-
వరంగల్.. ట్రయాంగిల్
సాక్షిప్రతినిధి, వరంగల్: తొలి నుంచి తెలంగాణ ఉద్యమానికి ఊపిరులూదిన గడ్డ. విప్లవ రాజకీయాలు, సామాజిక ఉద్యమాలకు నెలవు. మలిదశ తెలంగాణ ఉద్యమంలోనూ కేంద్రంగా ఉన్న ప్రాంతం. రాజకీయ చైతన్యానికి మారుపేరైన వరంగల్ సెగ్మెంట్ను బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఒకప్పుడు కాంగ్రెస్..ఆ తర్వాత టీడీపీకి కంచుకోటగా ఉన్న వరంగల్ (హనుమకొండ) పార్లమెంట్ నియోజకవర్గంపై టీఆర్ఎస్ పట్టు బిగించింది. 2009 పునర్విభజనలో వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గంగా ఏర్పడింది. 1952 నుంచి 2019 వరకు మూడు ఉపఎన్నికలు కలుపుకొని మొత్తం 20 పర్యాయాలు ఎన్నికలు జరిగాయి. ఏడుసార్లు కాంగ్రెస్, రెండుసార్లు కాంగ్రెస్(ఐ) అభ్యర్థులు విజయం సాధించగా, టీడీపీ ఐదు, టీఆర్ఎస్ నాలుగు, టీపీఎస్, పీడీఎఫ్ పార్టీలు ఒక్కోసారి గెలుపొందాయి. జనరల్ స్థానంగా ఉన్నప్పుడు సైతం మూడుసార్లు ఇక్కడ ఎస్టీ అభ్యర్థులు విజయం సాధించారు. కడియం కావ్య (కాంగ్రెస్)నాన్న తోడు.. పార్టీ బలమే గెలిపిస్తుందన్న ధీమా లోక్సభ ఎన్నికల ద్వారా రాజకీయ అరంగేట్రం చేసిన కడియం కావ్య.. తండ్రి కడియం శ్రీహరి, కాంగ్రెస్ పార్టీకున్న బలాన్ని నమ్ముకున్నారు. 2023 నవంబర్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్కు ఘన విజయం ఇచ్చారు. ఈ పార్లమెంట్ పరిధిలోని వచ్చే ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లలో ఆరింటిని కాంగ్రెస్ కైవసం చేసుకుంది. స్టేషన్ఘన్పూర్ నుంచి గెలుపొందిన కడియం శ్రీహరి కూడా కాంగ్రెస్లో చేరడం, ఆయన కూతురు కావ్యనే అభ్యర్థి కావడం అనుకూలంగా మారింది. డాక్టర్గా, స్వచ్ఛంద సంస్థల ఏర్పాటు ద్వారా చేసిన ప్రజాసేవకుతోడు కాంగ్రెస్ పార్టీ బలం, యువ నాయకురాలిగా ప్రజలు ఆదరిస్తారనే ధీమాలో కడియం కావ్య ఉన్నారు. అయితే కడియం కావ్య స్థానికేతరురాలని, ఆంధ్రా ప్రాంతానికి చెందిన ముస్లిం వ్యక్తిని వివాహం చేసుకుందన్న ప్రత్యర్థుల ఆరోపణలు ఇబ్బందికరంగా మారాయి. ఎన్నికల షెడ్యూల్ సమయాన బీఆర్ఎస్లో ఉన్న కావ్య.. ఆ తర్వాత తండ్రితో కలిసి కాంగ్రెస్ పార్టీలో చేరి అభ్యర్థి అయ్యారు. పార్టీ ఫిరాయింపులతో పాటు వీటన్నింటిపై ప్రతిపక్షాలు విమర్శనా్రస్తాలు సంధిస్తున్నాయి.అరూరి రమేశ్ (బీజేపీ)మోదీ చరిష్మా.. పాలకుల వైఫల్యాలే కలిసి వస్తాయంటూ.. 2014, 2018 ఎన్నికల్లో వర్ధన్నపేట నియోజకవర్గం నుంచి భారీ మెజారిటీ సాధించిన అరూరి రమేష్.. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో అదే సెగ్మెంట్ నుంచి బీఆర్ఎస్ తరఫున పోటీచేసి ఓడిపోయారు. తర్వాత బీజేపీలో చేరిన ఆయనకు ప్రధాని నరేంద్రమోదీ వరంగల్ ఎంపీ అభ్యర్థిగా అవకాశం కల్పించారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయారన్న సానుభూతికితోడు జాతీయస్థాయిలో మోదీ అనుకూల పవనాలు తనకు కలిసివస్తాయని భావిస్తున్నారు. గతంలో వరంగల్(హనుమకొండ)లో ఒకసారి బీజేపీ అభ్యర్థి ఎంపీగా గెలిచారు. కేంద్రంలో మరోసారి బీజేపీ అధికారంలోకి రాబోతుందన్న ప్రచారం కూడా అనుకూలమే. మామునూరు ఎయిర్పోర్టు, టెక్స్టైల్ పార్కు, రైల్వేకోచ్ ఫ్యాక్టరీ, మెట్రోరైలు సహా అనేక పథకాలకు మోక్షం కలుగుతుందని చెబుతున్నారు. బీజేపీ శ్రేణులు అరూరి రమేష్ గెలుపులో ఏమేరకు పాలు పంచుకుంటారన్న చర్చ ఓ వైపు జరుగుతుండగా.. ప్రధాని మోదీ వరంగల్ పర్యటన విజయవంతం, కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వస్తుందన్న ప్రచారంతో పాటు ప్రజలతో తనకున్న సంబంధాలతో గెలుస్తానని చెబుతున్నారు.సుదీర్కుమార్ (బీఆర్ఎస్)కేసీఆర్ చేసిన అభివృద్ధే గెలిపిస్తుందన్న ఆశ తెలంగాణరాష్ట్ర సమితి ఏర్పాటు నుంచి ఆ పార్టీలో పనిచేస్తున్న డాక్టర్ మారెపెల్లి సు«దీర్కుమార్ మొదటిసారి లోక్సభ ఎన్నికల బరిలోకి దిగుతున్నారు. క్రమశిక్షణ కలిగిన కార్యకర్తగా పార్టీ ఆవిర్భావం నుంచి ఎంపీటీసీగా, ఎంపీపీగా, జెడ్పీ వైస్ చైర్మన్, హనుమకొండ జెడ్పీ చైర్మన్ వరకు అనేక పదవులు చేపట్టారు. అయితే అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత ఓరుగల్లుకు చెందిన పలువురు బీఆర్ఎస్ ముఖ్యనేతలు పార్టీ మారారు. ఎంపీ పసునూరి దయాకర్ కాంగ్రెస్లో చేరగా, వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యే అరూరి రమేష్ బీజేపీలో చేరి ఎంపీ అభ్యర్థి కాగా, మేయర్ గుండు సు«ధారాణి, డీసీసీబీ చైర్మన్ మార్నేని రవిందర్రావు తదితరులు సైతం బీఆర్ఎస్ను వీడారు. మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు, మాజీ విప్ దాస్యం వినయ్భాస్కర్, జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు చల్లా ధర్మారెడ్డి, డా.టి.రాజయ్యలతో పాటు పలువురు పనిచేస్తున్నారు. రాష్ట్ర ఏర్పాటు, తొలి సీఎంగా కేసీఆర్ ఈ రాష్ట్రానికి చేసిన మేలును చూసి ప్రజలు గెలిపిస్తారన్న ధీమాలో బీఆర్ఎస్ అభ్యర్థి సుధీర్కుమార్ ఉన్నారు. ముగ్గురిదీ బీఆర్ఎస్ బ్యాక్గ్రౌండే.. అందరూ మొదటిసారే వరంగల్ నుంచి పోటీ చేసేందుకు అన్ని పార్టీలకన్నా ముందు బీఆర్ఎస్ తమ అభ్యర్థిగా కడియం శ్రీహరి కూతురు కావ్యను ప్రకటించింది. తర్వాత ఆమె హస్తం గూటికి చేరడంతో జరిగిన పరిణామాలతో బీఆర్ఎస్కు అభ్యరి ఎంపిక కత్తిమీద సాములా మారింది. వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యే అరూరి రమేశ్ తొలుత తాను బీఆర్ఎస్ నుంచి పోటీ చేసేందుకు ఆసక్తి చూపి.. ఆ తర్వాత బీజేపీలో చేరి బరిలో నిలిచారు. కాంగ్రెస్లో చేరిన కావ్యకు పోటీచేసే అవకాశం దక్కడంతో ఇక బీఆర్ఎస్ నుంచి హనుమకొండ జెడ్పీ చైర్మన్ డాక్టర్ ఎం.సు«దీర్కుమార్ను పోటీలోకి దింపారు. కాగా డాక్టర్ మారేపల్లి సు«దీర్కుమార్ ఆయుర్వేద వైద్యుడు కాగా, కడియం కావ్య సైతం వైద్యురాలే. బీఆర్ఎస్ బ్యాక్గ్రౌండ్ ఉన్న ఈ ముగ్గురు కూడా ఎంపీ ఎన్నికల బరిలో నిలవడం మొదటిసారి. ప్రభావితం చూపే అంశాలు » ఎంపీ సెగ్మెంట్లో మహిళా ఓటర్ల సంఖ్య ఎక్కువ. వారి మొగ్గు ఎటువైపు ఉంటుందో.. » దళితుల ఓట్లూ కీలకమే» నగర ఓటర్లు, విద్యావంతులూ ఎక్కువే» బలమైన తెలంగాణవాదం2019 లోక్సభ ఎన్నికల్లో ప్రధాన పార్టీల అభ్యర్థులకు వచ్చిన ఓట్లు ఇలా..» పసునూరి దయాకర్ (టీఆర్ఎస్) 6,12,498 » దొమ్మాటి సాంబయ్య (కాంగ్రెస్) 2,62,200 » చింతా సాంబమూర్తి (బీజేపీ) 83,777 -
‘ఆర్ఆర్’ ట్యాక్స్ వెయ్యికోట్లు!: ప్రధాని మోదీ
సాక్షి, వరంగల్/ సాక్షి ప్రతినిధి, కరీంనగర్/ వేములవాడ: ‘‘కాంగ్రెస్ రాష్ట్రంలో అధికారంలోకి రాగానే అభివృద్ధి పూర్తిగా ఆగి, ప్రభుత్వ ఖజానా ఖాళీగా మారింది, కాంగ్రెస్ వాళ్లు.. ఆర్ఆర్ ట్యాక్స్ పేరిట ప్రజలను దోపిడీ చేస్తున్నారు. అందులో సగం హైదరాబాద్లోని ‘ఆర్’కు వెళ్తే.. రెండో సగం మరో ‘ఆర్’ కోసం ఢిల్లీకి వెళ్తుంది. ఈ ఆర్ఆర్ ట్యాక్స్.. ట్రిపుల్ ఆర్ సినిమా రూ.వెయ్యికోట్ల వసూళ్లను అనతికాలంలోనే దాటడం ఇక్కడి అవినీతికి నిదర్శనం..’’ అని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆరోపించారు. కాంగ్రెస్ ఎంత అబద్ధాల కోరు అన్నది తెలంగాణ ప్రజలకు తెలిసినంతగా మరెవరికీ తెలియదన్నారు. రైతుల రుణమాఫీపై కాంగ్రెస్ చేతులెత్తేయబోతోందని.. లోక్సభ ఎన్నికల వరకు ఆగి మోసగిస్తుందని వ్యాఖ్యానించారు. బుధవారం వేములవాడ, వరంగల్లలో నిర్వహించిన బీజేపీ బహిరంగ సభల్లో ప్రధాని మోదీ ప్రసంగించారు. వివరాలు ఆయన మాటల్లోనే.. ‘‘తెలంగాణ అమరుల కుటుంబాలకు పెన్షన్ ఇస్తామని, 250 గజాల భూమి ఇస్తామని కాంగ్రెస్ చెప్పింది. ఇవ్వలేదు. మహిళలకు నెలకు రూ.2,500 ఇస్తామని చెప్పి, మోసం చేసింది. తెలంగాణలో విద్యుత్ కోతలు పెరిగాయి. ప్రజలకు గంట గడవడం కష్టమవుతోంది. అలాంటి నమ్మక ద్రోహి కాంగ్రెస్ ప్రజలకు ఎలా మేలు చేస్తుంది? ఒక్కసారి ఆలోచించాలి. స్వాతంత్య్రం వచ్చిన తొలినాళ్లలో ప్రజలు కాంగ్రెస్ను అధికారమిస్తే.. కుటుంబానికే పెద్దపీట వేసి, జాతి ప్రయోజనాలకు గంగలో ముంచింది. మాజీ ప్రధాని పీవీ నరసింహారావును అవమానించింది. అదే పీవీని బీజేపీ సర్కారు భారతరత్నతో గౌరవించింది. బీసీలకు కోత వేసి ముస్లింలకు ఇస్తుంది కాంగ్రెస్ దృష్టిలో రాజ్యాంగానికి విలువ లేదు. మతం ఆధారంగా రిజర్వేషన్లు ఇవ్వకూడదని అంబేడ్కర్ స్పష్టంగా చెప్పారు. కానీ కాంగ్రెస్ కర్ణాటకలో బీసీల రిజర్వేషన్లు కత్తిరించి ముస్లింలకు ఇచ్చింది. ఉమ్మడి ఏపీలో అదే ప్రయత్నం జరిగినా హైకోర్టు నిలిపివేసింది. దీన్ని కాంగ్రెస్ సహించలేకపోతోంది. అందుకే చట్టం చేసి అయినా.. ఎస్సీ, ఎస్టీలు, ఓబీసీల రిజర్వేషన్లు తొలగించి ముస్లింలకు ఇవ్వాలనుకుంటోంది. బీఆర్ఎస్ కూడా బుజ్జగింపు రాజకీయాలు చేస్తోంది. కేవలం ముస్లింల కోసం ఐటీ పార్కులను ఏర్పాటు చేస్తామని గతంలో ప్రకటించింది. 2014లో అధికారంలోకి వస్తే దళితుడ్ని సీఎం చేస్తామని మోసం చేసింది. దళిత బంధు పేరిట మోసం చేసింది. కాళేశ్వరం కుంభకోణానికి పాల్పడింది. ఎస్సీ వర్గీకరణ చేస్తాం.. మాదిగ సోదరులకు రిజర్వేషన్లు ఇచ్చే విషయంలో కాంగ్రెస్ వెనుకడుగు వేస్తోంది. ఎస్సీ వర్గీకరణ కోసం నా చిన్న తమ్ముడు మంద కృష్ణ చాలాకాలం నుంచి పోరాడుతున్నారు. ఇప్పటివరకు న్యాయం జరగలేదు. నేను వారికి న్యాయం చేస్తానని వాగ్దానం చేశాను. అమలు చేసి చూపిస్తా. కాంగ్రెస్ సీట్లను భూతద్దంలో చూసుకోవాల్సిందే.. ప్రపంచమంతా అస్థిరత, అశాంతి, విపత్తులు నెలకొని ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో దేశ కార్యభారాన్ని, శక్తిని తప్పుడు చేతుల్లో పెట్టొద్దు. పదేళ్ల క్రితం వరకు కాంగ్రెస్ ప్రభుత్వం ఏరకమైన పాపాలు చేసిందో అందరికీ తెలుసు. నాలుగు రోజులకో కుంభకోణం, అవినీతి బయటపడుతుండేవి. దేశంలోని పెద్ద పట్టణాల్లో బాంబు పేలుళ్లు సంభవించేవి. ఇప్పుడు ఎన్టీయే విజయరథం వేగంగా ప్రయాణం చేస్తోంది. ఇప్పటివరకు జరిగిన మూడు దశల పోలింగ్లో ముందు నిలిచింది. కాంగ్రెస్ ఎక్కడెక్కడ సీట్లు గెలుస్తుందా అని భూతద్దం పెట్టి చూసే పరిస్థితి ఏర్పడింది. నాలుగో దశ పూర్తయ్యే సరికి భూతద్దంతోనూ దొరకవు. మైక్రోస్కోప్ కావాల్సి వస్తుంది. బీఆర్ఎస్, కాంగ్రెస్ తోడు దొంగలే! బీఆర్ఎస్, కాంగ్రెస్ రెండూ తోడుదొంగలే. పైకి తిట్టుకున్నా అవినీతి అనే వారధి వారిని తెరవెనుక కలుపుతోంది. అందుకే ఓటుకు నోటు కేసులో కాంగ్రెస్ నేతను, కాళేశ్వరం అవినీతిలో బీఆర్ఎస్ నేతలను రెండు పార్టీలు పరస్పరం కాపాడుకుంటున్నాయి. హైదరాబాద్లో ఎంఐఎం విషయంలో బీఆర్ఎస్–కాంగ్రెస్ మధ్య అవగాహన ఉంది. కానీ బీజేపీ రంగంలోకి దిగేసరికి వారిలో ఆందోళన మొదలైంది. కాంగ్రెస్–బీఆర్ఎస్లకు కుటుంబ రాజకీయాలే తొలి ప్రాధాన్యం. బీజేపీకి దేశమే తొలిప్రాధాన్యం. ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల అడ్రస్ గల్లంతే. తెలంగాణ ప్రజలంతా ఏకమై మే 13న ఆ పార్టీలకు బుద్ధి చెప్పాలి..’’ అని మోదీ పిలుపునిచ్చారు. ఓరుగల్లు సభలో ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ పాల్గొన్నారు. చర్మం రంగును బట్టి యోగ్యత ఉంటుందా..? మేం 2014లో తొలిసారి అధికారంలోకి రాగానే దళితుడైన రాంనాథ్ గోవింద్ను రాష్ట్రపతిని చేశాం. 2019లో ఆదివాసీ మహిళ ద్రౌపదీ ముర్మును రాష్ట్రపతిని చేశాం. కాంగ్రెస్ ఈ ఇద్దరిని వ్యతిరేకించింది. ముఖ్యంగా ద్రౌపదీ ముర్మును కాంగ్రెస్ ఎందుకు అంతగా వ్యతిరేకించిందా? అని ఎంతగా ఆలోచించినా ఇన్నాళ్లూ అర్థం కాలేదు. ఇప్పుడు అర్థమవుతోంది. ద్రౌపదీ ముర్ము గారి చర్మం రంగు నలుపు. ఇక్కడున్న రాజ కుమారుడి (రాహుల్ గాం«దీ)కి అమెరికాలో ఓ ఫ్రెండ్ ఫిలాసఫర్, మార్గదర్శి (శ్యామ్ పిట్రోడా) ఉన్నారు. చర్మం రంగు నల్లగా ఉన్నవాళ్లందరూ ఆఫ్రికన్లలా ఉంటారని ఆయన ఈ మధ్య అన్నారు. చర్మం రంగును బట్టి ద్రౌపదీ ముర్ము గారిని కూడా ఆఫ్రికన్ అని ఆయన భావించారు. అందుకే ఓడించాలని చెప్పి రాజకుమారుడికి బోధించారు. నలుపు చర్మం ఈ దేశంలో చాలా మందికి ఉంటుంది. శ్రీకృష్ణుడి రంగు కూడా నలుపే. మరి అలాంటిది చర్మం రంగును బట్టి యోగ్యతను నిర్ధారిస్తారా? ఇందుకే ఆ రాజ కుమారుడి మీద నాకు కోపం వస్తోంది. నన్ను తిడితే నాకు కోపం రాదు. కానీ నా దేశ ప్రజలను చర్మం రంగు పేరిట రాజ కుమారుడి మార్గదర్శకుడు లండన్లో కూర్చొని , అమెరికాలో కూర్చొని తిట్టడం నాకు కోపం తెప్పిస్తోంది. రాజన్నను దర్శించుకున్న ప్రధాని మోదీ బుధవారం ఉదయం 9.30 గంటల సమయంలో ప్రత్యేక హెలికాప్టర్లో ప్రధాని మోదీ వేములవాడకు చేరుకున్నారు. నేరుగా శ్రీరాజరాజేశ్వరస్వామి ఆలయానికి చేరుకుని ప్రత్యేక పూజలు చేశారు. కోడె మొక్కు చెల్లించుకున్నారు. తర్వాత ప్రత్యేక కాన్వాయ్లో ప్రజలకు అభివాదం చేస్తూ.. బాలానగర్లోని సభాస్థలికి చేరుకున్నారు. సభ ముగిశాక హెలికాప్టర్లో వరంగల్ పయనమయ్యారు. ‘ఒక్కొక్కరి పొలంలో పది మీటర్లు..’ కాంగ్రెస్పై మోదీ సెటైర్ లెక్క! ‘‘ఈసారి ఇండియా కూటమి ఐదు సంవత్సరాల్లో ఐదుగురు ప్రధానులను తీసుకొస్తామని చెప్తోంది. ఇదీ అందరికీ స్పష్టంగా అర్థం కావాలంటే మరో పద్ధతిలో చెబుతా. పది మంది రైతులు తమ పొలాల్లో బోరు వేయించాలనుకున్నారు. ఒక నిపుణుడిని పిలుచుకొచ్చారు. ఆ నిపుణుడు మొత్తం పరిశీలించి, 100 మీటర్లు తవ్వితే నీళ్లు పడతాయని చెప్పారు. అప్పుడు ఈ రైతులు.. ఒకరి పొలంలో పది మీటర్లు, పక్క పొలంలో పది మీటర్లు, ఆ పక్కవాడి పొలంలో పది మీటర్లు.. ఇలా పది మంది పొలాల్లో తవ్వితే 100 మీటర్లు అయిపోతుందనుకున్నారు. అలా చేస్తే నీళ్లు వస్తాయా? ఇండియా కూటమి అంతే. పార్టీకో ప్రధాని ఉంటే దేశం భవిష్యత్ ఏమవుతుంది?’’ రుణమాఫీపై చేతులెత్తేస్తారు! ‘‘కాంగ్రెస్ అతిపెద్ద నాయకురాలు (సోనియా) పుట్టినరోజు డిసెంబర్ 9న రైతుల రుణమాఫీ చేస్తామని ఆ పార్టీ నేతలు చెప్పారు. ఇప్పుడు ఆగస్టు 15 వరకు వాయిదా వేసి ఆ వాగ్దానాన్ని వెనక్కి తోశారు. లోక్సభ ఎన్నికలు అయ్యేదాకా ఆగి ఆ తర్వాత చేతులెత్తేయబోతున్నారు. ఇది మిమ్మల్ని మోసం చేయడమే.. మీ మనోభావాలను దెబ్బతీయడమే.. వాళ్లు ఒకవైపు వేములవాడ రాజన్న మీద ఒట్టు పెడుతున్నారు. మరోవైపు సనాతన ధర్మాన్ని తిడుతున్నారు. సనాతన ధర్మాన్ని తిడుతూ, ఒట్లు పెట్టేవారిని ఎవరు నమ్ముతారు..’’ – మోదీ -
వరంగల్ను BRS, కాంగ్రెస్ బారి నుంచి కాపాడాలి: ప్రధాని మోదీ
వరంగల్, సాక్షి: మూడో విడత పోలింగ్లో రెండు విషయాలు స్పష్టం అయ్యాయి. బీజేపీ వీజయం వైపు దూసుకెళ్తోంది. కాంగ్రెస్ తాము ఎక్కడ గెలుస్తామా? అని భూతద్దంతో చూస్తోంది. కానీ, నాలుగో విడతలో కాంగ్రెస్ గెలిచే సీట్లను చూడాలంటే భూతద్దం సరిపోదు.. మైక్రోస్కోప్ కావాల్సిందే అని దేశ ప్రధాని నరేంద్ర మోదీ ఎద్దేవా చేశారు. బుధవారం మధ్యాహ్నాం బీజేపీ నిర్వహించిన ఓరుగల్లు జన గర్జన సభలో ప్రధాని మోదీ పాల్గొని ప్రసంగించారు.ప్రపంచమంతా అస్థిరత, సంక్షోభ పరిస్థితులు కొనసాగుతున్నాయి. ఇలాంటి సమయంలో అబ్కీ బార్ మోదీ సర్కార్ అంటోంది. గతంలో కాంగ్రెస్ వచ్చిందంటే సమస్యలు వచ్చేవి. ఇండియా కూటమిలో ఒక్కో ఏడాది ఒక్కో ప్రధాని అనే ప్రచారం జరుగుతోంది. ఒక్కో ఏడాది ఒక్కో ప్రధాని ఉంటే దేశం బాగుపడుతుందా?... ఇండియా కూటమి ఎక్కడ అధికారంలో ఉంటే.. ఆ రాష్ట్రంలో సంపదను ఏటీఎంలాగా దోచుకుంటుంది. ఎస్సీ, ఎస్టీ, బీసీల రిజర్వేషన్లను తొలగించి ముస్లింలకు ఇవ్వాలని ఇండియా కూటమి చూస్తోంది. మతం ఆధారంగా రిజర్వేషన్లు ఇవ్వొద్దన్న రాజ్యాంగ సూత్రాన్ని కాంగ్రెస్ పట్టించుకోవడం లేదు. ద్రౌపది ముర్మును కాంగ్రెస్ ఎందుకు ఓడించాలనుకుందో అర్థం కావడం లేదు. బహుశా రంగుచూసి ఓడించాలని నిర్ణయించినట్లు ఉంది. యువరాజుకు అమెరికాలో ఒక ఫ్రెండ్, గైడ్ (శ్యామ్ పిట్రోడాను ఉద్దేశిస్తూ..) ఉన్నారు. నల్లగా ఉన్నవారంతా ఆఫ్రికన్లే అని ఆ యువరాజుకి ఆ అంకుల్ చెప్పారు. అయినా చర్మం రంగు ఆధారంగా మన దేశంలో యోగ్యత నిర్ణయిస్తారా?’’ అని ప్రధాని మోదీ కాంగ్రెస్పై ధ్వజమెత్తారు... కాంగ్రెస్ అబద్ధాలు ఎలా ఉంటాయో.. ప్రజలకు బాగా తెలుసు. తెలంగాణ కోసం బలిదానాలు చేసుకున్నవాళ్లకు పెన్షన్ ఇచ్చిందా?. మహిళలకు రూ.2,500 ఇస్తామన్న కాంగ్రెస్ హామీ నెరవేరిందా?. రుణ మాఫీ ఆగష్టు 15వ తేదీకి మార్చారు. అది మోసం చేయడం కాదా?. తెలంగాణలో పవర్కట్స్ పెరిగిపోయి ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. తెలంగాణలో ఆర్ఆర్ ట్యాక్స్ వసూలు అవుతోంది. ఆ ఆర్ఆర్ ట్యాక్స్లో ఒక వాటా ఇక్కడి హైదరాబాద్ ఆర్కు, మరో వాటా ఢిల్లీలోని ఆర్కు వెళ్తోంది.. కాంగ్రెస్తో పాటు బీఆర్ఎస్ కూడా తెలంగాణ ప్రజల్ని మోసం చేసింది.2014లో దళితులను సీఎం చేస్తానని బీఆర్ఎస్ మాట తప్పింది. ఎస్సీ, ఎస్టీ, బీసీలను బీఆర్ఎస్ కూడా మోసం చేసింది. దళిత బంధు పేరుతోనూ బీఆర్ఎస్ మోసం చేసింది. తమ హక్కుల కోసం పోరాడుతున్న మాదిగలకు రిజర్వేషన్లు నేను ఇప్పిస్తాను.తెలంగాణలో కొందరు వేములవాడ రాజన్నపై ఒట్టు పెడుతున్నారు.. మరోవైపు సనాతన ధర్మాన్ని తిడుతున్నారు. సనాతన ధర్మాన్ని తిడుతున్న వాళ్ల మాటలు ఎవరైనా నమ్ముతారా?. కాకతీయ సామ్రాజ్యపు ప్రతీక వరంగల్. అహ్మదాబాద్ నా కర్మభూమి.. ఆ నగర దేవత కూడా భద్రకాళినే. గతంలో బీజేపీకి రెండు సీట్లు ఉన్నప్పుడు అందులో ఒకరు వరంగల్ నుంచే ఉన్నారు. వరంగల్ను కాంగ్రెస్, బీఆర్ఎస్ బారి నుంచి కాపాడాలి. అందుకోసం వరంగల్, మహబూబాబాద్ బీజేపీ అభ్యర్థులకు ఓటేసి గెలిపించాలి అని ప్రధాని మోదీ ఉమ్మడి వరంగల్ ఓటర్లను కోరారు. -
ప్రతి సర్కిల్లో కంట్రోల్ రూం
● ఎన్పీడీసీఎల్ సీఎండీ కర్నాటి వరుణ్రెడ్డి హన్మకొండ: ఈదురు గాలులు, అకాల వర్షాలపై విద్యుత్ ఇంజనీర్లు, ఉద్యోగులు అప్రమత్తంగా ఉండాలి.. ప్రతి సర్కిల్లో నిరంతరాయంగా పని చేసేలా కంట్రోల్ రూం ఏర్పాటు చేయాలని టీఎస్ ఎన్పీడీసీఎల్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ కర్నాటి వరుణ్రెడ్డి అన్నారు. రాష్ట్రంలో కురుస్తున్న వర్షాల నేపథ్యంలో ఆయన మంగళవారం అధికారులు, ఉద్యోగులకు సూచనలు చేశారు. అధికారులు, ఉద్యోగులు, సిబ్బంది విధిగా హెడ్ క్వార్టర్స్లో ఉంటూ సేవలందించాలని ఒక ప్రకటనలో ఆదేశించారు. అత్యవసరమైతే వెంటనే పునరుద్ధరణ చర్యలు చేపట్టేందుకు అవసరమైన మెటీరియల్ సిద్ధంగా ఉంచుకోవాలన్నారు. గోదావరి తీర ప్రాంతాలై న ఉమ్మడి వరంగల్, కరీంనగర్, ఖమ్మం, ఆదిలాబాద్ పరిసర ప్రాంతల్లో జాగ్రత్తగా ఉండాలన్నారు. అంతరాయాలు లేకుండా విద్యుత్ సరఫరా అందించాలని, ప్రతి ఒక్కరు నిబద్ధతతో యుద్ధప్రాతిపదికన పని చేయాలన్నారు. ట్రాన్స్ఫార్మర్లు తరలించడానికి వాహనాలు సిద్ధంగా ఉంచుకోవాలని పేర్కొన్నారు. ఎస్పీఎం సెంటర్లలో ట్రాన్స్ఫార్మర్ల మరమ్మతులు పెంచుకుని రోలింగ్ స్టాక్ సిద్ధంగా ఉంచుకోవాలని ఆదేశించారు. ఎన్పీడీసీఎల్ ప్రధాన కార్యాలయంలోని కంట్రోల్ రూంకు సంబంధిత సమాచారాన్ని చేరవేయాలని. జిల్లాలో ని ఆయా శాఖల అధికారుల సమన్వయంతో ముందుకు పోవాలని ఈ సదర్భంగా సూచించారు. విద్యుత్ సంబంధ సమస్యలపై వినియోగదారులు టోల్ ఫ్రీ 1800 425 0028 లేదా 1912 నంబర్కు ఫోన్ చేయాలని కోరారు. -
‘మోసం చేసిన వారిపై చర్య తీసుకోవాలి’
నర్సంపేట రూరల్ : తనకు తెలియకుండా అబార్షన్ చేయించి, గర్భసంచిని తొలగించిన వ్యక్తి, ఆస్పత్రి యాజామాన్యంపై చర్య తీసుకోవాలని బాధితురాలు డిమాండ్ చేసింది. ఈ మేరకు పట్టణంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రి ఎదుట మంగళవారం కుటుంబ సభ్యులతో కలిసి ఆమె ధర్నా చేసి మాట్లాడింది. నర్సంపేటకు చెందిన తనకు 2012లో కాజీపేటకు చెందిన గిరిగాని హరిప్రసాద్తో వివాహం జరిగింది. ఇద్దర కుమార్తెలు జన్మించారు. అనంతరం గొడవల కారణంగా భర్త తనను వదిలేయడంతో నర్సంపేటలోని ఓ షాపులో పనిచేస్తూ జీవనం కొనసాగించాను. ఈక్రమంలో నర్సంపేటకు చెందిన దామెర భిక్షపతితో పరిచయం ఏర్పడింది. తనను ప్రేమిస్తున్నానని, పెళ్లి చేసుకుంటానని మాయమాటలు చెప్పి లొంగదీసుకున్నాడు. సుమారు రెండు సంవత్సరాలు భిక్షపతితో సహజీవనం చేశాను. జనవరి 14న గర్భవతి అని తెలియడంతో అబార్షన్ చేయించాలని ఒక మాత్ర ఇచ్చాడు. ఏం మాత్ర అని నిలదీయంతో బలం కోసం తెచ్చానని నమ్మ బలికాడు. దీంతో ఆ మాత్రను వేసుకోవడంతో తనకు తీవ్ర రక్తస్రావమైందని బాధితురాలు తెలిపింది. దీంతో తాను స్పృహ కోల్పోవడంతో వరంగల్లోని సీకేఎం ఆస్పత్రి తీసుకెళ్లగా పరిస్థితి చేజారిందని, వైద్యం అందించలేమని వెనక్కి పంపించారు. 17న నర్సంపేట పట్టణంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించారు. తాను స్పృహలో లేనప్పుడు అబార్షన్ చేయించి, గర్భసంచి సైతం తొలగించారు. ఆ విషయాన్ని దాచిపెట్టి పెళ్లి చేసుకుంటానని నమ్మించి వెళ్లిపోయాడని, ఇంతవరకు రాలేదన్నారు. ఇటీవల తాను, తన చెల్లెలు భిక్షపతిని నిలదీయగా.. చెల్లెలుపై మహబూబాద్లో దాడి చేశారన్నారు. అనుమానంతో వారం రోజుల క్రితం వేరే ఆస్పత్రికి వెళ్లి పరీక్షలు చేయించుకోగా గర్భసంచి తొలగించారని చెప్పడంతో మంగళవారం వచ్చి ఆస్పత్రి ఎదుట ధర్నా చేసినట్లు తెలిపారు. తనకు తెలియకుండా ఎలా తీస్తారని ఆస్పత్రి యాజమాన్యాన్ని నిలదీసినట్లు పేర్కొన్నారు. అనంతరం నర్సంపేటలో షీ టీంకు ఫిర్యాదు చేశానని, తనను మోసం చేసిన వారిపై కఠినచర్యలు తీసుకోని న్యాయం చేయాలని కోరినట్లు ఆమె తెలిపింది. ఆస్పత్రి ఎదుట ధర్నా చేస్తున్న బాధితురాలికి ఏబీఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి బొట్ల నరేశ్ సంఘీభావం తెలిపారు. -
ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరించాలి
● మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు వర్ధన్నపేట : కాంగ్రెస్ పార్టీ ప్రజలకు మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చిందని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. వర్ధన్నపేట పట్టణంలోని ఎంఎంఆర్ గార్డెన్స్లో మంగళవారం ఏర్పాటు చేసిన కార్యర్తల సమావేశంలో మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు, బీఆర్ఎస్ వరంగల్ పార్లమెంట్ అభ్యర్థి డాక్టర్ మారెపల్లి సుధీర్కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా దయాకర్రావు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరించాలని కోరారు. బీఆర్ఎస్ను మోసం చేసిన కడియం శ్రీహరి, అరూరి రమేశ్కు ప్రజలు ఈ ఎన్నికల్లో తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు. కాళేశ్వరం ప్రాజెక్టులో కుంగిన రెండు పిల్లర్లను మరమ్మతులు చేయాల్సింది పోయి నీటిని మొత్తం సముద్రంలోకి విడిచి పెట్టారని విమర్శించారు. బీఆర్ఎస్ వరంగల్ ఎంపీ అభ్యర్థి డాక్టర్ మారెపల్లి సుధీర్కుమార్ను భారీ మెజార్టీతో గెలిపించుకోవాలని కోరారు. మాజీ స్పీకర్ మధుసూదనాచారి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వంపై పూర్తిగా ప్రజల్లో నమ్మకం పోయిందని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీని అనవసరంగా గెలిపించామని ప్రజలు తలలు పట్టుకుంటున్నారని తెలిపారు. -
గాలివాన బీభత్సం
నర్సంపేట/వర్ధన్నపేట/ఖానాపురం : జిల్లాలో మంగళవారం సాయంత్రం గాలిదుమారంతో కురిసిన అకాల వర్షం బీభత్సం సృష్టించింది. వరంగల్ నగరంతోపాటు నర్సంపేట నియోజకవర్గం, సంగెం, గీసుకొండ, వర్ధన్నపేట, రాయపర్తి, పర్వతగిరి మండలాల్లో వాతావరణం చల్లబడింది. ఆరబెట్టిన ధాన్యం, మొక్కజొన్నలు తడిసిముద్దయ్యాయి. పలుప్రాంతాల్లో మామిడి కాయలు రాలిపోయాయి. కోత దశకు వచ్చిన వరి పంట నేలవాలింది. విద్యుత్ సరఫరా నిలిచిపోయి అంధకారం ఏర్పడింది. ఖానాపురం మండలం బుధరావుపేట గ్రామంలో కృష్ణారెడ్డి, గట్ల సతీశ్ ఇళ్ల రేకులు కొట్టుకుపోయాయి. వరంగల్–ఖమ్మం జాతీయ రహదారిపై కట్య్రాల శివారులో ఎండిపోయిన పెద్ద చెట్టు రోడ్డుపై పడిపోవడంతో ట్రాఫిక్కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. చెట్టుకొమ్మలు మీదపడి ట్రాక్టర్లో ప్రయాణిస్తున్న విద్యార్థి మృతిచెందాడు. విద్యార్థి మృతితో ఇల్లందలో విషాదఛాయలు.. చెట్టుకొమ్మలు మీదపడి ట్రాక్టర్లో ప్రయాణిస్తున్న విద్యార్థి మృతి చెందడంతో ఇల్లంద గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. వర్ధన్నపేట మండలంలోని ఇల్లంద గ్రామానికి చెందిన ఆబర్ల దయాకర్(22) వరంగల్లోని ఓ ప్రైవేట్ ఇంజనీరింగ్ కళాశాలలో బీటెక్ రెండో సంవత్సరం చదువుతూ తల్లిదండ్రులకు చేదోడు వాదోడుగా ఉంటున్నాడు. మంగళవారం రాత్రి తమ సొంత ట్రాక్టర్లో గడ్డి లోడుతో సంగెం మండల కేంద్రానికి వెళ్లి అన్లోడ్ చేసి తిరిగి ఇల్లంద గ్రామానికి వస్తున్నాడు. ఈ క్రమంలో రాత్రి కట్య్రాల శివారులోని వరంగల్–ఖమ్మం జాతీయ రహదారిపై వెళ్తుండగా ఈదురు గాలులతో చెట్టు కూలి పోయింది. ఆ చెట్టుకొమ్మలు ట్రాక్టర్లో ప్రయాణిస్తున్న దయాకర్పై పడి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే ఆయనను వర్ధన్నపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. ఒక్కగానొక్క కుమారుడు మృతిచెందడంతో దయాకర్ తల్లిదండ్రులు శ్రీనివాస్–రమ కన్నీరుమున్నీరయ్యారు. దయాకర్కు ఇద్దరు అక్కలు లావణ్య, సుకన్య ఉన్నారు. రోడ్డుపై చెట్టును తొలగించిన పోలీసులు వర్ధన్నపేట ఎస్సై ప్రవీణ్కుమార్ తన సిబ్బంది బుచ్చిరాజు, దామోదర్, నరేందర్తో కలిసి సంఘటనా స్థలానికి చేరుకున్నారు. జేసీబీ లేకపోవడంతో ట్రాఫిక్కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. దీంతో పోలీస్ సిబ్బందితో కలిసి చెట్టును తొలగించి వాహనాల రాకపోకలను పునరుద్ధరించారు. కట్య్రాలలో చెట్టు కొమ్మలు మీదపడి బీటెక్ విద్యార్థి మృతి తడిసిన ధాన్యం, మొక్కజొన్నలు.. రాలిన మామిడి కాయలు పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచి అంధకారం బుధరావుపేటలో ఎగిరిపోయిన రెండు ఇళ్ల రేకులు -
రైతులకు ఇబ్బందులు లేకుండా చూడాలి
సంగెం: ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఇబ్బందులు లేకుండా చూడాలని జిల్లా అదనపు కలెక్టర్ సంధ్యారాణి సూచించారు. గవిచర్ల, చింతలపల్లి గ్రామాల్లో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను మంగళవారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సరిపడా టార్పాలిన్ షీట్లు అందుబాటులో ఉంచుకోవాలన్నారు. వర్షం వచ్చే అవకాశం ఉన్నందున అప్రమత్తంగా ఉండాలని పేర్కొన్నారు. కాంటాలు అయిన ధాన్యాన్ని వెంటనే మిల్లులకు తరలించాలని ఆదేశించారు. మిల్లర్ల నుంచి ఏమైనా సమస్యలు ఎదురవుతున్నాయా అని అడిగి తెలుసుకున్నారు. తేమ శాతం 17 శాతం ఉండేలా ధాన్యాన్ని తీసుకు రావాలని కోరారు. కార్యక్రమంలో సివిల్ సప్లయీస్ డీఎం సంధ్యారాణి, ఏపీఎం కిషన్, సీసీలు రాజయ్య, ఏలియా, కమిటీ సభ్యులు అంబిక, రజియ, మంజుల, లక్ష్మి, కవిత తదితరులు పాల్గొన్నారు. అదనపు కలెక్టర్ సంధ్యారాణి -
వరంగల్
బుధవారం శ్రీ 8 శ్రీ మే శ్రీ 2024వరంగల్ అభివృద్ధి వరంగల్, హనుమకొండ కాంగ్రెస్ కార్నర్ మీటింగ్లో సీఎం రేవంత్ రెడ్డి ● కడియం శ్రీహరి నిజాయితీని చూసే డాక్టర్ కావ్యకు టికెట్ ఇచ్చాం ● వరంగల్ ఈస్ట్లో ఆమె మెజారిటీ బాధ్యత కొండా మురళిదే న్యూస్రీల్ -
గుడుంబా స్థావరాలపై ఎకై ్సజ్ దాడులు
నెక్కొండ: మండలంలోని చిన్నకొర్పోలు, చెరువు ముందరి తండా, కునుసోతు తండాల్లోని గుడుంబా స్థావరాలపై ఎకై ్సజ్ పోలీసులు మంగళవారం దాడులు చేసినట్లు ఎకై ్సజ్ అసిస్టెంట్ కమిషనర్ నాగేందర్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎకై ్సజ్ డైరెక్టర్ కమలహాసన్రెడ్డి ఆదేశాల మేరకు ఆయా గ్రామాల్లో ఎౖక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్, టాస్క్ ఫోర్స్ అధికారులు సంయుక్తంగా దాడులు చేశారని పేర్కొన్నారు. 45 లీటర్ల గుడుంబాను స్వాధీనం చేసుకున్నామని, అలాగే 2300 లీటర్ల బెల్లం పానకాన్ని ధ్వంసం చేశామన్నారు. నలుగురిపై కేసుమోదు చేశామని ఆయన పేర్కొన్నారు. దాడుల్లో ఏఈఎస్లు మురళీధర్, శ్రీనివాసరెడ్డి, సీఐలు నరేశ్రెడ్డి, రమేశ్, చందర్, నాగేశ్వర్రావు, ఎస్సై రాజన్న, చంద్రశేఖర్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. మొక్కజొన్న కంకులు, డ్రిప్ పైపులు దగ్ధంసంగెం : మొక్కజొన్న, డ్రిప్ పైపులు దగ్ధమైన సంఘటన మండలంలో చోటు చేసుకుంది. స్థానిక రైతుల కథనం ప్రకారం.. కాట్రపల్లి గ్రామంలో మంగళవారం మధ్యాహ్నం ఈదురు గాలులు వీచాయి. ఎస్ఎస్ 4 ట్రాన్స్ఫార్మర్ విద్యుత్ తీగలు ఒకదానికొకటి తగిలాయి. నిప్పు రవ్వలు పడి తీగల కింద ఉన్న పలువురు రైతుల మొక్కజొన్న కంకి, డ్రిప్ పైపులు దగ్ధమయ్యాయి. గమనించిన రైతులు అగ్నిమాపక శాఖ అధికారులకు సమాచారం అందించారు. అగ్నిమాపక సిబ్బంది వచ్చి మంటలు ఆర్పివేశారు. సుమారు 15 ఎకరాల్లో నష్టం వాటిల్లిందని రైతులు తెలిపారు. కౌలు రైతు మేకల దూడయ్యకు చెందిన 5 ఎకరాల్లో మొక్కజొక్క, చొల్లేటి లక్ష్మారెడ్డి, కొమురారెడ్డి, ప్రభాకర్రెడ్డి, చింతిరెడ్డి మాధవరెడ్డి, గాయపు కొమురారెడ్డి తదితరులకు చెందిన డ్రిప్ పైపులు కాలిపోయాయి. వెంకటాపురంలో.. దుగ్గొండి : ప్రమాదవశాత్తు మంటలు అంటుకుని మొక్కజొన్న కంకులు దగ్ధమైన సంఘటన వెంకటాపురం గ్రామంలో మంగళవారం సాయంత్రం జరిగింది. వేసవిలో పంట వర్థ్యాలను కొంత మంది రైతులు తగుల బెట్టారు. అయితే ఒక్కసారిగా గాలిదుమారం రావడంతో మంటలు వేగంగా వ్యాపించి మొక్కజొన్న చేలకు అంటుకున్నాయి. పొగాకు బాలకృష్ణ ఒక ఎకరం, ముత్యాల వెంకన్న 20 గుంటల భూమిలో కుప్పలుగా ఉన్న కంకులు అంటుకుని కాలి బూడిదయ్యాయి. ప్రభుత్వం ఆదుకోవాలని రైతులు కోరారు. మట్టి తరలిస్తున్న 8 మందిపై కేసు పర్వతగిరి: చెరువు నుంచి అక్రమంగా మట్టి తరలిస్తున్న 8 మందిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై వెంకన్న తెలిపారు. ఆయన కథనం ప్రకారం.. దౌలత్నగర్ చెరువు నుంచి ప్రభుత్వ అనుమతి లేకుండా మట్టి తరలిస్తున్నారని మంగళవారం సమాచారం అందింది. దీంతో సిబ్బందితో వెళ్లి హిటాచీ, మూడు ట్రాక్టర్లు, ఒక టిప్పర్ను స్వాధీనం చేసుకుని స్టేషన్కు తరలించినట్లు తెలిపారు. 8 మందిపై కేసు నమోదు చేసినట్లు ఆయన పేర్కొన్నారు. వివాహిత అదృశ్యం చెన్నారావుపేట : వివాహిత అదృశ్యమైన ఘటన మంగళవారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఎస్సై అరుణ్కుమార్ కథనం ప్రకారం.. కాల్నాయక్ తండా శివారులోని బాల్నాయక్ తండాకు చెందిన లావుడ్యా దస్రు కుమార్తె నందిని (19 సంవత్సరాలు) గత నెల 8న ఇంటి నుంచి వెళ్లిపోయింది. పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఆచూకీ కనుక్కొని కుటుంబ సభ్యులకు అప్పగించారు. కాగా, అదే నెల 22న మళ్లీ ఇంటిలో ఎవరు లేని సమయంలో బయటికి వెళ్లింది. ఇప్పటి వరకు ఆచూకీ తెలియలేదు. కాగా, 6 నెలల క్రితం ఓ వ్యక్తితో ఆమెకు వివాహం జరిగింది. నందిని తండ్రి దస్రు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. -
ప్రతి సర్కిల్లో కంట్రోల్ రూం
హన్మకొండ: ఈదురు గాలులు, అకాల వర్షాలపై విద్యుత్ ఇంజనీర్లు, ఉద్యోగులు అప్రమత్తంగా ఉండాలి.. ప్రతి సర్కిల్లో నిరంతరాయంగా పని చేసేలా కంట్రోల్ రూం ఏర్పాటు చేయాలని టీఎస్ ఎన్పీడీసీఎల్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ కర్నాటి వరుణ్రెడ్డి అన్నారు. రాష్ట్రంలో కురుస్తున్న వర్షాల నేపథ్యంలో ఆయన మంగళవారం అధికారులు, ఉద్యోగులకు సూచనలు చేశారు. అధికారులు, ఉద్యోగులు, సిబ్బంది విధిగా హెడ్ క్వార్టర్స్లో ఉంటూ సేవలందించాలని ఒక ప్రకటనలో ఆదేశించారు. అత్యవసరమైతే వెంటనే పునరుద్ధరణ చర్యలు చేపట్టేందుకు అవసరమైన మెటీరియల్ సిద్ధంగా ఉంచుకోవాలన్నారు. ఎన్పీడీసీఎల్ ప్రధాన కార్యాలయంలోని కంట్రోల్ రూంకు సంబంధిత సమాచారాన్ని చేరవేయాలని పేర్కొన్నారు. సమస్యలపై వినియోగదారులు టోల్ ఫ్రీనంబర్ 1800 425 0028 లేదా 1912కు ఫోన్ చేయాలని కోరారు. -
వేసవి దుక్కులతో మేలు
నెక్కొండ : వేసవి దుక్కులతో చీడపీడలు కలిగించే పురుగులు నాశనమై ఎంతో మేలు చేకూరనుందని జిల్లా వ్యవసాయ శాఖ అధికారి ఉషాదయాళ్ అన్నారు. వెంకటాపురం, అప్పల్రావుపేట, నెక్కొండ గ్రామాల్లోని రైతులకు మంగళవారం ఆమె పలు సూచనలు చేశారు. వేసవి పంటల అవశేషాలను (పత్తి, మొక్కజొన్న, వరి) తగుల బెట్టకుండా నేలలో కలిసే విధంగా దున్నితే సేంద్రియ కర్బన శాతం పెరుగుతుందన్నారు. నేలలోని పోషక విలువల సమాచారం కోసం మట్టి నమూనాలను పరీక్ష చేయించాలన్నారు. వరి పంట వేసే ముందుగా పచ్చిరొట్ట పైరును సాగు చేసుకోవాలని ఆమె చెప్పారు. ఉరుములు, మెరుపులతో కూడిన వర్ష సూచనలున్నందున రైతులు విద్యుత్ స్తంభాలు, తీగలు, చెరువులు, నీటి కుంటలకు దూరంగా ఉండాలని ఆమె సూచించారు. అనంతరం మండల కేంద్రంలోని ఎరువుల షాపులను ఆమె తనిఖీ చేశారు. రైతులకు నాణ్యమైన విత్తనాలు, ఎరువులు సరఫరా చేయాలన్నారు. కార్యక్రమంలో జాతీయ ఆహార భద్రతా మిషన్ కన్సల్టెంట్ పి.సారంగం, ఉమ్మడి జిల్లా వ్యవసాయ శాఖ కార్యాలయ టెక్నికల్ అధికారి సీహెచ్.కృష్ణారెడ్డి, ఏఈఓ వసంత, రైతులు తదితరులు పాల్గొన్నారు. జిల్లా వ్యవసాయ శాఖ అధికారి ఉషాదయాళ్ -
కాకతీయుల స్ఫూర్తితో ఢిల్లీ సుల్తాన్లపై పోరు
సాక్షి ప్రతినిధి, వరంగల్: నాటి ఓరుగల్లు కాకతీయుల పాలకుల స్ఫూర్తితో ఢిల్లీ సుల్తాన్లకు ఏమాత్రం తీసిపోని బీజేపీని లోక్సభ ఎన్నికల్లో తిప్పికొట్టి ఉద్యమస్ఫూర్తి చాటుదామని ముఖ్యమంత్రి, టీపీసీసీ చీఫ్ ఎ.రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. మే 13న జరిగే సార్వత్రిక ఎన్నికలు తెలంగాణ వర్సెస్ గుజరాత్ మధ్య జరిగే ఫైనల్ మ్యాచ్ లాంటిదని అభివరి్ణంచిన సీఎం బీజేపీని డకౌట్ చేసి గుజరాత్ను ఓడించాలని కోరారు.లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళవారం రాత్రి గ్రేటర్ వరంగల్లో ఎంపీ అభ్యర్థి కడియం కావ్య గెలుపుకోసం రేవంత్ వరంగల్ పశి్చమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి ఆధ్వర్యంలో రోడ్షో నిర్వహించారు. హన్మకొండ చౌరస్తా, వరంగల్లో నిర్వహించిన కార్నర్ మీటింగ్లలో ఆయన ప్రసంగించారు. దేశంలో బీజేపీ, రాష్ట్రంలో బీఆర్ఎస్ పదేళ్లు పాలించి విధ్వంసం చేశాయని ధ్వజమెత్తారు. ఆ రెండు పార్టీలు ఒక్కటేనని, అవగాహనతోనే ఈ సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేస్తున్నాయని విమర్శించారు. బీజేపీ, బీఆర్ఎస్ చీకటి ఒప్పందం ‘వరంగల్ సాక్షిగా బీజేపీ, బీఆర్ఎస్ చీకటి ఒప్పందం చేసుకొని బీఆర్ఎస్ నాయకుడిని బీజేపీలోకి పంపించాయి. పాపం ఓ అమాయకుడిని బీఆర్ఎస్ పక్షాన బరిలో నిలిపాయి. ఇందుకు ఉదహరణ.. బీఆర్ఎస్ నాయకులు బాహాటంగా నిష్పక్షపాతంగా ప్రచారంలో పాల్గొనడం లేదు. మీ కష్టాన్ని పణంగా పెట్టి మిమ్మల్ని వ్యాపార వస్తువుగా మార్చుకొని బీజేపీతో కేసీఆర్ ఒప్పందం చేసుకున్నారు ఇందుకు నగదు పంచుకొని నగదు నారాయణ రాజకీయం చేçస్తుండు’అని రేవంత్ రెడ్డి ఆరోపించారు. బండకేసి కొట్టినా కేసీఆర్ బుద్ధి మారలే.. మాజీ సీఎం కేసీఆర్ బుద్ధి ఇంకా మారలేదనీ..వంకర ఆలోచనలు మానలేదని రేవంత్ రెడ్డి ఎద్దేవా చేశారు. పదేళ్లు అధికారంలో ఉండి తెలంగాణను విధ్వంసం చేసినందుకు డిసెంబర్ ఎన్నికల్లో ప్రజలు బండకేసి కొట్టినా కేసీఆర్ తీరుమారలేదని విమర్శించారు. బస్సు యాత్రలో మంచి మాటలు మాట్లాడి .. చేసిన అన్యాయానికి క్షమాపణలు చెప్పి మారతాడనుకుంటే.. మళ్లీ దగాకోరు విధానాలతో తిరుగుతుండ్రని నిందించారు. ఇక తలకిందికి పెట్టి తపస్సు చేసినా మీరు గెలువరనీ, కేటీఆర్ కారును జుమరాత్ బజారుకు తరలించండ్రనీ సూచించారు. నేను అల్లాటప్పాగా రాలేదు... ‘సీఎం కుర్చీ నుంచి దిగిపోవడానికి నేను అల్లాటప్పాగా రాలేదు. నిరంకుశ ప్రభుత్వంపై పదేళ్లు పోరాడి సీఎం కురీ్చలో కూర్చున్నా. పదేళ్లుగా అధికారంలో ఉన్న మోదీ దిగిపోవాలని కేసీఆర్ ఎందుకు అనడం లేదు. కుమార్తె బెయిల్ కోసం ఎంపీ సీట్లను ఆయన మోదీకి తాకట్టుపెట్టారా’అని రేవంత్రెడ్డి ధ్వజమెత్తారు.వరంగల్ బిడ్డ కడియం కావ్యను లక్ష మెజారిటీతో గెలిపించే దిశగా బూత్ లెవల్లో మారుమూల గ్రామాల్లో ఇంటింటా తిరిగి పార్టీ గెలుపు కోసం పాటుపడాలని కాంగ్రెస్ శ్రేణులకు పిలుపునిచ్చారు. మంత్రులు కొండా సురేఖ, ధనసరి సీతక్క, ప్రభుత్వ సలహాదారు వేం నరెందర్రెడ్డి, వరంగల్ ఎంపీ అభ్యర్థి కడియం కావ్య, స్టేషన్ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు పాల్గొన్నారు. మోదీ నిన్ను ప్రశి్నస్తున్నా.. వరంగల్కు ఎలా వస్తావు.. ‘ఓట్ల కోసం వస్తున్న ప్రధాని నరేంద్రమోదీని ప్రశి్నస్తున్నా.. జవాబు చెప్పినంకనే వరంగల్లో అడుగు పట్టాలని కూడా డిమాండ్ చేస్తున్నా. కాంగ్రెస్ హయాంలో తెలంగాణ ప్రజల ఆకాంక్షను తీర్చేందుకు సోనియాగాంధీ నేతృత్వంలో అప్పటి పీఎం మన్మోహన్సింగ్ ఆధ్వర్యంలో లోక్సభ, రాజ్యసభల్లో విభజన చట్టం చేసి ప్రత్యేక రాష్ట్రం వచి్చంది. తెలంగాణ ప్రాంతానికి సముచిత న్యాయం చేసేందుకు ఖమ్మం జిల్లాలోని బయ్యారం ఉక్కు, వరంగల్ జిల్లాలోని కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ ఇచ్చేందుకు ఒప్పందం చేస్తే ఇక్కడి ప్రజల ప్రయోజనాలను విస్మరించిన నువ్వు వరంగల్కు ఎలా వస్తావ్’అని రేవంత్రెడ్డి ప్రశ్నించారు.వర్షం కారణంగా కరీంనగర్లో సీఎం సభ వాయిదాఅకాల వర్షం కారణంగా మంగళవారం సాయంత్రం కరీంనగర్లో జరగాల్సిన సీఎం ఎ.రేవంత్రెడ్డి బహిరంగ సభ వాయిదా పడింది. కరీంనగర్ కాంగ్రెస్ పార్టీ లోక్సభ అభ్యర్థి వెలిచాల రాజేందర్రావుకు మద్దతుగా స్థానిక ఎస్సారార్ కళాశాలలో ఏర్పాటు చేసిన జనజాతర సభ కోసం సీఎం రావాల్సి ఉంది. అయితే మంగళవారం మధ్యాహ్నం నుంచే ఒక్కసారిగా గాలిదుమారంతో టెంట్లు ఎగిరి, భారీవర్షానికి సభాస్థలిలో నీరు నిలిచిపోవడంతో సభను వాయిదా వేశారు. -
140 క్వింటాళ్ల రేషన్ బియ్యం స్వాధీనం
