ఫైర్‌ సిబ్బంది సేవలను సద్వినియోగం చేసుకోవాలి | Sakshi
Sakshi News home page

ఫైర్‌ సిబ్బంది సేవలను సద్వినియోగం చేసుకోవాలి

Published Fri, Apr 19 2024 1:35 AM

వారోత్సవాల పోస్టర్లు ఆవిష్కరిస్తున్న ఫైర్‌ సిబ్బంది - Sakshi

ములుగు రూరల్‌: అగ్నిమాపక సిబ్బంది సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఫైర్‌ ఆఫీసర్‌ ఎండి.అబ్దుల్‌ రహీం అన్నారు. అగ్నిమాపక వారోత్సావాల్లో భాగంగా గురువారం ములుగు పట్టణ కేంద్రంలోని లక్ష్మీ గ్యాస్‌ ఏజెన్సీస్‌లో వంట గ్యాస్‌ ద్వారా అగ్ని ప్రమాదం సంభవించినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై పోస్టర్లను ఆవిష్కరించారు. అనంతరం అవగాహన కల్పించి మాక్‌ డ్రిల్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా అబ్దుల్‌ రహీం మాట్లాడుతూ ఎక్కడైనా అగ్ని ప్రమాదం సంభవించినప్పుడు ములుగు అగ్నిమాపక కేంద్రం సెల్‌ నంబర్‌ 8712699210, 8712699211 లేదా 101కి సమాచారం అందించాలన్నారు. అగ్ని ప్రమాదంలో ఎటువంటి వస్తువులు కాలుతున్నాయో స్పష్టంగా తెలుపాలన్నారు. అగ్ని ప్రమాదం సంభవించినప్పుడు కంగారు పడకుండా అగ్ని ప్రమాదాన్ని నివారించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎల్‌ఎఫ్‌ మహేశ్వర్‌, డీఓపీ రమేష్‌, సురేందర్‌, ధన్‌సింగ్‌, చంద్రప్రకాశ్‌ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement