పారిస్‌ ఒలింపిక్స్‌కు శ్రీశంకర్‌ దూరం  | Sakshi
Sakshi News home page

పారిస్‌ ఒలింపిక్స్‌కు శ్రీశంకర్‌ దూరం 

Published Fri, Apr 19 2024 4:22 AM

Sreeshankar away from Paris Olympics - Sakshi

న్యూఢిల్లీ: భారత స్టార్‌ లాంగ్‌జంపర్‌ మురళీ శ్రీశంకర్‌ మోకాలి గాయంతో పారిస్‌ ఒలింపిక్స్‌ నుంచి వైదొలిగాడు. ప్రాక్టీస్‌ సమయంలో శ్రీశంకర్‌ మోకాలికి గాయమైంది. ఈ గాయానికి శస్త్ర చికిత్స అవసరమని వైద్యులు నిర్ధారించడంతో ఈ ఏడాది మొత్తం శ్రీశంకర్‌ బరిలోకి దిగే అవకాశాలు కనిపించడం లేదు.

కేరళకు చెందిన 25 ఏళ్ల శ్రీశంకర్‌ గత ఏడాది ఆసియా అథ్లెటిక్స్‌ చాంపియన్‌షిప్‌లో 8.37 మీటర్ల దూరం దూకి రజత పతకం సాధించాడు. ఈ క్రమంలో పారిస్‌ ఒలింపిక్‌ బెర్త్‌ను కూడా సంపాదించాడు. 2022 కామన్వెల్త్‌ గేమ్స్‌లో రజతం, 2023 ఆసియా క్రీడల్లో రజతం నెగ్గిన శ్రీశంకర్‌ 2020 టోక్యో ఒలింపిక్స్‌లో పోటీపడినా ఫైనల్‌కు అర్హత పొందలేకపోయాడు.   

Advertisement
Advertisement