కమలాపూర్ : అక్రమంగా తరలిస్తున్న 140 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని మండలంలోని గూనిపర్తి వద్ద సోమవారం స్వాధీనం చేసుకుని ఇద్దరిని అరెస్ట్ చేసినట్లు ఇన్స్పెక్టర్ ఇ.హరికృష్ణ తెలిపారు. నడికూడ మండలం చర్లపల్లి నుంచి మహారాష్ట్రకు అక్రమంగా రేషన్ బియ్యం తరలిస్తున్నారన్న పక్కా సమాచారం మేరకు గూనిపర్తి వద్ద టీఎస్ 02 యూడీ 1582 నంబర్ గల వ్యాన్ను పోలీసులు తనిఖీ చేశారు. అందులో రూ.5.46 లక్షల విలువ గల 140 క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టుబడినట్లు తెలిపారు. బియ్యంతో పాటు వ్యాన్ను సీజ్ చేసి స్టేషన్కు తరలించినట్లు పేర్కొన్నారు. రేషన్ బియ్యం అక్రమ రవాణాకు పాల్పడుతున్న నడికూడ మండలం చర్లపల్లికి చెందిన తూర్పాటి ఐలయ్య, హుజూరాబాద్ మండలం చెల్పూర్కు చెందిన నగునూరి రాకేష్ను అరెస్ట్ చేసినట్లు ఇన్స్పెక్టర్ తెలిపారు. ఈ తనిఖీల్లో ఎస్సై వీరభద్రరావు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. నేడు నగరంలో రేవంత్రెడ్డి రోడ్షోలుహన్మకొండ చౌరస్తా: పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా సీఎం, టీపీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి నేడు(మంగళవారం) వరంగల్లో రోడ్షో, కార్నర్ మీటింగ్లలో పాల్గొననున్నారు. సాయంత్రం 5 గంటలకు వరంగల్ తూర్పులోని పోచమ్మమైదాన్ జంక్షన్లో కార్నర్ మీటింగ్లో పాల్గొంటారు. 6గంటలకు వేయిస్తంభాల గుడి నుంచి హనుమకొండ చౌరస్తా వరకు రోడ్షో నిర్వహిస్తారని పశ్చిమ ఎమ్మె ల్యే నాయిని రాజేందర్రెడ్డి తెలిపారు. అనంతరం హనుమకొండ చౌరస్తాలో ఏర్పాటుచేసిన కార్నర్ మీటింగ్లో ప్రసంగిస్తారన్నారు. కాంగ్రెస్ నా యకులు, కార్యకర్తలు, డివిజన్ అధ్యక్షులు, అభిమానులు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. -
ఉపాధి కూలీలకు నీడ, నీరు కల్పించాలి
కమలాపూర్ : మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పనులు చేస్తున్న ప్రదేశాల్లో కూలీలందరికి తాగునీరు, నీడ కల్పించడంతోపాటు ఓఆర్ఎస్ ప్యాకెట్లు, ప్రథమ చికిత్స కిట్లు అందుబాటులో ఉండాలని ఉపాధి హామీ పథకం జిల్లా అంబుడ్స్మన్ నాగరాజు, సిబ్బందిని ఆదేశించారు. మండలంలోని శ్రీరాములపల్లి, ఉప్పల్, దేశరాజుపల్లి గ్రామాల్లో సోమవారం ఆయన ఆకస్మికంగా పర్యటించి ఉపాధి పనులను పరిశీలించారు. సిబ్బందికి, కూలీలకు పలు సూచనలు చేశారు. ఎండ తీవ్రత దృష్ట్యా ఉదయం ఆరు గంటలకే పనులు ప్రారంభించాలని, కనీసం ఐదు గంటలైనా పనిచేయాలని, ఉద్యోగులు ఇచ్చిన కొలతల ప్రకారం పని చేస్తే రూ.300 వేతనం పొందవచ్చన్నారు. ఉపాధి హామీ పనులకు ఒకరికి బదులు మరొకరు రావొద్దని, పని ప్రదేశంలో కూడా ఉండొద్దని సూచించారు. ఉదయం పని ప్రారంభం కాగానే కూలీల హాజరు తీసుకోవాలని, పని ముగిసిన తర్వాత మరోసారి హాజరు తీసుకోవాలని క్షేత్ర సహాయకులకు సూచించారు. ఎంపీడీఓ గుండెబాబు, ఏపీఓ రమేశ్, సిబ్బంది, ఆయా గ్రామాల పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు. -
కరువులో నీటి కష్టాలు తీరుస్తున్నాం
ఖానాపురం: రాష్ట్రంలో పలుచోట్ల కరువు పరిస్థితులు ఏర్పడుతున్నప్పటికీ నర్సంపేట నియోజకవర్గంలో నీటి కష్టాలు తీరుస్తున్నామని ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి అన్నారు. ఈమేరకు మండలంలోని కొత్తూరులో కొత్తూరు, ధర్మరావుపేట గ్రామాలకు చెందిన బీఆర్ఎస్ కార్యకర్తలు సోమవారం కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈసందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే మాధవరెడ్డి మాట్లాడుతూ.. నర్సంపేటలో పవర్ బ్రోకర్లను కాంగ్రెస్లోకి తీసుకోవడంలేదన్నారు. గోదావరి జలాల తరలింపు ప్రాజెక్టును 2009లో తానే తీసుకొచ్చానన్నారు. స్వతంత్ర ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో బీఆర్ఎస్లోకి వెళ్లకపోవడంతోనే పనులు రద్దు చేశారన్నారు. ప్రధాన సేవకుడిగా పని చేస్తానన్నారు. మాజీ ఎమ్మెల్యే ఏజెంట్లను పెట్టుకుని కాల్వ పనులు చేశాడని, కొత్తూరు బొడ్రాయి వద్ద నిలబడతానని అభివృద్ధి ఎక్కడ జరిగిందో చూపిస్తారా? అని ప్ర శ్నించారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా అధికార ప్రతినిధి తక్కళ్లపల్లి రవీందర్రావు, నాయకులు మోహన్లాల్ శాఖమూరి హరిబాబు, వెంకటప్రసాదరావు, ముఖేశ్చౌదరి, సాగర్రావు, చెడిపాక ఉపేందర్, వల్లెరవి, పూల్సింగ్, వేణుగోపాల్రావు, సాంబయ్య తదితరులున్నారు. ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి -
పథకాలను ప్రజలకు వివరించాలి
పర్వతగిరి: కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెడుతున్న పథకాలను ప్రజలకు వివరించాలని వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్.నాగరాజు అన్నారు. ఈమేరకు మండల కేంద్రంలో సోమవారం గ్రామశాఖ అధ్యక్షులు, బూత్ ఇన్చార్జ్లతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే నాగరాజు మాట్లాడుతూ.. ప్రతీ కార్యకర్త కష్టపడి వరంగల్ ఎంపీ అభ్యర్థి కడియం కావ్యను భారీ మెజార్టీతో గెలిపించేందుకు పని చేయాలన్నారు. అనంతరం మండల పరిధి వివిధ గ్రామాల నుంచి బీఆర్ఎస్ నుంచి సుమారు 50 మంది కాంగ్రెస్లో చేరారు. కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షుడు పిన్నింటి అనిల్రావు, మండల అధ్యక్షుడు జాటోతు శ్రీనివాస్నాయక్ తదితరులు ఉన్నారు. అనంతరం మండల కేంద్రంలో సోమవారం ఉపాధి హామీ కూలీల పని ప్రదేశానికి వెళ్లి ఎంపీ అభ్యర్థి కడియం కావ్యకు ఓటు వేయాలని అభ్యర్థించారు. వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్.నాగరాజు -
ఎన్నికల సంగ్రామంలో వార్ వన్సైడే..
కరీంనగర్ ఎంపీ అభ్యర్థి బండి సంజయ్ఎల్కతుర్తి: పార్లమెంట్ ఎన్నికల సంగ్రామంలో వార్ వన్సైడేనని, బీజేపీ రాష్ట్రవ్యాప్తంగా 10నుంచి 12 సీట్లు గెలువబోతుందని ఆ పార్టీ కరీంనగర్ ఎంపీ అభ్యర్థి బండి సంజయ్ అన్నారు. సోమవారం హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం ముల్కనూర్లోని ఓ ఫంక్షన్హాల్లో హుస్నాబాద్ నియోజకవర్గ పోలింగ్ ఏజెంట్ల సమావేశం పార్టీ మండల అధ్యక్షుడు పృఽథ్వీరాజ్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సమావేశానికి బండి సంజయ్ ముఖ్యతిథిగా హాజరై మాట్లాడారు. ఎంపీ ఎన్నికల్లో బీజేపీకి వస్తున్న ఆదరణ చూసి కాంగ్రెస్, బీఆర్ఎస్కు వణుకు పుడుతోందన్నారు. మోదీ ప్రభుత్వం ప్రజలకు అనేక సంక్షేమ పథకాలు అందించింది..కాబట్టే వారికి బీజేపీపై నమ్మకం ఏర్పడిందన్నారు. రాష్ట్రంలో బీజేపీ అధిక సీట్లు గెలుస్తోందన్న సమాచారం మేరకు కాంగ్రెస్ పార్టీ బీజేపీని అప్రతిష్టపాలు చేసే కుట్ర పన్నుతుందన్నారు. ఆరు గ్యారంటీల పేరుతో గద్దెనెక్కిన కాంగ్రెస్ పథకాలను అమలు చేయకుండా ప్రజలను మోసం చేసిందని మండిపడ్డారు. మోసపూరిత హామీలిచ్చి నెరవేర్చని కాంగ్రెస్కు ప్రజలు నమ్మి ఓటేసే పరిస్థితి లేదని పేర్కొన్నారు. తమకు డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ స్ఫూర్తిదాయకమన్నారు. ఆయన స్పూర్తితోనే నరేంద్రమోదీ ప్రధాని అయ్యాడని గుర్తు చేశారు. ఈనెల 13న జరిగే ఎన్నికల్లో బీజేపీని గెలిపించేందుకు నాయకులంతా కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఫోన్ట్యాపింగ్ చేసిన నాయకులపై రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదో చెప్పాలన్నారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ ఒక్కటే అన్నారు. అనంతరం పలువురు నాయకులు బీఆర్ఎస్ నుంచి బీజేపీలో చేరడంతో ఆయన పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. కార్యక్రమంలో మాజీ మంత్రి ఇనుగాల పెద్దిరెడ్డి, మాజీ ఎమ్మెల్యే నందీశ్వర్గౌడ్, గంగిడి కృష్ణారెడ్డి, మోహన్రెడ్డి, గుజ్జ సత్యానారాయణ, రామ్గోపాల్రెడ్డి, సురేందర్రెడ్డి, లక్ష్మారెడ్డి, తిరుమల, సంతోష్, వేణుగోపాల్రావు, స్వరూప, శ్రీనివాస్, సదానందం తదితరులు పాల్గొన్నారు. -
బీజేపీ జనసభతో శ్రేణుల్లో ఉత్సాహం
నర్సంపేట: పట్టణంలోని ఎంఏఆర్ ఫంక్షన్ హాల్లో సోమవారం నిర్వహించిన జన సభలో ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్సింగ్దామీ పాల్గొన్నారు. అధిక సంఖ్యలో జనం తరలివచ్చి సభను విజయవంతం చేశారు. సభకు నియోజకవర్గవ్యాప్తంగా వేలాది మంది కార్యకర్తలు, అభిమానులు, నాయకులు హాజరవడంతో బీజేపీ శ్రేణుల్లో నూతనోత్సాహం నిండింది. ముందుగా ప్రకటించిన షెడ్యూల్ కంటే గంటన్నర ఆలస్యంగా పుష్కర్సింగ్దామీ వచ్చారు. కొంతమంది వెళ్లిపోయినప్పటికీ సీఎం వచ్చేటప్పటికి సభా ప్రాంగణం కిక్కిరిసింది. జిల్లా ఆస్పత్రిలో రిఫ్రిజిరేటర్ ఏర్పాటునర్సంపేట రూరల్: ‘జిల్లా ఆస్పత్రిలో తాగునీటి కష్టాలు’ శీర్షికన ‘సాక్షి’లో ఇటీవల ప్రచురితమైన కథనానికి అధికారులు స్పందించారు. ఆస్పత్రిలో రోగులు, వైద్య సిబ్బంది కోసం నూతనంగా రిఫ్రిజిరేటర్ ఏర్పాటు చేశారు. నర్సంపేట ఆస్పత్రి సూపరింటెండెంట్ గోపాల్, ఆర్ఎంఓ మనోజ్లాల్ ఆధ్వర్యంలో నూతనంగా రిఫ్రిజిరేటర్ కొని సోమవారం ప్రారంభించారు. ఫార్మసిస్టులకు త్వరలో వేతనాల పెంపు● ఫార్మసిస్టుల అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు బత్తిని సుదర్శన్ గౌడ్ గీసుకొండ: సెకెండ్ పీఆర్సీ ద్వారా త్వరలో వైద్య ఆరోగ్యశాఖలో పని చేస్తున్న ప్రభుత్వ ఫార్మసిస్టులకు ఆశాజనకంగా వేతనాలు పెరిగే అవకాశం ఉందని ప్రభుత్వ ఫార్మసిస్టుల అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు బత్తిని సుదర్శన్గౌడ్ అన్నారు. సోమవారం జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయంలో అసోసియేషన్ జిల్లా కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. పీఆర్సీ కమిటీకి ఫార్మసిస్టులకు జరుగుతున్న అన్యాయం గురించి వివరించి న్యాయం చేయాలని కోరగా.. వారు సానుకూలంగా స్పందించినట్లు తెలిపారు. అనంతరం సుదర్శన్గౌడ్ను ఫార్మిసిస్ట్ అసోసియేషన్ ప్రతినిధులు సన్మానించారు. కార్యక్రమంలో రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కందకట్ల శరత్బాబు, జిల్లా అధ్యక్షుడు దే వంబట్ల ప్రకాశ్రావు, కార్యదర్శి అడప వెంకటరమణ, హనుమకొండ జిల్లా కార్యదర్శి సుఽ ధాకర్రెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ అవినాశ్, నా యకులు వేణు, సూరయ్య, విజయలక్ష్మి, జాన్సీరాణి, శ్రీదేవి, సునీత తదితరులున్నారు. కావ్యను భారీ మెజార్టీతో గెలిపించాలి● పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్రెడ్డి సంగెం: కాంగ్రెస్ వరంగల్ పార్లమెంట్ అభ్యర్థి కడియం కావ్యను భారీ మెజార్టీతో గెలిపించాలని పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్రెడ్డి పిలుపునిచ్చారు. సోమవారం మండలంలోని తీగరాజుపల్లి, తిమ్మాపూర్ ఎంపీటీసీల పరిధిలో కాంగ్రెస్ పార్టీ బూత్ లెవల్ సన్నాహక సమావేశం జరిగింది. ముఖ్య అతిథిగా హాజరైన ప్రకాశ్రెడ్డి మాట్లాడుతూ.. కేంద్రంలో రాహుల్గాంధీ ప్రధానమంత్రి కావాలంటే కడియం కావ్యను గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో ఎంపీపీ కళావతి, పార్టీ మండల అధ్యక్షుడు మాధవరెడ్డి, జిల్లా అధికార ప్రతినిధి శ్రీనివాస్రెడ్డి, నియోజకవర్గ అధికార ప్రతినిధి జనగాం రమేశ్, పార్టీ మహిళా విభాగం మండల అధ్యక్షురాలు బిక్కిరెడ్డి సంధ్య, వర్కింగ్ ప్రెసిడెంట్ రమేశ్ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. -
పల్లెల్లో పని జాతర!
ఖానాపురం: గ్రామీణ ప్రాంతాల్లోని ఉపాధిహామీ పని ప్రదేశాలైన చెరువులు, కుంటలు కూలీలతో జాతరను తలపిస్తున్నాయి. వేసవి కావడంతో బయటెక్కడా పనులు అంతగా దొరకట్లేదు. చెరువులు, బావుల్లో నీళ్లు తగ్గిపోవడంతో రైతులు, గ్రామీణ ప్రజలకు పనులు లభించట్లేదు. దీంతో పల్లె ప్రజలు ఉపాధిహామీ పనుల వైపు చూస్తున్నారు. ఉదయమే పనుల బాటపట్టి పది గంటల వరకు ఇంటికి చేరుకుంటున్నారు. కాగా.. గతంలో కంటే కూలీల సంఖ్య సైతం పెరుగుతుందని అధికారుల లెక్కలు చెబుతున్నాయి. ఎంత మంది వచ్చినా పని.. వరంగల్ జిల్లా వ్యాప్తంగా జాబ్ కార్డులు ఉన్న కూలీలకు పనులు కల్పించేందుకు జిల్లా అధికారులు మండల స్థాయి అధికారులకు ముందస్తుగానే పనులు గుర్తించాలనే ఆదేశాలు జారీ చేశారు. ఇందుకోసం ఎప్పటికప్పుడు పర్యవేక్షించి పనుల్ని గుర్తించారు. పనులు చేసిన కూలీలకు జిల్లాలో సగటున రోజుకు రూ.203 చెల్లించినట్లు అధికారుల లెక్కల ద్వారా తెలుస్తోంది. ఇటీవల కేంద్ర ప్రభుత్వం ఉపాధి కూలీలకు కూలీ డబ్బులను రూ.300లకు పెంచడంతో గతంలో కంటే ప్రస్తుతం కూలీల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. అధిక సంఖ్యలో.. జిల్లాలో ఇప్పటి వరకు కేవలం కరోనా సమయంలో మాత్రమే 51 వేల మంది అత్యధికంగా ఉపాధి హామీ పనులకు హాజరయ్యారు. ప్రస్తుతం బయట ఎక్కడా పనులు దొరక్కపోవడంతో కూలీలు అధిక సంఖ్యలో ఉపాధి పనులకు హాజరవుతున్నారు. జి ల్లాలో ఈనెల2న 45490, 3న 45807, 04వ తేదీన 46141 మంది, సోమవారం రోజున 46474 మంది కూలీలు ఉపాధి పనులకు హాజరయ్యారు. పనులు చేసిన కూలీలకు సకాలంలోనే డబ్బులు వస్తుండడంతో కూలీలు ఉపాధి పనులకు ముందుకొస్తున్నారు. ఎంతమంది కూలీలు హాజరైనా పనులు కల్పించడానికి అధికారులు పనులు గుర్తిస్తున్నారు. అరకొర వసతులు.. కూలీలకు ఇబ్బందులు ఎండల తీవ్రత అధికంగా ఉండడంతో కూలీలు ఉదయాన్నే ఉపాధి హామీ పనులకు వెళ్తున్నారు. పని ప్రదేశంలో కనీస వసతులు కరువవడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పనులు ముగించుకునే సమయంలోపే ఎండ తీవ్రత పెరుగుతోంది. కనీస వసతులైన నీడ, నీటి వసతుల్లేక ప్రజలు ఎండ వేడికి అల్లాడుతున్నారు. వడదెబ్బకు గురవకుండా కనీసం ఓ ఆర్ఎస్ ప్యాకెట్లు అయినా అందుబాటులో ఉంచాలని, తాగు నీటి వసతులు కల్పించాలని పలు గ్రామాల ఉపాధి కూలీలు కోరుతున్నారు.జిల్లాలో జోరుగా ఉపాధి హామీ పనులు ఏటేటా పెరుగుతున్న కూలీల సంఖ్య పని ప్రదేశంలో అరకొర వసతులు జిల్లాలో 1,19,425 జాబ్ కార్డులు రోజుకు సుమారు 49 వేల మంది హాజరుజిల్లాలో ఇలా.. మండలాలు 11 గ్రామ పంచాయతీలు 323 జాబ్ కార్డులు 1,19,425 కూలీల సంఖ్య 2,38,687 పనిచేస్తున్న కూలీల సంఖ్య 1,31,085 ఏప్రిల్లో పని చేసిన కుటుంబాలు 40,911 వారికి చెల్లించిన నగదు రూ.15,13,48,000 -
డిగ్రీ సెమిస్టర్ల పరీక్షలు షురూ
కేయూ క్యాంపస్: కేయూ పరిధిలో ఉమ్మడి వరంగల్, ఖమ్మం, ఆదిలాబాద్ జిల్లాల్లో డిగ్రీ రెండో, ఆరో సెమిస్టర్ల పరీక్షలు సోమవారం ప్రారంభమయ్యాయి. హనుమకొండలోని కాకతీయ ప్రభుత్వ డిగ్రీ కళాశాల పరీక్ష కేంద్రాన్ని కేయూ రిజిస్ట్రార్ పి.మల్లారెడ్డి సందర్శించారు. ఆయన వెంట ఎస్.నర్సింహాచారి, డాక్టర్ తిరుమలాదేవి ఉన్నారు. ఏడుగురు డీబార్ కాకతీయ యూనివర్సిటీ ఫార్మసీ కళాశాల కేంద్రంలో సోమవారం నిర్వహించిన బీఫార్మసీ రెండో సెమిస్టర్ పరీక్షల్లో కాపీయింగ్ చేస్తూ ఏడుగురు విద్యార్థులు పట్టుబడడంతో వారిని డీబార్ చేసినట్లు పరీక్షల నియంత్రణాధికారి ఎస్.నర్సింహాచారి తెలిపారు. -
కాంగ్రెస్, బీజేపీ మోసాల్ని వివరించాలి..
