-
పట్టబడిన మద్యం ఆరణిదేనా..?
తిరుపతి తుడా : బంగారుపాళ్యం వద్ద పోలీసులకు పట్టుబడిన కర్ణాటక మద్యం తిరుపతిలో పోటీ చేస్తున్న జనసేన అభ్యర్థి ఆరణి శ్రీనివాసులుకు చెందినదనే వార్తలు గుప్పుమన్నాయి. ఎన్నికల సందర్భంగా తిరుపతి ప్రజలను మత్తులో ముంచి ఓట్లు వేయించుకునేందుకే ఆయన రూ.లక్షల విలువైన మద్యం తెప్పిస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. జనసేన అభ్యర్థిగా ఆరణి తిరుపతిలో అడుగు పెట్టినప్పటి నుంచి జరుగుతున్న పరిణామాలను గమనిస్తే ఆయన అంతటి ఘనుడే అని అర్థమవుతోందని కూటమి నేతలు బహిరంగంగానే వ్యాఖ్యానిస్తున్నారు. అసంతృప్తి నాయకులకు డబ్బు ఎరవేసి కొనుగోలు చేసిన విషయాన్ని గుర్తుచేసుకుంటున్నారు. రూ.కోట్లు వెదజల్లి, ప్రలోభాలకు గురిచేసి, రౌడీయిజం చేయించి ఈ ఎన్నికల్లో గట్టెక్కాలని తీవ్రంగా ప్రయత్నిస్తున్నారని చెప్పుకుంటున్నారు. తిరుపతి పవిత్రత దెబ్బతీస్తున్నారంటూ ఎల్లోమీడియాలో నిత్యం నోరేసుకుని పడిపోయే కూటమి నేతలకు ఆరణి ప్రలోభాల పర్వం కనిపించడం లేదా అని స్థానికులు మండిపడుతున్నారు. ఓట్ల కోసం అసాంఘికశక్తులను తిరునగరిలోకి తీసుకువచ్చిన వారికి ఎలా మద్దుతు ఇస్తారని ప్రశ్నిస్తున్నారు. -
నారహంతకుడు!
● వృద్ధులు, వికలాంగులను ఇబ్బందులకు గురిచేయడం సరికాదు ● జగన్ చేస్తున్న మంచిని ఓర్వలేకే కుట్రలు ● వెంకటగిరి ప్రచారంలో నేదురుమల్లి ధ్వజం వెంకటగిరి(సైదాపురం): ‘ఎన్నికల వేళ నారా చంద్రబాబునాయుడు తన నిజ స్వరూపాన్ని బయట పెట్టారు. 55 నెలలుగా ఇంటి వద్దకే పాలన అందిస్తున్న విధానంపై కక్షగట్టారు. తన అనుచరుల ద్వారా ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేయించారు. వలంటీర్ల వ్యవస్థను పక్కనబెట్టించారు. అంతటితో ఆగక అవ్వాతాతల చావుకు కారణమవుతూ రాక్షసానందం పొందుతున్నారు’ అని వైఎస్సార్సీపీ తిరుపతి జిల్లా అధ్యక్షులు, వెంటగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి నేదురుమల్లి రామ్కుమార్రెడ్డి ధ్వజమెత్తారు. రాష్ట్రంలో పేద ప్రజలకు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి చేస్తున్న మంచిని ఓర్వలేక ప్రజల అసువులు కోరే నర హంతకుడిగా తయారయ్యారని విరుచుకుపడ్డారు. వెంకటగిరి పట్టణంలో మంగళవారం ఆయన ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేశారు. ఈసందర్భంగా పట్టణ ప్రజలు ఆయనకు బ్రహ్మరథం పట్టారు. అనంతరం నేదురుమల్లి రామ్కుమార్రెడ్డి మాట్లాడుతూ పేద ప్రజలకు మంచి చేయాలన్న ఉద్దేశంతో సంక్షేమ పథకాలు గడపవద్దకే అందించిన ఘనత సీఎం జగనన్నకే దక్కుతుందన్నారు. దీన్ని ఓర్వలేక చంద్రబాబునాయుడు పనిగట్టుకుని వృద్ధులు, దివ్యాంగులను ఇబ్బందులకు గురిచేస్తున్నారని మండిపడ్డారు. జగనన్న అందిస్తున్న సంక్షేమ పథకాలను కాపీ కొట్టి ప్రజలకు మోసపూరిత మాటలు చెబుతున్నారని ఎద్దేవా చేశారు. రానున్న ఎన్నికల్లో ఫ్యాను గుర్తుపై రెండు ఓట్లు వేసి జగనన్న సైనికులను అఖండ మెజారిటీతో గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. కార్యక్రమంలో వెంకటగిరి రాజా కుటుంబీకులు సర్వజ్ఞకుమారయాచేంద్ర, వైఎస్సార్సీపీ నియోజకవర్గ పరిశీలకులు కొడవలూరు ధనంజయ్యరెడ్డి, సూళ్లూరుపేట అదనపు పరిశీలకులు కలిమిలి రాంప్రసాద్రెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్ నక్కా భానుప్రియ, పట్టణ కన్వీనర్ జీ.ఢిల్లీబాబు, జిల్లా సహాయ కార్యదర్శి చిట్టేటి హరికృష్ణ, న్యాయ వాది ఎల్.కోటేశ్వరరావు, వైస్ చైర్మన్లు ఎస్.బాలయ్య, సీహెచ్ ఉమామహేశ్వరి, మున్సిపల్ వార్డు కౌన్సిలర్లు పాల్గొన్నారు. -
ఈత.. కడుపు కోత
● ఈతకు వెళ్లి బాలుడి మృతి ● శోకసంద్రంలో కుటుంబ సభ్యులు చంద్రగిరి: ఈతకు వెళ్లి బాలుడు మృతి చెందిన ఘటన మండల పరిధిలోని యల్లంపల్లి చెరువులో మంగళవారం చోటు చేసుకుంది. గ్రామస్తుల వివరాల మేరకు.. భీమవరం గ్రామానికి చెందిన ప్రవీణ్(16) తన అమ్మమ్మతో ఉంటున్నాడు. మంగళవారం మధ్యాహ్నం ప్రవీణ్ మరికొంత మంది స్నేహితులతో కలసి యల్లంపల్లిలోని చెరువులో ఈతకు వెళ్లాడు. ఈ క్రమంలో చెరువులో ఈత కొడుతూ ప్రమాదవశాత్తు ప్రవీణ్ నీట మునిగాడు. ఎంతకీ బయటకు రాకపోవడంతో తోటి స్నేహితులు గ్రామస్తులకు సమాచారం అందించారు. అనంతరం గ్రామంలోని గజ ఈతగాళ్లు ప్రవీణ్ కోసం గాలించినా ఫలితం లేకపోయింది. సుమారు 3 గంటల పాటు శ్రమించి ప్రవీణ్ మృతదేహాన్ని బయటకు తీశారు. తమ కళ్లెదుటే బిడ్డ మృతి చెందడంతో గ్రామస్తులు బోరున విలపించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తిరుపతి ఎస్వీ మెడికల్ కళాశాలకు తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
బాబు మేనిఫెస్టో బూటకం
ఏర్పేడు: చంద్రబాబు ప్రవేశపెట్టిన మేనిఫెస్టో అంతా బూటకమని.. ఆ మేనిఫెస్టోను నమ్మి మోసపోవద్దని ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్రెడ్డి ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. ఆయన మంగళవారం మండలంలోని ముసలిపేడు, సరస్వతీకండ్రిగ, రాచపాళెం, కందాడు, ఎస్సీ కాలనీ, రాజులకండ్రిగ, మడిబాక, పాయిల్ సెంటర్, చెల్లూరు, కుమ్మరికండ్రిగ, గుండ్లకండ్రిగ, కుక్కలగుంట వరకు ఎన్నికల ప్రచార రోడ్షో నిర్వహించారు. ఆయా గ్రామాల ప్రజలు ఆయనకు బ్రహ్మరథం పట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో మరోసారి తనను ఎమ్మెల్యేగా గెలిపిస్తే శ్రీకాళహస్తి నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేస్తామని చెప్పారు. వైఎస్సార్సీపీ మండల ఇన్చార్జ్ గున్నేరి కిషోర్రెడ్డి, వైస్ ఎంపీపీలు జనార్దన్రెడ్డి, శ్రీనివాసులు, సర్పంచ్లు శ్రీదేవి,చెంగల్రాజు, సుబ్ర మణ్యం, జయముని, మోహనప్రియ, మాజీ సర్పంచ్ వీరరాఘవరెడ్డి, కో–ఆప్షన్ సభ్యుడు బత్తిశెట్టి, వైఎస్సార్ సీపీ మండల అధ్యక్షుడు రమణయ్యయాదవ్, సర్పంచ్ల సంఘం మండల