన 6 మ్యాచ్ల్లో కేవలం 2 విజయాలు మాత్రమే సాధించి, పాయింట్ల పట్టికలో చివరి నుంచి రెండో స్థానంలో నిలిచింది. -
పేరుకే ఆల్రౌండర్.. జట్టులో ఎందుకు ఉన్నాడో తెలియదు! తీసి పడేయండి
ఐపీఎల్-2023లో సన్రైజర్స్ హైదరాబాద్ మరోసారి తీవ్ర నిరాశ పరిచింది. చెపాక్ వేదికగా చెన్నై సూపర్ కింగ్స్తో జరిగిన మ్యాచ్లో 7 వికెట్ల తేడాతో ఎస్ఆర్హెచ్ ఓటమిపాలైంది. బౌలింగ్, బ్యాటింగ్ విభాగాల్లో దారుణంగా విఫలమైన ఎస్ఆర్హెచ్ ఘోర ఓటమిని మూటకట్టుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన ఎస్ఆర్హెచ్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల కోల్పోయి కేవలం 134 పరుగులు మాత్రమే చేసింది. సన్రైజర్స్ బ్యాటర్లలో అభిషేక్ శర్మ(34) పరుగులతో టాప్ స్కోరర్గా నిలిచాడు. సీఎస్కే బౌలర్లలో జడేజా మూడు వికెట్లతో చెలరేగగా.. దేశ్పాండే, ఆకాష్ సింగ్, పతిరానా తలా వికెట్ సాధించారు. అనంతరం 135 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన సీఎస్కే కేవలం మూడు వికెట్లు కోల్పోయి 18.4 ఓవర్లలో ఛేదించింది. చెన్నై ఓపెనర్ డెవాన్ కాన్వే 77 పరుగులతో ఆజేయంగా నిలిచి మ్యాచ్ను ఫినిష్ చేశాడు. వాషింగ్టన్పై విమర్శల వర్షం.. ఇక ఇది ఇలా ఉండగా.. ఎస్ఆర్హెచ్ జట్టులో కీలక ఆల్రౌండర్గా ఉన్న వాషింగ్టన్ సుందర్ దారుణ ప్రదర్శన కనబరుస్తున్నాడు. సీఎస్కేతో జరిగిన మ్యాచ్లోనూ కేవలం 9 పరుగులు మాత్రమే చేసిన సుందర్.. బౌలింగ్లో కూడా ఒక్క వికెట్ పడగొట్టలేకపోయాడు. తన హోం గ్రౌండ్ అయిన చెపాక్లో కూడా అతడు పేలవ ప్రదర్శన కనబరచడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఇక ఈ ఏడాది సీజన్లో ఇప్పటి వరకు 6 మ్యాచ్లు ఆడిన సుందర్ కేవలం 36 పరుగులు మాత్రమే చేశాడు. అదే విధంగా బౌలింగ్లో అయితే అస్సలు రాణించలేకపోతున్నాడు. 6 మ్యాచ్ల్లో అతడు ఒక్క వికెట్ కూడా పడగొట్టకపోవడం గమనార్హం. ఈ క్రమంలో వాషింగ్టన్ సుందర్పై నెటిజన్లు తీవ్ర విమర్శల వర్షం కురిపిస్తున్నారు. పేరుకే ఆల్రౌండర్ తప్ప పొడిచింది ఏమి లేదని సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు. సుందర్ స్థానంలో మరో ఆటగాడికి అవకాశం ఇస్తే బాగుంటుంది అని పలువురు మాజీ క్రికెటర్లు కూడా అభిప్రాయపడుతున్నారు. చదవండి: NEP vs OMN: చరిత్ర సృష్టించిన నేపాల్ క్రికెటర్.. ప్రపంచంలోనే తొలి బౌలర్గా Fourth #IPL2023 win in the 🎒 & #CSK are back to winning ways at 🏡 Which player's performance did you enjoy the most in #CSKvSRH? 💬#IPLonJioCinema #TATAIPL | @ChennaiIPL pic.twitter.com/HPgBxeFHf7 — JioCinema (@JioCinema) April 21, 2023 -
సుందరానికి తొందరెక్కువ.. తప్పించుకోవడం కష్టం!
సీఎస్కే కెప్టెన్ ఎంఎస్ ధోని తన కీపింగ్ స్మార్ట్నెస్ మరోసారి చూపించాడు. ఎస్ఆర్హెచ్తో మ్యాచ్లో మొదట సూపర్ స్టంపింగ్తో మెరిసిన ధోని ఆఖర్లో సుందర్ను రనౌట్ చేసిన తీరు హైలెట్గా మారింది. ఎస్ఆర్హెచ్ ఇన్నింగ్స్ ఆఖరి ఓవర్ ఆఖరి బంతిని మార్కో జాన్సెన్ మిస్ చేశాడు. ఒక్క పరుగుతో వచ్చేది ఏం లేదని అక్కడే ఆగిపోయే ఉంటే బాగుండేది. ఎదురుగా ఉన్నది ధోని అని తెలిసి కూడా జాన్సెన్ రిస్క్ చేశారు. ఫలితం నాన్స్ట్రైక్ ఎండ్లో ఉన్న సుందర్ క్రీజులోకి వచ్చేలోపే ధోని బంతితో డైరెక్ట్ హిట్ వేయడంతో వికెట్లు ఎగిరిపడ్డాయి. "సుందరానికి బాగా తొందరెక్కువ.. బంతి ధోని చేతుల్లోకి వెళితే తప్పించుకోవడం కష్టమని తెలిసి కూడా రిస్క్ అవసరమా'' అంటూ అభిమానులు కామెంట్ చేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. \ | / Dhoni 𝚠̶𝚊̶𝚜̶ is here! 💥#CSKvSRH #TATAIPL #IPLonJioCInema #IPL2023 pic.twitter.com/9r21Ay7PIS — JioCinema (@JioCinema) April 21, 2023 చదవండి: క్లాసెన్ అడ్డుకున్నా.. ఈసారి ధోని వదల్లేదు! -
పరుగెత్తడంలో అలసత్వం.. కర్మ ఫలితం అనుభవించాల్సిందే
ఎస్ఆర్హెచ్ ఆటగాడు వాషింగ్టన్ సుందర్ బద్దకానికి బ్రాండ్ అంబాసిడర్లా తయారయ్యాడు. కనీసం పరిగెత్తడంలోనూ అలసత్వం ప్రదర్శించడంతో మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది. విషయంలోకి వెళితే.. ఎస్ఆర్హెచ్ ఇన్నింగ్స్ 18వ ఓవర్ జాసన్ బెహండార్ఫ్ వేశాడు. అప్పటికే రెండు ఫోర్లతో సుందర్ టచ్లో కనిపించాడు. Photo: IPL Twitter ఓవర్ ఐదో బంతిని ఫుల్టాస్ వేయగా సుందర్ మిడాఫ్ దిశగా డ్రిల్ చేశాడు. సింగిల్కు ప్రయత్నించిన సుందర్ మొదట్లో వేగంగానే పరిగెత్తుకు వచ్చాడు. బంతిని అందుకున్న ఫీల్డర్ టిమ్ డేవిడ్ నేరుగా బంతిని డైరెక్ట్ త్రో వేశాడు. మరి డేవిడ్ వేసిన బంతి వికెట్లకు తాకదనుకున్నాడో.. తాను ఔట్ కానని నమ్మకమో తెలియదు కానీ క్రీజుకు అడుగు దూరంలో నిర్లక్ష్యం ప్రదర్శించాడు. ఆ నిర్లక్ష్యమే సుందర్ను దెబ్బకొట్టింది. రిప్లేలో సుందర్ క్రీజులోకి వచ్చేలోపే టిమ్ డేవిడ్ వేసిన త్రో డైరెక్ట్గా వికెట్లను తాకింది. పరిగెత్తడంలో అలసత్వం ప్రదర్శించిన సుందర్పై సోషల్ మీడియాలో ట్రోల్స్ గుప్పుమన్నాయి. బద్దకానికి బ్రాండ్ అంబాసిడర్లా ఉన్నావు.. పరిగెత్తడంలో ఇంత నిర్లక్ష్యమా.. కర్మ ఫలితం అనుభవించాల్సిందే. అంటూ ద్వజమెత్తారు. Extreme sloppy and lazy running from Washington Sundar! When you are hitting the ball so well, why to get run out like that!!#RohitSharma𓃵 #ViratKohli𓃵 #MSDhoni𓃵 #washingtonsundar #Sundar #SRHvsMI #TATAIPL2023 #Rohit #IPLOnStar #IPL2O23 #kavyamaran pic.twitter.com/H0LtWKJcPV — Cricket Fanatic (@CricketFanati20) April 18, 2023 చదవండి: #Tilak Varma: ఉన్నది కాసేపే.. కానీ దడదడలాడించాడు -
చేతులు కాలాక ఆకులు పట్టుకోవడం అంటే ఇదే.. ఆ పని ముందే చేయాల్సింది!
