-
జ్యుడీషియల్ కమిషన్ చైర్మన్కు స్వాగతం
జ్యోతినగర్(రామగుండం): జ్యుడీషియల్ క మిషన్ చైర్మన్ జస్టిస్ పినాకి చంద్రఘోష్కు కలెక్టర్ ముజమ్మిల్ఖాన్ పుష్పగుచ్ఛం అందించి స్వాగతం పలికా రు. ఎన్టీపీసీ పర్మినెంట్ టౌన్ షిప్లోని జ్యోతిభవన్కు చేరుకున్న జస్టిస్ ఘో ష్కు కలెక్టర్తోపాటు అదనపు కలెక్టర్ అరుణ శ్రీ ఘనస్వాగతం పలికారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై దర్యాప్తునకు ఏర్పాటైన జ్యుడీషియల్ కమిషన్కు రిటైర్డ్ జస్టిస్ పినాకి చంద్రఘోష్ చైర్మన్గా నియమితులైన విషయం విదితమే. ఈక్రమంలో ఆయన మేడిగడ్డ బ్యారేజీ సంద ర్శించారు. అనంతరం ఎన్టీపీసీ జ్యోతిభవన్కు చేరుకున్నారు. కలెక్టర్, అదనపు కలెక్టర్ ఆయనను మర్యాద పూర్వకంగా కలిశారు. కార్యక్రమంలో ఎన్టీపీసీ ఏజీఎం(హెచ్ఆర్)బిజయ్కుమార్ సిగ్దర్తోపాటు పలువురు పాల్గొన్నారు. -
పోలింగ్ కేంద్రాల పరిశీలన
ఎలిగేడు(పెద్దపల్లి): సుల్తాన్పూర్, ఎలిగేడులో జిల్లా పంచాయతీ అధికారి ఆశాలత మంగళవారం పర్యటించారు. పార్లమెంట్ ఎన్నికల కో సం ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాలను పరిశీలించారు. వసతులపై ఆరా తీశారు. తాగునీ టి సమస్య తలెత్తకుండా చూడాలని ఆదేశించా రు. ఎంపీడీవో భాస్కర్రావు పాల్గొన్నారు. ఆయిల్పామ్ సాగు చేయండి ఎలిగేడు(పెద్దపల్లి): ఆయిల్పామ్ సాగుకు రై తులు ముందుకు రావాలని ఉద్యానవనశాఖ అధికారి జ్యోతి కోరారు. ముప్పిరితోటలో పెద్దపల్లి ఉద్యానవనశాఖ, రివులిస్ కంపెనీ ఆధ్వర్యంలో మంగళవారం రైతులకు ఆయిల్పామ్ సాగుపై అవగాహన కల్పించారు. ఆయిల్పా మ్ సాగుకు ప్రభుత్వం రాయితీ ఇస్తుందన్నా రు. త్వరలోనే పెద్దరాతిపల్లిలో ఆయిల్పామ్ శుద్ధి పరివ్రమ ప్రారంభమవుతుందని వెల్లడించారు. ఏఈవో పద్మ, ఫీల్డ్ఆఫీసర్ అభిలాష, రివులిస్ డ్రిప్ ఇరిగేషన్ ప్రతినిధి రహమాన్, కో ఆర్టినేటర్ సత్యనారాయణ పాల్గొన్నారు. ఎల్లంపల్లిలో 6.10టీఎంసీలురామగుండం: శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు పూ ర్తిస్థాయి నీటిమట్టం 148 మీటర్లు. నీటి నిల్వ సామర్థ్యం 20.175 టీఎంసీలు. ప్రస్తుతం నీటి మట్టం 141 మీటర్లు ఉంది. నీటి నిల్వ సామర్థ్యం 6.10 టీఎంసీలకు పడిపోయింది. చిన్నారుల విహారయాత్ర రామగుండం: స్థానిక తబితా ఆశ్రమంలోని చి న్నారులు వేసవి ఆటవిడుపు కోసం మంగళవా రం హైదరాబాద్లోని వండర్లా సందర్శనకు బయలుదేరి వెళ్లారు. కలెక్టర్ ముజామ్మిల్ఖాన్ తన సొంత నిధులు వెచ్చించడంతో చిన్నారు మానసిక ఆనందం కోసం వివాహర యాత్రకు తీసుకెళ్తున్నామని ఆశ్రమ నిర్వాహకుడు వీరేందర్నాయక్ ఈ సందర్భంగా తెలిపారు. -
అన్నదాతలంటే బీజేపీకి అక్కసు ఎందుకు?
● రాష్ట్ర మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు మంథని: దేశానికి అన్నం పెట్టే అన్నదాతలు అంటే బీజేపీకి అక్కసు ఎందుకని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు ప్రశ్నించారు. మంగళవారం రాత్రి పట్టణంలోని తన నివాసంలో ఆ యన విలేకరులతో మాట్లాడారు. ఎన్నికల కమిషన్ ను అడ్డుగా పెట్టుకొని బీజేపీ, బీఆర్ఎస్ రైతుల బ్యాంకు ఖాతాల్లో జమచేసిన సొమ్మును నిలిపివేయడం సరికాదన్నారు. 2018 ఎన్నికల్లో బీఆర్ఎస్ ఎన్నికల రోజు రైతుబంధు సొమ్ము జమచేస్తే ఆనా డు నోరు మెదపని బీజేపీ.. నేడు రైతుబంధు డబ్బు ఎందుకు ఆపిందని నిలదీశారు. తెలంగాణలోని సంక్షేమ పథకాలపై రాజస్థాన్ సీఎం భజన్లాల్శర్మకు అవగాహన లేదని ఎద్దేవా చేశారు. రిజర్వేషన్లు రద్దు చేసే కుట్రను బీజేపీ చేస్తుందనేనిది నిజం కాదా? అని ప్రశ్నించారు. మంథని మున్సిపల్ చైర్పర్సన్ పెండ్రి రమ, టీపీసీసీ ఎన్నికల కమిషన్ కో ఆర్డినేషన్ కమిటీ సభ్యుడు శశిభూషణ్ కాచే, ఎంపీపీ కొండ శంకర్, సింగిల్విండో చైర్మన్ కొత్త శ్రీనివాస్, నాయకులు పురుశోత్తంరెడ్డి పాల్గొన్నారు. -
టోల్ఫ్రీ నంబర్కు ఫోన్ చేయండి
● కొత్త కథ వినండి ● కలెక్టర్ ముజమ్మిల్ఖాన్ పెద్దపల్లిరూరల్: వేసవిలో పిల్లలు ఉల్లాసంగా గడిపేందుకు రూమ్ టు రీడ్ సంస్థ రోజుకో కొత్త కథ ఆడియో రూపంలో అందిస్తోందని కలెక్టర్ ముజమ్మిల్ఖాన్ తెలిపారు. కలెక్టరేట్లోని క్యాంప్ కార్యాలయంలో మంగళవారం రూమ్ టు రీడ్ ఉల్లాస సమయం పోస్టర్ ఆవిష్కరించి మాట్లాడారు. వేసవి సెలవుల్లో విద్యార్థుల చదువులకు ఆటంకం కలుగకుండా రూమ్ టు రీడ్ సంస్థ.. ఐవీఆర్ఎస్ సాయంతో ఉల్లాసవంతమైన కొత్త కథలను ఆడియో రూపంలో అందిస్తోందని తెలిపారు. నీతి కథలు, పిల్లల కథలు వింటే చిన్నారుల్లో వ్యక్తిత్వ వికాసం పెంపొందుతుందని ఆయన అన్నారు. కొత్త కథల కోసం టోల్ ఫ్రీ నంబర్ 040– 4520–9722కు కాల్ చేయాలని ఆయన సూచించారు. జిల్లా విద్యాశాఖ అధికారి మాధవి, ప్రతినిధులు నరసింహాచారి, పాఠశాల అకడమిక్ అధికారి షేక్, రీడ్ టు రూమ్ సంస్థ రాష్ట్ర ప్రతినిధులు తేజస్వి, మధు తదితరులు పాల్గొన్నారు. -
ప్రకృతి కన్నెర్ర
● గాలిదుమారంతో కుప్పకూలిన వేదిక ● ముఖ్య అతిథి చేరకముందే ఘటన ● బీజేపీ శ్రేణుల్లో నిరుత్సాహం మంథని: పార్లమెంట్ ఎన్నికల వేళ.. క్యాడర్లో జోష్ నింపి, ఓటర్లలో ఉనికి చాటుకునేందుకు భారతీయ జనతా పార్టీ పట్టణంలో మంగళవారం చేపట్టిన బహిరంగసభపై ప్రకృతి కన్నెర్ర జేసింది. కొద్దిరోజులుగా మంథనిలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదువుతున్నాయి. అయితే, వాతావరణంలో మంగళవారం ఒక్కసారిగా మార్పులు చోటుచేసుకున్నాయి. ఆకాశం మేఘావృతమై చల్లబడింది. ఇది తమకు శుభసూచకమని బీజేపీ క్యాడర్ ఆనందం వ్యక్తచేసింది. సరిగ్గా ఇదే సమయంలో పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది. భారీగా జనసమీకరణ.. రాజస్థాన్ సీఎం భజన్లాల్శర్మ ముఖ్యఅతిథిగా హాజరయ్యే బహిరంగ సభ ఉదయం 9గంటలకు ఉంటుందని బీజేపీ శ్రేణులు ప్రచారం చేశారు. ఈమేరకు పెద్దసంఖ్యలో జనాన్ని తరలించారు. కానీ, నిర్దేశిత సమయం కన్నా సుమారు ఐదు గంటలు ఆలస్యమైంది. దీంతో పలువురు వేదికపైనుంచి మాట్లాడుతూ, సభికులను ఉత్సాహ పరిచారు. ఎంపీ అభ్యర్థి గోమాస శ్రీనివాస్ ఓవైపు మాట్లాడుతుండగానే జనం సభ నుంచి వెళ్లిపోవడం కనిపించింది. ఆ తర్వాత మెల్లిగా గాలిదుమారం ప్రారంభమైంది. ఆ వెంటనే బీభత్సం సృష్టించింది. వేదిక వద్ద టెంట్లు గాలిదుమారం ధాటికి కుప్పకూలిపోయారు. తొలుత జనం కోసం వేసిన టెంట్లు, ఆ తర్వాత స్టేజీ వేసిన టెంట్లు, వేదిక నెలమట్టమైంది. తప్పిన పెనుప్రమాదం ఈదురుగాలులకు వేదిక ఒక్కసారిగా కుప్పకూలింది. టెంట్లకింద ఉన్న ప్రజలు పరుగులు తీశారు. మరికొందరు టెంట్లకు ఆవల ఉండడంతో ప్రమాదం తప్పింది. అయితే, ఈ ఘటనలో ఇద్దరు మహిళలు స్వల్పంగా గాయపడ్డారు. ఏదిఏమైనా బహిరంగ సభ ద్వారా తమ ప్రభావం చాటేందుకు బీజేపీ చేసిన ప్రయత్నంపై ప్రకృతి కన్నెర్ర జేయడంతో ఆ పార్టీ శ్రేణులు నిరాశ చెందారు. -
అభివృద్ధికి మరిన్ని పథకాలు
గోదావరిఖని: పారిశ్రామిక ప్రాంత అభివృద్ధికి మ రిన్ని పథకాలు ప్రవేశపెట్టేలా చూస్తామని రామగుండం ఎమ్మెల్యే ఎంఎస్ రాజ్ఠాకూర్ అన్నారు. స్థానిక సింగరేణి జవహర్లాల్ నెహ్రూ క్రీడా ప్రాంగణంలో మంగళవారం మార్నింగ్ వాకర్స్ను కలిసి సమస్య లు అడిగి తెలుసుకున్నారు. దివంగత నేత వెంకటస్వామి(కాకా) మనుమడు, కాంగ్రెస్ పార్టీ పెద్దపల్లి పార్లమెంట్ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ చేతిగుర్తుపై ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఎన్నికల తర్వాత రూ.36 కోట్లతో లక్ష్మీనగర్ ప్రాంత అభివృద్ధి ప్రారంభిస్తామని, రూ.15 కోట్లతో స్టేడియం అభివృద్ధి చేస్తామని ఆయన తెలిపారు. ఎమ్మెల్యే వెంట నాయకులు బొంతల రాజేశ్, మహంకాళి స్వామి, పెద్దెల్లి ప్రకాశ్, ముస్తాఫా తదితరులు ఉన్నారు. పాలకుర్తి మండలంలో.. పాలకుర్తి(రామగుండం): కాంగ్రెస్ అభ్యర్థి వంశీకృష్ణను గెలిపించాలని ఎమ్మెల్యే మక్కాన్సింగ్ రాజ్ఠాకూర్ కోరారు. కొత్తపల్లి, ఈసాలతక్కళ్లపల్లిలో ఉపాధిహామీ కూలీలను కలిసి ఓట్లు అభ్యర్థించారు. నాయకులు సూర సమ్మయ్య, గంగాధర రమేశ్, ముక్కెర శ్రీనివాస్, పాత రవీందర్, మహేందర్, ఓడ్నాల రాజు పాల్గొన్నారు. బీ థర్మల్లో ఉత్పత్తి నిలిపివేత రామగుండం: పట్టణంలోని 62.5 మెగావాట్ల సా మర్థ్యం గల బీ–థర్మల్ విద్యుత్ కేంద్రంలో మంగళవారం ఉత్పత్తి నిలిపివేశారు. హైదరాబాద్ విద్యుత్ సౌధ నుంచి ఆదేశాలు రావడంతో ఇంజినీర్లు విద్యు త్ కేంద్రాన్ని ట్రిప్ చేశారు. వ్యవసాయ వినియోగం తగ్గడం, ఉష్ణోగ్రతలు పడిపోవడంతో విద్యుత్ వినియోగం తగ్గిందని అధికారులు తెలిపారు. -
గడువు తీరిన మందులపై విచారణ
పెద్దపల్లిరూరల్ : నిట్టూరులో విరిగిపడ్డ తాటిచెట్టుకోల్సిటీ(రామగుండం): గోదావరిఖని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి(జీజీహెచ్)లో ఓ పేషెంట్కు గడువు ముగిసిన మందులు ఇచ్చిన ఘటనపై మంగళవారం ‘సాక్షి’లో ‘సర్కారు ఆస్పత్రిలో గడువు ముగిసిన మందులు!’ శీర్షికన కథనం ప్రచురితమైంది. దీంతో అధికారులు స్పందించారు. ఆస్పత్రి కొత్త బ్లాక్లోని ఫార్మసీ కేంద్రంలో ఆర్ఎంవోలు తిరుమలేశ, రేణుక తనిఖీ చేశారు. పేషెంట్కు ఇచ్చిన మందుల గడువు తేదీలు పరిశీలించారు. గడువు ముగిన మందులను ఫార్మసీ విభాగం ఇన్చార్జిలకు అప్పగించాలని ఆదేశించారు. ఆర్ఎంవో తిరుమలేశ ఫోన్ ద్వారా బాధితుడు బత్తిని రవితో మాట్లాడి వివరాలు సేకరించారు. గడువు ముగిసిన మందులు ఇచ్చినట్లు విచారణలో తేలితే చర్యలు తీసుకుంటామని ఆర్ఎంవో వెల్లడించారు. ఫార్మసీ సిబ్బంది కొరత... జీజీహెచ్ను ఫార్మసీ సిబ్బంది కొరత వెంటాడుతోంది. కేవలం ఇద్దరు ఫార్మాసిస్టులతోనే నెట్టుకొస్తున్నారు. స్టాఫ్నర్స్ల సహకారంతో పేషెంట్లకు మందులు పంపిణీ చేస్తున్నారు. కనీసం ఐదారుగురు ఫార్మాసిస్టుల పోస్టులు భర్తీ చేయాల్సి ఉంది. ఇందులో ఉన్నతాధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి. కుప్పలుగా గడువు ముగిసిన మందులు! గడువు ముగిసిన మందులను ఎప్పటికప్పుడు గుర్తించాల్సి ఉంది. ఇందుకోసం ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేసి వాటిని భూమిలో పాతిపెట్టాల్సి ఉంటుందని అధికారులు చెబుతున్నారు. కానీ ఫార్మసీ స్టోర్స్లో గడువు ముగిసిన మందులు కుప్పలుగా పడి ఉన్నాయని తెలిసింది. -
అకాలం.. అతలాకుతలం
జిల్లాలోని ధర్మారం, ఎలిగేడు, పెద్దపల్లి, రామగిరి, మంథని, ముత్తారం, ఓదెల మండలాల్లో ఈదురుగాలులతో కూడిన భారీవర్షం కురవడంతో కొను గోలు కేంద్రాల్లోని ధాన్యం తడిసిముద్దయ్యింది. ఆ రబెట్టిన ధాన్యంతోపాటు తూకం వేసిన వడ్ల బస్తా లు వర్షపునీటిలో తడిశాయి. కొన్నిచోట్ల నీటిలో కొ ట్టుకుపోయాయి. ఎలిగేడు, ధర్మారం మండలాల్లో మామాడికాయలు రాళ్లవర్షం ధాటికి నేలరాలాయి. సౌకర్యాలు కరువు.. గ్రామాల్లో ఎక్కడికక్కడే ధాన్యం కొనుగోలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో మార్కెట్ యార్డులతోపాటు, గ్రామాల్లోని ఖాళీ ప్రదేశాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశారు. అక్కడ సౌకర్యాలేమీలేవు. ధాన్యం కుప్పలు పోసుకున్న రైతులకు టార్పాలిన్లు కూడా అందుబాటులో లేవు. మంగళవారం ఒక్కసారిగా కురిసిన వర్షంతో ధాన్యం తడిసిముద్దయ్యింది. రెక్కలు ముక్కలు చేసుకుని పండించిన ధాన్యం వర్షపు నీటిలో కొట్టుకుపోవడాన్ని చూసిన రైతులు కన్నీరుమున్నీరయ్యారు. వడ్లను కాపాడుకునేందుకు కొనుగోలు కేంద్రాలకు ఉరుకులు, పరుగులు తీశారు. ఐదురోజుల పాటు భారీవర్షాలు రాష్ట్రంలో మరో 5 రోజులపాటు భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. బుధవారం ఉరుములు, మెరుపులు, గంటకు 40 కి.మీ. నుంచి 50కి.మీ. వేగంతో ఈదురుగాలులు వీస్తాయని వెల్లడించింది. భారీవర్షాలు కురుస్తాయని, దీంతో జిల్లాకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. రైతులు ధాన్యం తడవకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచించారు. జూలపల్లిలో వర్షం.. జూలపల్లి(పెద్దపల్లి): మండల కేంద్రంతోపాటు వివిధ గ్రామాల్లోని కొనుగోలు కేంద్రాల్లో నిల్వచేసిన ధాన్యం తడిసి ముద్దయ్యింది. కొంత వర్షపునీటిలో కొట్టుకుపోయింది. రైతులకు తీరని నష్టం వాటిల్లింది.కాల్వశ్రీరాంపూర్లో.. కాల్వశ్రీరాంపూర్(పెద్దపల్లి): కాల్వశ్రీరాంపూర్లో ని గ్రామాల్లో కురిసిన భారీవర్షం, గాలిదుమారానికి ధాన్యం తడిసి రైతులు ఇబ్బందులు పడ్డారు. చేతికి చేతికి అందివచ్చిన వరి పంట వర్షార్పణం కావడంతో అన్నదాతలు ఆవేదన చెందారు. ఎలిగేడులో.. ఎలిగేడు(పెద్దపల్లి): కొనుగోలు కేంద్రాల్లోని ధా న్యం తడిసింది. లాలపల్లిలో వడగళ్లవాన కురిసింది. వరిపైరు నేలవాలింది. అన్నదాతలకు అపార నష్టం వాటిల్లింది. మామిడికాయలు రాలిపడ్డాయి. కూరగాయల తోటలు దెబ్బతిన్నాయి. గ్రామాల్లో..సుల్తానాబాద్రూరల్: మండల కేంద్రంతోపాటు గ్రామాల్లో కురిసిన భారీవర్షానికి ధాన్యం తడిసిపోయింది. నీటిలో కొట్టుకుపోయిన వడ్లను కాపాడుకునేందుకు అన్నదాతలు నానాఅవస్థలు పడ్డారు. తడిసిన ధాన్యం కొనుగోలు చేయాలని కోరారు.ముత్తారంలో.. ముత్తారం(మంథని): మచ్చుపేటకు చెందిన కల వేన మల్లయ్య ఇంటి పైకప్పు రేకులు గాలిదుమారం ధాటికి కొట్టుకుపోయాయి. సమీపంలోని విద్యుత్ స్తంభానికి తగిలి ఆగాయి. ఆ సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. లక్కారం, మచ్చుపేట, మైదంబండ, సర్వారం, కేశనపల్లి, పారుపల్లి, ముత్తారం, అడవిశ్రీరాంపూర్, ఓడేడ్లోని కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడిసి ముద్దయ్యింది. అకాల వర్షం తమను ముంచిందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఓదెలలో.. ఓదెల(పెద్దపల్లి): కొలనూర్, ఓదెల, పొత్కపల్లి, కనగర్తి, గుంపుల ఐకేపీ కేంద్రాల్లో నిల్వచేసిన ధాన్యం తడిసి ముద్దయ్యింది. కొంత వర్షపునీటిలో కొట్టుకుపోయింది. కొలనూర్లో జక్కుల రాజ య్యకు చెందిన ఇంటి పైకప్పు గాలిదుమారానికి కొట్టుకుపోయింది. ఆ సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడంతో ప్రాణాలతో బయటపడ్డారు. ఓదె ల, పొత్కపల్లిలోనూ కొన్ని ఇళ్లు పాక్షికంగా ధ్వంసమైనట్లు గ్రామస్తులు తెలిపారు. పాలకుర్తి మండలంలో.. పాలకుర్తి(రామగుండం): వివిధ గ్రామాల్లో మధ్యాహ్నం హఠాత్తుగా కురిసిన వర్షంతో కోతకు వచ్చిన వరిపైరు నేలవాలింది. కల్లాల్లోని ధాన్యం తడిసి ముద్దయ్యింది. కొనుగోలు కేంద్రాల్లో తూకానికి సిద్ధంగా ఉంచిన ధాన్యం బస్తాలు పాక్షికంగా తడిశాయి. వడగళ్లవాన – విరిగిన చెట్లు పెద్దపల్లిరూరల్: జిల్లా కేంద్రంలోని కొన్ని ప్రాంతాల్లో అకాల వర్షం కురిసింది. వ్యవసాయ మార్కెట్లో ధాన్యంపై పరదాలు కప్పేందుకు రైతులు నానా తంటాలు పడ్డారు. వ్యవసాయ మార్కెట్ అధికారులు, సిబ్బంది అప్రమత్తమై వెంటనే టార్పాలిన్లు కప్పడంతో ధాన్యం తడవలేదు. నిట్టూరు, మారేడుగొండ తదితర గ్రామాల్లోనూ వర్షం కురిసింది. నిట్టూరులోని శ్మశానవాటిక పైకప్పు గాలి ధాటికి ఎగిరి పడింది. తాటిచెట్టు విరిగి విద్యుత్ తీగలపై పడింది. రాఘవపూర్, రాగినేడు, ములసాల, కాల్వశ్రీరాంపూర్ మండలం మీర్జంపేట, సుల్తానాబాద్ మండలం కనుకులలోని సబ్స్టేషన్లలో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగిందని ఎస్ఈ సుదర్శనం తెలిపారు. సమస్యలు ఉంటే 79016 28367 నంబరుకు కాల్చేసి సమాచారం ఇవ్వాలని ఆయన కోరారు. తడిసిన ధాన్యం పరిశీలన స్థానిక వ్యవసాయ మార్కెట్ యార్డును అడిషనల్ కలెక్టర్ శ్యామ్ప్రసాద్లాల్ సందర్శించారు. తడిసిన ధాన్యంపై ఆరా తీశారు. వర్షం కురిసేలోపు టార్పాలిన్లు కప్పడంతో పెద్దగా తడవలేదని అధికారులు ఆయనకు వివరించారు. కొనుగోలు చేసిన ధాన్యా న్ని వెంటనే రైస్మిల్లులకు తరలించాలని ఆయన సూచించారు. పాక్షికంగా తడిసిన ధాన్యాన్ని ఆరబోయించి కొనుగోలు చేయాలన్నారు. మార్కెట్ కార్యదర్శి దేవరాజ్పృథ్వీరాజ్, డిప్యూటీ తహసీల్దార్ శంకర్, సీఈవో మదన్మోహన్ ఉన్నారు. వడ్లు.. నీటిపాలు.. సుల్తానాబాద్(పెద్దపల్లి): స్థానిక వ్యవసాయ మార్కె ట్లో ఆరబోసిన ధాన్యం వర్షపునీటికి తడిసి ముద్దయ్యింది. ఇటుక బట్టీలకు తీరని నష్టం వాటిల్లింది. తడిసిన ధాన్యాన్ని జిల్లా మార్కెటింగ్ అధికారి ప్రవీణ్రెడ్డి పరిశీలించారు. ధర్మారం కొనుగోలు కేంద్రంలో నిలిచిన వర్షపునీరు, తడిసిన ధాన్యంజిల్లా సమాచారం కొనుగోలు కేంద్రాలు 311 సేకరించిన ధాన్యం(మెట్రిక్ టన్నుల్లో) 1,52,179 మిల్లులకు తరలించింది(మెట్రిక్ టన్నుల్లో) 1,50,908 కేంద్రాల్లో ఉన్న ధాన్యం(మెట్రిక్ టన్నుల్లో) 1,271 బలమైన ఈదురుగాలులు ఆ వెంటనే ఉరుములు, మెరుపులు మధ్యాహ్నం దంచికొట్టిన అకాల వర్షం తడిసి ముద్దయిన ధాన్యం.. రాలిన మామిడికాయలు ధ్వంసమైన ఇళ్ల పైకప్పులు విద్యుత్ సరఫరాకు అంతరాయం మంగళవారం ఉదయం ఏడు గంటల నుంచే ఎండలు దంచికొట్టాయి. ఉక్కపోత తో జిల్లావాసులు ఉక్కిరిబిక్కిరయ్యారు. మధ్యాహ్నం రెండు గంటల సమయంలో బలమైన ఈదురుగాలులతో కూడిన భారీవర్షం కురవడంతో వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. ఉరుములు, మెరుపులు జనాలను భయకంపితులను చేశాయి. మరోవైపు.. వర్షం, గాలుల ధాటికి కోతకు వచ్చిన వరి పైరు నేలవాలింది. కల్లాల్లో ఆరబెట్టిన ధాన్యం తడిసి ముద్దయ్యింది. కొనుగోలు కేంద్రాల్లో తూకానికి సిద్ధంగా ఉంచిన వడ్లు వర్షపు నీటికి కొట్టుకుపోయాయి. మామిడికాయలు రాలిపోయాయి. చేతికి వచ్చిన పంటను వానదేవుడు హఠాత్తుగా తన్నుకుపోవడంతో అన్నదాత కన్నీరుమున్నీరయ్యాడు. – సాక్షి, పెద్దపల్లిధాన్యం కొట్టుకుపోయింది ధర్మారం కేంద్రంలో పోసిన దాదాపు 3 క్వింటాళ్ల ధాన్యం నీటిలో కొట్టుకపోయింది. వర్షం తగ్గిన తర్వత మిగిలిన ధాన్యంపై కవర్లు కప్పిన. సరిపడా టార్పాలిన్లు ఇవ్వకపోవడంతోనే ధాన్యం నీటిలో కొట్టుకు పోయింది. – గుమ్ముల సతీశ్, రైతు, ధర్మారంధర్మారంలో.. ధర్మారం(ధర్మపురి): బంజేరుపల్లి, పెర్కపల్లి, కటికెనపల్లి, మల్లాపూర్, ఎర్రగుంటపల్లిలో మధ్యాహ్నం నుంచి సాయంత్రం 5గంటల వరకు వడగళ్లవాన కురిసింది. మామిడి కాయలు నేలరాలాయి. ధర్మారం, ఎర్రగుంటపల్లి, కటికెనపల్లిలోని కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడిసి ముద్దయ్యింది. ఎర్రగుంటపల్లిలో ధాన్యం కుప్పలు నీట మునిగిపోయాయి. తూకం వేసిన ధాన్యం బస్తాలు తడిపోయాయి. సరిపడా టార్పిలిన్లు ఇవ్వకపోవడంతోనే ఈ దుస్థితి నెలకొందని రైతులు వాపోయారు. -
పట్టుదలతో చదవండి
● కలెక్టర్ ముజమ్మిల్ఖాన్ పెద్దపల్లిరూరల్: విద్యార్థులు క్రమశిక్షణ, పట్టుదల తో చదివి లక్ష్యం సాధించాలని కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ అన్నారు. పదో తరగతి వార్షిక ఫలితాల్లో ఉత్త మ ప్రతిభ కనబర్చిన విద్యార్థులు, ప్రోత్సాహించిన ఉపాధ్యాయులను తన కార్యాలయంలో సోమవా రం ఆయన సన్మానించారు. డీఈవో మాధవితో కలి సి విద్యార్థులకు పలు సూచనలిచ్చారు. జిల్లాలో ఈ సారి టెన్త్ ఫలితాలు మెరుగ్గానే వచ్చాయని తెలిపా రు. వచ్చే విద్యాసంవత్సరంలో నూరుశాతం ఫలితా లు సాధించేలా ప్రణాళికలతో ముందుకు సాగాలని సూచించారు. విద్యార్థులకు ప్రత్యేక తరగతుల ని ర్వహణ, ఇంటివద్ద చదువు ఫాలోఅప్ చేయడం లాంటి చర్యలు మంచి ఫలితాల సాధనకు దోహదపడ్డాయని అన్నారు. నూరు మార్కులు సాధించిన విద్యార్థులతో ముచ్చటించారు. జాతీయస్థాయి ప్రే రణ శిక్షణకు ఎంపికై న విద్యార్థులను అభినందించారు. అకడమిక్ అధికారి షేక్తోపాటు జిల్లా అధికారులు రంగారెడ్డి, మెహరాజ్ మహమూద్, హెచ్ఎం, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. -
పోలింగ్ కేంద్రాల తనిఖీ
ఫెర్టిలైజర్సిటీ: 39వ డివిజన్ శాంతినగర్లోని ప్ర జా పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రా లని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ అరుణశ్రీ సో మవారం తనిఖీ చేశారు. సౌకర్యాలపై ఆరా తీశారు. డిప్యూటీ తాహసీల్దార్ మాధవి పాల్గొన్నారు. ఉమ్మడి జిల్లాకు వర్ష సూచన ● 7 నుంచి 11 తేదీ వరకు తేలికపాటి వర్షాలు సాక్షిప్రతినిధి, కరీంనగర్: మాడు పగిలే ఎండలతో తల్లడిల్లుతున్న ప్రజలకు భారత వాతావరణశాఖ (ఐఎండీ) చల్లటి కబురు చెప్పింది. ఈనెల 7వ తేదీ నుంచి 11వ తేదీ వరకు ఉమ్మడి జిల్లాలోని కరీంనగర్, పెద్దపల్లి, జగిత్యాల, సిరిసిల్ల జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి వర్షాలు పడే అవకాశాలున్నాయని సోమవారం విడుదల చేసిన ప్రకటనలో వెల్లడించింది. -
కమిషనింగ్ పూర్తిచేయండి
జ్యోతినగర్(రామగుండం): ఈవీఎంల కమిషనింగ్ ప్రక్రియ పూర్తిచేయాలని ఎన్నికల రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ ముజమ్మిల్ఖాన్ సూ చించారు. ఎన్టీపీసీ జెడ్పీ హైస్కూల్లో ఏర్పా టు చేసిన ఈవీఎంల కమిషనింగ్ ప్రక్రియను అదనపు కలెక్టర్ అరుణశ్రీతో కలిసి సోమవా రం ఆయన తనిఖీ చేశారు. అదనపు బ్యాలెట్ యూనిట్ల ర్యాండమైజేషన్ పూర్తిచేసి, ఈవీఎంల కమిషనింగ్ ప్రారంభించామని తెలిపారు. తహస్దీల్దార్ కుమారస్వామి పాల్గొన్నారు. పోలింగ్ కేంద్రాల తనిఖీపాలకుర్తి(రామగుండం): కన్నాల జెడ్పీ హై స్కూల్లోని పోలింగ్ కేంద్రాలను జెడ్పీ సీఈవో నరేందర్ సోమవారం ఆకస్మికంగా తనిఖీ చేశా రు. త్వరితగతిన పూర్తిస్థాయిలో సౌకర్యాలు కల్పించాలని ఆదేశించారు. పాలకుర్తి, ఈసాలతక్కళ్ళళ్లల్లి, బసంత్నగర్ డీఆర్డీవో రవీందర్ ఠాథోడ్ పర్యటించి పోలింగ్ కేంద్రాలు, అమ్మ ఆదర్శ పాఠశాలల్లో అభివృద్ధి పనులు పరిశీలించారు. ఎంపీడీవో శశికళ, ఏపీఎం సదానందం, సీసీ రాంబాబు, హెచ్ఎం కమలాకర్రావు, పంచాయతీ కార్యదర్శి శ్రీనివాస్ పాల్గొన్నారు. ‘మీరూ ఓటు వేయండి’పెద్దపల్లిరూరల్: ప్రజాస్వామ్యంలో ఓటుహ క్కు విలువైనదని, ప్రతీఓటరు దానిని సద్వినియోగం చేసుకోవాలని పెద్దపల్లి ఏసీపీ కృష్ణ అ న్నారు. ఎన్నికల విధులు నిర్వర్తించాల్సి ఉన్నందున సబ్ డివిజనల్ పోలీసు అధికారులు పోస్టల్ బ్యాలెట్ పద్ధతిన సోమవారం వారు తమ ఓటుహక్కు వినియోగించుకున్నారు. విద్యుత్ ఉత్పత్తి పునరుద్ధరణ రామగుండం: పట్టణంలోని 62.5 మెగావాట్ల సామర్థ్యం గల బీ–థర్మల్ విద్యుత్ కేంద్రాన్ని ఆదివారం రాత్రి ఉత్పత్తి దశలోకి తీసుకొచ్చా రు. గతనెల 29న మిల్స్లో తలెత్తిన సాంకేతిక లోపంతో యూనిట్ను షట్డౌన్ చేశారు. దీంతో విద్యుత్ ఉత్పత్తి నిలిచిపోయింది. ఐదు రో జులుగా ఇంజినీర్లు, ఉద్యోగుల నిరంతరం శ్ర మిచి యూనిట్ను విద్యుత్ ఉత్పత్తిని పునరుద్ధరించారు. గత మూడు నెలలుగా తరచూ సాంకేతిక లోపాలు తలెత్తడం, పునరుద్ధరించడం తదితర పనులతో రూ.కోట్లు వెచ్చిస్తున్నారు. అయినా, శాశ్వత పరిష్కారం లభించడంలేదు. నీటి సమస్య పరిష్కరించాలిమంథని: గ్రామాల్లో తాగునీటి సమస్య తలె త్తకుండా చర్యలు తేసుకుంటున్నట్లు జిల్లా పంచాయతీ అధికారి ఆశాలత తెలిపారు. గుంజపడుగు గ్రామపంచాయతీ కార్యాలయాన్ని సో మవారం ఆమె తనిఖీ చేశారు. తాగునీటి సరఫరా తీరు పరిశీలించి పలు సూచనలు చేశారు. అనంతరం పోలింగ్ కేంద్రాలు సందర్శించారు. సౌకర్యాలపై ఆరా తీశారు. పంచాయతీ కార్య దర్శి రత్నాకర్ తదితరులు ఉన్నారు. ప్రశాంతంగా ఈసెట్ రామగిరి(మంథని): సెంటినరీకాలనీ జేఎన్టీయూలో సోమవారం ఈసెట్ ప్రశాంతంగా ముగిసింది. 150 మంది విద్యార్థులకు ఇద్దరు గైర్హాజరైనట్లు ప్రిన్సిపాల్ శ్రీధర్రెడ్డి తెలిపారు. ప్రతీ విద్యార్థిని క్షుణ్ణంగా తనిఖీ చేసిన అనంతరం పరీక్ష కేంద్రంలోకి అనుమతించామని అన్నారు. ఎస్సై సందీప్కుమార్ ఆధ్వర్యంలో బందోబస్తు ఏర్పాటు చేశారు. -
స్వర్ణకారుల సమస్యలు పరిష్కరిస్తాం
● రామగుండం ఎమ్మెల్యే ఎంఎస్ రాజ్ఠాకూర్ గోదావరిఖని/గోదావరిఖనిటౌన్: స్వర్ణకారుల సమస్యలు పరిష్కరిస్తామని ఎమ్మెల్యే ఎంఎస్ రాజ్ఠాకూర్ అన్నారు. స్థానిక దుర్గానగర్ ఫంక్షన్హాల్లో జరిగిన స్వర్ణకారుల నూతన కార్యవర్గ ప్రమా ణ స్వీకారానికి ఆయన హాజరై మాట్లాడారు. బీఆర్ఎస్, బీజేపీకి ఓటుద్వారా బుద్ధి చెప్పాలని కోరారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వంశీకృష్ణను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. కార్పొరేటర్ బాల రాజ్కుమార్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో స్వర్ణకార సంఘం జిల్లా అధ్యక్షుడు రంగు శ్రీనివాస్, నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన కొండపర్తి నరహరి, ప్రధాన కార్యదర్శి కట్ట నగేశ్కుమార్, గౌరవ అధ్యక్షుడు సత్యనారాయణ, కోశాధికారి కట్ట శ్రీధరాచారి, ప్రతినిధులు ఉప్పుల లక్ష్మీనర్సయ్య, గుగ్గిళ్ల రవీందరాచారి, కాంగ్రెస్ నాయకులు మహంకాళి స్వామి, ప్రకాశ్, నజీముద్దీన్, శివ, ముబీన్ తదితరులు పాల్గొన్నారు. -
సర్కారు ఆస్పత్రిలో గడువు ముగిసిన మందులు!
