India Open 2024: క్వార్టర్స్‌లో సాత్విక్‌ జోడీ | Sakshi
Sakshi News home page

India Open 2024: క్వార్టర్స్‌లో సాత్విక్‌ జోడీ

Published Fri, Jan 19 2024 2:45 AM

India Open 2024: Satwik-Chirag, Prannoy move into quarters - Sakshi

న్యూఢిల్లీ: ఇండియా ఓపెన్‌ వరల్డ్‌ టూర్‌ సూపర్‌–750 బ్యాడ్మింటన్‌ టోర్నీ పురుషుల డబుల్స్‌ విభాగంలో రెండో సీడ్‌ సాత్విక్‌ సాయిరాజ్‌–చిరాగ్‌ శెట్టి (భారత్‌) జోడీ క్వార్టర్‌ ఫైనల్లోకి దూసుకెళ్లింది. ప్రిక్వార్టర్‌ ఫైనల్లో సాత్విక్‌–చిరాగ్‌ ద్వయం 21–14, 21–15తో చింగ్‌ యావో లు–పో హాన్‌ యాంగ్‌ (చైనీస్‌ తైపీ) జంటపై గెలిచింది.

పురుషుల సింగిల్స్‌లో భారత నంబర్‌వన్‌ ప్రణయ్‌ క్వార్టర్‌ ఫైనల్లోకి అడుగు పెట్టాడు. భారత్‌కే చెందిన ప్రియాన్షు రజావత్‌తో జరిగిన ప్రిక్వార్టర్‌ ఫైనల్లో ప్రణయ్‌ 20–22, 21–14, 21–14తో గెలుపొందాడు. 

Advertisement

తప్పక చదవండి

Advertisement