-
SRH: కాస్త ఓపిక పట్టు.. నీకూ టైమ్ వస్తుంది: యువీ పోస్ట్ వైరల్
#Abhishek Sharma: లక్నో సూపర్ జెయింట్స్తో మ్యాచ్ సందర్భంగా సన్రైజర్స్ యువ ఓపెనర్ అభిషేక్ శర్మ మరోసారి తన బ్యాటింగ్ పవర్ చూపించాడు. గత కొన్ని రోజులుగా భారీ స్కోర్లు నమోదు చేయలేక చతికిల పడిన ఈ లెఫ్టాండర్ బ్యాటర్.. ఉప్పల్లో మాత్రం శివాలెత్తిపోయాడు.మరో ఓపెనర్ ట్రావిస్ హెడ్(30 బంతుల్లో 89)తో కలిసి ఆకాశమే హద్దుగా చెలరేగాడు. లక్నో విధించిన 166 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో 8 ఫోర్లు, 6 సిక్సర్ల సాయంతో 28 బంతుల్లోనే 75 పరుగులు సాధించాడు అభిషేక్ శర్మ.హెడ్తో కలిసి అజేయంగా నిలిచి 9.4 ఓవర్లలోనే సన్రైజర్స్ టార్గెట్ పూర్తి చేసి ఉప్పల్ స్టేడియాన్నిహోరెత్తించాడు. ఈ నేపథ్యంలో అభిషేక్ శర్మపై ప్రశంసల వర్షం కురుస్తోంది.That's Sunrisers Hyderabad for you 💥#IPLonJioCinema #SRHvLSG #TATAIPL pic.twitter.com/xFiuuafuXa— JioCinema (@JioCinema) May 8, 2024యువీ పాజీకి థాంక్స్ఇక మ్యాచ్ అనంతరం అభిషేక్ శర్మ మాట్లాడుతూ.. ‘‘ఈ టోర్నీ ఆరంభానికి ముందు నేను చేసిన హార్డ్వర్క్ ఫలితాన్నిస్తోంది. యువీ పాజీ(యువరాజ్ సింగ్), బ్రియన్ లారా, నా తండ్రికి ధన్యవాదాలు. మా నాన్నే నా మొదటి కోచ్’’ అంటూ ఉద్వేగానికి లోనయ్యాడు 23 ఏళ్ల అభిషేక్.కాస్త ఓపికగా పట్టుఈ నేపథ్యంలో యువరాజ్ సింగ్ స్పందిస్తూ.. ‘‘అద్భుతంగా ఆడావు అభిషేక్ శర్మ. ఇలాగే నిలకడగా ఆడు. కాస్త ఓపికగా ఉండు! త్వరలోనే నీకూ టైమ్ వస్తుంది’’ అంటూ టీమిండియాలో ఎంట్రీ ఇవ్వాలని ఆకాంక్షించాడు.అదే విధంగా ట్రావిస్ హెడ్ గురించి ప్రస్తావిస్తూ.. ‘‘నువ్వు ఏ గ్రహం నుంచి వచ్చావు ఫ్రెండ్? అస్సలు నమ్మలేకున్నాం’’ అని యువీ అతడిని ఆకాశానికెత్తాడు. కాగా టీమిండియా మాజీ ఆల్రౌండర్ యువరాజ్ సింగ్ పంజాబ్ యువ సంచలనం అభిషేక్ శర్మకు మెంటార్!!సూపర్ అభికాగా ఐపీఎల్-2024లో అభిషేక్ శర్మ నమోదు చేసిన స్కోర్లు వరుసగా.. 32(19), 63(23), 29(20), 37(12), 16(11), 34(22), 46(12), 31(13), 15(9), 12(10), 11(16), 75*(28). మొత్తం 195 బంతుల్లో 35 సిక్సర్ల సాయంతో 401 పరుగులు.సన్రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ లక్నో సూపర్ జెయింట్స్ స్కోర్లు👉వేదిక: ఉప్పల్ స్టేడియం.. హైదరాబాద్👉టాస్: లక్నో.. బ్యాటింగ్👉లక్నో స్కోరు: 165/4 (20)👉సన్రైజర్స్ స్కోరు: 167/0 (9.4)👉ఫలితం: 10 వికెట్ల తేడాతో లక్నోను చిత్తు చేసిన సన్రైజర్స్👉ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్: ట్రావిస్ హెడ్ (30 బంతుల్లో 8 ఫోర్లు, 8 సిక్స్ల సాయంతో 89 రన్స్- నాటౌట్). -
రోహిత్కు ఇంగ్లిష్ రాదు.. ఏడిపించేవాళ్లం.. కానీ: యువీ
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ గురించి భారత మాజీ ఆల్రౌండర్ యువరాజ్ సింగ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. జట్టులోకి వచ్చిన తొలినాళ్లలో రోహిత్ ఇంగ్లిష్ సరిగ్గా మాట్లాడలేకపోయేవాడని.. దాంతో సరదాగా అతడిని తాము ఏడిపించేవాళ్లమని పేర్కొన్నాడు.అయితే, రోహిత్కు మాత్రం అందరితో కలిసి ఉండటం ఇష్టమని.. అతడు గొప్ప మనసున్న వ్యక్తి అంటూ యువీ కొనియాడాడు. ఈసారి రోహిత్ శర్మ కచ్చితంగా ప్రపంచకప్ సాధిస్తాడని ధీమా వ్యక్తం చేశాడు.ఇంత వరకూ నో ఐసీసీ టైటిల్స్!టీ20 ప్రపంచకప్-2021 తర్వాత టీమిండియా సారథిగా బాధ్యతలు చేపట్టిన రోహిత్ శర్మ ఒక్క ఐసీసీ టోర్నీలోనూ టైటిల్ అందించలేకపోయాడు. అతడి కెప్టెన్సీలో 2022 టీ20 ప్రపంచకప్లో సెమీస్లోనే ఇంటిబాట పట్టిన భారత్.. వరల్డ్ టెస్టు చాంపియన్షిప్ ఫైనల్లోనూ చేతులెత్తేసింది.ఇక సొంతగడ్డపై వన్డే వరల్డ్కప్-2023 ఫైనల్లోనూ బోల్తాపడి తృటిలో ట్రోఫీని చేజార్చుకుంది. ద్వైపాక్షిక సిరీస్లు, ఆసియా వన్డే కప్-2023 మినహా ఒక్క మెగా ఈవెంట్లోనూ రోహిత్ సేన ఆశించిన ఫలితాలు రాబట్టలేకపోయింది.రోహిత్కు ఇంగ్లిష్ రాదుఈ క్రమంలో ప్రస్తుతం అందరి కళ్లు టీ20 ప్రపంచకప్-2024 మీదే ఉన్నాయి. 37 ఏళ్ల రోహిత్ శర్మ ఈసారైనా టైటిల్ గెలవాలని అభిమానులు కోరుకుంటున్నారు. ఇదిలా ఉంటే.. జూన్ 1 నుంచి అమెరికా- వెస్టిండీస్ వేదికగా మొదలుకానున్న ఈ ఐసీసీ టోర్నీకి యువరాజ్ సింగ్ అంబాసిడర్గా ఎంపికైన విషయం తెలిసిందే.ఈ నేపథ్యంలో ఐసీసీతో మాట్లాడుతూ యువీ రోహిత్ శర్మ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘‘అతడికి అసలు ఇంగ్లిష్ రాదు. ముంబైలోని బోరివలీ వీధుల నుంచి వచ్చిన వాడు. చాలా సరదాగా ఉంటాడు.ఇంగ్లిష్ విషయంలో మాత్రం అతడిని మేము ఏడిపించేవాళ్లం. భాష సంగతి పక్కనపెడితే అతడి మనసు మాత్రం వెన్న. ఎంత ఎదిగినా తన ప్రవర్తనలో ఎలాంటి మార్పూ లేదు. రోహిత్ శర్మలో గొప్ప గుణం అదే.నా బెస్ట్ ఫ్రెండ్ తాను సరదాగా ఉండటంతో పాటు చుట్టూ ఉన్న వాళ్లకు కూడా వినోదం పంచుతాడు. గొప్ప నాయకుడు. క్రికెట్ రంగంలో నాకున్న అత్యంత సన్నిహితుల్లో రోహిత్ కూడా ఒకడు.ఈసారి రోహిత్ శర్మ వరల్డ్కప్ ట్రోఫీ ఎత్తాలని.. వరల్డ్కప్ మెడల్ మెడలో వేసుకుంటే చూడాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే అతడు ఇందుకు వందకు వంద శాతం అర్హుడు’’ అని యువరాజ్ సింగ్ పేర్కొన్నాడు.అతడే సరైన కెప్టెన్ ఒత్తిడిలోనూ సరైన నిర్ణయాలు తీసుకోగల సత్తా ఉన్న రోహిత్ శర్మ టీమిండియా కెప్టెన్గా ఉండటం బీసీసీఐ తీసుకున్న సరైన నిర్ణయమని ఈ సందర్భంగా యువీ అన్నాడు. ఐపీఎల్లో ఐదు ట్రోఫీలు గెలిచిన రోహిత్ లాంటి వ్యక్తి టీ20 వరల్డ్కప్-2024లోనూ భారత్ను ముందుకు నడిపించడం సానుకూలాంశమని పేర్కొన్నాడు.చదవండి: ప్లే ఆఫ్స్ రేసులో ఉన్నారా? హార్దిక్ సమాధానం ఇదే! -
వరల్డ్కప్ ట్రోఫీతో ఫోజులిచ్చిన యువరాజ్.. ఫోటోలు వైరల్
క్రికెట్ అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్న టీ20 వరల్డ్కప్-2024కు మరో ఐదు వారాల్లో తెరలేవనుంది. జూన్ 1 నుంచి అమెరికా, వెస్టిండీస్ల వేదికగా ఈ మెగా టోర్నీ ఆరంభం కానుంది. కాగా ఈ మెగా ఈవెంట్కు బ్రాండ్ అంబాసిడర్గా టీమిండియా లెజెండ్ యువరాజ్ సింగ్ ఎంపికైన సంగతి తెలిసిందే.ఈ క్రమంలో ఇటీవలే మియామీ గ్రాండ్ ప్రిక్స్లో సందడి చేసిన యువరాజ్.. వరల్డ్కప్ ట్రోఫితో ఫోటోలకు ఫోజులిచ్చాడు. రేసింగ్ ట్రాక్పై వరల్డ్కప్ ట్రోఫితో యువీ ఫోటోలు దిగాడు. ఇందుకు సంబంధించిన ఫోటోలను యువరాజ్ తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేశాడు.ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. కాగా 2007లో జరిగిన మొదటి టీ20 ప్రపంచకప్లో భారత్ తరఫున ప్రాతినిధ్యం వహించిన యువీ.. టైటిల్ గెలవడంలో కీలక పాత్ర పోషించాడు. ఈ టోర్నీలోనే ఇంగ్లండ్తో జరిగిన మ్యాచ్లో స్టువార్ట్ బ్రాడ్ బౌలింగ్లో యువరాజ్ ఆరు బంతులకు ఆరు సిక్సర్లు బాదాడు. ఇప్పటికి టీ20 వరల్డ్కప్ అంటే యువరాజ్ సింగ్ కోసం ప్రతీ ఒక్కరూ చర్చించుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే యువీని ఐసీసీ బ్రాండ్ అంబాసిడర్గా నియమించింది. యువీ.. ఉసెన్ బోల్ట్తో కలిసి ప్రపంచవ్యాప్తంగా నిర్వహించే వరల్డ్కప్ ప్రచార కార్యక్రమాల్లో పాల్గొననున్నాడు. -
Rohit Sharma: మా జట్టు గుండె చప్పుడు!.. వీడియో వైరల్
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ పుట్టినరోజు నేడు(ఏప్రిల్ 30). హిట్మ్యాన్ మంగళవారం నాడు 37వ వసంతంలో అడుగుపెడుతున్నాడు. ఈ సందర్భంగా అతడికి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.బీసీసీఐ కార్యదర్శి జై షా సహా మాజీ క్రికెటర్లు యువరాజ్ సింగ్, గౌతం గంభీర్, వసీం జాఫర్ తదితరులు రోహిత్ శర్మకు విషెస్ తెలిపారు. ఇక హిట్మ్యాన్ ప్రాతినిథ్యం వహిస్తున్న ఐపీఎల్ ముంబై ఇండియన్స్ అతడి బర్త్డే గిఫ్ట్గా ఫ్యాన్స్ కోసం ప్రత్యేక వీడియోను షేర్ చేసింది.మా జట్టు గుండె చప్పుడు‘‘భారత క్రికెట్లో ఉత్తుంగతరంగంలా దూసుకుపోతున్న మా కెప్టెన్ రోహిత్ శర్మకు హ్యాపీ బర్త్డే! నీ నాయకత్వ పటిమ, నైపుణ్యం అమోఘం. మా జట్టు గుండె చప్పుడు నువ్వు.బౌండరీలు బాదుతూ.. మరో వసంతంలోకి! చరిత్ర పుటల్లోకెక్కిన హిట్మ్యాన్.. నువ్వు మరింత ప్రకాశవంతంగా వెలిగిపోవాలి’’ అని జై షా ఆకాంక్షించాడు.సోదర సమానుడు‘‘ఆయురారోగ్యాలు, సంతోషాలతో నువ్వెప్పుడూ విలసిల్లాలి రోహిత్’’ అంటూ గంభీర్ విష్ చేశాడు. ఇక యువీ.. ‘‘సోదర సమానుడు రోహిత్కు పుట్టినరోజు శుభాకాంక్షలు. నీ బ్యాట్ నుంచి మరిన్ని పరుగులు జాలువారాలి’’ అని విషెస్ తెలిపాడు.కాగా ప్రస్తుతం ఐపీఎల్-2024తో బిజీగా ఉన్న ముంబై ఇండియన్స్ స్టార్ రోహిత్ శర్మ భార్య రితికాతో కలిసి బర్త్డే సెలబ్రేట్ చేసుకున్నట్లు తెలుస్తోంది. View this post on Instagram A post shared by Mumbai Indians (@mumbaiindians) ఇందుకు సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్ అవుతుండగా.. ఇందులో సూర్యకుమార్ యాదవ్, అతడి భార్య దేవిషా శెట్టి కూడా కనిపిస్తున్నారు. కాగా ముంబై మంగళవారం లక్నో సూపర్ జెయింట్స్తో తలపడనుంది. HBD Rohit Sharma: హిట్మ్యాన్ కుటుంబం గురించి తెలుసా? బ్యాగ్రౌండ్ ఇదే! -
T20 WC: డీకే అవసరమా?.. వాళ్లిద్దరు బెస్ట్!
టీ20 ప్రపంచకప్-2024 నేపథ్యంలో జట్ల ప్రకటనకు అంతర్జాతీయ క్రికెట్ మండలి మే 1ని డెడ్లైన్గా విధించింది. ఆలోపు మెగా ఈవెంట్లో పాల్గొనే ఆటగాళ్ల ఎంపికను పూర్తి చేయాలని స్పష్టం చేసింది.ఈ నేపథ్యంలో భారత క్రికెట్ నియంత్రణ మండలి ఇప్పటికే జట్టు ఎంపికపై చర్చలు ముమ్మరం చేసినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో టీమిండియా మాజీ ఆల్రౌండర్, ప్రపంచకప్ విజేత యువరాజ్ సింగ్.. మెగా టోర్నీలో ఆడాల్సిన భారత వికెట్ కీపర్ గురించి కీలక వ్యాఖ్యలు చేశాడు.పోటీలో ఆ నలుగురు!కాగా ప్రపంచకప్ జట్టులో బెర్తు కోసం రిషభ్ పంత్, సంజూ శాంసన్, కేఎల్ రాహుల్, దినేశ్ కార్తిక్ మధ్య పోటీ నెలకొంది. ఈ నలుగురిలో డీకే ఐపీఎల్-2024లో ఆర్సీబీకి ఆడుతూ ఫినిషర్గా రాణిస్తున్నాడు.ఇప్పటి వరకు తొమ్మిది మ్యాచ్లలో కలిపి 195.52 స్ట్రైక్రేటుతో 262 పరుగులు చేశాడు. మరోవైపు.. ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ రిషభ్ పంత్ దాదాపు 14 నెలల విరామం తర్వాత కాంపిటేటివ్ క్రికెట్లో అడుగుపెట్టినా.. ఫుల్ ఫామ్లోకి వచ్చేశాడు.ఆడిన తొమ్మిది మ్యాచ్లలో మూడు హాఫ్ సెంచరీల సాయంతో 342 పరుగులు చేశాడు. ఇక సంజూ శాంసన్ రాజస్తాన్ రాయల్స్ కెప్టెన్గా రాణిస్తూ.. వికెట్ కీపర్ బ్యాటర్గానూ రాణిస్తున్నాడు. ఇప్పటి దాకా 385 రన్స్తో అత్యధిక పరుగుల వీరుల జాబితాలో రెండో స్థానంలో కొనసాగుతున్నాడు.డీకే అవసరమా?ఈ లిస్టులో సంజూ తర్వాత కేఎల్ రాహుల్ 378 పరుగులతో మూడో స్థానంలో ఉన్నాడు. ఈ నేపథ్యంలో యువీ ఐసీసీతో మాట్లాడుతూ.. ‘‘డీకే ప్రస్తుతం బాగానే బ్యాటింగ్ చేస్తున్నాడు. కానీ గతసారి(2022) టీ20 వరల్డ్కప్లో అతడు రాణించలేకపోయాడు.కాబట్టి ఈసారి జట్టుకు ఎంపిక చేసినా అతడికి తుదిజట్టులో చోటు దక్కకపోవచ్చు. నిజానికి రిషభ్ పంత్, సంజూ శాంసన్ రూపంలో ఇద్దరు యువ ప్లేయర్లు అందుబాటులో ఉన్నారు. -
రోహిత్, స్కై కాదు!.. వరల్డ్కప్లో ఒకే ఓవర్లో 6 సిక్స్లు కొట్టేది ఇతడే!
2007.. అంతర్జాతీయ క్రికెట్ మండలి మొట్టమొదటి సారి నిర్వహించిన టీ20 వరల్డ్కప్ టోర్నీలో నాటి టీమిండియా స్టార్ యువరాజ్ సింగ్ సృష్టించిన పరుగుల విధ్వంసాన్ని అభిమానులు అంత తేలికగా మర్చిపోలేరు.ఒకే ఓవర్లో ఏకంగా ఆరు సిక్సర్లు బాది యువీ అభిమానులకు కన్నుల పండుగ చేశాడు. ఇంగ్లండ్తో మ్యాచ్లో స్టువర్ట్ బ్రాడ్ బౌలింగ్లో ఆరు బంతుల్లో ఆరు సిక్స్లు కొట్టి ఏకంగా 36 పరుగులు పిండుకుని.. ప్రపంచంలో ఈ ఘనత సాధించిన తొలి క్రికెటర్గా చరిత్రకెక్కాడు.‘న భూతో న భవిష్యతి’ అన్న రీతిలో తాను సాధించిన ఘనత గురించి ఎదురైన ప్రశ్నకు యువరాజ్ సింగ్ ఆసక్తికర సమాధానం ఇచ్చాడు. టీ20 ప్రపంచకప్-2024లో టీమిండియా ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా తన ఫీట్ను పునరావృతం చేయగలడని భావిస్తున్నట్లు తెలిపాడు.జూన్ 1 నుంచి అమెరికా- వెస్టిండీస్ వేదికగా వరల్డ్కప్ ఈవెంట్ ఆరంభం కానున్న విషయం తెలిసిందే. ఈ ఐసీసీ టోర్నీ కోసం మే 1 లోపు జట్లను ప్రకటించేందుకు ఇరవై దేశాల బోర్డులు సిద్ధమయ్యాయి. ఈ నేపథ్యంలో టీమిండియా ఎంపిక గురించి ఇప్పటికే చాలా మంది మాజీ క్రికెటర్లు తమ అభిప్రాయాలు పంచుకున్నారు.అతడికి కూడా ఛాన్స్ ఇవ్వాలిఐపీఎల్-2024లో పేలవ ప్రదర్శన కనబరుస్తున్న పేస్ ఆల్రౌండర్, ముంబై ఇండియన్స్ సారథి హార్దిక్ పాండ్యాకు ఈ జట్టులో చోటు దక్కడం కష్టమేనని భావిస్తున్నారు. అతడికి బదులు చెన్నై సూపర్ కింగ్స్ ఆల్రౌండర్ శివం దూబేకు ఛాన్స్ ఇవ్వాలని బీసీసీఐకి విజ్ఞప్తి చేస్తున్నారు.ఈ నేపథ్యంలో ఐసీసీతో మాట్లాడిన సందర్భంగా.. ‘‘ఈసారి వరల్డ్కప్లో ఒకే ఓవర్లో ఆరు సిక్స్లు కొట్టగల సత్తా ఎవరికి ఉంది?’’ అని యువరాజ్ సింగ్కు ప్రశ్న ఎదురైంది. ఇందుకు బదులిస్తూ.. ‘‘నేనైతే హార్దిక్ పాండ్యానే సాధిస్తాడనుకుంటున్నా’’ అని యువీ పేర్కొన్నాడు. అదే సమయంలో ప్రపంచకప్ జట్టులో శివం దూబేకు కూడా చోటు ఇవ్వాలని యువీ అభిప్రాయపడ్డాడు. ‘‘టీమిండియాలో అతడికి సుస్థిర స్థానం ఉండటం లేదు. కానీ ఐపీఎల్లో మాత్రం బ్యాటింగ్తో అదరగొడుతున్నాడు.కాబట్టి అతడిని జట్టులోకి తీసుకుంటే ఉపయోగకరంగా ఉంటుంది’’ అని యువరాజ్ సింగ్ పేర్కొన్నాడు. కాగా వరల్డ్కప్-2024లో జూన్ 5న టీమిండియా ఐర్లాండ్తో తమ తొలి మ్యాచ్ ఆడనుంది. జూన్ 9న చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్తో అమీతుమీ తేల్చుకోనుంది.ఇక తొట్టతొలి పొట్టి ప్రపంచకప్-2007ను ధోని సేన గెలుచుకున్న విషయం తెలిసిందే. ఆ తర్వాత ఇంత వరకు మళ్లీ టీ20 ఫార్మాట్లో టీమిండియా టైటిల్ గెలవలేదు.చదవండి: సహనం కోల్పోయిన గంభీర్... అంపైర్తో గొడవ! ఆఖరికి.. View this post on Instagram A post shared by ICC (@icc) -
T20 WC 2024: యువరాజ్ సింగ్కు కీలక బాధ్యతలు
టీమిండియా మాజీ ఆటగాడు, సిక్సర్ల కింగ్ యువరాజ్ సింగ్కు ఐసీసీ కీలక బాధ్యతలు అప్పజెప్పింది. త్వరలో ప్రారంభంకానున్న టీ20 వరల్డ్కప్ 2024కు రాయబారిగా నియమించింది. యువరాజ్.. యూనివర్సల్ బాస్ క్రిస్ గేల్, ఎనిమిది సార్లు ఒలింపిక్స్ స్వర్ణ పతక విజేత ఉసేన్ బోల్ట్తో కలిసి పొట్టి ప్రపంచకప్కు అంబాసిడర్గా వ్యవహరిస్తాడని ఐసీసీ ప్రకటించింది. Who will make it to India’s squad for the ICC Men’s #T20WorldCup 2024? 🤔Event Ambassador @Yuvstrong12 has some exciting prospects on his list 👀https://t.co/YlDetOGdYs— T20 World Cup (@T20WorldCup) April 26, 2024 మెగా టోర్నీలో భాగంగా జరిగే భారత్-పాకిస్థాన్ మ్యాచ్తో సహా యుఎస్ఏలో జరిగే మొత్తం మ్యాచ్ల ప్రమోషన్ బాధ్యతలను యువరాజ్కు అప్పజెప్పింది. టీ20 వరల్డ్కప్కు ఐసీసీ రాయబారిగా ఎంపిక కావడంపై యువరాజ్ స్పందిస్తూ.. ఒకే ఓవర్లో ఆరు సిక్సర్లు కొట్టడం వంటి మరుపురాని జ్ఞాపకాలు పొట్టి ప్రపంచకప్తో ముడిపడి ఉన్నాయి.ఇలాంటి మెగా ఈవెంట్లో మరోసారి భాగం కావడం నా అదృష్టం. వరల్డ్కప్ రాయబారిగా నా బాధ్యతలు నిర్వర్తించడానికి చాలా ఉత్సాహంగా ఉన్నానని అన్నాడు. భారత్-పాక్ మ్యాచ్పై యువీ స్పందిస్తూ.. ఈ ఏడాది ప్రపంచంలో జరుగబోయే అతిపెద్ద క్రీడా సంగ్రామమంగా అభివర్ణించాడు. కాగా, ఈ ఏడాది టీ20 ప్రపంచకప్ యూఎస్ఏ, కరీబియన్ దీవులు వేదికగా జూన్ 1 నుంచి ప్రారంభంకానుంది. నెల రోజుల పాటు సాగనున్న ఈ మెగా టోర్నీలో మొత్తం 20 జట్లు నాలుగు గ్రూపులుగా విడిపోయి పోటీపడతాయి. గ్రూప్-ఏలో భారత్తో పాటు కెనడా, పాకిస్థాన్, యూఎస్ఏ, ఐర్లాండ్ ఉన్నాయి. క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న దాయాదుల సమరం (భారత్-పాక్ మ్యాచ్) జూన్ 9న న్యూయార్క్ వేదికగా జరుగనుంది. -
బర్త్డే స్పెషల్.. చిన్నారులతో ఫుట్ బాల్ ఆడిన సచిన్! వీడియో వైరల్
భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ బుధవారం (ఏప్రిల్ 24) తన 51వ వసంతంలోకి అడుగుపెట్టాడు. ఈ సందర్భంగా సచిన్కు పుట్టినరోజు శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. అభిమానులు, యువరాజ్ సింగ్, గౌతం గంభీర్, సురేష్ రైనా, ఓజా వంటి మాజీ క్రికెటర్లు సచిన్కు సోషల్ మీడియా ద్వారా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు.ఐసీసీ, బీసీసీఐ కూడా సచిన్కు ఎక్స్ వేదిగా స్పెషల్ విషెస్ తెలియజేసింది. కాగా సచిన్ తన బర్త్డే సెలబ్రేషన్స్ను సతీమణి అంజలితో కలిసి ‘సచిన్ టెండ్కూల్కర్ ఫౌండేషన్’లో జరపునకున్నాడు. చాలా సమయం పాటు అక్కడ ఉన్న చిన్నారులతో సచిన్ ముచ్చటించాడు. ఈ సందర్భంగా తన బర్త్డే సెలబ్రేషన్స్కు సంబంధించిన విషయాలను సచిన్ అభిమానులతో పంచుకున్నాడు."ఈసారి నా బర్త్డే సెలబ్రేషన్స్ భిన్నంగా చేసుకోవడం చాల సంతోషంగా ఉంది. సచిన్ టెండూల్కర్ ఫౌండేషన్ సాయంతో ఎదుగుతున్న చిన్నారుల మధ్య కేక్ కట్ చేయడం నా అదృష్టంగా భావిస్తున్నా. వారితో ఫుట్బాల్ ఆడటం, నా స్టోరీలను పంచుకోవడం ఎంతో అనుభూతిని ఇచ్చింది. నాకు శుభాకాంక్షలు తెలిపిన వారిలో వీరే ఫస్ట్ అనుకుంటాను. ఈ మూమెంట్ నా జీవితంలో ఎప్పటికీ గుర్తుండిపోతుందని" తన బర్త్డే వేడుకల సంబంధించిన వీడియో క్లిప్ను సచిన్ ఎక్స్లో షేర్ చేశాడు. Happy birthday paaji! 🎉 From smashing bowlers on the field to smashing life goals, you're the reason I learned to aim higher in life (and sometimes on the field too 🤪) Here's wishing you loads of love, good health and happiness always 🤗❤️@sachin_rt #HappyBirthdaySachin pic.twitter.com/t6qFKgKJmZ— Yuvraj Singh (@YUVSTRONG12) April 24, 2024 -
11 బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేసిన అశుతోష్.. యువరాజ్ రికార్డు బద్దలు
ఐపీఎల్ 2024 సీజన్లో భాగంగా ముంబై ఇండియన్స్తో నిన్న (ఏప్రిల్ 18) జరిగిన మ్యాచ్లో పంజాబ్ కింగ్స్ బ్యాటర్ అశుతోష్ శర్మ మెరుపు ఇన్నింగ్స్తో (28 బంతుల్లో 61; 2 ఫోర్లు, 7 సిక్సర్లు) విధ్వంసం సృస్టించిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్లో అశుతోష్ సుడిగాలి ఇన్నింగ్స్ విరుచుకుపడినప్పటికీ పంజాబ్కు పరాభవం తప్పలేదు. ముంబై నిర్దేశించిన 193 పరుగుల లక్ష్యానికి పంజాబ్ 10 పరుగుల దూరంలో నిలిచిపోయి ఓటమిపాలైంది. కాగా, అశుతోష్ పేరిట టీ20ల్లో సెకెండ్ ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ ఉన్న విషయం మనలో చాలామందికి తెలియకపోవచ్చు. సరిగ్గా ఆరు నెలల కిందట సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ 2023లో అశుతోష్ 11 బంతుల్లో ఫిఫ్టి కొట్టాడు. ఆ టోర్నీలో రైల్వేస్కు ఆడిన అశుతోష్.. అరుణాచల్ ప్రదేశ్తో జరిగిన గ్రూప్-సి మ్యాచ్లో 11 బంతుల్లో బౌండరీ, ఎనిమిది సిక్సర్ల సాయంతో 53 పరుగులు చేశాడు. ఈ మెరుపు ఇన్నింగ్స్ తర్వాత అశుతోష్.. యువరాజ్ సింగ్ పేరిట ఉండిన సెకెండ్ ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. 2007లో జరిగిన తొలి టీ20 వరల్డ్కప్లో యువరాజ్ ఇంగ్లండ్పై 12 బంతుల్లో హాఫ్ సెంచరీ చేశాడు. దాదాపు 16 ఏళ్ల పాటు టీ20ల్లో ఇదే ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీగా కొనసాగింది. అయితే అశుతోష్ 11 బంతులు హాఫ్ సెంచరీ చేయడానికి నెల ముందు ఈ రికార్డుకు బీటలు పడ్డాయి. 2023 ఏషియన్ గేమ్స్లో నేపాల్ ఆటగాడు దీపేంద్ర సింగ్.. మంగోలియాపై కేవలం 9 బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేసి ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ రికార్డు తన పేరిట లిఖించుకున్నాడు. ఇదిలా ఉంటే, 25 ఏళ్ల అశుతోష్ తన తొలి ఐపీఎల్ సీజన్లో (2024) చెలరేగిపోతున్నాడు. ఈ సీజన్లో అశుతోష్ ఆడిన నాలుగు మ్యాచ్ల్లో 205.3 స్ట్రయిక్రేట్తో 52 సగటున 156 పరుగులు చేశాడు. ఈ సీజన్లో అశుతోష్ ఇప్పటివరకు 13 సిక్సర్లు, 9 ఫోర్లు బాదాడు. ఐపీఎల్లో ఆడిన నాలుగు మ్యాచ్ల్లో అశుతోష్ స్కోర్లు ఇలా ఉన్నాయి. - 31(17). - 33*(15). - 31(26). - 61(28). -
6 బంతుల్లో ఆరు సిక్స్లు .. నేపాల్ బ్యాటర్ వరల్డ్ రికార్డు! వీడియో వైరల్
అంతర్జాతీయ టీ20 క్రికెట్లో నేపాల్ స్టార్ ఆల్రౌండర్ దీపేంద్ర సింగ్ ఐరీ సరికొత్త చరిత్ర సృష్టించాడు. టీ20ల్లో రెండు సార్లు ఆరు బంతుల్లో ఆరు సిక్సర్లు బాదిన తొలి క్రికెటర్గా దీపేంద్ర సింగ్ రికార్డులకెక్కాడు. ఏసీసీ ప్రీమియర్ కప్ -2024లో భాగంగా ఒమెన్ వేదికగా ఖతార్తో మ్యాచ్లో దీపేంద్ర సింగ్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. ఈ మ్యాచ్లో దీపేంద్ర సింగ్ ఆరు బంతుల్లో ఆరు సిక్స్లు బాదాడు. నేపాల్ ఇన్నింగ్స్ 20 ఓవర్ వేసిన ఖతార్ బౌలర్ కమ్రాన్ ఖాన్ బౌలింగ్లో ఐరీ వరుసగా ఆరు సిక్స్లు కొట్టాడు. ఓవరాల్గా ఈ మ్యాచ్లో 21 బంతులు ఎదుర్కొన్న దీపేంద్ర సింగ్ 3 ఫోర్లు, 7 సిక్స్లతో 64 పరుగులు చేశాడు. కాగా అంతకుముందు ఏషియన్ గేమ్స్-2023లో మంగోలియాతో జరిగిన మ్యాచ్లోనూ ఐరీ ఆరు బంతుల్లో ఆరు సిక్సర్లు కొట్టాడు. తద్వారా ఈ వరల్డ్ రికార్డును ఐరీ పేరిట లిఖించుకున్నాడు. ఇప్పటివరకు వరల్డ్క్రికెట్లో ఎవరూ రెండు సార్లు ఆరు బంతుల్లో ఆరు సిక్సర్లు బాదలేదు. ఇక అంతర్జాతీయ టీ20ల్లో ఐరీ కంటే ముందు యువరాజ్ సింగ్, కీరాన్ పొలార్డ్ 6 బంతుల్లో ఆరు సిక్స్లు బాదారు. 𝗨𝗡𝗥𝗘𝗔𝗟 😵💫#NEPvQAT #ACCMensPremierCup #ACC pic.twitter.com/72Itd5INE1 — AsianCricketCouncil (@ACCMedia1) April 13, 2024 -
IPL 2024: నీకు ‘బడిత పూజ’ తప్పదు.. యువీ ‘ఫైర్’!
సన్రైజర్స్ హైదరాబాద్ స్టార్ బ్యాటర్ అభిషేక్ శర్మపై టీమిండియా మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ మరోసారి ‘కోపం’ ప్రదర్శించాడు. గతంలో అభిషేక్కు చెప్పు చూపి బెదిరించిన యువీ.. ఈసారి నీకు బడిత పూజ తప్పదన్నట్లుగా ఓ మీమ్ షేర్ చేశాడు. కాగా ఐపీఎల్-2024లో భాగంగా చెన్నై సూపర్ కింగ్స్తో మ్యాచ్లో అభిషేక్ అదరగొట్టిన విషయం తెలిసిందే. 166 పరుగుల మోస్తరు లక్ష్యంతో బరిలోకి దిగిన ఎస్ఆర్హెచ్కు ఈ లెఫ్టాండ్ ఓపెనర్ అదిరిపోయే ఆరంభం ఇచ్చాడు. సీఎస్కే బౌలింగ్ను చీల్చి చెండాడుతూ కేవలం 12 బంతుల్లో 37 పరుగులు సాధించాడు. అతడి ఇన్నింగ్స్లో మూడు ఫోర్లతో పాటు ఏకంగా నాలుగు సిక్సర్లు ఉండటం విశేషం. స్ట్రైక్ రేటు ఏకంగా 308.33. అయితే, అతడి అభిషేక్ బ్యాటింగ్ మెరుపులు ఇంకాసేపు చూడాలని భావించిన అభిమానుల ఆశలపై దీపక్ చహర్- రవీంద్ర జడేజా నీళ్లు చల్లారు. I’m right behind you boy …well played again - but bad shot to get out on 🤨@IamAbhiSharma4 #CSKvsSRH pic.twitter.com/IF8qLZ5S9Z — Yuvraj Singh (@YUVSTRONG12) April 5, 2024 రైజర్స్ ఇన్నింగ్స్లో మూడో ఓవర్లో చహర్ వేసిన నాలుగో బంతి అవుట్ ఆఫ్ దిశగా వైడ్ వెళ్తుండగా.. అభిషేక్ షాట్ ఆడేందుకు ప్రయత్నించాడు. డీప్ బ్యాక్వర్డ్ పాయింట్ మీదుగా బంతిని కొట్టగా.. ఫీల్డర్ జడ్డూ అద్భుత రీతిలో క్యాచ్ అందుకున్నాడు. ఫలితంగా అభిషేక్ ఇన్నింగ్స్కు తెరపడింది. Abhishek sambhavam 🔥🤩#SRHvCSK #IPLonJioCinema #TATAIPL pic.twitter.com/rkekTCQOve — JioCinema (@JioCinema) April 5, 2024 ఏదేమైనా ఈ మ్యాచ్లో జట్టును గెలిపించిన అభిషేక్ శర్మను ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు వరించింది. ఈ క్రమంలో అతడిపై ప్రశంసలు కురిపిస్తూనే చిరుకోపం ప్రదర్శించాడు యువీ. ‘‘నేను ఎల్లప్పుడూ నీకు మద్దతుగానే ఉంటాను బాబూ.. మరోసారి మంచి ఇన్నింగ్స్ ఆడావు. అయితే, ఈసారి కూడా చెత్త షాట్ సెలక్షన్కు అవుటయ్యావు’’ అంటూ ఓ వ్యక్తి కర్ర లాంటి వస్తువుతో మరో వ్యక్తిని తరుముతున్నట్లుగా ఉన్న హిలేరియస్ మీమ్ ఒకటి షేర్ చేశాడు. యువీ చేసిన ఈ ట్వీట్ నెట్టింట వైరల్గా మారింది. కాగా పంజాబ్కు చెందిన అభిషేక్ శర్మ యువీకి వీరాభిమాని. ఇక అభిషేక్కు యువరాజ్ మెంటార్గా వ్యవహరిస్తూ ఉండటం విశేషం. ఈ నేపథ్యంలో మ్యాచ్ అనంతరం అభిషేక్ మాట్లాడుతూ.. ‘‘యువీ పాజీ.. ధన్యవాదాలు’’ అంటూ కృతజ్ఞత చాటుకున్నాడు. ఈ నేపథ్యంలో యువరాజ్ సింగ్ ఈ మేరకు స్పందించడం గమనార్హం. ఐపీఎల్-2024 ఎస్ఆర్హెచ్ వర్సెస్ సీఎస్కే ►టాస్- ఎస్ఆర్హెచ్- బౌలింగ్ ►సీఎస్కే స్కోరు: 165/5 (20) ►ఎస్ఆర్హెచ్: 166/4 (18.1). ►ఫలితం: ఆరు వికెట్ల తేడాతో చెన్నైపై సన్రైజర్స్ విజయం. చదవండి: జడ్డూ అవుట్ కావాలి కదా? కమిన్స్ ఎందుకు వదిలేశాడు? వీడియో వైరల్ var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_7552012696.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
WC 2011: ఊహించని షాకులు.. ఆ మధుర జ్ఞాపకాలు మరువగలమా?!
‘‘2011.. మేము ప్రపంచకప్ ఎత్తిన రోజు. ఆ చారిత్రాత్మక క్షణాన్ని గుర్తు చేసుకుంటే ఇప్పటికీ రోమాలు నిక్కబొడుచుకుంటాయి. అద్భుతమైన జట్టుతో మరుపురాని జ్ఞాపకాలు’’.. ‘‘ఆ అద్భుత క్షణంలోకి మరొక్కసారి’’.. టీమిండియా వన్డే వరల్డ్కప్ గెలిచిన జట్టులో సభ్యులైన సురేశ్ రైనా, యువరాజ్ సింగ్ భావోద్వేగం.సరిగ్గా పదమూడేళ్ల క్రితం ఇదే రోజున.. ఇరవై ఎనిమిదేళ్ల సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ భారత క్రికెట్ జట్టు జగజ్జేతగా అవతరించింది. సొంత గడ్డపై ప్రఖ్యాత వాంఖడే మైదానంలో మువ్వన్నెల జెండాను రెపరెపలాడించింది ధోని సేన.క్రికెట్ దేవుడిగా పేరొందిన సచిన్ టెండుల్కర్ చిరకాల కలను నెరవేర్చి.. అపూర్వ విజయాన్ని అతడికి బహుమతిగా అందించింది. నాడు శ్రీలంకతో ఫైనల్ మ్యాచ్లో కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని సిక్స్ బాదగానే కోట్లాది మంది భారతీయుల హృదయాలు సంతోషంతో ఉప్పొంగిపోయాయి.వాంఖడేలో ఉన్న దాదాపు 33 వేల మంది మా తుజే సలాం అంటూ జట్టును ఉత్సాహపరిచారు. మైదానంలో ఉన్న ప్రేక్షకులతో పాటు యావత్ భారతావని ఆనందంతో పులకించిపోయింది. ఆ అపురూప క్షణాన్ని చెరగని జ్ఞాపకంగా గుండెల్లో పదిలపరచుకున్నారు అభిమానులు. వారిలో మీరూ ఒకరా?!.. మరి ఆనాటి మ్యాచ్ విశేషాలు మరోసారి గుర్తుచేసుకుందామా?శుభారంభం లభించినాముంబైలోని వాంఖడే స్టేడియం.. టాస్ గెలిచిన శ్రీలంక కెప్టెన్ కుమార్ సంగక్కర తొలుత బ్యాటింగ్ ఎంచుకున్నాడు. భారత పేసర్ జహీర్ ఖాన్ ఆరంభంలోనే ఓపెనర్ ఉపుల్ తరంగ(2)ను పెవిలియన్కు పంపాడు. అనంతరం హర్భజన్ సింగ్ మరో ఓపెనర్ తిలకరత్రె దిల్షాన్(33)ను అవుట్ చేయగా.. యువరాజ్ సింగ్.. కెప్టెన్ కుమార్ సంగక్కర(48) వికెట్ను తన ఖాతాలో వేసుకున్నాడు.వరుస వికెట్లు తీసిన టీమిండియా ఆనందాన్ని ఆవిరి చేస్తూ.. నాలుగో నంబర్ బ్యాటర్ మహేళ జయవర్ధనే అజేయ శతకం(103)తో విరుచుకుపడ్డాడు. అయితే, మిగతా వాళ్లలో మళ్లీ ఒక్కరు కూడా కనీసం 35 పరుగుల మార్కు అందుకోలేకపోయారు. ఫలితంగా నిర్ణీత 50 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 274 పరుగుల వద్ద శ్రీలంక ఇన్నింగ్స్ ముగిసింది.ఊహించని షాకులుఇక లక్ష్య ఛేదనకు దిగిన టీమిండియాకు ఊహించని షాకిచ్చాడు లసిత్ మలింగ. ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్(0)ను డకౌట్ చేశాడు. మైదానమంతా నిశ్శబ్దం. ఆ తర్వాత కాసేపటికే సచిన్ టెండుల్కర్(18) కూడా అవుట్!ఊపిరులూదిన గంభీర్ఆ సమయంలో నిలకడగా బ్యాటింగ్ చేస్తూ భారత శిబిరంతో పాటు అభిమానుల్లో ఉత్సాహం నింపాడు వన్డౌన్ బ్యాటర్ గౌతం గంభీర్. 122 బంతులు ఎదుర్కొని 97 పరుగులు సాధించాడు. సెంచరీకి మూడు పరుగుల దూరంలో నిలిచిపోయినా.. అంతకంటే విలువైన ఇన్నింగ్సే ఆడాడు.ధనాధన్ ధోనిమిగిలిన వాళ్లలో విరాట్ కోహ్లి 35 పరుగులతో ఫర్వాలేదనిపించగా.. ధనాధన్ బ్యాటింగ్తో దంచికొట్టాడు కెప్టెన్ ధోని. యువరాజ్ సింగ్(21 నాటౌట్)తో కలిసి ఆఖరి వరకు అజేయంగా నిలిచి టీమిండియాను గెలిపించాడు. ఆ క్షణాన్ని మర్చిపోగలమా?ఇక నలభై తొమ్మిదవ ఓవర్ రెండో బంతికి అతడు కొట్టిన విన్నింగ్ సిక్స్ భారత క్రికెట్ చరిత్రలోనే అత్యుత్తమ క్షణంగా నిలిచిపోతుందనడం అతిశయోక్తి కాదు. ఈ మ్యాచ్లో మొత్తంగా 79 బంతులు ఎదుర్కొన్న ధోని 8 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 91 పరుగులతో నాటౌట్గా నిలిచాడు.ఆరు వికెట్ల తేడాతో శ్రీలంకపై జయభేరి మోగించిన భారత జట్టు రెండోసారి వన్డే వరల్డ్కప్ ట్రోఫీని ముద్దాడింది. దీంతో వాంఖడేతో పాటు దేశమంతటా సంబరాలు అంబరాన్నంటాయి.Probably the greatest ever night for any Indian fan which came under MS Dhoni's captaincy. The atmosphere and feeling were unmatched. pic.twitter.com/bzrIKRbsts— Mufaddal Vohra (@mufaddal_vohra) July 7, 2022చదవండి: IPL 2024: చరిత్ర సృష్టించిన ముంబై ఇండియన్స్.. తొలి జట్టుగాReliving this feeling ❤️🇮🇳🏆#CWC2011 pic.twitter.com/zT9C0FSusg— Yuvraj Singh (@YUVSTRONG12) April 2, 2024 -
WC 2011: ఊహించని షాకులు.. ఆ మధుర జ్ఞాపకాలు మరువగలమా?!
‘‘2011.. మేము ప్రపంచకప్ ఎత్తిన రోజు. ఆ చారిత్రాత్మక క్షణాన్ని గుర్తు చేసుకుంటే ఇప్పటికీ రోమాలు నిక్కబొడుచుకుంటాయి. అద్భుతమైన జట్టుతో మరుపురాని జ్ఞాపకాలు’’.. ‘‘ఆ అద్భుత క్షణంలోకి మరొక్కసారి’’.. టీమిండియా వన్డే వరల్డ్కప్ గెలిచిన జట్టులో సభ్యులైన సురేశ్ రైనా, యువరాజ్ సింగ్ భావోద్వేగం. సరిగ్గా పదమూడేళ్ల క్రితం ఇదే రోజున.. ఇరవై ఎనిమిదేళ్ల సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ భారత క్రికెట్ జట్టు జగజ్జేతగా అవతరించింది. సొంత గడ్డపై ప్రఖ్యాత వాంఖడే మైదానంలో మువ్వన్నెల జెండాను రెపరెపలాడించింది ధోని సేన. క్రికెట్ దేవుడిగా పేరొందిన సచిన్ టెండుల్కర్ చిరకాల కలను నెరవేర్చి.. అపూర్వ విజయాన్ని అతడికి బహుమతిగా అందించింది. నాడు శ్రీలంకతో ఫైనల్ మ్యాచ్లో కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని సిక్స్ బాదగానే కోట్లాది మంది భారతీయుల హృదయాలు సంతోషంతో ఉప్పొంగిపోయాయి. వాంఖడేలో ఉన్న దాదాపు 33 వేల మంది మా తుజే సలాం అంటూ జట్టును ఉత్సాహపరిచారు. మైదానంలో ఉన్న ప్రేక్షకులతో పాటు యావత్ భారతావని ఆనందంతో పులకించిపోయింది. ఆ అపురూప క్షణాన్ని చెరగని జ్ఞాపకంగా గుండెల్లో పదిలపరచుకున్నారు అభిమానులు. వారిలో మీరూ ఒకరా?!.. మరి ఆనాటి మ్యాచ్ విశేషాలు మరోసారి గుర్తుచేసుకుందామా? శుభారంభం లభించినా ముంబైలోని వాంఖడే స్టేడియం.. టాస్ గెలిచిన శ్రీలంక కెప్టెన్ కుమార్ సంగక్కర తొలుత బ్యాటింగ్ ఎంచుకున్నాడు. భారత పేసర్ జహీర్ ఖాన్ ఆరంభంలోనే ఓపెనర్ ఉపుల్ తరంగ(2)ను పెవిలియన్కు పంపాడు. అనంతరం హర్భజన్ సింగ్ మరో ఓపెనర్ తిలకరత్రె దిల్షాన్(33)ను అవుట్ చేయగా.. యువరాజ్ సింగ్.. కెప్టెన్ కుమార్ సంగక్కర(48) వికెట్ను తన ఖాతాలో వేసుకున్నాడు. వరుస వికెట్లు తీసిన టీమిండియా ఆనందాన్ని ఆవిరి చేస్తూ.. నాలుగో నంబర్ బ్యాటర్ మహేళ జయవర్ధనే అజేయ శతకం(103)తో విరుచుకుపడ్డాడు. అయితే, మిగతా వాళ్లలో మళ్లీ ఒక్కరు కూడా కనీసం 35 పరుగుల మార్కు అందుకోలేకపోయారు. ఫలితంగా నిర్ణీత 50 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 274 పరుగుల వద్ద శ్రీలంక ఇన్నింగ్స్ ముగిసింది. ఊహించని షాకులు ఇక లక్ష్య ఛేదనకు దిగిన టీమిండియాకు ఊహించని షాకిచ్చాడు లసిత్ మలింగ. ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్(0)ను డకౌట్ చేశాడు. మైదానమంతా నిశ్శబ్దం. ఆ తర్వాత కాసేపటికే సచిన్ టెండుల్కర్(18) కూడా అవుట్! ఊపిరులూదిన గంభీర్ ఆ సమయంలో నిలకడగా బ్యాటింగ్ చేస్తూ భారత శిబిరంతో పాటు అభిమానుల్లో ఉత్సాహం నింపాడు వన్డౌన్ బ్యాటర్ గౌతం గంభీర్. 122 బంతులు ఎదుర్కొని 97 పరుగులు సాధించాడు. సెంచరీకి మూడు పరుగుల దూరంలో నిలిచిపోయినా.. అంతకంటే విలువైన ఇన్నింగ్సే ఆడాడు. ధనాధన్ ధోని మిగిలిన వాళ్లలో విరాట్ కోహ్లి 35 పరుగులతో ఫర్వాలేదనిపించగా.. ధనాధన్ బ్యాటింగ్తో దంచికొట్టాడు కెప్టెన్ ధోని. యువరాజ్ సింగ్(21 నాటౌట్)తో కలిసి ఆఖరి వరకు అజేయంగా నిలిచి టీమిండియాను గెలిపించాడు. ఆ క్షణాన్ని మర్చిపోగలమా? ఇక నలభై తొమ్మిదవ ఓవర్ రెండో బంతికి అతడు కొట్టిన విన్నింగ్ సిక్స్ భారత క్రికెట్ చరిత్రలోనే అత్యుత్తమ క్షణంగా నిలిచిపోతుందనడం అతిశయోక్తి కాదు. ఈ మ్యాచ్లో మొత్తంగా 79 బంతులు ఎదుర్కొన్న ధోని 8 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 91 పరుగులతో నాటౌట్గా నిలిచాడు. ఆరు వికెట్ల తేడాతో శ్రీలంకపై జయభేరి మోగించిన భారత జట్టు రెండోసారి వన్డే వరల్డ్కప్ ట్రోఫీని ముద్దాడింది. దీంతో వాంఖడేతో పాటు దేశమంతటా సంబరాలు అంబరాన్నంటాయి. Probably the greatest ever night for any Indian fan which came under MS Dhoni's captaincy. The atmosphere and feeling were unmatched. pic.twitter.com/bzrIKRbsts — Mufaddal Vohra (@mufaddal_vohra) July 7, 2022 చదవండి: IPL 2024: చరిత్ర సృష్టించిన ముంబై ఇండియన్స్.. తొలి జట్టుగా Reliving this feeling ❤️🇮🇳🏆#CWC2011 pic.twitter.com/zT9C0FSusg — Yuvraj Singh (@YUVSTRONG12) April 2, 2024 -
చెప్తే అర్థం కాదా?.. సన్రైజర్స్ స్టార్కు చెప్పు చూపించిన యువీ!