అధ్యక్షుడు శివయ్య, సింగిల్విండో అధ్యక్షుడు జనార్దన్యాదవ్, మాజీ అధ్యక్షుడు నాగార్జునరెడ్డి, పార్టీ నాయకులు కందాటి ప్రభాకర్రెడ్డి, పారి నాగరాజు, లోకనాథరెడ్డి, అయోధ్య, ప్రభాకర్రెడ్డి, శేఖర్రెడ్డి, చల్లా సుబ్రమణ్యం, చంద్రారెడ్డి, గోపీయాదవ్, మధుయాదవ్, జీపీ యాదవ్, మునికృష్ణారెడ్డి, పరమాల చంద్రశేఖర్, రుప్పాల వెంకటేష్, గాలి గుణశేఖర్ నాయుడు, గురునాథం, రవియాదవ్, మణిరాజు, కేశవులురెడ్డి, రాంబత్తెయ్య, రాజులపాలెం రమేష్ పాల్గొన్నారు. -
కళ్లుగప్పి
ఎన్నికల వేళ జిల్లాలోకి కర్ణాటక మద్యం యథేచ్ఛగా ప్రవేశిస్తోంది. ఓటర్లను మత్తులో ముంచేందుకు సరిహద్దులను దాటి చొరబడుతోంది. ఈ మేరకు అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. ఎక్కడికక్కడ నిఘాను కట్టుదిట్టం చేసింది. ఈ క్రమంలోనే మంగళవారం బంగారుపాళ్యం వద్ద రూ.లక్షల విలువైన కన్నడ లిక్కర్ తీసుకువస్తున్న ఓ కంటెయినర్ పోలీసులకు పట్టుబడింది. విచారణలో ఈ లోడ్ తిరుపతికి వెళుతున్నట్లు వెల్లడైంది. మద్యం తరలింపు వెనుక కూటమి అభ్యర్థుల హస్తం ఉన్నట్లు తెలిసింది.చిత్తూరు అర్బన్ : ఎన్నికల సందర్భంగా ప్రలోభాల పర్వం మొదలైంది. ఓటర్లకు డబ్బు, మద్యం పంపిణీకి రంగం సిద్ధమైంది. ఇందులో కూటమి అభ్యర్థులు విచ్చలవిడిగా ఓటర్లకు ఎరవేస్తున్నట్లు సమాచారం. ముఖ్యంగా మద్యం బాటిళ్లను వెదజల్లి ఓట్లు రాబట్టుకోవాలని యత్నిస్తున్నట్లు సమాచారం. అయితే ఇక్కడి ప్రభుత్వ వైన్షాపుల్లో క్వార్టర్ కొనాలంటే కనీసం రూ.130–రూ.150 చెల్లించాల్సిఉంటుంది. అదే కర్ణాటకలో అయితే కేవలం రూ.35కు టెట్రా ప్యాకెట్, రూ.75కు క్వార్టర్ దొరుకుతోంది. దీంతో చీప్గా కన్నడ మద్యం కొనుగోలు చేసి జిల్లాకు అక్రమంగా తీసుకువస్తున్నట్లు తెలుస్తోంది. ఈ స్మగ్లింగ్ వ్యవహారానికి కూటమి అభ్యర్థులు పకడ్బందీ ప్రణాళిక రూపొందించినట్లు సమాచారం.రూ.లక్షల మద్యం పట్టివేతఎన్నికల్లో ఎలాగైనా గెలవాలనే లక్ష్యంతో కూటమి అభ్యర్థులు మరింత బరితెగిస్తున్నారు. ఓటర్లకు తాయిలాలతో ఎరవేస్తున్నారు. అందులో భాగంగా కర్ణాటక నుంచి చీప్ లిక్కర్ తెప్పించి ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. ఈ క్రమంలోనే మంగళవారం బంగారుపాళ్యం సమీంలోని టోల్గేటు వద్ద ఓ కంటైనర్ను పోలీసులు అడ్డుకున్నారు. అందులో పరిశీలిస్తే రూ.43 లక్షల విలువైన కర్ణాటక మద్యం కనిపించింది. నిందితులను అదుపులోకి తీసుకుని విచారిస్తే విస్తుబోయే వాస్తవాలు వెలుగుచూశాయి. మద్యం లోడ్ను తిరుపతికి తరలిస్తున్నట్లు నిందితులు వెల్లడించారు. ఇందులో కూటమి పార్టీలకు చెందిన నేతలు కీలక పాత్ర పోషించినట్లు తెలిపారు. కర్ణాటకలో తక్కువ ధరకే మద్యం కొనుగోలు చేసి ఇక్కడి ఓటర్లకు పంపిణీ చేయాలని ప్లాన్ వేసినట్లు వివరించారు. ఇందుకోసం కూటమి అభ్యర్థులు తమ పార్టీలకు చెందిన కొందరు నేతలతో కలిసి మొత్తం వ్యవహారం నడిపించిట్లు