పర్వతగిరి: కాంగ్రెస్, బీజేపీ చేసిన మోసాలపై ఇంటింటికీ వెళ్లి వివరించాలని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు, మాజీ శాసన సభాపతి సిరికొండ మధుసూదనాచారి అన్నారు. ఈమేరకు మండలంలోని అన్నారం షరీఫ్, కల్లెడ, చింత నెక్కొండ, కొంకపాక, వడ్లకొండ, ఏనుగల్, దౌలత్నగర్, పర్వతగిరి గ్రామాల బీఆర్ఎస్ బూత్ స్థాయి సమావేశాన్ని సోమవారం నిర్వహించారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ.. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత రైతుబంధు, రైతు బీమా, కల్యాణలక్ష్మి, కేసీఆర్ కిట్ వంటి చాలా పథకాలు ఆగిపోయాయన్నారు. రైతుల ఆత్మహత్యలు పెరిగి కరెంట్ కష్టాలు మళ్లీ మొదలయ్యాయని తెలిపారు. గొంతెత్తి తెలంగాణ హక్కులు కాపాడేది బీఆర్ఎస్ మాత్రమేనన్నారు. వరంగల్ పార్లమెంట్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి మారేపల్లి సుధీర్కుమార్ను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో ఎంపీపీ కమలపంతులు, ఏఎంసీ మాజీ వైస్ చైర్మన్ ఏడుదొడ్ల జితేందర్రెడ్డి, పీఏసీఎస్ మోటపోతుల మనోజ్గౌడ్, వైస్ ఎంపీపీ ఎర్రబెల్లి రాజేశ్వర్రావు, చిన్నపాక శ్రీనివాస్, గటిక మహేశ్, యుగేందర్రావు పాల్గొన్నారు. కార్యకర్తలకు మాజీ మంత్రి ఎర్రబెల్లి పిలుపు -
ఉద్యోగాల తొలగింపు అన్యాయం
గీసుకొండ: గీసుకొండ–సంగెం మండలాల పరిధి కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్(కేఎంటీపీ) గణేశా ఎకోపెట్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో డ్రైవర్లు, వర్కర్లు, ఇంజనీర్లుగా పని చేస్తున్న తెలుగువారిని ఎలాంటి కారణాల్లేకుండా ఉద్యోగం నుంచి తొలగిస్తున్నారని ఉద్యోగం కోల్పోయిన పలువురు ఆవేదన వ్యక్తం చేశారు. సోమవారం వారు కేఎంటీపీలో విలేకరులకు తమ గోడు వినిపించారు. ఇటీవల పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్రెడ్డి చొరవ మేరకు కంపెనీలో 16 గంటల పనికి బదులు 8 గంటలు చేసేలా కంపెనీ యాజమాన్యం ఒప్పుకుందని, ఈ విషయంలో తాము ఎమ్మెల్యే వద్దకు వెళ్లినందుకు తమపై యాజమాన్యం కక్ష కట్టిందన్నారు. ఇప్పటికే పది మంది డ్రైవర్లు, పది మంది తెలుగు కూలీలతో పాటు ఓ ఇంజనీర్ను తొలగించినట్లు తెలిపారు. తాము ఇతర కంపెనీల్లో పని కోసం వెళ్లేందుకు పే స్లిప్పులు, సర్వీస్ సర్టిఫికెట్ ఇవ్వాలని కోరితే ఉద్యోగానికి రాజీనామా చేస్తున్నట్లు లేఖ ఇస్తే ఇస్తామని, లేదంటే కుదరదని కంపెనీ వారు బెదిరిస్తున్నట్లు తెలిపారు. కంపెనీలో పని చేస్తున్న తెలుగువారితో బలవంతంగా ముందే రాజీనామా లేఖ రాయించుకుని అకారణంగా తొలగిస్తున్నట్లు ఆవేదన చెందారు. ఇప్పటికైనా ఎమ్మెల్యే చొరవ తీసుకుని తమకు న్యాయం చేయాలని బాధిత డ్రైవర్లు రాజశేఖర్, సిద్దు, గురునాఽథ్, గోపీనాథ్, ఉదయ్, రామకృష్ణ, కరుణాకర్ కోరారు. ఎమ్మెల్యే రేవూరి న్యాయం చేయాలి గణేశా ఎకోపెట్ కంపెనీ బాధితుల ఆవేదన -
అభివృద్ధి కోసమే కాంగ్రెస్లో చేరా..
ఐనవోలు/ధర్మసాగర్: నియోజకవర్గ అభివృద్ధి కోసమే కాంగ్రెస్ పార్టీలో చేరానని స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. ఐనవోలు మండలం వెంకటాపూర్లో, ధర్మసాగర్ మండలం పెద్ద పెండ్యాలలో నిర్వహించిన కార్నర్ మీటింగ్లో ఎమ్మెల్యే కడియం శ్రీహరి మాట్లాడుతూ.. అవినీతికి కలిగిన కేసీఆర్ కుటుంబంలో ఉండలేకనే కాంగ్రెస్ పార్టీలో చేరానన్నారు. వరంగల్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కడియం కావ్యను నిండు మనసుతో ఆశీర్వదించాలన్నారు. చేతి గుర్తుకు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. పీసీసీ ప్రధాన కార్యదర్శి సింగపురం ఇందిర మాట్లాడుతూ.. కావ్యకు అధిక మెజార్టీ ఇచ్చి గెలిపించాలని కోరారు. ఎంపీ అభ్యర్థి కడియం కావ్య మాట్లాడుతూ.. కోతికి కొబ్బరి చిప్ప దొరికినట్టు తాటికొండ రాజయ్య ఇష్టం వచ్చినట్లు ఎగురుతున్నారని, మతిభ్రమించి ఇష్టం వచ్చిన వ్యాఖ్యలు చేస్తున్నాడని మండిపడ్డారు. మీ ఇంటి ఆడబిడ్డగా భావించి ఓటు వేసి గెలిపించాలని వేడుకున్నారు. ఆయా కార్యక్రమాల్లో డీసీసీబీ చైర్మన్ మార్నేని రవీందర్రావు, నాయకులు గుర్రపు ప్రసాద్, అమరేందర్రెడ్డి, తోట నాగరాజు సీపీఎం నాయకుడు కాడబోయిన లింగయ్య పాల్గొన్నారు. కావ్యను భారీ మెజార్టీతో గెలిపించాలి స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి -
మత్స ్య సంపద ౖపైపెకి..
గీసుకొండ : జిల్లాలో మత్స్య సంపద ఈ ఏడాది కూడా ఆశాజనకంగానే ఉంది. వరుసగా నాలుగేళ్ల నుంచి చేపల దిగుబడి వస్తోంది. ఈసారి మరింత అదనపు దిగుబడి వస్తోందని తెలుస్తోంది. ప్రభుత్వం ఉచితంగా చేపపిల్లలను పంపిణీ చేసింది. గత సంవత్సరం చేపల పంపిణీ ఆలస్యమైంది. దీంతో కొన్ని మత్స్య సంఘాల వారు కాకినాడ, రాజమండ్రి (బిక్కూరు)తోపాటు తెలంగాణ రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచి చేపపిల్లలను సొంత ఖర్చుతో కొనుగోలు చేసి చెరువుల్లో పోశారు. ప్రస్తుత వేసవికాలంలో జలాశయాల్లో నీరు తగ్గుతోంది. దీంతో గతంలో ఉన్న పాత తెల్ల చేపలు సుమారు 5 నుంచి 10 కిలోల సైజ్లో పెరిగాయని మత్స్యకారులు చెబుతున్నారు. జిల్లాలో జలాశయాలు ఇలా.. జిల్లాలో 702 చెరువులు ఉన్నాయి. వాటిలో ఎల్గూరురంగంపేట, మాదన్నపేట, నల్లబెల్లి, దమ్మన్నపేట, వర్ధన్నపేటలో కోనారెడ్డి చెరువులు పెద్దవి. ఇవే కాకుండా రాయపర్తి మండలంలోని మైలారం రిజర్వాయర్ ఉంది. పాకాల చెరువు మత్య్సశాఖ పరిధిలోకి రాకుండా అటవీశాఖ ఆధీనంలో ఉంది. నాలుగేళ్ల నుంచి పెరుగుతున్న దిగుబడి.. గడిచిన నాలుగేళ్ల నుంచి జిల్లాలో మత్స్యసంపద దిగుబడి గణనీయంగా పెరుగుతోంది. 2021–22లో చేపలు 8,500 టన్నులు, రొయ్యలు 301 టన్నులు.. రెండు కలిపి మొత్తం 8,801 టన్నుల దిగుబడి వచ్చిందని మత్స్యశాఖ అధికారులు తెలిపారు. అలాగే 2022–23లో చేపలు 8,950 టన్నులు, రొయ్యలు 320 టన్నులు.. మొత్తం కలిపి 9270 టన్నులు, ఈ ఏడాది(2023–24)లో చేపలు 9,500 టన్నులు, రొయ్యలు 350 టన్నులు.. మొత్తం కలిపి 9,850 టన్నుల చేపల దిగుబడి వచ్చినట్లు చెబుతున్నారు. అలాగే ప్రస్తుత మే, జూన్ మాసాలు ముగిసేసరికి మరో 800 టన్నుల దిగుబడి అధికంగా వచ్చే అవకాశం ఉందంటున్నారు. చేపల వైపే ప్రజల మొగ్గు.. ప్రస్తుతం చేపలకు గిరాకీ బాగానే పెరిగింది. మార్కెట్లో మాంసం, చికెన్ ధరలు పెరగడంతో మాంసాహారులు ప్రత్యామ్నాయంగా ఆరోగ్యానికి మేలు చేసే చేపల వైపు మొగ్గుతున్నారు. గతంలో కిలోకు రూ.100 నుంచి రూ. 120 వరకు విక్రయిస్తుండగా.. ప్రస్తుత సీజన్లో రూ.150 వరకు తెల్ల చేపలను విక్రయిస్తున్నారు. బొమ్మె రకం చేపలు కిలోకు రూ.400 వరకు ధర పలుకుతోంది. గతంలో కోస్తా ఆంధ్ర ప్రాంతం నుంచి చేపలు ఇక్కడికి దిగుమతి అయ్యేవి. జిల్లాలో మత్స్య సంపద గణీయంగా పెరగడంతో ఇక్కడి చేపలు రాష్ట్రంలోని పలు జిల్లాలతోపాటు పశ్చిమబెంగాల్లోని కోల్కతా, మహారాష్ట్రలోని చంద్రాపూర్, నాగ్పూర్కు భారీగానే ఎగుమతి అవుతున్నాయి. ఆశాజనకంగా చేపల దిగుబడి జిల్లాలో గతంలో ఎల్గూరురంగంపేట, మాదన్నపేట, మైలారం రిజర్వాయర్లలో నీలకంఠ రొయ్య పిల్లలను పోశారు. ఇవి నాలుగు నెలల్లోనే పెరిగి చేతికివస్తాయి. మత్స్యకారులకు లాభదాయకంగా ఉంటాయి. ఈ ఏడాది తెల్ల చేపల దిగుబడి ఆశాజనకంగా ఉంది. దీంతో మత్స్యకారులకు ఉపాధి మెరుగుపడింది. – నరేశ్కుమార్ నాయుడు, జిల్లా మత్స్యశాఖ అధికారిజిల్లాలో చెరువులు, మత్స్యసంఘాల వివరాలు.. గత ఏడాదితో పోలిస్తే ఈసారి 800 టన్నుల అధిక దిగుబడి వచ్చే అవకాశం మన చేపలు పశ్చిమబెంగాల్, మహారాష్ట్రకు ఎగుమతి నీలకంఠ రొయ్యలకు భలే గిరాకీ జిల్లాలో 702 చెరువులు.. 184 మత్స్య సంఘాలుచెరువులు 702 చెరువుల నీటి విస్తీర్ణం 12,910 హెక్టార్లు పోసిన చేపపిల్లలు 1,93,63,000 మత్స్య సంఘాలు 184 మొత్తం సభ్యులు 15,741
Pagination
స్టార్ హీరోలతో యాక్టింగ్.. ఆ కమెడియన్ ఇలా అయిపోయాడేంటి!
భర్తతో విడిపోయిన హీరోయిన్.. కూతురితో కలిసి..
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
పాప్లెట్ చేపలతో పరేషాన్!
ఓటీటీకి వచ్చేసిన పుష్ప విలన్ హిట్ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
పంట నష్టపరిహారం మంజూరు
గోడ కూలి ఏడుగురు దుర్మరణం
సీఎంపై చర్యలు తీసుకోవాలి
నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తా
‘మరింత అప్రమత్తంగా ఉండాలి’
జిల్లా రద్దు ఉత్త ముచ్చట
రాజ్నాథ్సింగ్ సభ రద్దు
సీఎం దిష్టిబొమ్మ దహనం
తప్పక చదవండి
- సీఎం నితీష్కు షాకిచ్చి.. లాలూ చెంతకు బడా నేత!
- Lok Sabha Election 2024: ఐదో విడత బరిలో..695 మంది
- ఐఏఎఫ్ కాన్వాయ్పై దాడి ఘటన..
- నాడు తిట్లు.. నేడు కౌగిలింతలు!
- నల్ల ఖజానా గేట్లు తెరచిన బాబు
- ‘సూపర్ సీఎం’ పాండియన్!
- షర్మిలా.. మా బకాయిలిచ్చేయ్!
- భరత్.. వైజాగ్ ఇప్పుడు గుర్తొచ్చిందా?
- Sakshi.com ఇప్పుడు సరికొత్తగా మీ ముందుకు
- బర్త్ డే స్పెషల్.. విజయ్ దేవరకొండ ఎక్కడ తప్పు చేస్తున్నాడు?
Advertisement