సన్రైజర్స్ హైదరాబాద్ స్టార్ బ్యాటర్ అభిషేక్ శర్మపై టీమిండియా మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ ప్రశంసలు కురిపించాడు. అదే సమయంలో ‘‘నీకోసం.. ప్రత్యేకంగా ఓ చెప్పు ఎదురుచూస్తోంది’’ అంటూ ఊహించని షాకిచ్చాడు. ఇంతకీ విషయమేమిటంటే.. ఐపీఎల్-2024లో భాగంగా ముంబై ఇండియన్స్తో జరిగిన మ్యాచ్లో సన్రైజర్స్ హైదరాబాద్ అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్న విషయం తెలిసిందే. ఉప్పల్ మైదానంలో పరుగుల వరద పారించి క్యాష్ రిచ్ లీగ్ చరిత్రలోనే అత్యధిక స్కోరు(277) నమోదు చేసింది. ఇక ఈ మ్యాచ్లో వన్డౌన్లో వచ్చిన అభిషేక్ శర్మ వీర విహారం చేశాడు. కేవలం 23 బంతుల్లోనే 63 పరుగులతో అదరగొట్టాడు. 3 ఫోర్లు, 7 సిక్సర్ల సాయంతో పరుగుల సునామీ సృష్టించి.. సన్రైజర్స్ తరఫున వేగవంతమైన అర్ధ శతకం నమోదు చేశాడు. Abhishek Sharma's scintillating knock comes to an end but he's put @SunRisers on 🔝 with his astonishing strokes 🔥 Head to @JioCinema and @StarSportsIndia to watch the match LIVE#TATAIPL | #SRHvMI pic.twitter.com/OoHgAK6yge — IndianPremierLeague (@IPL) March 27, 2024 అయితే, ముంబై బౌలర్ పీయూష్ చావ్లా సంధించిన షార్ట్బాల్ను సరిగ్గా అంచనా వేయలేక నమన్ ధిర్కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. ఈ నేపథ్యంలో యువరాజ్ సింగ్ స్పందిస్తూ.. ‘‘సూపర్ సర్.. వారెవ్వా అభిషేక్.. గొప్ప ఇన్నింగ్స్. కానీ ఇలాంటి షాట్కు అవుటవుతావా? నీకు మంచిగా చెబితే అర్థం కాదు కదా? అందుకే ఇప్పుడు నీ కోసం ప్రత్యేకంగా ఓ స్లిప్పర్ ఎదురుచూస్తోంది. వచ్చెయ్’’ అని ఎక్స్ వేదికగా పోస్ట్ పెట్టాడు. అదే విధంగా.. హెన్రిచ్ క్లాసెన్ అద్భుత ఇన్నింగ్స్ను కూడా కొనియాడాడు. కాగా పంజాబ్కు చెందిన అభిషేక్కు యువీ ఆరాధ్య క్రికెటర్. అంతేకాకుండా.. అతడికి మెంటార్ కూడా! Waah sir Abhishek waah 👏🏻 great innings but what a splendid shot to get out on! Laaton ke bhoot baaton se nahi maante! Special 🩴 waiting for you now @IamAbhiSharma4 Great knock by Klassy #Klaasen! #SRHvMI #IPL2024 — Yuvraj Singh (@YUVSTRONG12) March 27, 2024 అందుకే యువరాజ్ ఈ మేరకు అభిషేక్ ఆట తీరును విశ్లేషిస్తూ.. చొరవగా ఇలా ట్వీట్ చేశాడు. కాగా ముంబై ఇండియన్స్తో మ్యాచ్లో అభిషేక్తో పాటు ట్రవిస్ హెడ్(24 బంతుల్లో 62), మార్క్రమ్(28 బంతుల్లో 42 నాటౌట్), హెన్రిచ్ క్లాసెన్(34 బంతుల్లో 80 నాటౌట్) దుమ్ములేపారు. ఫలితంగా 277 పరుగులు స్కోరు చేసిన సన్రైజర్స్.. ముంబైని 246 పరుగులకు కట్టడి చేసి 31 పరుగుల తేడాతో గెలిచింది. చదవండి: #SRHvsMI: ఎగిరి గంతేసిన కావ్య.. తలపట్టుకున్న నీతా అంబానీ! వైరల్ The moment when @SunRisers created HISTORY! Final over flourish ft. Heinrich Klaasen 🔥 Head to @JioCinema and @StarSportsIndia to watch the match LIVE#TATAIPL | #SRHvMI pic.twitter.com/QVERNlftkb — IndianPremierLeague (@IPL) March 27, 2024 WHAT. A. MATCH! 🔥 Raining sixes and 500 runs scored for the first time ever in #TATAIPL 💥 Hyderabad is treated with an epic encounter 🧡💙👏 Scorecard ▶️ https://t.co/oi6mgyCP5s#SRHvMI pic.twitter.com/hwvWIDGsLh — IndianPremierLeague (@IPL) March 27, 2024 -
యువరాజ్ సింగ్ పోరాటం వృధా.. లెజెండ్స్ టైటిల్ నెగ్గిన ఉతప్ప జట్టు
శ్రీలంకలోని పల్లెకెలె వేదికగా జరుగుతున్న తొలి లెజెండ్స్ క్రికెట్ ట్రోఫీని రాజస్థాన్ కింగ్స్ కైవసం చేసుకుంది. ఇవాళ జరిగిన ఫైనల్లో రాబిన్ ఉతప్ప సారధ్యం వహిస్తున్న రాజస్థాన్.. యువరాజ్ సింగ్ నాయకత్వంలోని న్యూయార్క్ సూపర్స్టార్ స్ట్రయికర్స్ను 20 పరుగుల తేడాతో ఓడించింది. రాజస్థాన్ నిర్దేశించిన 180 పరుగుల లక్ష్య ఛేదనలో న్యూయార్క్ను గెలిపించేందకు యువరాజ్ సింగ్ చివరివరకు ప్రయత్నించి విఫలమయ్యాడు. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్థాన్.. ఆష్లే నర్స్ (41 బంతుల్లో 97), హ్యామిల్టన్ మసకద్జ (30 బంతుల్లో 56) చెలరేగడంతో నిర్ణీత 15 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 179 పరుగులు చేసింది. న్యూయార్క్ బౌలర్లలో జేరోమ్ టేలర్ 3 వికెట్లు పడగొట్టగా.. నువాన్ ప్రదీప్ ఓ వికెట్ దక్కించుకున్నాడు. 180 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన న్యూయార్క్.. యువరాజ్ సింగ్ మెరుపు అర్దశతకంతో (22 బంతుల్లో 54) మెరిసినప్పటికీ ఓటమిపాలైంది. ఈ జట్టు నిర్ణీత ఓవర్లు పూర్తయ్యేసరికి 6 వికెట్ల నష్టానికి 159 పరుగులు మాత్రమే చేయగలిగింది. న్యూయార్క్ ఇన్నింగ్స్లో కపుగెదెర (30), గుణరత్నే (24) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. రాజస్థాన్ బౌలర్లలో పర్విందర్ అవానా, జకాతి, బిపుల్ శర్మ, చతురంగ డిసిల్వ, ఆష్లే నర్స్ తలో వికెట్ పడగొట్టారు. -
అతడు టీమిండియా కెప్టెన్.. వేటు వేస్తారా?: యువీ
ముంబై ఇండియన్స్ కెప్టెన్ మార్పు అంశంపై టీమిండియా మాజీ ఆల్రౌండర్ యువరాజ్ సింగ్ కీలక వ్యాఖ్యలు చేశాడు. హార్దిక్ పాండ్యాకు హడావుడిగా కెప్టెన్సీ అప్పగించి.. రోహిత్ శర్మపై వేటు వేయడం సరికాదని అభిప్రాయపడ్డాడు. కాగా ఐపీఎల్-2024 ఆరంభానికి ముందే ముంబై ఇండియన్స్ తమకు కొత్త కెప్టెన్ వచ్చినట్లు వెల్లడించిన విషయం తెలిసిందే. ఐదుసార్లు జట్టుకు టైటిల్ అందించిన రోహిత్ శర్మను కాదని.. గుజరాత్ టైటాన్స్ నుంచి భారీ మొత్తానికి ట్రేడ్ చేసుకున్న పాండ్యాను తమ నాయకుడిగా ప్రకటించింది. ఈ నేపథ్యంలో రోహిత్ శర్మ అభిమానులతో పాటు ముంబై ఇండియన్స్ ఫ్యాన్స్ కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. హిట్మ్యాన్కు ఇది అవమానమేనంటూ సోషల్ మీడియా వేదికగా ఎంఐ మేనేజ్మెంట్ నిర్ణయాన్ని తూర్పారబట్టారు. అయితే, ఫ్రాంఛైజీ మాత్రం భవిష్యత్తును దృష్టిలో పెట్టుకునే కెప్టెన్ మార్పు చేసినట్లు పేర్కొంది. ఈ క్రమంలో తాజాగా యువరాజ్ సింగ్ ఈ అంశంపై స్పందించాడు. ‘‘కెప్టెన్గా ఐదుసార్లు ఐపీఎల్ ట్రోఫీ గెలిచిన రోహిత్ శర్మది. అతడిని కెప్టెన్సీ నుంచి తొలగించడం అనేది సాహసోపేత నిర్ణయం. హార్దిక్ పాండ్యాను కెప్టెన్ చేయడం వెనుక వాళ్ల కారణాలు వాళ్లకు ఉండి ఉంటాయని అర్థం చేసుకోగలను. కానీ.. నా అభిప్రాయం ప్రకారం.. కనీసం ఈ ఒక్క సీజన్కైనా కెప్టెన్గా రోహిత్ను కొనసాగించాల్సింది. పాండ్యాను అతడికి డిప్యూటీగా నియమించి పరిశీలించమని చెప్పాల్సింది. భవిష్యత్తును దృష్టిలో పెట్టుకునే వాళ్లు ఈ నిర్ణయం తీసుకున్నారని చెబుతున్నారు. నిజమే.. కానీ రోహిత్ ఇప్పటికీ అద్భుతంగా ఆడుతున్నాడు. టీమిండియాకు కెప్టెన్గా ఉన్నాడు. అలాంటపుడు అతడిని తప్పించడం ఎంత వరకు ఆమోదయోగ్యం?’’ అని యువరాజ్ సింగ్ స్టార్ స్పోర్ట్స్ షోలో పేర్కొన్నాడు. అదే విధంగా.. హార్దిక్ పాండ్యాను ఉద్దేశించి మాట్లాడుతూ.. ‘‘అవును.. అతడు అద్భుతమైన నైపుణ్యాలున్న ఆటగాడే. అయితే, గుజరాత్ టైటాన్స్ను ముందుకు నడిపించడానికి.. ముంబై కెప్టెన్గా వ్యవహరించడానికి చాలా తేడా ఉంటుంది. ముంబై ఏ రకంగా చూసినా పెద్ద జట్టు. అందుకు తగ్గట్లుగానే అంచనాలు కూడా భారీగానే ఉంటాయి’’ అని యువీ హెచ్చరించాడు. కాగా మార్చి 22న ఐపీఎల్-2024 ఆరంభం కానుండగా.. మార్చి 24న ముంబై-తమ తొలి మ్యాచ్ ఆడనుంది. ఈ మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్తో తలపడనుంది. -
