‘రైతులకు అండగా ప్రేమ్‌సాగర్‌రావు’ | Sakshi
Sakshi News home page

‘రైతులకు అండగా ప్రేమ్‌సాగర్‌రావు’

Published Fri, Apr 19 2024 1:45 AM

జలాభిషేకం నిర్వహిస్తున్న నాయకులు
 - Sakshi

దండేపల్లి: రైతులకు ఇబ్బందులు కలుగకుండా మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేంసాగర్‌రావు అండగా నిలిచి ఆదుకుంటున్నారని కాంగ్రెస్‌ నాయకులు, రైతులు అన్నారు. మండలంలోని తానిమడుగు సమీపంలో గూడెం ఎత్తిపోతల డెలివరీ పాయింట్‌ వద్ద కడెం ప్రధాన కాల్వలో పలువురు రైతులు, కాంగ్రెస్‌ నాయకులు ప్రేంసాగర్‌రావు చిత్రపటానికి గురువారం జలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. కడెం ఆయకట్టు కింద యాసంగిలో డీ–30నుంచి డీ–42 వరకు దండేపల్లి మండలంలోని గూడెం సత్యనారాయణస్వామి ఎత్తిపోతల ద్వారా జనవరి 6నుంచి ఏప్రిల్‌ 3వరకు నిరంతరాయంగా సాగునీరు అందించారని తెలిపారు. ప్రస్తుతం ఎల్లంపల్లి ప్రాజెక్టులో నీటిమట్టం తక్కువ ఉన్నా రైతులు నష్టపోకుండా ఉండేందుకు నీరందిస్తున్నారని తెలిపారు.

Advertisement
Advertisement