లారీల కోసం రైతుల ఆందోళన | Sakshi
Sakshi News home page

లారీల కోసం రైతుల ఆందోళన

Published Thu, May 9 2024 12:15 AM

లారీల కోసం రైతుల ఆందోళన

కోనరావుపేట(వేములవాడ): కొనుగోలు కేంద్రాల్లో లారీలు రావడం లేదని రైతులు ఆందోళనకు దిగారు. వారు మాట్లాడుతూ అధికారులు అధిక తూకం వేయొద్దని ఆదేశాలు జారీ చేసినా వెంకట్రావుపేటలో బస్తాకు 42.500 కిలోలు తూకం వేస్తున్నారన్నారు. అధిక తూకం వేసిన తర్వాత మిల్లర్లు తరుగు పేరిట ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తూకం వేసిన ధాన్యాన్ని తరలించడానికి లారీలు కూడా రావడంలేదన్నారు. కామిండ్ల ధర్మయ్య, చెరుకుపెల్లి లచ్చిరెడ్డి, దర్శనాల లక్ష్మణ్‌, కుమ్మరి పోచయ్య తదితరులు కోరుతున్నారు.

Advertisement
 
Advertisement
 
Advertisement