లోక్సభ ఎన్నికల్లో పోటీ?.. స్పందించిన యువరాజ్ సింగ్
తన రాజకీయ రంగ ప్రవేశం గురించి వస్తున్న వార్తలపై టీమిండియా మాజీ ఆల్రౌండర్ యువరాజ్ సింగ్ స్పందించాడు. ప్రజలకు సేవ చేయాలంటే రాజకీయాలు ఒక్కటే మార్గం కాదని.. తన ఫౌండేషన్ ద్వారా వీలైనన్ని సేవా కార్యక్రమాలు చేపడతానని యువీ పేర్కొన్నాడు. తాను ఎన్నికల్లో పోటీ చేయడం లేదని ఈ సందర్భంగా స్పష్టం చేశాడు. కాగా బీజేపీ తరఫున యువరాజ్ సింగ్ ఎన్నికల బరిలో దిగుతాడని వార్తలు వినిపించాయి. పంజాబ్లోని గురుదాస్పూర్ నియోజకవర్గం నుంచి యువీ లోక్సభకు పోటీ చేయనున్నాడంటూ ప్రచారం జరిగింది. సాయం చేయడం అంటే ఇష్టం సిట్టింగ్ ఎంపీ, నటుడు సన్నీ డియోల్ స్థానంలో అతడికి బీజేపీ టికెట్ ఇస్తోందంటూ.. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీతో యువీ దిగిన ఫొటో నెట్టింట వైరల్ అయింది. అయితే, ఇవన్నీ వట్టి పుకార్లేనని యువరాజ్ సింగ్ కొట్టిపారేశాడు. ఈ మేరకు ఎక్స్ వేదికగా స్పందిస్తూ.. ‘‘మీడియాలో వస్తున్న వార్తలు అవాస్తవం. నేను గురుదాస్పూర్ నుంచి ఎన్నికల్లో పోటీ చేయడం లేదు. కష్టాల్లో ఉన్నవారికి చేతనైనంత సాయం చేయడం, వారికి మద్దతుగా నిలవడం నాకు ఇష్టం. అందుకోసం నా ఫౌండేషన్ ద్వారా సేవా కార్యక్రమాలు నిర్వర్తిస్తున్నాను. ఈ ప్రయాణాన్ని ఇలాగే కొనసాగిస్తాను. గొప్ప మార్పు తెచ్చేందుకు నా వంతు ప్రయత్నంలో మీరూ భాగం కండి’’ అని యువీ తన అభిమానులకు పిలుపునిచ్చాడు. దిగ్గజ ఆల్రౌండర్గా కాగా భారత క్రికెట్లో దిగ్గజ ఆల్రౌండర్లలో ఒకడిగా పేరొందిన యువరాజ్ సింగ్.. 2007 టీ20 వరల్డ్కప్ టోర్నీలో ఒకే ఓవర్లో వరుసగా ఆరు సిక్సర్లు బాదిన తీరు చిరస్థాయిగా నిలిచిపోతుందనడంలో సందేహం లేదు. అదే విధంగా టీమిండియా 2011లో వన్డే ప్రపంచకప్ గెలవడంలోనూ యువీది కీలక పాత్ర. ఆల్రౌండర్ ప్రతిభతో అదరగొట్టి నాటి ఐసీసీ ఈవెంట్లో ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ అవార్డు అందుకున్నాడు. ఈ క్రమంలో క్యాన్సర్ బారిన పడ్డ యువీ కోలుకున్న తర్వాత తిరిగి మైదానంలో అడుగుపెట్టాడు. ఎంతో మందికి స్ఫూర్తిగా నిలిచాడు. ఇక 2019లో క్రికెట్కు వీడ్కోలు పలికిన యువీ ప్రస్తుతం తన ఫౌండేషన్ కార్యక్రమాలతో బిజీగా ఉన్నాడు. భార్య హాజిల్ కీచ్, కుమారుడు ఓరియాన్, కుమార్తె ఆరాతో కలిసి సమయం గడుపుతున్నాడు. Contrary to media reports, I'm not contesting elections from Gurdaspur. My passion lies in supporting and helping people in various capacities, and I will continue to do so through my foundation @YOUWECAN. Let's continue making a difference together to the best of our abilities❤️ — Yuvraj Singh (@YUVSTRONG12) March 1, 2024 చదవండి: Gautam Gambhir: గంభీర్ సంచలన ప్రకటన.. బీజేపీకి గుడ్బై! -
లోక్సభ ఎన్నికల్లో పోటీ చేయనున్న యువరాజ్ సింగ్..?
టీమిండియా మాజీ క్రికెటర్, సిక్సర్ల వీరుడు యువరాజ్ సింగ్ రానున్న లోక్సభ ఎన్నికల్లో బీజేపీ తరఫున పోటీ చేయనున్నాడని భారీ ఎత్తున ప్రచారం జరుగుతుంది. యువీ పంజాబ్లోని గురుదాస్పూర్ నుంచి బీజేపీ ఎంపీ అభ్యర్దిగా బరిలో నిలుస్తాడని సోషల్మీడియా కోడై కూస్తుంది. తాజాగా యువీ.. తల్లి షబ్నమ్తో కలిసి కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని కలవడంతో ఈ ప్రచారం నిజమేనని నెటిజన్లు చర్చించుకుంటున్నారు. ఈ విషయంపై యువీ స్పందించాల్సి ఉంది. ప్రస్తుతం గురుదాస్పూర్ ఎంపీగా సినీ నటుడు సన్నీ డియోల్ ఉన్నాడు. ఇతను 2019 ఎన్నికల్లో బీజేపీ అభ్యర్దిగా భారీ మెజార్టీతో గెలుపొందాడు. ఈ నియోజకవర్గం నుంచి గతంలో మరో సినీ నటుడు కూడా ఎంపీగా గెలిచాడు. మునుపటి తరం బాలీవుడ్ నటుడు వినోద్ ఖన్నా ఇక్కడి నుంచి బీజేపీ అభ్యర్దిగా పలుమార్లు గెలిచాడు. 1998, 1999, 2004, 2014లో వినోద్ ఖన్నా గురుదాస్పూర్ ఎంపీగా గెలిచాడు. ఈ నియోజకవర్గం భారత్-పాకిస్తాన్ బోర్డర్ను ఆనుకుని ఉంటుంది. కాగా, భారత క్రికెటర్లు రాజకీయాల్లో రావడం కొత్తేమీ కాదు. గతంలో చాలామంది లోక్సభకు పోటీ చేసి గెలిచారు. కొందరు రాజ్యసభకు ఎన్నికయ్యారు. దిగ్గజ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ గతంలో రాజ్యసభకు ప్రాతినిథ్యం వహించగా.. ప్రస్తుతం టర్బనేటర్ హర్భజన్ సింగ్ రాజ్యసభ ఎంపీగా (ఆమ్ ఆద్మీ పార్టీ) కొనసాగుతున్నాడు. లోక్సభ విషయానికొస్తే.. టీమిండియా మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్ ప్రస్తుతం న్యూఢిల్లీ నుంచి లోక్సభకు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. ఇతను 2019లో బీజేపీ అభ్యర్దిగా గెలుపొందాడు. రానున్న లోక్సభ ఎన్నికల్లో బీజేపీ ఎంపీ అభ్యర్దిగా పోటీ చేస్తాడని ప్రచారం జరుగుతున్న యువరాజ్ సింగ్.. ప్రస్తుత ఎంపీలు గంభీర్, హర్బజన్ సింగ్ సమకాలీకులే కావడం విశేషం. -
యువరాజ్ సింగ్ ఇంట్లో చోరీ, ఇపుడు ఎందుకు వైరల్?!
టీమిండియా మాజీ ఆల్రౌండర్ యువరాజ్ సింగ్ తల్లి ఇంట్లో భారీ దొంగతనం జరిగింది. పంచకులలోని మానసా దేవి కాంప్లెక్స్లోని తమ ఇంట్లో నగదు, నగలు మాయమైనట్లు యువరాజ్ తల్లి షబ్మాన్ సింగ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. పంచకుల ఇంటి నుంచి సుమారు 70వేల విలువైన నగదు, నగలు చోరీకి గురయ్యాయని, తన ఫిర్యాదులో వెల్లడించారు. ఈ ఘటన ఆరు నెలల క్రితమే జరిగినప్పటికీ, ఇప్పుడు ఇంటర్నెట్లో ఇదే వార్త హల్చల్ చేస్తోంది. యువరాజ్ తల్లి, షబ్నమ్ సింగ్ ఇప్పటికే పోలీసులలో కేసు నమోదు చేశారు. హౌస్ కీపింగ్ సిబ్బంది, సాకేత్డికి చెందిన లలితా దేవి,బీహార్కు చెందిన వంట మనిషి సిల్దార్ పాల్పై అనుమానాలు లేవనెత్తారు.దీనిపై విచారణ ఇంకా కొనసాగుతోంది. తాజాగా భారత మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ కూడా తన ఇంట్లో దొంగతనం జరిగినట్లు ఫిర్యాదు చేయడంతో యువరాజ్ సింగ్ ఇంట్లో చోరీ ఘటన మళ్లీ వైరల్ అవుతోంది. ఫోన్లో వ్యక్తిగత సమాచారం ఉందని, దుర్వినియోగం కాకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని ఆందోళన వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. యువరాజ్ సింగ్ తల్లి ఫిర్యాదు మేరకు గతేడాది సెప్టెంబర్ ఈ చోరీ జరిగింది. తమ సిబ్బందిలోఇద్దరు ఇంటి నుంచి వెళ్లిన ఆరు నెలలకే దొంగతనం జరిగిందని ఆమె పేర్కొన్నారు. గురుగ్రామ్లో ఉంటున్న సమయంలో నిందితులు తమ ఇంటిని విడిచిపెట్టినట్లు ఫిర్యాదులో తెలిపారు. కాగా యువరాజ్ సింగ్ మాజీ నటి , మోడల్ అయిన హాజెల్ కీచ్ను 2016, నవంబరులో పెళ్లి చేసుకున్నాడు. ఈ దంపతులకు కుమారుడు ఓరియన్, కుమార్తె ఆరా ఉన్నారు. -
ఆ జట్టు కెప్టెన్గా యువరాజ్ సింగ్..
టీమిండియా మాజీ ఆల్రౌండర్ యువరాజ్ సింగ్ త్వరలోనే మళ్లీ బ్యాట్ పట్టనున్నాడు. లెజెండ్స్ క్రికెట్ ట్రోఫీ-2024లో భాగం కానున్నాడు. న్యూయార్క్ సూపర్స్టార్ స్ట్రైకర్స్ తరఫున బరిలోకి దిగనున్నాడు. ఈ నేపథ్యంలో న్యూయార్క్ స్ట్రైకర్స్ బుధవారం కీలక ప్రకటన చేసింది. యువీని తమ కెప్టెన్గా నియమిస్తున్నట్లు తెలిపింది. యువరాజ్ సింగ్ తమ జట్టుకు ఆడటం పట్ల సంతోషం వ్యక్తం చేసిన ఫ్రాంఛైజీ.. అతడికి సాదర స్వాగతం పలుకుతున్నామని పేర్కొంది. తొలి సీజన్ విజేతలుగా ఆ జట్లు కాగా గతేడాది ప్రారంభమైన లెజెండ్స్ క్రికెట్ ట్రోఫీ టోర్నీలో ఆరు జట్లు చండీగఢ్ చాంప్స్, నాగ్పూర్ నింజాస్, పట్నా వారియర్స్, వైజాగ్ టైటాన్స్, ఇండోర్ నైట్స్, గువాహటి అవెంజర్స్ పాల్గొన్నాయి. మార్చి 22 నుంచి 30 వరకు ఘజియాబాద్లో టోర్నీ జరిగింది. ఇక మాజీ క్రికెటర్లు పాల్గొన్న ఈ టీ20 లీగ్లో సురేశ్ రైనా సారథ్యంలోని ఇండోర్ నైట్స్, యూసఫ్ పఠాన్ కెప్టెన్సీలోని గువాహటి అవెంజర్స్ సంయుక్త విజేతలుగా నిలిచాయి. వర్షం కారణంగా ఫైనల్ మ్యాచ్ రద్దైన నేపథ్యంలో ఈ రెండు జట్లను చాంపియన్స్గా ప్రకటించారు. అయితే, ఈసారి ఈ లీగ్లో న్యూయార్క్ సూపర్స్టార్ స్ట్రైకర్స్ కూడా ఎంట్రీ ఇవ్వనున్నట్లు తాజా ప్రకటన ద్వారా తేలింది. కండిషన్స్ ఇవే ఇక లెజెండ్స్ క్రికెట్ ట్రోఫీ ఈసారి మార్చి 7 నుంచి 18 వరకు నిర్వహించనున్నారు. శ్రీలంకలోని కాండీ వేదికగా ఈ ఈవెంట్ ఆరంభం కానుంది. అదే విధంగా.. ఈసారి 90 బాల్ ఫార్మాట్లో టోర్నీ నిర్వహించనున్నట్లు సమాచారం. ఇందులో భాగంగా ఓ జట్టు ఐదుగురు బౌలర్లను బరిలోకి ఇదింపి ఒక్కొక్కరిచే మూడు ఓవర్లు వేయించాలి. అయితే, కెప్టెన్ నిర్ణయానుసారం ఒక్కరిచే మాత్రం నాలుగు ఓవర్లు వేయించవచ్చు. అయితే, 60వ బంతి పడకముందే బౌలింగ్ జట్టు కెప్టెన్ తన నిర్ణయాన్ని చెప్పాల్సి ఉంటుంది. Delighted to announce the legendary Yuvraj Singh joining our team! Get ready for some electrifying moments on and off the field. Welcome aboard, Yuvi! 💥 @YUVSTRONG12 📸 - @BCCI #NewYorkStrikers #NYSSquad #NY #YuvrajSingh pic.twitter.com/Kc2RWwpiMP — New York Strikers (@NewYorkStrikers) February 14, 2024 -
సచిన్, యువరాజ్ మెరుపులు.. సిక్సర్తో గెలిపించిన ఇర్ఫాన్ పఠాన్
సచిన్ టెండూల్కర్తో పాటు భారత్, ఇతర దేశాలకు చెందిన క్రికెట్ దిగ్గజాలు మరోసారి బరిలోకి దిగారు. మధుసూదన్ సాయి గ్లోబల్ హ్యుమానిటేరియన్ మిషన్ ఆధ్వర్యంలో జరిగిన 'వన్ వరల్డ్ వన్ ఫ్యామిలీ' కప్లో వీరంతా రెండు టీమ్లుగా విడిపోయి ఫ్రెండ్లీ మ్యాచ్ ఆడారు. ఈ మ్యాచ్ ద్వారా సేకరించబడే డబ్బును మధుసూదన్ సాయి గ్లోబల్ మిషన్ వారు నిరుపేదల కోసం వినియోగిస్తారు. Sachin Ramesh Tendulkar is Back Guys 🔥🐐pic.twitter.com/170aFmQQ9Q — Arun Vijay (@AVinthehousee) January 18, 2024 ఐక్యత యొక్క శక్తిని, మానవత్వం యొక్క బలాన్ని, సామాజిక బాధ్యత యొక్క భావాన్ని వెదజల్లడానికి ఈ ఫ్రెండ్లీ క్రికెట్ మ్యాచ్ నిర్వహిస్తున్నట్లు నిర్వహకులు తెలిపారు. Sachin Tendulkar rolling his arms after a long time and got a wicket.pic.twitter.com/4WiqVlCsZu— Mufaddal Vohra (@mufaddal_vohra) January 18, 2024 మ్యాచ్ విషయానికొస్తే.. కర్ణాటకలోని ముద్దెనహళ్లిలో జరిగిన ఈ మ్యాచ్లో సచిన్ కెప్టెన్సీలోని వన్ వరల్డ్, యువరాజ్ సింగ్ నాయకత్వంలోని వన్ ఫ్యామిలీ జట్లు తలపడ్డాయి. తొలుత బ్యాటింగ్ చేసిన వన్ ఫ్యామిలీ.. 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 180 పరుగులు చేసింది. Watching Sachin Tendulkar play live for the first time and he has taken a wicket in his 2nd over. 🐐 - 50 years old, he still got it. #OWOFCup pic.twitter.com/MWSglJHdqO — Johns. (@CricCrazyJohns) January 18, 2024 ఇంగ్లండ్ ఆటగాడు డారెన్ మ్యాడీ (51) అర్ధసెంచరీతో రాణించగా.. లంక మాజీ వికెట్కీపర్ కలువితరణ 22, టీమిండియా మాజీ ఆటగాళ్లు యూసఫ్ పఠాన్ 38, యువరాజ్ సింగ్ 23 పరుగులు చేశారు. వన్ వరల్డ్ బౌలర్లలో హర్భజన్ సింగ్ 2 వికెట్లు పడగొట్టగా.. సచిన్, ఆర్పీ సింగ్, అశోక్ దిండా, మాంటీ పనేసర్ తలో వికెట్ దక్కించుకున్నారు. అన్న బౌలింగ్లో సిక్సర్ కొట్టి గెలిపించిన ఇర్ఫాన్ పఠాన్ 181 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన వన్ వరల్డ్.. అల్విరో పీటర్సన్ (74), సచిన్ టెండూల్కర్ (27), నమన్ ఓఝా (25), ఉపుల్ తరంగ (29) రాణించడంతో 19.5 ఓవర్లలో విజయతీరాలకు చేరింది. యూసఫ్ పఠాన్ బౌలింగ్లో అతని సోదరుడు ఇర్ఫాన్ పఠాన్ ఆఖరి ఓవర్ ఐదో బంతికి సిక్సర్ బాది తన జట్టును గెలిపించాడు. One World needed 3 in 2 balls: Irfan Pathan smashed a six against Yusuf Pathan, after that Irfan hugged Yusuf. pic.twitter.com/1QPPfcVkNG — Mufaddal Vohra (@mufaddal_vohra) January 18, 2024 వన్ ఫ్యామిలీ బౌలర్లలో చమింద వాస్ 3 వికెట్లు పడగొట్టగా.. ముత్తయ్య మురళీథరన్, యువరాజ్ సింగ్, జేసన్ క్రేజా తలో వికెట్ దక్కించుకున్నారు. చాలాకాలం తర్వాత క్రికెట్ దిగ్గజాలు బరిలోకి దిగడం చూసి అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ మ్యాచ్కు సంబంధించిన పోస్ట్లు ప్రస్తుతం సోషల్మీడియాలో వైరలవుతున్నాయి. Sachin's Team Won the match 💙💥 pic.twitter.com/T4cRvUmMsO — 𝑺𝒉𝒆𝒃𝒂𝒔 (@Shebas_10dulkar) January 18, 2024 -
అశ్విన్కు జట్టులో ఉండే అర్హతే లేదు: యువీ సంచలన వ్యాఖ్యలు
Ravichandran Ashwin Doesn't Deserve Place: టీమిండియా వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ను ఉద్దేశించి భారత మాజీ ఆల్రౌండర్ యువరాజ్ సింగ్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఈ చెన్నై బౌలర్కు పరిమిత ఓవర్ల జట్టులో స్థానం పొందే అర్హతే లేదన్నాడు. ఆధునికతరం భారత మేటి స్పిన్నర్లలో ఒకడిగా తనదైన ముద్ర వేస్తున్నాడు అశ్విన్. టెస్టుల్లో బంతి, బ్యాట్తో రాణిస్తూ ఆల్రౌండర్గా కీలక పాత్ర పోషిస్తున్నాడు. 500 వికెట్ల మైలురాయికి చేరువగా ముఖ్యంగా సొంతగడ్డపై టీమిండియా టెస్టు సిరీస్ ఆడుతుందంటే అశూ జట్టులో ఉండాల్సిందే. ఇప్పటికే సంప్రదాయ క్రికెట్లో 490 వికెట్లు తీసిన అశూ.. ఇంగ్లండ్తో జనవరి 25 నుంచి మొదలుకానున్న టెస్టు సిరీస్ సందర్భంగా 500 వికెట్ల క్లబ్లో చేరే దిశగా పయనిస్తున్నాడు. 5 శతకాలతో సత్తా చాటి బ్యాటర్గానూ ఇప్పటిదాకా 95 టెస్టుల్లో అశూ 3193 పరుగులు సాధించాడు. ఇందులో 5 శతకాలు, 14 అర్ధ శతకాలు ఉండటం విశేషం. ఇలా ఆల్రౌండర్గా భారత టెస్టు జట్టులో పాతుకుపోయిన అశూకు.. వన్డే, టీ20 జట్టులో మాత్రం ఉండే అర్హత లేదంటున్నాడు యువీ. అశూకు ఆ అర్హత లేదు టైమ్స్ ఆఫ్ ఇండియా ఇంటర్వ్యూలో భాగంగా టీమిండియా పరిమిత ఓవర్ల క్రికెట్లో అశ్విన్ గురించి ఎదురైన ప్రశ్నకు స్పందిస్తూ... ‘‘అశ్విన్ గొప్ప బౌలరే... కానీ వన్డే, టీ20 జట్టులో ఉండే అర్హత అతడికి లేదు. టెస్టుల్లో ఆల్రౌండర్గా అతడు బెస్ట్.. కానీ పరిమిత ఓవర్ల క్రికెట్లో బ్యాటర్గా, ఫీల్డర్గా తను ఏం చేయగలడు? అందుకే టెస్టుల్లో తను కచ్చితంగా ఉండాలి. కానీ వైట్బాల్ క్రికెట్ జట్టులో అతడికి చోటు అవసరం లేదు’’ అని కుండబద్దలు కొట్టాడు. 37 ఏళ్ల అశూ వైట్బాల్ జట్టులో అనవసరం! కాగా ఇప్పటి వరకు అంతర్జాతీయ స్థాయిలో అశ్విన్ 116 వన్డేల్లో 156.. అదే విధంగా 65 టీ20లలో 72 వికెట్లు తీశాడు. అయితే, వన్డే, టీ20లలో యువ బౌలర్లు ప్రతిభ నిరూపించుకుంటున్నప్పటికీ 2011 మొదలు తాజాగా ముగిసిన 2023 వరల్డ్కప్ జట్లలో 37 ఏళ్ల అశూకు స్థానం లభించింది. ఈ నేపథ్యంలోనే యువరాజ్ సింగ్ ఈ మేరకు వ్యాఖ్యలు చేయడం గమనార్హం. చదవండి: INDA Vs ENGA: శతక్కొట్టిన పాటిదార్.. పాపం సర్ఫరాజ్! భరత్ ఫిఫ్టీ.. -
T20 WC: పాక్ ప్రమాదకర జట్టు.. యువీ వ్యాఖ్యలకు గంభీర్ రిప్లై ఇదే
రానున్న ఆరు నెలల్లో మరో క్రికెట్ మెగా టోర్నీకి తెరలేవనుంది. వచ్చే ఏడాది జూన్ 4 నుంచి టీ20 ప్రపంచకప్-2024 ఈవెంట్ ఆరంభం కానుంది. ఈ టోర్నమెంట్ సందర్భంగానైనా టీమిండియా ఐసీసీ ట్రోఫీ గెలవాలన్న కల తీరాలని అభిమానులు ఆశగా ఎదురుచూస్తున్నారు. పదేళ్లుగా భారత జట్టు ఒక్క మెగా టైటిల్ కూడా గెలవలేదన్న విషయం తెలిసిందే. పుష్కరకాలం తర్వాత వన్డే వరల్డ్కప్-2023 సందర్భంగా ఆ కరువు తీరుతుందనుకుంటే ఆఖరి మెట్టుపై రోహిత్ సేన బోల్తా పడింది. అహ్మదాబాద్ వేదికగా జరిగిన ఫైనల్లో ఆస్ట్రేలియా చేతిలో ఓటమి పాలై ట్రోఫీ చేజార్చుకుంది. అయితే, ఆరు నెలల వ్యవధిలోనే టీ20 వరల్డ్కప్ రూపంలో టీమిండియాకు మరో అవకాశం దక్కనుంది. ఈ నేపథ్యంలో భారత మాజీ క్రికెటర్లు గౌతం గంభీర్, యువరాజ్ సింగ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అమెరికా- వెస్టిండీస్ సంయుక్తంగా ఆతిథ్యం ఇవ్వనున్న ప్రపంచకప్-2024లో టీమిండియాకు గట్టి పోటీనిచ్చే జట్ల గురించి ఎదురైన ప్రశ్నకు బదులిస్తూ.. ‘‘అక్కడి పిచ్లపై అఫ్గనిస్తాన్ మరింత ప్రమాదకారిగా మారుతుంది. ఆస్ట్రేలియా కూడా సవాల్ విసురుతుంది. ఆ జట్టులో ఎంతో మంది ఇంపాక్ట్ ప్లేయర్లు ఉన్నారు. ప్రత్యర్థి జట్టు విజయావకాశాలను ఒంటి చేత్తో మార్చగల సత్తా ఉన్న వాళ్లు ఉన్నారు. ఇక ఇంగ్లండ్ కూడా టీ20 క్రికెట్లో కచ్చితంగా బలమైన ప్రత్యర్థే’’ అని గంభీర్ పేర్కొన్నాడు. యువరాజ్ సింగ్ మాత్రం ఇందుకు భిన్నంగా స్పందించాడు. ‘‘ఈసారి సౌతాఫ్రికా ప్రపంచకప్ గెలుస్తుందనుకుంటున్నాను. వరల్డ్కప్-2023 సందర్భంగా.. ఆ జట్టు పురోగతిని చూసిన తర్వాత నాకు ఈ అభిప్రాయం ఏర్పడింది. పాకిస్తాన్ కూడా డేంజరస్ జట్టు’’ అని యువీ పేర్కొన్నాడు. ఇందుకు స్పందించిన గంభీర్.. ‘‘50 ఓవర్ల ప్రపంచకప్ టోర్నీలో పాకిస్తాన్ ఫీల్డింగ్ ఎలా ఉందో చూశాం కదా! అంతర్జాతీయ క్రికెట్లో అత్యంత చెత్తగా ఫీల్డింగ్ చేయడం బహుశా ఇదే మొదటిసారి అనుకుంటా. ఇక టీ20 ఫార్మాట్లో పోటీ పడాలంటే అలా చెత్తగా ఆడితే మాత్రం వారికి అసలు అవకాశాలు ఉండవు. గత ఐదారేళ్లలో టీమిండియా ఆఖరి వరకు పట్టుదలగా పోరాడిన తీరు చూశాం. ఈసారి భారత్ ఆ అవరోధాన్ని దాటుతుందనుకుంటున్నా’’ అని కుండబద్దలు కొట్టాడు. ఓ క్రీడా చర్చలో పాల్గొన్న గౌతీ- యువీ ఈ మేరకు వ్యాఖ్యలు చేశారు. View this post on Instagram A post shared by Thums Up (@thumsupofficial) -
రితిక జోలికి వస్తే ఊరుకోను.. నాడు రోహిత్కు యువీ వార్నింగ్!