● ఉద్యోగుల నిర్లక్ష్యమా? అధికారుల బాధ్యతారాహిత్యమా? కోల్సిటీ(రామగుండం): గోదావరిఖని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి(జీజీహెచ్)లో కాలం చెల్లిన మందులు పంపిణీ చేస్తూ పేషెంట్ల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. సోమవారం ఆస్పత్రికి వెళ్లిన ఓ పేషెంట్కు గడువు ముగిసిన మందులు ఇవ్వడంతో అధికారుల బాధ్యతా రాహిత్యం వెలుగులోకి వ చ్చింది. బాధితుడి కథనం ప్రకారం.. గోదావరిఖని కల్యాణ్నగర్కు చెందిన కారు డ్రైవర్, ట్రావెల్స్ నిర్వాహకుడు.. బత్తిని రవి రెండు రోజులుగా కడుపునొప్పితో బాధపడుతున్నాడు. సోమవారం జీజీహెచ్కు వెళ్లగా పరీక్షించిన వైద్యులు మందులు రాశారు. ఆస్పత్రి కౌంటర్లో డాక్టరు రాసిచ్చిన చీటీ చూపించి మూడు రకాల మందులు తీసుకున్నాడు. అందులో రెండు రకాలు నాణ్యతగా ఉండగా, మూడోరకానికి చెందిన 10 టాబ్లెట్లు తీసుకున్నాడు. ఓ రాజకీయ పార్టీ ప్రచారం కోసం కారు పంపించే హడావుడిలో ఎన్టీపీసీ వెళ్లిన రవి.. అక్కడే మందులు వేసుకోవడానికి ప్రయత్నించాడు. అక్కడే ఉన్న ఓ మిత్రుడు వాటిని చూసి కాలం చెల్లిన మందులని చెప్పాడు. దీంతో చప్పరించే మందులను వాడకుండా పక్కన పెట్టాడు. అనుమానంతో ఓ ప్రైవేట్ మెడికల్ షాప్కు వెళ్లి ఆ మందుల గురించి ఆరా తీశాడు. గతనెల వరకే గడువు ఉందని షాపు నిర్వాహకులు స్పష్టం చేయడంతో బాధితుడు రవి ఆందోళన చెందాడు. మందులు, టానిక్లు, ఇంజక్షన్లు తరచూ తనిఖీచేసి, కాలం చెల్లిన వాటిని పక్కన పెట్టాల్సిన ఉద్యోగులు, అధికారులు.. బాధ్యతా రాహిత్యంగా వ్యవహరించడం ఇందుకు నిదర్శనంగా నిలుస్తున్నాయి. ఇంకా ఎంతమందికి ఇచ్చారో? మరోవైపు.. కాలం చెల్లిన మందులు ఆస్పత్రి కౌంటర్లో ఇంకా ఎన్నిఉన్నాయి? ఇప్పటివరకు ఇంకా ఎంతమందికి ఇచ్చారు? వైద్యులకు తెలిసే గడువు ముగిసిన మందులు పంపిణీ చేశారా? లేక వారికి తెలియకుండా, పొరపాటున మందులు పంపిణీ చేశారా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇవన్నీ విచారణ చేపడితే వెలుగులోకి వస్తాయని పేషెంట్లు అభిప్రాయపడుతున్నారు. విచారణ జరువుతాం గడువు తీరిన మందులు ఇచ్చారనే ఘటనపై విచారణ చేపడతాం. ఇలాంటి సంఘటనలు పునరావతం కాకుండా కఠిన చర్యలు తీసుకుంటాం. – డాక్టర్ అరుణ, ఆర్ఎంవో, జీజీహెచ్ -
ఓదెల మల్లన్న సాక్షిగా చెబుతున్నా..
పెద్దపల్లిరూరల్: ‘భారత్ మాతాకీ జై.. అందరికీ నమస్కార్.. ఓదెల మల్లన్న సాక్షిగా చెబుతున్నా’ అ ని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జగత్ ప్రకాశ్(జేపీ) న డ్డా జిల్లా కేంద్రంలో సోమవారం జరిగిన బహిరంగ సభలో ప్రసంగం ఆరంభించారు. ప్రధాని మోదీ సా రథ్యంలోని ప్రభుత్వం నీతివంతమైన పాలన సాగిస్తోందని, మనదేశాన్ని ప్రపంచంలో అగ్రభాగాన ని లిపేందుకే ఆరాట పడుతోందన్నారు. స్థానిక ప్రభు త్వ జూనియర్ కాలేజీ మైదానంలో పెద్దపల్లి పార్ల మెంట్ బీజేపీ అభ్యర్థి గోమాస శ్రీనివాస్కు మద్దతు గా ఏర్పాటు చేసిన ఎన్నికల ప్రచార సభలో ఆయన మాట్లాడారు. నడ్డా ప్రసంగాన్ని రాంచందర్రావు తె లుగులో అనువదించారు. మంథని ఎమ్మెల్యేగా ఎ న్నికైన, మాజీ ప్రధాని పీవీ నర్సింహారావుకు భార తరత్న పురస్కారం అందించామని గుర్తుచేశారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకా లు అన్నిగ్రామాలకు చేరాయన్నారు. 53వ నంబరు జాతీయ రహదారి పూర్తయితే మరింత మేలు కలుగుతుందన్నారు. ఇప్పటికే రైల్వేస్టేషన్ల ఆధునికీకరణ సాగుతోందని, రామగుండం ఎరువుల కర్మాగారం పునఃప్రారంభించామని తెలిపారు. 25కోట్ల మంది పేదలు ఆత్మ నిర్భర్ ద్వారా ఆర్థికాభ్యున్నతి సాధించేలా ప్రోత్సహించామన్నారు. పదేళ్ల కేసీఆర్ సర్కార్ విచ్చలవిడి అవినీతికి పాల్పడిందని, కుటుంబపాలనకే ప్రాధాన్యం ఇచ్చారని ఆరోపించారు. పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లు నిర్మించి ఇవ్వలేదని, కేంద్రప్రభుత్వం ప్రధాని ఆవాస్ యోజన కింద 4కోట్ల ఇళ్లు నిర్మించిందని తెలిపారు. ఓవైసీతో దోస్తానా.. కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతలు ఓవైసీతో దోస్తీ చేస్తున్నా రని జేపీ నడ్డా విమర్శించారు. ముస్లింల ఓట్ల కోస మే ఓబీసీలకు దక్కాల్సిన రిజర్వేషన్లు పంచారని, తాము వాటినే రద్దు చేస్తామని స్పష్టం చేశారు. పెద్దపల్లి వివేక్ కుటుంబం జాగీరా? ‘పెద్దపల్లి అడ్డా వెంకటస్వామి కుటుంబీకుల జాగీ రా? వెంకటస్వామి పోతే ఆయన కొడుకు వివేక్, ఇ పుడు ఈయన కొడుకు వంశీకృష్ణ పోటీ చేస్తరా? ఈ ఎన్నికల్లో చరిత్ర తిరగరాస్తం.. గడ్డం కుటుంబీకుల ను ఓడించి కాషాయజెండా ఎగురవేస్తం’ అని బీజే పీ ఎంపీ అభ్యర్థి గోమాస శ్రీనివాస్ అన్నారు. ఇక్క డ ప్రజాప్రతినిధులుగా గెలిచి ఇతర రాష్ట్రాల్లో కంపెనీలు ఏర్పాటు చేస్తున్నారని మండిపడ్డారు. ఎంపీ వెంకటేశ్ మాట్లాడుతూ, ప్రధాని మోదీ వికసిత్ భా రత్ లక్ష్యంగా అడుగులు వేస్తున్నారన్నారు. పెద్దపల్లిలో బీజేపీ అభ్యర్థి శ్రీనివాస్ గెలుపు ఖాయమని అన్నారు. బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దుగ్యాల ప్రదీప్కుమార్ మాట్లాడుతూ, దేశ ప్రజలు కాంగ్రెస్ పార్టీ గ్యారంటీలు నమ్మే పరిస్థితుల్లో లేరన్నారు. అంబేడ్కర్ రాజ్యాంగం ద్వారా ప్రసాదించిన రిజర్వేషన్లు ఒక్క వెంకటస్వామి కుటుంబమే అనుభవిస్తోందని ఆరోపించారు. పెద్దపల్లి, మంచిర్యాల జిల్లాల బీజేపీ అధ్యక్షులు సునీల్రెడ్డి, రఘునాథ్, మాజీ ఎమ్మెల్యేలు రాంరెడ్డి, శ్రీదేవి, నాయకులు చిలారపు పర్వతాలు, జి.సురేశ్రెడ్డి, వనిత, కందుల సంధ్యారాణి, సుహాసినిరెడ్డి పాల్గొన్నారు. భారత్ మాతాకీ జై.. అందరికీ నమస్కార్ బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా -
వేడెక్కిన ప్రచారం
● జిల్లాలో అగ్రనేతల పర్యటనలు ● ప్రధాన పార్టీల శ్రేణుల్లో జోష్ ● సీఎం రేవంత్, మాజీ సీఎం కేసీఆర్, బీజేపీ అధ్యక్షుడు నడ్డా రాక ● పార్లమెంట్ పరిధిలో అభ్యర్థుల విజయం కోసం నేతల ప్రచారం ● హామీలిస్తూ, విమర్శలు గుప్పిస్తూ, ఉత్సాహం నింపుతూ ముందుకు.. సాక్షి, పెద్దపల్లి: పెద్దపల్లి లోక్సభలో తమ పార్టీ అ భ్యర్థుల గెలుపే లక్ష్యంగా ప్రధాన రాజకీయ పార్టీల అగ్రనేతలు ప్రచారంతో హీటెక్కిస్తున్నారు. ఒకరి తర్వాత మరొకరు తమ అభ్యర్థుల విజయం కోసం జిల్లా పర్యటనకు వస్తున్నారు. దీంతో ఎన్నికల ప్రచారం హోరెత్తుతోంది. పోలింగ్ గుడువు సమీపిస్తున్న నేపథ్యంలో అగ్రనేతలు పార్లమెంట్ను చు ట్టేస్తూ ప్రత్యర్థులపై విమర్శలు గుప్పిస్తున్నారు. ఇదేసమయంలో తమ పార్టీని గెలిపిస్తే చేసే అభివృద్ధి గురించి వివరిస్తున్నారు. పార్టీ నేతలు, శ్రేణుల్లో ఉత్సాహం నింపుతూ ముందుకు సాగుతున్నారు. మరోసారి సీఎం రేవంత్రెడ్డి రాక.. ● సీఎం రేవంత్రెడ్డి రాష్ట్రమంతా సుడిగాలి పర్యటన చేస్తున్నారు. ● ఇందులో భాగంగా జగిత్యాల జిల్లా ధర్మపురి మండలం రాజారాంపల్లి బహిరంగ సభలో కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణకు మద్దతుగా ఎన్నిక ప్రచారం చేశారు. ● దివంగత పీవీ, శ్రీపాదరావు, కాకాను గుర్తుచేస్తూ, స్థానిక సమస్యల పరిష్కారం కోసం హామీలిస్తూ, ప్రత్యర్థి పార్టీలపై విమర్శలతో కాంగ్రెస్ శ్రేణుల్లో జోష్ నింపారు. ● కార్యకర్తల శ్రమతోనే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని,టీ పార్లమెంట్ ఎన్నికల్లోనూ ఇదే స్ఫూర్తితో ఎన్నికల ప్రచారం నిర్వహించాలని దిశానిర్దేశం చేశారు. ● జిల్లాకేంద్రంలో వంశీకృష్ణకు మద్దతుగా నిర్వహించే సభలో సీఎం రేవంత్రెడ్డి మరోసారి పాల్గొననున్నారు. కార్మికులకు అండగా ఉండేది బీఆర్ఎస్ బీఆర్ఎస్ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్కు మద్దతుగా రామగుండంలో చేపట్టిన రోడ్డుషోలో మాజీ సీఎం కేసీఆర్ ప్రచారం నిర్వహించారు. సింగరేణి కార్మికుల ఓట్లే కీలకం కావడంతో.. గతంలో కాంగ్రెస్ సింగరేణిని ముంచిందని, బొగ్గు గనులను బీజేపీ ప్రైవేట్పరం చేస్తోందని ఫైర్ ఆయ్యారు. తెలంగాణ కోసం, సింగరేణి కోసం కొట్లాడేది బీఆర్ఎస్ మాత్రమేనని స్పష్టం చేశారు. ఐదునెలల్లో రాష్ట్రంలో కరెంట్, సాగు నీటిసమస్యలు తలెత్తాయని, కార్మికుల పక్షాన పార్లమెంట్లో గళం విప్పేది బీఆర్ఎస్ ఎంపీలేనంటూ ప్రచారం నిర్వహించారు. ఆర్ఎఫ్సీఎల్ను పునరుద్ధరించాం.. ● బీజేపీ ఎంపీ అభ్యర్థి గోమాస శ్రీనివాస్కు మద్దతుగా ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా పెద్దపల్లి జనసభలో కాషాయ నేతలకు దిశా నిర్దేశం చేశారు. ● జగదల్పూర్–పెద్దపల్లి–ధర్మపురి– నిజామాబాద్ జాతీయ రహదారిని త్వరలో పూర్తిచేస్తామని హామీ ఇచ్చారు. ● మూతపడిన ఎఫ్సీఐని ఆర్ఎఫ్సీఎల్గా పునరుద్ధరించి, నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు పెంచామని ఆయన అన్నారు. ● బీజేపీ అభ్యర్థికి మద్దతుగా మంథనిలో మంగళవారం నిర్వహించే బహిరంగ సభలో రాజస్థాన్ సీఎం భాజన్లాల్శర్మ పాల్గొననున్నారు. ఎండలోనూ చుట్టేస్తున్నారు ముఖ్య నాయకుల సభలు లేని మిగతా రోజుల్లో అభ్యర్థులు ప్రతీ గ్రామంలో పర్యటిస్తున్నారు. కార్నర్ మీటింగ్లు, రోడ్డుషోలతోపాటు కుల సంఘాలు, యువతతో ప్రత్యేక సమావేశాలు, సమ్మేళనాలు నిర్వహిస్తున్నారు. ప్రతీ పల్లె చుట్టేస్తూ ‘అన్నా.. ఎట్లున్నవు.. చెల్లె, అక్కా బాగున్నావా.. అమ్మా ఓటెయ్యాలే’ అని బంధుగణం, అనుచరగణం ఇంటింటి ప్రచారం చేస్తోంది. -
ఎన్నికల ప్రచార వ్యయం నమోదుపై సమావేశం
పెద్దపల్లిరూరల్: పార్లమెంట్ అభ్యర్థులు ప్రచార వ్యయ వివరాలను రిజిష్టర్లలో పకడ్బందీగా నమో దు చేయాలని ఎన్నికల వ్యయ పరిశీలకులు సమీర్ నైరంతర్యా సూచించారు. కలెక్టరేట్లో సోమవారం ఎన్నికల వ్యయం నమోదుపై వివిధ పార్టీల ఎంపీ అభ్యర్థులతో సమావేశమై పలు సూచనలు చేశారు. ఎన్నికల కమిషన్ నిబంధనల ప్రకారం వ్యయం వి వరాలు నమోదు చేయాలన్నారు. 36మంది అభ్యర్థులు హాజరు కాగా గైర్హాజరైన ఆరుగురికి నోటీసు లు జారీచేశామని తెలిపారు. తదుపరి సమావేశం ఈనెల 11న ఉంటుందని పేర్కొన్నారు. డీసీవో శ్రీమాల తదితర అధికారులు పాల్గొన్నారు. రూ.కోటి 78లక్షల జప్తు.. పార్లమెంట్ నియోజకవర్గంలో చేపట్టిన తనిఖీల్లో ఇప్పటివరకు రూ.కోటి 78లక్షల97వేల132 నగదు జప్తు చేసి, తగిన ఆధారాలు చూపిన వారికి రూ.కోటి67లక్షల37వేల32 నగదు విడుదల చేసినట్లు ఎన్నికల రిటర్నింగ్ అధికారి ముజమ్మిల్ఖాన్ తెలి పారు. ఆధారాలు చూపని రూ.11లక్షల60వేల100 సీజ్ చేసి ఉంచామని ఆయన పేర్కొన్నారు. -
ఆదాయపు పన్ను మాఫీ చేయిస్తాం
● రాష్ట్ర మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబుగోదావరిఖని: కాంగ్రెస్ అభ్యర్థి వంశీకృష్ణను గెలిపి స్తే సింగరేణి ఉద్యోగుల ఆదాయపు పన్ను మాఫీపై పోరాటం చేస్తామని మంత్రి దుద్దిళ్ల శ్రీధర్భాబు హా మీ ఇచ్చారు. స్థానిక సీతానగర్లో సోమవారం రా త్రి నిర్వహించిన కార్నర్ మీటింగ్లో రామగుండం, చెన్నూర్ ఎమ్మెల్యేలు ఎమ్మెస్ రాజ్ఠాకూర్, వివేక్, ఎంపీ అభ్యర్థి వంశీకృష్ణతో కలిసి మాట్లాడారు. ఈ ప్రాంత అభివృద్ధి కోసం ఎమ్మెల్యే రాజ్ఠాకూర్ చిత్తశుద్ధితో కృషి చేస్తున్నారన్నారు. ఆరు గ్యారంటీల్లో ఐ దింటిని ఇప్పటికే పూర్తి చేశామని, మిగతావి కూడా పూర్తిచేస్తామన్నారు. అయితే ప్రతిపక్షాల విమర్శల్లో అర్థం లేదన్నారు. పదేళ్లపాటు అధికారంలో ఉన్న బీ ఆర్ఎస్ ప్రజలకు చేసిందేమీలేదని విమర్శించారు. బీజేపీని గెలిపిస్తే ఒరిగేదేమీ ఉండదన్నారు. నాయకులు బొంతల రాజేశ్, బంగి అనిల్కుమార్, మ హంకాళి స్వామి తదితరులు పాల్గొన్నారు. కాగా, 49వ డివిజన్ అశోక్నగర్లో పలువురు కాంగ్రెస్లో రాజ్ఠాకూర్ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. యాకూబ్, వహీద్బేగ్ పాల్గొన్నారు. -
ఓపెన్ కాస్టుల్లో పనివేళలు మార్చండి
● ఏఐటీయూసీ అధ్యక్షుడు సీతారామయ్య గోదావరిఖని:ఎండలను దృష్టిలో ఉంచుకుని సింగరేణి ఓసీపీల్లో షిఫ్టు వేళలు మార్చాలని ఏఐటీయూ సీ అధ్యక్షుడు సీతారామయ్య, ప్రధాన కార్యదర్శి కె. రాజ్కుమార్ కోరారు. సోమవారం హైదరాబాద్లో సీఎండీ బలరాంను కలిసి ఒక వినతిపత్రం అందజేశారు. తమ పోరాట ఫలితంగా మొదటిషిఫ్టును ఉద యం 6 నుంచి మధ్యాహ్నం 2గంటల వరకు, రెండో షిఫ్ట్ను సాయంత్రం 4 నుంచి రాత్రి 12గంటల వరకు, రాత్రి డ్యూటీ యథావిధిగా ఉంటుందని సింగరేణి ప్రకటించిందన్నారు. దీనిని కార్మికవర్గం వ్యతిరేకిస్తోందన్నారు. మొదటి షిఫ్ట్ను ఉదయం 7 నుంచి 1గంట వరకు, మధ్యాహ్న భోజనం కంటి న్యూ, రెండో షిఫ్ట్ను సాయంత్రం 4 నుంచి రాత్రి 11గంటల వరకు మార్చాలని ప్రతిపాదించామని అన్నారు. సీఎండీ సానుకూలంగా స్పందించారని సీతారామయ్య తెలిపారు. తద్వారా ఉదయం 7 నుంచి మధ్యాహ్నం 3గంటల వరకు మధ్యాహ్నం 3 నుంచి రాత్రి 11గంటల వరకు, రాత్రి 11 నుంచి మరుసటి రోజు ఉదయం 7గంటల పని వేళలు ఉంటాయని వివరించారు. కాగా, ఎన్నికల విధులను ఆన్లైన్ డ్యూటీగా పరిగణించాలని నేతలు కోరారు. -
ట్రాక్టర్ అదుపు తప్పి..కాలువలోకి దూసుకెళ్లి..
సుల్తానాబాద్రూరల్: డ్రైవర్ సీటు కింది స్ప్రింగ్ ఊడిపోవడంతో ట్రాక్టర్ అదుపు తప్పి కాలువలోకి దూసుకెళ్లి బోల్తా పడడంతో ముగ్గురు మహిళా కూలీలు దుర్మరణం చెందారు. ఈ ఘటన పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం మియాపూర్లో ఈ ఘటన చోటుచేసుకుంది. ఎస్సై శ్రావణ్కుమార్, మృతుల కుటుంబసభ్యుల కథనం ప్రకారం..సుల్తానాబాద్ మండలం చిన్న కూర్ గ్రామానికి చెందిన డ్రైవర్ మల్యాల వెంకటేశ్ మియాపూర్ గ్రామ పరిధిలో చేను కౌలుకు తీసుకొని మొక్కజొ న్న సాగు చేశాడు. పంట చేతికి రావడంతో తన భార్య మల్యాల వైష్ణవి(35)తోపాటు పోచంపల్లి రాజమ్మ(61), బేతి లక్ష్మి(50), పోచంపల్లి పద్మ, విజ్జగిరి రమ, విజ్జగిరి రాజమ్మ, పోచంపల్లి లక్ష్మి ని ట్రాక్టర్లో తీసుకొని ఆదివారం ఉదయం 7గంటల సమయంలో చేను వద్దకు వెళ్లాడు. మొక్కజొన్న కంకులు కోసి ట్రాక్టర్లో లోడ్ చేసుకున్నాడు. తిరుగుప్రయాణంలో వారిని ట్రాక్టర్ ట్రాలీ పై ఎక్కించుకొని కాలువ వెంట ఉన్న దారి నుంచి వస్తున్నాడు. మధ్యాహ్నం 12గంటల సమయంలో డ్రైవర్ సీటు కింద ఉన్న స్ప్రింగ్ ఊడిపోయింది. దీంతో ఒక్కసారిగా డ్రైవర్ కుప్పకూలిపోయాడు. స్టీరింగ్ చేజారి ట్రాక్టర్ అదుపు తప్పింది. వేగంగా కాలువలోకి దూసుకెళ్లి బోల్తాపడింది. దీంతో ట్రాలీ కింద మహిళా కూలీలు నలిగిపోయారు. ఇందులో మల్యాల వైష్ణవి, పోచంపల్లి రాజమ్మ, బేతి లక్ష్మి తీవ్రగాయాలతో అక్కడికక్కడే మృతి చెందారు. పోచంపల్లి పద్మ, విజ్జగిరి రమ, విజ్జగిరి రాజమ్మ, పోచంపల్లి లక్ష్మికి తీవ్ర గాయాలు సమీపంలోని రైతులు వెంటనే కరీంనగర్లోని ఆస్పత్రికి తరలించారు. డ్రైవర్ వెంకటేశ్కు స్వల్ప గాయాలు కావడంతో సుల్తానాబాద్ ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స అందించారు. గాయపడిన వారి ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని వైద్యులు తెలిపారు. మృతదేహాలను సుల్తానాబాద్ ప్రభుత్వ ఆస్పత్రికి పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. సీఐ సుబ్బారెడ్డి సంఘటన స్థలానికి చేరుకొని వివరాలు తెలుసుకున్నారు ఎస్సై కేసు నమోదు చేశారు. పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణారావు, మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్రెడ్డి, నాయకులు నల్ల మనోహర్రెడ్డి మృతుల కుటుంబాలను పరామర్శించారు. -
చిన్నబోయిన చిన్నబొంకూరు
సుల్తానాబాద్రూరల్: చిన్నబొంకూరు చిన్నబోయింది.. ట్రాక్టర్ రూపంలో వచ్చిన మృత్యువు ముగ్గురు మహిళా కూలీలను బలితీసుకుంది. దీంతో ఆ పల్లె మూగబోయింది.. పొద్దున లేవగానే మంచీచెడులు తెలుసుకుని, సమస్యలు, ఇబ్బందుల్లో పాలుపంచుకునే వారు హఠాత్తుగా చనిపోవడంతో ఊరుఊరంతా రోదించింది.. గ్రామానికి చెందిన మల్యాల వెంకటేశ్ తన భార్య వైష్ణవితో కలిసి మరో ఆరుగురు మహిళా కూలీలను తీసుకుని మియాపూర్ సమీపంలోని తను కౌలుకు తీసుకున్న మొక్కజొన్న చేను వ ద్దకు ఉదయం 7 గంటలకు వెళ్లిపోయాడు. కంకులు లోడ్ చేసుకుని మధ్యాహ్నం 12గంటల సమయంలో తిరిగి ఇంటికి ట్రాక్టర్ నడుపుకుంటూ వస్తుండగా.. తను కూర్చున్న సీటు కింది స్ప్రీంగ్ హఠాత్తుగా ఊడిపోయింది.. అదుపుతప్పిన ట్రాక్టర్ పక్కనే ఉ న్న కాలువలోకి దూసుకెళ్లి బోల్తాపడింది. ఈ ఘటనలో వెంకటేశ్ స్వల్ప గాయాలతో ప్రాణాలతో బ యటపడ్డాడు. కానీ, ఆయన భార్య వైష్ణవితోపాటు బేతి లక్ష్మి, పోచంపల్లి రాజమ్మ దుర్మరణం చెందా రు. మరో నలుగురు మహిళా కూలీలు తీవ్రంగా గాయపడ్డారు. వారిని కరీంనగర్లోని ఆస్పత్రికి తరలించారు. మృతదేహాలను స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి పోస్టుమార్టం కోసం తరలించారు. సమాచారం అందుకున్న మృతుల కుటుంబసభ్యులు, బంధువులు పెద్దఎత్తున ప్రభుత్వ ఆస్పత్రికి చేరుకున్నారు. తమ ఆప్తులను కోల్పోయి రోదించిన తీరు కన్నీరు తెప్పించింది. మృతులతోపాటు గాయాలపాలైన వారివి నిరుపేద కుటుంబాలే.. కౌలుకు తీసుకుని.. ఎవుసం చేసుకుంటూ.. మల్యాల వెంకటేశ్కు ఎకరం పొలం ఉంది. ఓ రైతు నుంచి మరికొంత కౌలుకు తీసుకున్నాడు. అందులో మొక్కజొన్న పండించాడు. పంట చేతికి వచ్చింది. దానిని కూలీలతో ఇంటికి తెచ్చేందుకు వెళ్లి వస్తుండగా ప్రమాదం జరిగింది. ఘటనలో భార్యను కోల్పోయిన వెంకటేశ్.. ప్రాణాలతో బయటపడ్డాడు. వెంకటేశ్– వైష్ణవి దంపతులకు కొడుకు అర్జున్ప్రసాద్(10), కూతురు సహస్ర(6) సంతానం ఉంది. తండ్రి ఆస్పత్రిలో ఉండగా, చనిపోయిన తల్లికి ఏమైందో తెలియక చిన్నారులు దిక్కులు చూస్తూ ఉండిపోయారు. ఆ చిన్నారులను చూసిన హృదయాలు తరుక్కుపోయాయి. సొంత ఊరు విడివి వచ్చి.. ఎలిగేడు మండలం చీమలపేటకు చెందిన బైతి లక్ష్మి– మహేందర్ దంపతులు. తమ పిల్లలతో కలిసి పదేళ్ల క్రితం పొట్టచేత పట్టుకుని చిన్నబొంకూరుకు వలస వచ్చారు. వ్యవసాయం చేసుకుంటూ కుటుంబాన్ని సాకుతున్నారు. లక్ష్మి వ్యవసాయ కూలీగా పనులకు వెళ్తోంది. ఈక్రమంలో మక్కకంకులు తెంపేందుకు వెళ్లి దుర్మరణం పాలైంది. వీరి కూతురికి పెళ్లి కాగా కొడుకు వేణు ఉన్నాడు. ఇంటి వద్ద ఖాళీగా ఉండలేక.. ప్రమాదంలో చనిపోయిన పోచంపల్లి రాజమ్మ భర్త గతంలోనే మృతి చెందాడు. వివాహమైన పెద్దకొడుకు శ్రీనివాస్, చిన్నకొడుకు నరేశ్ హమాలీ పనులు చేస్తున్నారు. అయితే, ఇంటి వద్ద ఖాళీగా ఉండలేక రాజమ్మ రోజూవారీ కూలీ పనులకు వెళ్తోంది. ఈక్రమంలోనే మక్కకంకులు తెంపేందుకు వెళ్లి ట్రాక్టర్ ప్రమాదంలో చనిపోయింది. అంత్యక్రియలకు ఏర్పాట్లు చిన్నబొంకూరు గ్రామానికి చెందిన ముగ్గురు మహిళా కూలీలు ట్రాక్టర్ ప్రమాదంలో మృతి చెందడంతో వారి అంత్యక్రియలు చేసేందుకు బంధువులు, కుటుంబసభ్యులు ఏర్పాట్లు చేస్తున్నారు. మృతుల కుటుంబాలు, గాయపడిన వారిని పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణారావు, మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్రెడ్డి పరామర్శించారు. తామున్నామంటూ వారికి ధైర్యం చెప్పారు. ట్రాక్టర్ రూపంలో వచ్చిన మృత్యువు కాలువలోకి దూసుకెళ్లి బోల్తా.. ముగ్గురు మహిళల దుర్మరణం మరో నలుగురికి గాయాలు.. ఆస్పత్రికి తరలింపు మొక్కజొన్న కంకులు సేకరించి ఇళ్లకు వస్తుండగా ఘటన -
నేడు జేపీ నడ్డా రాక
పెద్దపల్లిరూరల్: జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కాలేజీ మైదానంలో సోమవారం బీజేపీ బహిరంగ సభ నిర్వహించనుంది. ఈమేరకు అన్ని ఏర్పాట్లు సిద్ధం చేశారు. పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా పెద్దపల్లి అభ్యర్థి గోమాస శ్రీనివాస్కు మద్దతుగా ప్రచారం చేసేందుకు ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా హాజరవుతారు. సభా ఏర్పాట్లు తదితర కార్యక్రమాలను బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దుగ్యాల ప్రదీప్కుమార్, రాష్ట్ర నాయకులు చిలారపు పర్వతాలు, గొట్టిముక్కుల సురేశ్రెడ్డి, పోచయ్య తదితరులు ఆదివారం పర్యవేక్షించారు. ఓటు వేసిన పోలీసు అధికారులుజ్యోతినగర్(రామగుండం): పోలీసు అధికారులు పోస్టల్ బ్యాలెట్ ద్వారా తమ ఓటుహక్కు వినియోగించుకున్నారు. ఎన్టీపీసీ జెడ్పీ హైస్కూల్లో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో గోదావరిఖని ఏసీపీ రమేశ్, రామగుండం సీఐ అజయ్బాబు, ఎస్సైలు ఉదయ్కిరణ్, సతీశ్, వెంకటస్వామి ఆదివారం తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా ఏసీపీ రమేశ్ మాట్లాడారు. పార్లమెంట్ ఎన్నికల్లో విధులు నిర్వర్తించే పోలీసు సిబ్బంది అందరూ పోస్టల్ బ్యాలెట్ ద్వారా తమ ఓటుహక్కు వినియోగించుకోవాలన్నారు. బీఆర్ఎస్తోనే మెరుగైన పాలన జ్యోతినగర్(రామగుండం): బీఆర్ఎస్తోనే మెరుగైన ప్రజాపాలన సాధ్యమని, మోసపూరిత హామీలతో కాంగ్రెస్ ప్రజలను మోసం చేసిందని పెద్దపల్లి పార్లమెంట్ అభ్యర్థి, మాజీమంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. రామగుండం కార్పొరేషన్ రెండో డివిజన్ ఇందిరమ్మకాలనీ, న్యూపీకేరామయ్య కాలనీ, సిక్కువాడలో ఆదివారం ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కేంద్రప్రభుత్వం నుంచి నిధులు విడుదలయ్యేందుకు పార్లమెంట్లో బీఆర్ఎస్ ఎంపీలు ఉండాలని ఆయన అన్నారు. ఇందుకోసం కారు గుర్తుకు ఓటు వేసి తనను గెలిపించాలని ఆయన అభ్యర్థించారు. మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్, డిప్యూటీ మేయర్ అభిషేక్రావు, కార్పొరేటర్ ఎన్వీ రమణారెడ్డి, నాయకులు రాంమోహన్రావు, నారాయణదాసు మారుతి తదితరులు పాల్గొన్నారు. చాలీసా పారాయణం రామగుండం: పట్టణంలోని శ్రీభక్తాంజనేయస్వామి దేవాలయంలో ఆదివారం హనుమాన్ మాలాధారణ చేసిన స్వాములు చాలీసా పారాయం గావించారు. పట్టణానికి చెందిన కౌశిక వెంకటరమణ–విజయ దంపతులు దీక్షాపరులకు అన్నదానం చేశారు. రాబోయే హనుమాన్ పెద్ద జయంతి వరకు మాలాధారణ స్వాములకు రోజుకొకరు దాతలు అన్నదానం చేస్తుండడంపై హర్షం వ్యక్తమవుతోంది. ప్యాక్స్ ఉద్యోగుల జిల్లా కార్యవర్గం సుల్తానాబాద్రూరల్: ప్రాథమిక సహకార సంఘాల ఉద్యోగుల యూనియన్ జిల్లా అధ్యక్షుడిగా కెశెట్టి విక్రమ్(ఎలిగేడ్)ను ఆదివారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ప్రధాన కార్యదర్శిగా దాసరి ప్రసాద్, ఉపాధ్యక్షుడిగా సురేశ్, గౌరవ అధ్యక్షుడిగా గొళి అంజిరెడ్డి, క్యాషియర్గా శ్రీనివాస్, ముఖ్య సలహాదారుగా మదన్మోహన్, రాష్ట్ర ప్రత్యేక ఆహ్వానితుడిగా వల్లకొండ రమేశ్, ప్రచార కార్యదర్శిగా ప్రభంజన్, డైరెక్టర్లుగా ఏపీ రాజు, కల్వల కిరణ్, రమణ, అశోక్, శంకర్ ఎన్నికయ్యారు. అనంతరం రాష్ట్ర యూనియన్ అధ్యక్షుడు బొంగొని శంకర్గౌడ్ నూతన కమిటీని సన్మానించి అభినందించారు. -
బీఆర్ఎస్, బీజేపీకి బుద్ధి చెప్పాలి
గోదావరిఖని: పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్కు ఓటువేసి బీఆర్ఎస్, బీజేపీకి బుద్ధి చెప్పాలని రామగుండం ఎమ్మెల్యే ఎంఎస్ రాజ్ఠాకూర్, ఎంపీ అభ్యర్థి వంశీకృష్ణ కోరారు. ఆదివారం రాత్రి స్థానిక రమేశ్నగర్ సెంటర్లో ఏర్పాటు చేసిన కార్నర్ మీటింగ్లో వారు మాట్లాడారు. తాలు పేరిట సాగుతున్న దోపిడీకి అడ్డుకట్టవేసింది కాంగ్రెస్ ప్రభుత్వమే అని వారు అన్నారు. నాయకులు ఉన్నారు. ‘కూటమి’ అభ్యర్థిని గెలిపించండి ఇండియా కూటమి అభ్యర్థి గడ్డం వంశీకృష్ణను ఎంపీగా గెలిపించాలని చెన్నూరు ఎమ్మెల్యే వివేక్, ఏఐటీయూసీ అధ్యక్షుడు వాసిరెడ్డి సీతారామయ్య కోరారు. స్థానిక భాస్కర్రావు భవన్లో జరిగిన జనరల్ బాడీ సమావేశంలో వారు మాట్లాడారు. మతాల మధ్య చిచ్చు పెడుతున్న బీజేపీని ఓడించాలని వారు కోరారు. కార్యక్రమంలో నాయకులు కవ్వంపల్లి స్వామి, ఆరెల్లి పోశం, మడ్డి ఎల్లాగౌడ్, వైవీరావు, ఎల్.ప్రకాశ్, కందుకూరి రాజారత్నం, జిగురు రవీందర్, ఎంఆర్సీ రెడ్డి, మాదన మహేశ్, సంకె అశోక్ తదితరులు పాల్గొన్నారు. ఉద్యోగ కల్పన కాంగ్రెస్తోనే సాధ్యం జ్యోతినగర్(రామగుండం): నిరుద్యోగలకు ఉద్యోగ కల్పన కాంగ్రెస్తోనే సాధ్యమని ఎమ్మెల్యే రాజ్ఠా కూర్ మక్కాన్ సింగ్ అన్నారు. ఎన్టీపీసీ మేడిపల్లి సెంటర్లో ఏర్పాటు చేసిన కార్నర్ మీటింగ్లో ఆయన మాట్లాడారు. ఎన్టీపీసీ కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు ఆసిఫ్ పాషా ఆధ్వర్యంలో జరిగి ఈ సమావేశంలో నాయకులు కొలిపాక సుజాత, బొంతల రాజేశ్, వెంగల పద్మలత, కత్తెరమల్ల రమేశ్ తదితరులు పాల్గొన్నారు. ఎమ్మెల్యే మక్కాన్సింగ్ రాజ్ఠాకూర్ -
ఓసీపీ..ఉక్కిరిబిక్కిరి
అవుట్ సమయాలు మార్చాలి డ్యూటీ ఇన్టైం కొనసాగిస్తూనే అవుట్ టైం తగ్గించాలి. మొదటి షిఫ్టు ఉదయం 7 నుంచి మధ్యాహ్నం 1గంట వరకు ఉంచాలి. రెండో షిఫ్టు సాయంత్రం 4 నుంచి రాత్రి 11గంటల వరకు కొనసాగించాలి. కొందరు ఆపరేటర్లు ఏసీలో పనిచేస్తున్నారని సాకు చూపుతూ మిగ తా వారందరినీ ఇబ్బంది పెట్టడం సరికాదు. – రియాజ్ అహ్మద్, అధ్యక్షుడు, హెచ్ఎంఎస్ అనుకూలంగా ఉండాలి ఓసీపీ కార్మికులకు అనుగుణంగా షిఫ్టు వేళలు మార్చాలి. గతంలో కొనసాగిన పద్ధతి అనుసరించాలి. గత వేసవి కన్నా ఈసారి మేలో ఎండలు మండిపోతున్నాయి. క్వారీల్లో పనిచేస్తున్న కార్మికులు తీవ్రఅస్వస్థతకు గురవుతున్నారు. ఒకరోజు డ్యూటీ చేస్తే రెండు రోజులు ఇంట్లో ఉండాల్సిన పరిస్థితి ఉంది. – సీఐటీయూ అధ్యక్షులు తుమ్మల రాజారెడ్డి సీఎండీతో మాట్లాడతాం గత వేసవిలో అనుసరించిన పద్ధతి ఇప్పుడూ కొనసాగించాలి. ఉదయం 7 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు మొదటి షిఫ్టు, సాయంత్రం 4 నుంచి రాత్రి 11గంటల వరకు రెండో షిఫ్టు గతంలో అమలు చేశారు. సోమవారం సీఎండీతో మాట్లాడతాం. పాత పద్ధతి కొనసాగించకపోతే యాజమాన్యంతో పోరాటం చేస్తాం. – వాసిరెడ్డి సీతారామయ్య, అధ్యక్షుడు, ఏఐటీయూసీ ● క్వారీల్లో మండుతున్న ఎండలు ● 50 డిగ్రీల సెల్సియస్పైనే నమోదవుతున్న ఉష్ణోగ్రతలు ● విధులు నిర్వర్తించేందుకు జంకుతున్న కార్మికులు ● షిఫ్ట్ సమయాలు మార్చాలని డిమాండ్ గోదావరిఖని: పైన మండుటెండ, క్వారీలో రగులుతున్న బొగ్గు వేడితో ఓసీపీల్లో పనిచేస్తున్న కార్మికులు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ఒకరోజు డ్యూటీకి వస్తే రెండు రోజులు విధులకు గైర్హాజరవుతున్నారు. ఎండల తీవ్రతను దృష్టిలో ఉంచుకుని సింగరేణి యాజమాన్యం గతంలో మే నెలలో షిఫ్టు సమయాలు మార్చేది. ఈసారి ఎండలు మండుతున్నా దృష్టి సారించడం లేదు. 46 డిగ్రీల సెల్సియస్కు పైగానే ఉష్ణోగ్రతల నమోదు.. ● గోదావరిఖని పరిసరాల్లో వారం రోజులుగా 46 డిగ్రీల సెల్సియస్కు పైగానే ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ● ఓసీపీల్లో 50 డిగ్రీల సెల్సియస్ వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశాలు ఉంటాయని కార్మికులు చెబుతున్నారు. ● బయటి ఎండలకు తోడు క్వారీలోని బొగ్గు వేడికి పనిస్థలాల్లో విధులు నిర్వర్తించలేక కార్మికులు నీరసించిపోతున్నారు. ● వర్క్షాప్ల్లో పనిచేసే కార్మికులు, క్వారీల్లోని కేబుల్బాయ్లు, ఓబీ బ్లాస్టింగ్ సిబ్బంది, ట్రిప్మెన్ తదితర విభాగాల్లో పనిచేసే కాంట్రాక్టు కార్మికులు ఎండవేడికి తల్లడిల్లి పోతున్నారు. ● సింగరేణి యాజమాన్యం భారీ యంత్రాల్లో పనిచేసే ఆపరేటర్లకు ఎలాంటి ఇబ్బంది ఉండదని చెబుతున్నా.. బ్లాస్టింగ్, సర్వే, ఓబీ కాంట్రాక్టు కార్మికుల పరిస్థితి ఏమిటని ప్రశ్నిస్తున్నారు. ● ఈక్రమంలో ఉదయం షిఫ్టు మధ్యాహ్నం 1గంట వరకు, రెండో షిఫ్టు సాయత్రం 4గంటల నుంచి 11గంటల వరకు కొనసాగించాలనే డిమాండ్ పెరుగుతోంది. ప్రత్యామ్నాయం చూడాలి.. ఓసీపీల్లో షిఫ్టు వేళలు మార్చాలనే డిమాండ్ పెరుగుతోంది. ప్రధానంగా ఉదయం షిఫ్టు 1గంట వరకు పూర్తి చేసి, రెండో షిఫ్టు సాయంత్రం 4గంటల తర్వా త ప్రారంభించాలని కార్మికులు కోరుతున్నారు. అయితే సింగరేణి యాజమాన్యం మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 4గంటల వరకు విరామం ప్రకటిస్తామని చెబుతోంది. మూడు షిఫ్టుల సమయాలు మార్చి కొనసాగిస్తామని అంటోంది. దీనిని కార్మిక సంఘాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. సవరించిన సమయాలివే ఎండలను దృష్టిలో ఉంచుకుని సింగరేణి యాజమాన్యం సోమవారం నుంచి షిఫ్టు సమయాలు మార్చుతోంది. ఉదయం 6గంట నుంచి మధ్యాహ్నం 2గంటల వరకు మొదటి షిఫ్టు, సాయంత్రం 4గంటల నుంచి రాత్రి 12 గంటల వరకు రెండో షిఫ్టు కొనసాగించాలని నిర్ణయించింది. ఈమేరకు సమయాలను కూడా ప్రకటించింది. దీనిపై కార్మికులు, కార్మిక సంఘాల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. -
‘నల్లసూరీడు’పై నజర్
● మూడు దశాబ్దాలుగా స్పష్టతలేని ఆదాయపు పన్ను మాఫీ ● మోక్షం లభించని కొత్తగనుల ఏర్పాటు, యువతకు ఉద్యోగాల కల్పన ● అనుబంధ పరిశ్రమల ఏర్పాటుపై రాజకీయ నేతల హామీలు గోదావరిఖని: పెద్దపల్లి పార్లమెంట్ పరిధిలో సింగరేణి కార్మికుల ఓట్లే కీలకం. దీంతో వారిని మచ్చిక చేసుకుని తమ పార్టీ అభ్యర్థిని ఎలాగైనా గెలిపించుకోవాలనే లక్ష్యంతో ప్రధాన రాజకీయ పార్టీలు పావులు కదుపుతున్నాయి. రెండు జిల్లాలు.. రెండు లక్షల ఓట్లు.. ● పెద్దపల్లి పార్లమెంట్ పరిధి విస్తరించిన మంచిర్యాల, పెద్దపల్లి జిల్లాల్లో సుమారు రెండు లక్షలకుపైగా ఓట్లు ఉన్నాయి. ● రామగుండం రీజియన్లో రామగుండం, మంథని అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండగా, ఆర్జీ–1,2,3, ఏపీఏ ఏరియాల్లో సుమారు 12వేలకు పైగా పర్మినెంట్, 8వేలకుపైగా కాంట్రాక్టు కార్మికులు పనిచేస్తున్నారు. ● బెల్లంపల్లి రీజియన్లోని మంచిర్యాల, చెన్నూ రు, బెల్లంపల్లి నియోజవర్గాల్లో బెల్లంపల్లి, మందమర్రి, శ్రీరాంపూర్ ఏరియాల్లో 16వేలకుపైగా పర్మినెంట్ కార్మికులు, మరో 7వేలకుపైగా కాంట్రాక్టు కార్మికులు పనిచేస్తున్నారు. ● వీరి కుటుంబాలతో సహా ఒక్కో ఇంటికి నలుగురు చొప్పున లెక్కించినా సుమారు రెండులక్షలకుపైగా ఓట్లు ఉంటాయని నాయకులు అంచనా వేస్తున్నారు. ● దీంతో వీరి ఓట్లపై కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ అభ్యర్థులు ప్రధానంగా దృష్టి సారించారు. ● ఉదయం బొగ్గుగనులపై గేట్ మీటింగ్లు నిర్వహిస్తూ, సాయంత్రం కార్మిక వాడల్లో పర్యటిస్తూ ఓటర్లను తమకు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. ● మరికొద్ది రోజుల్లో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ప్రధాన నేతల తాకిడి ఈప్రాంతాల్లో పెరుగుతోంది. ● ఈనెల 3న మాజీ సీఎం కేసీఆర్ పర్యటించారు. 6న బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా తదితరులు రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. నలుగుతున్న ఆదాయపు పన్ను మాఫీ.. సింగరేణి కార్మికులను సైనికులతో సమానంగా గుర్తిస్తామని అన్ని పార్టీలు ప్రకటిస్తున్నాయి. తాము గెలిచిన వెంటనే ఆదాయపు పన్ను మాఫీ చేస్తామని హామీ ఇస్తున్నాయి. అయితే, గెలిచాక పార్లమెంట్లో కొద్దిరోజులు పోరాటం చేయడం, ఆ తర్వాత హామీ అటకెక్కించడం సర్వసాధారణంగా మారింది. ఇలా దశాబ్దాలుగా ఈ అంశం నలుగుతోంది. నూతన భూగర్భగనులు.. తాము గెలిస్తే సింగరేణి సంస్థకు పూర్వవైభవం తీసుకురావడంతోపాటు కార్మికుల సంఖ్య పెంచేందుకు కొత్తగా భూగర్భ గనులు తవ్విస్తామని ప్రధాన రాజకీయ పార్టీలు హామీ ఇస్తున్నాయి. కార్మికులతో సమానంగా విధులు నిర్వహిస్తున్న కాంట్రాక్టు కార్మికులకు హైపవర్ కమిటీ వేతనాలు అమలు చేస్తామని అంటున్నాయి. స్కిల్ ట్రైనింగ్ సెంటర్లపై దృష్టి అందరికీ ఉద్యోగావకాశాలు కల్పించకపోయినా.. నిరుద్యోగులకు ప్రత్యేక నైపుణ్య శిక్షణ ఇచ్చి ఉద్యోగావకాశాలు కల్పించేలా చూస్తామని పలు పార్టీల నేతలు పేర్కొంటున్నారు. ఇప్పటికే మంచిర్యాల జిల్లాలో ఒక ట్రైనింగ్ సెంటర్ ఏర్పాటు చేయగా, రామగుండం నియోజవర్గంలోని గోదావరిఖనిలో మరో స్కిల్ ట్రైనింగ్ సెంటర్ ప్రారంభించేందుకు సింగరేణి సిద్ధమవుతోంది. జాడలేని మారుపేర్ల మార్పు.. సుమారు 20ఏళ్లుగా నలుగుతున్న మారుపేర్ల మార్పుపై గత పాలకులు హామీలు ఇచ్చినా సింగరేణి ఏ నిర్ణయమూ తీసుకోలేదు. దీంతో 400మందికి పైగా కార్మిక కుటుంబాల డిపెండెంట్ కేసులు కార్పొరేట్ కార్యాలయంలో నాలుగేళ్లుగా ముందుకు కదలడంలేదు. దీనిపై రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు కీలక నిర్ణయం తీసుకోవాల్సి ఉండగా, గత బీఆర్ఎస్ ప్రభుత్వం హామీ ఇచ్చింది. కనీసం ఈ ఎన్నికల్లో ప్రధాన ప్రచారాస్త్రాలుగా మారిన ఈ సమస్యలకు గెలిచిన పార్టీలు పరిష్కారం చూపాలని కార్మికులు, వారి కుటుంబాలు కోరుతున్నారు. -
బీఆర్ఎస్ శ్రేణుల్లో జోష్..
జగిత్యాల: జగిత్యాల జిల్లా కేంద్రంలోని పాతబస్టాండ్ వద్ద ఆదివారం రాత్రి నిర్వహించిన కేసీఆర్ బస్సుయాత్ర బీఆర్ఎస్ శ్రేణుల్లో ఉత్సాహం నింపింది. సాయంత్రం ఆరు గంటలకు కేసీఆర్ రోడ్షో నిర్వహించాల్సి ఉన్నా.. జగిత్యాలకు చేరుకునే సరికి రాత్రి 7.50 గంటలైంది. బస్సుయాత్రలో కేసీఆర్తోపాటు నిజామాబాద్ పార్లమెంట్ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్, పెద్దపల్లి పార్లమెంట్ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ వచ్చారు. కొత్తబస్టాండ్ వద్ద జగిత్యాల, కోరుట్ల ఎమ్మెల్యేలు సంజయ్కుమార్, కల్వకుంట్ల సంజయ్, ఎమ్మెల్సీ రమణ, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు విద్యాసాగర్రావు ఘనస్వాగతం పలికారు. కార్యకర్తలకు అభివాదం చేసుకుంటూ.. ఒగ్గు కళాకారుల నృత్యాలతో టపాసుల మధ్య యాత్ర కొనసాగింది. కొత్తబస్టాండ్ నుంచి మొదలై అంగడిబజార్, తహసీల్చౌరస్తా మీదుగా బస్సు యాత్ర నిర్వహించి అక్కడ ప్రసంగించారు. పెద్ద ఎత్తున ప్రజలు తరలిరావడంతో యాత్ర బీఆర్ఎస్ శ్రేణుల్లో ఉత్సాహం నింపింది. కేసీఆర్ 20 నిమిషాల పాటు ప్రసంగించారు. వడ్లకుప్పలు ఎక్కడికక్కడే.. దేశంలో ఎక్కడాలేని విధంగా రైతుబంధు అమలు చేశామని, రైతులు సమృద్ధిగా పంటలు పండించుకున్నారని కేసీఆర్ పేర్కొన్నారు. జగిత్యాలలో వడ్లకుప్పలు ఎక్కడికక్కడే ఉన్నాయన్నారు. ఆరెకరాలు, ఏడెకరాలున్న రైతులు ఏం పాపం చేశారని, వారికి రైతుబంధు ఎందుకు వేయలేదన్నారు. రూ.500 బోనస్ బోగస్ అయిందన్నారు. కల్యాణలక్ష్మి, తులం బంగారం కూడా లేదన్నారు. జగిత్యాలలో రెండురెండు తులాలు వచ్చిందంట కదా..? అనడంతో ప్రజలు బిగ్గరగా నవ్వారు. అందని తాగునీరు మిషన్ భగీరథ ద్వారా నీరు అందించామని, ఇప్పుడు ఎందుకు రావడం లేదని కేసీఆర్ ప్రశ్నించారు. కరెంట్ కోతలు పెడుతున్నది ఈ అసమర్థత ప్రభుత్వమన్నారు. పేదల ఇళ్లలో నల్లాలు పెట్టి గోదావరి నీరు ఇస్తే ఇప్పుడేం రోగం వచ్చిందని ప్రశ్నించారు. కొత్త స్కీంలు అమలు కావడం లేదని, పాతస్కీంలు బందయ్యాయని ఆరోపించారు. నిజామాబాద్ ఎంపీగా అర్వింద్ గెలిచి పసుపుబోర్డు తెచ్చారా..? షుగర్ ఫ్యాక్టరీ తెరిచారా..? అని ప్రశ్నించారు. యువత ఆలోచన చేసి ఓటేయాలని, తెలంగాణ భవిష్యత్ వారి చేతుల్లోనే ఉందని తెలిపారు. బీఆర్ఎస్ ఎంపీలు గెలిస్తేనే పార్లమెంట్లో కొట్లాడతారన్నారు. బీజేపీ ఎంపీలు గెలిస్తే మోదీ ముందు మాట్లాడలేరన్నారు. జిల్లా రచయితలకు నిలయమని, ఇక్కడ చరిత్రకారుడు రమణయ్య వంటి మేధావులు ఉన్నారని, వారు ఆలోచన చేయాలని పేర్కొన్నారు. జగిత్యాల, కోరుట్ల, మెట్పల్లిలోని బీడీ కార్మికులను ఆదుకున్నది బీఆర్ఎస్ అన్నారు. బీఆర్ఎస్ గెలుపులోనే తెలంగాణ విజయం ఉందన్నారు. కేసీఆర్ గుండె చీల్చితే తెలంగాణ ఉంటదని, బతికున్నంత వరకూ తెలంగాణ కోసమే పోరాటం చేస్తానని స్పష్టం చేశారు. జగిత్యాలలో కేసీఆర్ రోడ్షో విజయవంతం తరలివచ్చిన అభిమానులు, కార్యకర్తలు స్వాగతం పలికిన నాయకులుఆరుగ్యారంటీల అమలెక్కడ? కాంగ్రెస్ ఆరు గ్యారంటీల్లో ఒక్కటీ అమలు చేయలేదని కేసీఆర్ అన్నారు. మహిళలకు రూ.2500 వచ్చాయా..? అని మహిళలను ప్రశ్నించారు. నిర్మల్ సభలో రాహుల్ గాంధీ రూ.2,500 ఇస్తున్నామని జూటామాటలు చెబుతున్నారని ఎద్దేవా చేశారు. సీఎం ఏ ఊరికెళ్తే ఆ ఊరు దేవుడి మీద ఒట్టు పెట్టుకుంట ప్రజలను మోసం చేస్తున్నారని తెలిపారు.
Pagination
స్టార్ హీరోలతో యాక్టింగ్.. ఆ కమెడియన్ ఇలా అయిపోయాడేంటి!
భర్తతో విడిపోయిన హీరోయిన్.. కూతురితో కలిసి..
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- బర్త్ డే స్పెషల్.. విజయ్ దేవరకొండ ఎక్కడ తప్పు చేస్తున్నాడు?
- ఒక్క క్లిక్తో ‘ఏపీ పాలిసెట్’ ఫలితాలు
- సుప్రీత మైండ్ బ్లోయింగ్ గ్లామర్.. ఫారెన్ వీధుల్లో కేతిక!
- ఐసీఎంఆర్ విడుదల చేసిన ఆహార మార్గదర్శకాలు ఇవే..
- పిట్రోడా వ్యాఖ్యల దుమారం.. నిర్మలా సీతారామన్ ఆగ్రహం
- పవన్ మూవీ రిలీజ్ డేట్కి టెండర్ వేసిన 'దేవర'?
- టీ20 వరల్డ్కప్ 2024 కోసం భారత బి టీమ్.. కెప్టెన్గా కేఎల్ రాహుల్..!
- ‘నోరు మెదపరేం రాహుల్జీ?’..ప్రధాని మోదీ విమర్శలు
- ల్యాండ్ టైట్లింగ్ చట్టం నిజాలివిగో..
- బాబోస్తే ఆరోగ్యశ్రీ గో..వింద
Advertisement