రామాలయంలో నిత్యారాధన హోమం | Sakshi
Sakshi News home page

రామాలయంలో నిత్యారాధన హోమం

Published Fri, Apr 19 2024 1:35 AM

రామాలయంలో హోమం నిర్వహిస్తున్న వేద పండితులు - Sakshi

ఏటూరునాగారం: మండల కేంద్రంలోని శ్రీసీతారామచంద్రస్వామి ఆలయంలో గురువారం ఉదయం నిత్యారాధన, హోమం, బలిహరణ కార్యక్రమాన్ని వేదపండితులు ముక్కాముల వెంకటనారాయణశర్మ, యల్లాప్రగడ మణికంటిశర్మ, నాగేశ్వర్‌రావుశర్మ ఘనంగా నిర్వహించారు. సాయంత్రం సదస్యము, ఆరగింపు, పల్లకిసేవ కార్యక్రమాలు జరిపించారు. అనంతరం సీతారాములను దర్శించుకున్న భక్తులకు తీర్థప్రసాదాలను పంపిణీ చేశారు. రామాలయంలో ఐదు రోజుల బ్రహ్మోత్సవాలలో భాగంగా నాలుగో రోజు (శుక్రవారం) ఆలయంలో రాత్రి 9గంటలకు పుష్పయాగం(నాగబెల్లి) కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు అర్చకులు నాగేశ్వర్‌రావుశర్మ తెలిపారు.

Advertisement
Advertisement