ప్రియుడి వేధింపులు తట్టుకోలేక యువతి ఆత్మహత్య | Woman Committed Suicide In hyderabad | Sakshi
Sakshi News home page

ప్రియుడి వేధింపులు తట్టుకోలేక యువతి ఆత్మహత్య

May 30 2024 6:34 AM | Updated on May 30 2024 12:07 PM

Woman Committed Suicide In hyderabad

జీడిమెట్ల: అమ్మా.. నాన్న.. మీరు చెప్పిన మాటలు నేను వినలేదు.. ప్రేమిస్తున్నాను అని వెంటపడిన అబ్బాయి ప్రేమను అంగీకరించారు.. అతను పెట్టే మానసిక ఒత్తిడి తట్టుకోలేక చనిపోతున్నాను. ఐ లవ్‌ యూ అమ్మా నాన్న అంటూ ఓ యువతి సూసైడ్‌ నోట్‌ రాసి ఆత్మహత్య చేసుకుంది. ఈ  సంఘటన జీడిమెట్ల పీఎస్‌ పరిధిలో చోటు చేసుకుంది. 

పోలీసుల, మృతురాలి తల్లిదండ్రులు తెలిపిన మేరకు.. షాపూర్‌నగర్‌ ఎన్‌ఎల్‌బీ నగర్‌కు చెందిన బాలబోయిన కుమార్‌ కుమార్తె అఖిల(22)ను అదే ప్రాంతానికే చెందిన ఓరుగంటి వెంకటేశ్‌ కుమారుడు అఖిల్‌ సాయిగౌడ్‌ గత 8సంవత్సరాల నుండి ప్రేమిస్తున్నాను అంటూ వెంటపడుతున్నాడు. తనను ప్రేమించకపోతే చనిపోతానంటూ వేధించేవాడు. దీంతో అఖిల కూడా సాయిగౌడ్‌ ప్రేమను అంగీకరించి విషయాన్ని ఇంట్లో తల్లిదండ్రులకు తెలిపింది. ఈ విషయం ఇరుకుటుంబాలు కూర్చుని మాట్లాడుకుని వీరి ప్రేమను అంగీకరించాయి.  



వేధించి రోడ్లపైనే కొట్టేవాడు.. 
కాగా అఖిలను సాయిగౌడ్‌ మానసికంగా వేధించేవాడు. కోపంతో రోడ్లపైనే కొట్టేవాడు. అయినప్పటికీ అఖిల భరిస్తూ వచ్చింది విషయాన్ని పలుమార్లు తల్లిదండ్రులకు కూడా  చెప్పింది. అతని వేధింపులు భరించలేక అఖిల తనలో తానే కుమిలిపోయేది ఇటీవల కొంతకాలం నుండి సాయిగౌడ్‌ పెళ్లి విషయంలో ముఖం చాటేశాడు. దీంతో మరింత కుంగిపోయిన అఖిల మంగళవారం రాత్రి 10 పేజీల సూసైడ్‌ నోట్‌ రాసి ఇంట్లో ఉరి వేసుకుని మృతిచెందింది.  దీంతో జీడిమెట్ల పోలీసులు అఖిల్‌ సాయిగౌడ్‌పై కేసు నమోదు చేశారు.  

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement