● నాబార్డ్ రిటైర్డ్ సీజీఎం డి.రవీంద్ర
ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): నాబార్డ్ ద్వారా తక్కువ వడ్డీకి రుణాలు అందిస్తూ.. రైతుల సంక్షేమమే లక్ష్యంగా సహకార సంఘాలు పనిచేసేలా అభివృద్ధి బాటలో నడిపిస్తామని నాబార్డ్ రిటైర్డ్ సీజీఎం డి.రవీంద్ర పేర్కొన్నా రు. ఎల్లారెడ్డిపేటలోని గోదాంల నిర్మాణం, సర్వాయిపల్లిలో ఏర్పాటు చేసిన పెట్రోల్ పంపు, 500 మెట్రిక్ టన్నుల సామర్థ్యం గల గోదాం, సహకార సంఘం నూతన భవనం పనులను బుధవారం పరిశీలించారు. పీడీసీ సెల్ అఫీషియల్ సత్యనారాయణ, విష్ణు, సీఈవో కిశోర్కుమార్ పాల్గొన్నారు.