ఐపీఎల్-2023లో సన్రైజర్స్ తమ పరాజయాల పరంపర కొనసాగిస్తోంది. ఈ ఏడాది సీజన్లో వరుసగా రెండో ఓటమి చవిచూసింది. లక్నో వేదికగా లక్నో సూపర్ జెయింట్స్తో జరిగిన మ్యాచ్లో 5వికెట్ల తేడాతో ఎస్ఆర్హెచ్ ఓటమి పాలైంది. తొలుత టాస్ గెలిచిన బ్యాటింగ్కు దిగిన ఎస్ఆర్హెచ్ ఆరంభం నుంచే తడబడింది. పిచ్పై బంతి అద్భుతంగా టర్న్ అవ్వడం గమనించిన లక్నో కెప్టెన్ కేఎల్ రాహుల్ను పవర్ప్లే లోపే స్పిన్నర్లను రంగంలోకి దించాడు. సన్రైజర్స్ ఇన్నింగ్స్ మూడో ఓవర్ వేసిన కృనాల్ పాండ్యా.. అగర్వాల్ వికెట్ పడగొట్టి అద్భుతమైన ఆరంభం ఇచ్చారు. అనంతరం ఏ దశలోనూ హైదరాబాద్ బ్యాటర్లు లక్నోకు పోటీఇవ్వలేకపోయారు. ఆ పని ముందే చేయాల్సింది.. 9 ఓవర్లు ముగిసే సమయానికి ఎస్ఆర్హెచ్ కేవలం 55 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఇటువంటి సమయంలో ఎస్ఆర్హెచ్ మెనెజ్మెంట్ పెద్ద తప్పు చేసింది. బ్యాటింగ్ లైనప్లో ముందు ఉన్న అబ్ధుల్ సమద్ను కాదని వాషింగ్టన్ సుందర్ను పంపింది. ఇదే సన్రైజర్స్ కొంపముంచింది. కీలక సమయంలో బ్యాటింగ్కు వచ్చిన సుందర్ టెస్టు మ్యాచ్ను తలపించేలా తన ఇన్నింగ్స్ను కొనసాగించాడు. 28 బంతులు ఎదుర్కొన్న సుందర్ 16 పరుగులు మాత్రమే చేసి తీవ్ర నిరాశపరిచాడు. ఎస్ఆర్హెచ్ ఇన్నింగ్స్ 17 ఓవర్లో రాహుల్ త్రిపాఠి ఔటైన వెంటనే అబ్దుల్ సమద్ క్రీజులోకి వచ్చాడు. అతడు తన ఎదుర్కొన్న తొలి బంతినే బౌండరీగా మలిచాడు. కేవలం 10 బంతులు మాత్రమే ఎదుర్కొన్న సమద్ 2 సిక్స్లు, ఒక ఫోర్తో 21 పరుగులు చేశాడు. అయితే సమద్ క్రీజులోకి వచ్చినప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. సమద్ సంచలన ఇన్నింగ్స్ ఆడడంతో ఎస్ఆర్హెచ్ 121 పరుగులైనా చేయగల్గింది. ఇక సుందర్ స్థానంలో సమద్ బ్యాటింగ్ వచ్చే పరిస్ధితి మరోవిధంగా ఉండేదని ఆరెంజ్ ఆర్మీ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో తెగ చర్చించుకుంటున్నారు. అదే విధంగా రాజస్తాన్తో జరిగిన తొలి మ్యాచ్లో కూడా ఇంపాక్ట్ ప్లేయర్గా వచ్చిన సమద్ 32 పరుగులు చేసి అందరని అకట్టుకున్నాడు. చదవండి: IPL 2023 SRH vs LSG: ఎవరు బాబు నీవు.. వెళ్లి టెస్టులు ఆడుకో పో! అక్కడ కూడా పనికి రాడు
Pagination
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
17, 18 తేదీల్లో గైట్లో ఎస్టీయూ రాష్ట్ర స్థాయి శిక్షణ
నేడు, రేపు గురుకుల పాఠశాలల్లో సీట్ల భర్తీ
No Headline
No Headline
శ్రీసీతారామచంద్రస్వామి కల్యాణం
శ్రీశైలం మల్లికార్జున స్వామిని దర్శించుకున్న ‘గంగుల’
కరీంనగర్లో ‘లండన్’ ఎగ్జిబిషన్
నేలకు సారం.. పంటకు ప్రాణం
పనులు సత్వరమే పూర్తి చేయాలి
బీమా చెక్కు అందజేత
తప్పక చదవండి
- ముంబై హోర్డింగ్ ఘటన.. కారులోనే నలిగిన దంపతుల ప్రాణాలు
- భర్తతో విడిపోయిన సీరియల్ నటి.. సోషల్ మీడియాలో పోస్ట్
- ‘ఫ్యాన్’దే ప్రభంజనం.. సీఎం జగన్ సరికొత్త రికార్డ్!
- ఐశ్వర్యారాయ్ టోట్ బ్యాగ్ ధర తెలిస్తే నోరెళ్లబెడతారు!
- టీడీపీ గుండాల అరాచకం.. ఫ్యాన్కు ఓటేసిందని ట్రాక్టర్తో తొక్కించబోయారు
- కొత్త మార్కును దాటిన బంగారం! ఏకంగా ఎంత ఎగిసిందంటే..
- Virat Kohli: ఒక్కసారి క్రికెట్కు వీడ్కోలు పలికితే.. కోహ్లి నోట రిటైర్మెంట్ మాట!
- భారత సంతతి బాలుడికి దుబాయ్ పోలీసుల సత్కారం!
- IPL 2024: సన్రైజర్స్ ప్లే ఆఫ్స్ చేరదు.. ఆ నాలుగు జట్లే! ఫ్యాన్స్ ఫైర్
- మళ్లీ మనదే అధికారం.. చరిత్ర సృష్టించబోతున్నాం: సీఎం జగన్
Advertisement