How Ritika Related To Yuvraj Singh: ‘‘నా జీవితంలో అడుగుపెట్టిన మొదటి రోజు నుంచే ఎన్నో మార్పులు తీసుకొచ్చాడీ అబ్బాయి. నా ప్రాణ స్నేహితుడు.. నన్ను నవ్వించే నా కమెడియన్.. అన్నింటికీ మించి ఓ మంచి మనిషి. నాకు సర్వస్వమైన వ్యక్తి.. నీతో జీవితం ఇంద్రజాలం కంటే తక్కువేమీ కాదు. లవ్ యూ’’ అంటూ ఆమె.. ‘‘నాకు దొరికిన అత్యుత్తమ జీవిత భాగస్వామి’’ అంటూ అతడు పరస్పరం పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు. ఇంతకీ ఆ జంట ఎవరంటే.. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ- రితిక సజ్దే. తమ వివాహ బంధానికి ఎనిమిదేళ్లు పూర్తైన సందర్భంగా ఇలా ఒకరికొరి పట్ల ఒకరు ప్రేమను చాటుకుంటూ సోషల్ మీడియా వేదికగా అందమైన ఫొటోలు పంచుకున్నారు. అన్యోన్య దాంపత్యంతో కపుల్ గోల్స్ సెట్ చేస్తున్న రోహిత్- రితికల లవ్స్టోరీపై ఓ లుక్కేద్దామా?! యాడ్ షూట్లో పరిచయం టీమిండియా మాజీ ఆల్రౌండర్ యువరాజ్ సింగ్, రోహిత్ శర్మ 2008లో ఓ వాణిజ్య ప్రకటనకు సంబంధించిన షూటింగ్లో పాల్గొన్నారు. ఆ యాడ్ షూట్కు మేనేజర్ రితిక. అప్పటికే రితికతో యువీకి ప్రత్యేక అనుబంధం ఉంది. రితికను తన సొంత చెల్లిలా భావిస్తాడు యువరాజ్ సింగ్. అందుకే.. రోహిత్ శర్మ షూటింగ్కు రాగానే ముందుగానే ఓ హెచ్చరిక జారీ చేసేశాడు. ఆమెకు దూరంగా ఉండు రితికా సజ్దేను చూపిస్తూ.. తను స్పోర్ట్స్ ఈవెంట్ మేనేజర్.. ఆమెకు ఎంత దూరంగా ఉంటే నీకు అంత మంచిది అని హిట్మ్యాన్కు వార్నింగ్ ఇచ్చాడు. దీంతో ఆశ్చర్యపోవడం రోహిత్ వంతైంది. అయినా.. నాకు ఆమెతో ఏం పని? నేనిక్కడకు వచ్చింది షూటింగ్లో పాల్గొనడానికి కదా! అని తానూ గట్టిగానే బదులిచ్చాడు. ఆ తర్వాత మరో షూట్లో కలిశారు రోహిత్- రితిక. మొదటిసారి రితికను చూసినపుడు పెద్దగా పట్టించుకోని రోహిత్.. రెండోసారి కలిసినపుడు ఆమె వ్యవహరించిన తీరుకు ఫిదా అయ్యాడు. రెండోసారి కలిసినపుడు ఫిదా మైక్రోఫోన్తో కలిగిన అసౌకర్యం వల్ల ఇబ్బంది పడిన తన పట్ల ఎంతో హృద్యంగా.. హుందాగా స్పందించిన రితిక వ్యక్తిత్వాన్ని మెచ్చుకోకుండా ఉండలేకపోయాడు. ఇద్దరి మధ్య మాటలు కలిశాయి. స్నేహం పెరిగింది. రోహిత్కు స్పోర్ట్స్ మేనేజర్గా పనిచేయడం మొదలుపెట్టింది రితిక. స్పెషల్ ప్లేస్లో లవ్ ప్రపోజల్ అలా అలా ప్రొఫెషనల్గా దగ్గరైన రోహిత్- రితిక.. కాలక్రమంలో ప్రాణ స్నేహితులుగా మారారు. ఆమె వ్యక్తిత్వానికి ఆకర్షితుడైన రోహిత్.. బోరివలీ స్పోర్ట్స్ కాంప్లెక్స్కు రితికను తీసుకువెళ్లి.. లవ్ యూ అంటూ తన మనసులోని మాటను బయటకు చెప్పాడు. డిసెంబరు మొత్తం రోహిత్ కుటుంబానికి ప్రత్యేకం ఆమె కూడా సరేనంది. అలా ఆరేళ్ల పరిచయం తర్వాత.. పెళ్లి చేసుకోవాలని నిశ్చయించుకున్నారు. ఈ క్రమంలో ఇరు కుటుంబాలను ఒప్పించి.. 2015, జూన్ 3న రితిక వేలికి ఉంగరం తొడిగి ఆమెతో నిశ్చితార్థం చేసుకున్నాడు రోహిత్. పదకొండేళ్ల వయసులో తను క్రికెట్ ఆడటం మొదలుపెట్టిన అదే బోరివలీ స్పోర్ట్స్ కాంప్లెక్స్లో ఎంగేజ్మెంట్ చేసుకుని కెరీర్, లైఫ్నకు సంబంధించిన కీలక ఘట్టాలను మధుర జ్ఞాపకాలుగా మార్చుకున్నాడు. ఇక డిసెంబరు 13, 2015లో ముంబైలోని తాజ్ ల్యాండ్స్ హోటళ్లో రోహిత్- రితిక పెళ్లి అంగరంగ వైభవంగా జరిగింది. ఆ తర్వాత.. ముంబై ఇండియన్స్ ఫ్రాంఛైజీ యజమానులు అంబానీ కుటుంబం తమ కెప్టెన్ రోహిత్ శర్మ వెడ్డింగ్ రిసెప్షన్ను ఘనంగా జరిపించింది. యువీకి రాఖీ సిస్టర్ ఈ జంటకు డిసెంబరు 30, 2018లో కుమార్తె సమైరా జన్మించింది. రోహిత్- రితిక జీవితాల్లో ప్రత్యేక ఘట్టాలన్నీ డిసెంబరుతో ముడిపడటం విశేషం. అన్నట్లు తమ పరిచయానికి కారణమైన యువరాజ్ సింగ్కు రితిక రక్షా బంధన్ కడుతున్న దృశ్యాలు అప్పట్లో వైరల్ అయ్యాయి. దీంతో ఆమె యువీకి తోబుట్టువేమో అని అని నెటిజన్లు భావించారు. నిజానికి రితిక.. యువరాజ్కు రాఖీ సిస్టర్!!.. అదే విధంగా టీమిండియా సూపర్స్టార్ విరాట్ కోహ్లి దగ్గర కూడా స్పోర్ట్స్ మేనేజర్గా పనిచేసిన అనుభవం ఆమెకు ఉంది. చదవండి: U19 WC 2024: క్రికెట్ వరల్డ్కప్ జట్టులో పోత్గల్ కుర్రాడు.. కేటీఆర్ హర్షం! పోస్ట్ వైరల్ -
సిక్సర్ల కింగ్ యువరాజ్ సింగ్ బర్త్డే స్పెషల్ (ఫొటోలు)
Pagination
ఓటర్ మిత్రమా.. జాగ్రత్త! ఆ సౌండ్ వస్తేనే మీరు ఓటేసినట్టు!
ఇది కదా క్రేజ్ అంటే.. సీఎం జగన్ ఇంటర్వ్యూకి మిలియన్ల వ్యూస్
Sakshi.com ఇప్పుడు సరికొత్తగా మీ ముందుకు
కాపులు, ముస్లింలకు రిజర్వేషన్లు అక్కర్లేదు: పవన్కళ్యాణ్
రైతు కుమార్తె విజయం.. రిషబ్ శెట్టి అభినందనలు
పులివెందుల ప్రజలకు ఇద్దరిపైనా ప్రేమే: వైఎస్ భారతి
RCB Vs PBKS: కోహ్లి అరుదైన రికార్డు.. ఐపీఎల్ చరిత్రలోనే తొలి క్రికెటర్గా
Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో బిగ్ ట్విస్ట్..
బిజీగా ఉండటం ఇంత డేంజరా! హెచ్చరిస్తున్న సైకాలజిస్ట్లు
కారులో వాసన బాగుందని తెగ పీల్చుకుంటున్నారా.?
Mothers day 2024 మామ్స్తో సెలబ్రిటీలు, రెండు కళ్లూ చాలవు (ఫోటోలు)
లండన్ ట్రిప్ను ఎంజాయ్ చేస్తున్న మీనా
పెళ్లికి రెడీ అయిన హాట్ బ్యూటీ.. అంతకు ముందే 'ఎగ్ ఫ్రీజింగ్'
అందరూ ఓటు వేయండి.. ఓటర్లకు ప్రియాంక గాంధీ విజ్ఞప్తి
నా ప్రాణాలు పోయిన పర్లేదు..రిగ్గింగ్ జరిగితే ఊరుకోను
ఓటు హక్కు వినియోగించుకున్న తండ్రి కొడుకులు
రూ. 400 కోట్ల లాభం వస్తోంది.. చాలదా?: సెహ్వాగ్ కామెంట్స్ వైరల్
పెళ్లికి రెడీ అయిన మరో హీరోయిన్!
ఓటు వేసిన YSRCP నేతలు
ఐబీవీ, ఆర్పీ ఠాకూర్లపై ఈసీకి వైఎస్సార్సీపీ ఫిర్యాదు!
తప్పక చదవండి
- ఐబీవీ, ఆర్పీ ఠాకూర్లపై ఈసీకి వైఎస్సార్సీపీ ఫిర్యాదు!
- పోలింగ్ ఏజెంట్లను బూత్లలోకి రానివ్వడం లేదు: దిలీప్ ఘోష్
- శ్రీనగర్లో రికార్డులను అధిగమించనున్న ఓటింగ్ శాతం?
- ఎయిర్ ఫోర్స్ మాజీ చీఫ్ సతీమణి ఓటు గల్లంతు
- AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్!
- జగనన్నకు కృతజ్ఞతతో.. దివ్యాంగురాలి మాటలు వింటే..
- నాలుగో దశ ఎలక్షన్స్.. ప్రధాని మోదీ సందేశం
- అందుకే శిల్పా రవికి మద్దతు ఇచ్చాను: అల్లు అర్జున్
- Watch: కుటుంబ సభ్యులతో కలిసి ఓటేసిన సీఎం జగన్
- ఓటర్ మిత్రమా.. జాగ్రత్త! ఆ సౌండ్ వస్తేనే మీరు ఓటేసినట్టు!
Advertisement