మార్కాపురం: నేను మీ సేకుడిని.. మీకు సేవ చేసేందుకే జగనన్న ఆశీస్సులతో మార్కాపురం నియోజకవర్గ నుంచి వైఎస్సార్ సీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నానని, పార్లమెంటు అభ్యర్థిగా పోటీ చేస్తున్న డాక్టర్ చెవిరెడ్డి భాస్కర్రెడ్డికి ఓటు వేసి గెలిపించాలని ఎమ్మెల్యే అన్నా రాంబాబు కోరారు. బుధవారం చింతగుంట్ల పంచాయతీలోని అయ్యగారిపల్లిలో టీడీపీకి చెందిన 15 కుటుంబాలు అన్నా రాంబాబు సమక్షంలో వైఎస్సార్ సీపీలోకి చేరాయి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సంక్షేమ పథకాలతో ప్రతి ఒక్క కుటుంబం అభివృద్ధి చెందిందని, అభివృద్ధి ఇంకా కొనసాగాలంటే మరోసారి జగనన్నను సీఎం చేసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఇటీవల ప్రకటించిన వైఎస్సార్ సీపీ మేనిఫెస్టోతో ప్రజలు సంతృప్తిగా ఉన్నారన్నారు. చింతగుంట్ల పంచాయతీలోని అయ్యగారిపల్లికి చెందిన ఏరువ కృష్ణరెడ్డి, చల్ల వెంకటేశ్వర్లు, కందుల వెంకటరెడ్డి, కందుల శివారెడ్డి, దండ గోవర్ధన్రెడ్డి, బోగెం వెంకట సుబ్బయ్య, బొగెం గురవయ్య, వెన్న కాశిరెడ్డి, చల్ల కొండయ్య, గుండారెడ్డి నారాయణరెడ్డి, చేరుకుల చిన్న వెంకటరెడ్డి, దండా రామిరెడ్డి, చింతలపూడి బసిరెడ్డిలు వైఎస్సార్ సీపీలో చేరారు. వీరికి ఎమ్మెల్యే అన్నా రాంబాబు పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జగనన్న ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకునేంత వరకూ నిరంతరం శ్రమిస్తామని హామీ ఇచ్చారు. ఈ నెల 13న జరిగే ఎన్నికల్లో తాము వైఎస్సార్ సీపీని భారీ మెజారిటీతో గెలిపిస్తామని చెప్పారు. మాజీ ఎంపీపీలు పోలయ్య, చెంచిరెడ్డి, మందటి శివారెడ్డి ఉన్నారు.
15 కుటుంబాలు టీడీపీ నుంచి
వైఎస్సార్ సీపీలో చేరిక