తెలిసింది ముందుగా బెంగళూరుకు చెందిన ప్రకాష్ అనే వ్యక్తి ద్వారా 713 బాక్సుల కర్ణాటక మద్యాన్ని ఓ కంటైనర్లోకి ఎక్కించుకుని నామాల ముని కేశవ (కిరణ్) మరో ఇద్దరు జిల్లాకు బయలుదేరారు. సోమవారం రాత్రి నంగిలి వద్ద ఈ కంటైనర్ను పట్టుకోవడానికి పోలీసులు ప్రయత్నిస్తే, తప్పించుకున్నారు. చివరకు బంగారుపాళ్యం వద్ద, కంటైనర్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ క్రమంలో నిందితులు పరారయ్యేందుకు యత్నించగా పోలీసులు వెంటబడి పట్టుకున్నారు. మద్యం స్మగ్లింగ్లో పూతలపట్టుకు చెందిన టీడీపీ నేత హస్తం ఉన్నట్లు పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. వీరికి కుప్పం నియోజకవర్గానికి పచ్చ నేత సహకరించినట్లు తెలిసింది. కంటెయినర్లోని మద్యంలో కొంత పూతలపట్టులో డంప్ చేసి మిగిలింది తిరుపతి తరలించాలని తమకు ఆదేశాలు అందినట్లు నిందితులు వెల్లడించారు. ఈ మేరకు పోలీసులు పలువురిపై కేసులు నమోదు చేశారు. మద్యం స్మగ్లింగ్కు సహకరించిన కారణంగా కుప్పానికి చెందిన తెలుగునాడు స్టూడెంట్ ఫెరడేషన్ రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాస్పై పోలీసులు కేసు నమోదుచేశారు. అయితే శ్రీనివాస్ పరారీలో ఉన్నట్లు సమాచారం. అలాగే కర్ణాటకలో మద్యం విక్రయించిన బెంగళూరుకు చెందిన డిస్టిలరీ యజమాని, వైన్షాప్ ఓనర్, క్యాషియర్పై కూడా పోలీసులు కేసులు నమోదు చేశారు. -
శిక్షణకు 26 మంది డుమ్మా
తిరుపతి అర్బన్: సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో శిక్షణకు డుమ్మాకొట్టిన 26 మంది పీఓలు, ఏపీవోలకు సెక్షన్ 134 ప్రకారం షోకాజ్ నోటీసులు జారీ చేసినట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ప్రవీణ్కుమార్ తెలిపారు. ప్రిసైడింగ్, అసిస్టెంట్ ప్రిసైడింగ్ అధికారులకు రెండు వారాల వ్యవధిలో రెండు సార్లు ఎన్నికల నిర్వహణపై శిక్షణ ఇచ్చామని చెప్పారు. అయితే రెండో సారి నిర్వహించిన శిక్షణకు 4,524 మందికి గాను 4,498 మంది మాత్రమే హాజరయ్యారని, ఇందులో 26 మంది ముందుస్తుగా ఎటువంటి సమాచారం ఇవ్వకుండానే శిక్షణకు డుమ్మాకొట్టారని వెల్లడించారు. మూడు రోజుల్లో వారు సరైన వివరణ ఇవ్వకుంటే ఎన్నికల నియమావళి ప్రకారం చర్యలు తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు. శ్రీవారి దర్శనానికి 8 గంటలు తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. క్యూకాంప్లెక్స్లో కంపార్ట్మెంట్లు అన్నీ ఖాళీగా ఉన్నాయి. సోమవారం అర్ధరాత్రి వరకు 76,748 మంది స్వామివారిని దర్శించుకోగా 30,688 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ.4.10 కోట్లు సమర్పించారు. టైంస్లాట్ టిక్కెట్లు కలిగిన భక్తులకు సకాలంలోనే దర్శనమవుతోంది. దర్శన టిక్కెట్లు లేని భక్తులకు 8 గంటల్లో దర్శనం లభిస్తోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లు కలిగిన భక్తులకు 2 గంటల్లో దర్శనం లభిస్తోంది. డిగ్రీ ఫలితాలు విడుదలతిరుపతి సిటీ : ఎస్వీయూ పరిధిలో గత ఏడాది డిసెంబర్లో నిర్వహించిన డిగ్రీ అన్ని గ్రూపులకు సంబంధించిన ఐదో సెమిస్టర్ ఫలితాలను మంగళవారం విడుదల చేసినట్లు పరీక్షల నియంత్రణాధికారి దామ్లానాయక్ తెలిపారు. ఫలితాలను వర్సిటీ వెబ్సైట్ నందు ఆన్లైల్లో అందుబాటులో ఉంచామని ఆయన వెల్లడించారు. పారదర్శకంగా ఎన్నికల ప్రక్రియ తిరుపతి అర్బన్: సార్వత్రిక ఎన్నికల ప్రక్రియ పారదర్శకంగా నిర్వహించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ప్రవీణ్కుమార్ సిబ్బందిని ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్లో ఆయన సంబంధిత అధికారులతో సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ ఓటర్ స్లిప్పులు పంపిణీ నిబంధనల మేరకు జరగాలన్నారు. పోలింగ్ కేంద్రాల్లో షేడ్, తాగు నీరు, లైటింగ్, ర్యాంపు, వీల్ చైర్ ఏర్పాటు చేయాలని చెప్పారు. పీడబ్ల్యూడీ, సీనియర్ సిటిజన్స్ ఓటింగ్ కోసం వెయిటింగ్ లేకుండా ప్రత్యేక చర్యలు చేపట్టాలన్నారు. కార్యక్రమంలో డీఆర్వో పెంచలకిషోర్, జిల్లా నోడల్ అధికారులు, ఎన్నికల సెక్షన్ సిబ్బంది పాల్గొన్నారు. అనుమతులు తప్పనిసరితిరుపతి అర్బన్: సార్వత్రిక ఎన్నికల పోలింగ్ రోజు, దానికి ముందు రోజు ప్రింట్ మీడియాలో అభ్యర్థులకు సంబంధించిన రాజకీయ ప్రకటనలకు తప్పనిసరిగా అనుమతులు తీసుకోవాలని కలెక్టర్ ప్రవీణ్కుమార్ స్పష్టం చేశారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ రాజకీయ ప్రకటనలకు రెండు రోజుల ముందే అనుమతుల కోసం దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. విద్వేషపూరిత ప్రకటనల కారణంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు చేపడతామన్నారు. 96 శాతం హోమ్ ఓటింగ్ తిరుపతి అర్బన్ : జిల్లా వ్యాప్తంగా ఏడు నియోజకవర్గాల్లో హోమ్ ఓటింగ్ 96 శాతం పూర్తయింది. 1,139 మంది ఓటర్లు ఉండగా.. అందులో 1,077 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. -
అధికార దాహంతో పేట్రేగుతున్న కూటమి
● ప్యాకేజీ స్టార్కు రాజకీయ పరిణితి లేదు ● అవినీతి, అరాచకాలకు బ్రాండ్ అంబాసిడర్ ఆరణి ● 45వ డివిజన్ ఎన్నికల ప్రచారంలో ఎమ్మెల్యే భూమన ధ్వజం తిరుపతి మంగళం: ‘అధికారమే ధ్యేయంగా.. అరాచక పాలనే లక్ష్యంగా.. కూటమి నేతలు పేట్రేగిపోతున్నారు’ అని టీటీడీ చైర్మన్, ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి ధ్వజమెత్తారు. తిరుపతి 45వ డివిజన్లో మంగళవారం కార్పొరేటర్ డాక్టర్ అనీష్రాయల్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే ఇంటింటా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ప్రతి గడపకూ వెళ్లి జగనన్న అందించిన సంక్షేమం, తిరుపతిలో అభినయ్ చేసిన అభివృద్థిని స్థానిక ప్రజలకు ఆయన వివరించారు. రానున్న ఎన్నికల్లో సీఎంగా జగనన్నను, తిరుపతి ఎమ్మెల్యే అభ్యర్థి భూమన అభినయ్ని గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. అనంతరం ఎమ్మెల్యే భూమన మాట్లాడుతూ చంద్రబాబు, పవన్కళ్యాణ్కు అధికార దాహం తప్ప ప్రజాసంక్షేమం అవసరం లేదన్నారు. 14 ఏళ్ల చంద్రబాబు పాలనలో ఏ ఒక్కరికీ మేలు చేసిన పాపానపోలేదన్నారు. అందుకే ఒంటరిగా ఎన్నికల్లో పోటీచేసే ధైర్యం లేక జనసేన, బీజేపీతో పొత్తుపెట్టుకుని మరోసారి ప్రజలను మోసం చేయాలని చూస్తున్నారన్నారు. చంద్రబాబు ప్రజలకు మంచి చేసి ఉంటే కూటమిగా ఏర్పడాల్సిన అవసరం ఉండేదా? అని ప్రశ్నించారు. పదేళ్లుగా పవన్కళ్యాణ్ రాజకీయంలో ఉన్నా కనీస అవగాహనలేక, ప్రజామద్దతు లభించక ఏమి చేయాలో దిక్కుతోచక చంద్రబాబుతో పొత్తు పెట్టుకుని ఫ్యాకేజీలతో సర్దేస్తున్నారని ఆరోపించారు. రూ.30కోట్లు లంచం తీసుకుని తిరుపతి జనసేన టికెట్ను ఆరణి శ్రీనివాసులుకు ఇచ్చారంటే ఎంత ప్యాకేజీ స్టారో అర్థమవుతోందన్నారు. చిత్తూరు రౌడీయిజం పనికిరాదు ప్రశాంతమైన తిరుపతి పుణ్యక్షేత్రంలో కూటమి అభ్యర్థి ఆరణి శ్రీనివాసులు చిత్తూరు రౌడీయిజాన్ని తీసుకొచ్చి అరాచకాలు సృష్టిస్తున్నాడని ఎమ్మెల్యే భూమన మండిపడ్డారు. చిత్తూరులో ఆరణి జీవితం అవినీతి, అరాచకాలతో నిండిందని, అక్కడ దోచు కుని, దాచుకున్న డబ్బుల్లో రూ.30 కోట్లు పవన్కళ్యాణ్కు లంచంగా ఇచ్చి తిరుపతిలో జనసేన టికె ట్ తెచ్చుకున్నారని ఆరోపించారు. చిత్తూరులోని ప్రజలకు చిన్నపాటి మేలు కూడా చేయలేదని తమ నాయకుడు వైఎస్.జగన్మోహన్రెడ్డి ఆరణికి టికెట్ ఇవ్వలేదని గుర్తుచేశారు. తిరుపతి ప్రజలు భూమన కుటుంబానికి ఇస్తున్న ఆదరణ చూసి ఓర్వలేక తమపై నోటికి వచ్చిన ఆరోపణలు చేస్తున్నాడని మండిపడ్డారు. దొంగలు దొంగలు ఊళ్లు పంచుకున్నట్లు తిరుపతిలో కూటమి పేరుతో అందరూ ఒక్కటయ్యారన్నారు. తిరుపతి ప్రజలంతా అభినయ్కే మద్దతుగా ఉన్నారని తెలిపారు. కార్యక్రమంలో పార్టీ సీనియర్ నాయకులు దొడ్డారెడ్డి సిద్ధారెడ్డి, పార్టీ నగర అధ్యక్షులు పాలగిరి ప్రతాప్రెడ్డి, నాయకులు కదిరి రా జేంద్ర, రాజేశ్వరి, మాధవనాయుడు పాల్గొన్నారు. -
విద్యుత్ షాక్తో చిన్నారి మృతి
– మరో చిన్నారికి తీవ్ర గాయాలు చిల్లకూరు : తండ్రితో కలిసి గొర్రెలు మేపేందుకు వెళ్లిని ఓ చిన్నారిని విద్యుత్ తీగ బలిగొంది. మరో చిన్నారిని గాయాలు పాలు చేసింది. ఈ విషాద సంఘటన మంగళవారం తీర ప్రాంతంలోని బకింగ్ హాం కెనాల్కు అవతలి వైపున చోటుచేసుకుంది. స్థానికుల వివరాలు.. మండలంలోని తీర ప్రాంత గ్రామమైన తూర్పుకనుపూరు పంచాయతీలోని ఈదులవారిపాళెం గ్రామానికి చెందినసిద్ధయ్య, ముత్యాలయ్య అనే గిరిజన కుటుంబాల వారికి గొర్రెలు ఉన్నాయి. వాటిని మేపుకునేందుకు గ్రామానికి సమీపంలో ఉన్న బకింగ్హాం కెనాల్కు అవతలి వైపు వెళ్తుంటారు. ఈ క్రమంలో ఇద్దరి కుమారులు మునేంద్ర(8), సతీష్(9) కూడా వారితో వెళ్లారు. ఎండ తీవ్రత ఎక్కువగా ఉండడంతో చిన్నారులిద్దర్నీ ఇంటికి వెళ్లమని తండ్రులు వారికి నచ్చజెప్పారు. చిన్నారులిద్దరూ ఇంటికి వచ్చే క్రమంలో కాలువకు దగ్గరగా ఉన్న 11 కేవీ విద్యుత్ తీగ తెగిపడి ఉండడంతో గుర్తించక దానిపై కాలు వేశారు. మునేంద్ర అక్కడికక్కడే కాలిపోయి మృతి చెందగా సతీష్కు కాళ్లు కాలి పోయి అపస్మారక స్థితికి చేరుకున్నాడు. ప్రమాదాన్ని గమనించి ఇద్దరు తండ్రులు సంఘటనా స్థలానికి చేరుకుని బోరున విలపిస్తూ ఇద్దరు బిడ్డలను ఇంటికి చేర్చారు. ఆపై తీవ్రంగా గాయపడిన సతీష్ను ఆస్పత్రికి తరలించారు. మునేంద్ర మృతదేహం వద్ద కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. దీనిపై పోలీసులకు ఎలాంటి సమాచారం అందలేదు. విద్యుత్ తీగ తెగిపడిన విషయమై ఆ శాఖ ఏఈని వివరణ కోరగా.. తమకు కూడా సమాచారం అందిందని, వివరాలు సేకరిస్తున్నామని తెలిపారు. -
విద్యుత్ షాక్తో బాలుడి మృతి
తెగిపడిన విద్యుత్ వైరుపై కాలు వేయడంతో ఓ బాలుడు మృతిచెందాడు. ఈ ఘటన చిల్లకూరు మండలంలో చోటు చేసుకుంది. జగన్తోనే జనం మెచ్చిన పాలన శ్రీకాళహస్తి(తొట్టంబేడు): జనం మెచ్చిన పాలన వైఎస్.జగన్మోహన్రెడ్డితోనే సాధ్యమని ఎమ్మెల్సీ, రష్ హాస్పిటల్ అధినేత డాక్టర్ సిపాయి సుబ్రమణ్యం అన్నారు. వైఎస్సార్సీపీ అభ్యర్థుల విజయం కోసం మంగళవారం ఆయన శ్రీకాళహస్తి మండలం, వెంకటాపురంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా సిపాయి మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల ద్వారా ప్రతి కుటుంబానికీ లబ్ధి చేకూరిందన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాలు పలు రాష్ట్రాలకు ఆదర్శనీయంగా నిలిచాయని కొనియాడారు. ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్రెడ్డి శ్రీకాళహస్తి నియోజకవర్గ ప్రజలకు చేసిన సేవలను గుర్తుచేశారు. రానున్న ఎన్నికల్లో వైఎస్సార్సీపీని గెలిపించాలని కోరారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు, కార్యకర్తలు సిపాయి సమక్షంలో పార్టీలో చేరగా, వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు సర్పంచ్ రామిరెడ్డి, వడ్లతాంగల్ బాలాజీ ప్రసాద్రెడ్డి, చెంగల్రాయరెడ్డి, మునిశేఖర్, మనోహర్రెడ్డి, సుబ్రమణ్యం పాల్గొన్నారు. రెండు రోజుల ముందే మద్యం విక్రయాలకు బ్రేక్ తిరుపతి అర్బన్: ఎన్నికల నేపథ్యంలో ఈనెల 11 సాయంత్రం 7 నుంచి 13వ తేదీ సాయంత్రం 7 గంటల వరకు మద్యం దుకాణాలు మూసివేయాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ప్రవీణ్కుమార్ సిబ్బందిని ఆదేశించారు. నిబందనలకు విరుద్ధంగా విక్రయిస్తే 9177119097, 9492630970 ఎకై ్సజ్ కంట్రోల్ రూమ్ నంబర్లకు సమాచారం అందించాలని ఆయన సూచించారు. జిల్లా ఎకై ్సజ్ అధికారి జానకీరామ్, గూడూరు డిపో మేనేజర్ శ్రీసత్యనారాయణ బాబు, డిస్టిలరీ అధికారిణి శ్రీమతి ప్రమీలాదేవి, ఏసీ విజిలెన్స్ ఇన్స్పెక్టర్ సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. – 8లో -
‘గుడ్’మార్నింగ్
ప్రజాభిప్రాయ సేకరణలో భాగంగా మంగళవారం ‘సాక్షి’ బృందం సత్యవేడు నియోజకవర్గంలో విలేజ్ విజిట్ నిర్వహించింది. ఈ సందర్భంగా నియోజకవర్గంలోని ఏడు మండలాలను సందర్శించింది. ఈ క్రమంలో ముందుగా బుచ్చినాయుడుకండ్రిగ మండలం, కుక్కంబాకం గ్రామం నుంచి రోడ్షో ప్రారంభమైంది. అక్కడి నుంచి బయలుదేరి వరదయ్యపాళెం మండలంలోని చిన్న పాండూరుకు.. అక్కడి నుంచి నియోజకవర్గ కేంద్రమైన సత్యవేడులోకి ప్రవేశించింది. ఆ తర్వాత సత్యవేడు–ఊత్తుకోట ప్రధాన రహదారి మీదుగా నాగలాపురం మండలంలోని కారణి గ్రామంలోకి, ఆ తర్వాత అదే మార్గంలో పుత్తూరుకు వెళ్లే జాతీయ రహదారి మీదుగా పిచ్చాటూరు మండలంలోని గోవర్థనగిరి గ్రామాన్ని సందర్శించింది. అక్కడి నుంచి నారాయణవనం మండలంలోకి ప్రవేశించి, వెంకటకృష్ణపాళెం పంచాయతీ, నాగిలేరు గ్రామాన్ని సందర్శించి.. అక్కడి నుంచి వెనుదిరిగి పిచ్చాటూరు–శ్రీకాళహస్తి ప్రధాన రోడ్డు మార్గంలోని కేవీబీపురం మండలంలోని పెరిందేశం గ్రామాన్ని సందర్శించింది. ఆయా గ్రామాలలో ఈ ఐదేళ్లలో చేపట్టిన అభివృద్ధి పనులపై ప్రజలను అడిగి తెలుసుకుంది. ..వారి మాటల్లోనే. – వరదయ్యపాళెం -
పల్లె మురిసే!
ప్రగతి మెరిసే.. సత్యవేడు నియోజకవర్గంలో ‘సాక్షి’ విలేజ్ విజిట్ ● ఏడు మండలాల్లో పర్యటన ● అభివృద్ధి పనుల పరిశీలన ● స్థానికుల అభిప్రాయాలను సేకరించిన బృందంమత్తేరిమిట్ట గ్రామంలో నాడు–నేడు సొబగులుచదువు విలువ తెలుసు కాబట్టే..! చదువు విలువ తెలుసు కాబట్టే రాష్ట్ర ప్రభుత్వం ఈ ఐదేళ్లలో విద్యకు ప్రాధాన్యమిచ్చింది. నాడు–నేడుతో ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు సమూలంగా మార్చేసింది. మా గ్రామంలోని ప్రాథమిక పాఠశాలను చూస్తే నమ్మలేకపోయా. అక్కడ కార్పొరేట్కన్నా మిన్నగా వసతులు సమకూర్చారు. ఇంత గొప్ప ఆలోచనతో ముందుకెళ్తున్న ప్రభుత్వానికే ప్రజల ఆశీర్వాదం ఉంటుందని నమ్ముతున్నా. –ధర్మలింగం, సర్పంచ్, వీకేపాళ్యం, నారాయణవనం మండలం ఊళ్లోనే నాణ్యమైన వైద్యం గత సంవత్సరం వరకు మా గ్రామంలో ఎటువంటి ఆస్పత్రి లేదు. జ్వరం, జలుబు వంటి చిన్నచిన్న రోగాలొచ్చినా ఏడు మైళ్ల దూరంలో ఉన్న పిచ్చాటూరు, నాగలాపురం మండల కేంద్రాలకు వెళ్లాల్సి వచ్చేది. అయితే ఇప్పుడు ఆరోగ్యపరంగా ఏ సమస్య వచ్చినా వెంటనే వైఎస్ఆర్ హెల్త్ క్లినిక్కు వెళ్తే చాలు.. అక్కడే పరీక్షలు చేస్తున్నారు. ఉచితంగా మందులు, మాత్రలు కూడా ఇస్తున్నారు. ఇప్పుడు వైద్యం కోసం మేము ఎక్కడికీ వెళ్లాల్సిన పనిలేదు. పేదలకు ఇంత మంచి చేసిన ప్రభుతానికే మేమంతా అండగా ఉంటాం. –వీ.లక్ష్మమ్మ, గోవర్దనగిరి హరిజనవాడ, పిచ్చాటూరు మండలం -
వైఎస్సార్సీపీలోకి భారీగా చేరికలు
వెంకటగిరి రూరల్: మండలంలోని చెలికంపాడు గ్రామానికి చెందిన 20 టీడీపీ కుటుంబాలు వైఎస్సార్సీపీలో చేరాయి. వారికి వైఎస్సార్సీపీ తిరుపతి జిల్లా అధ్యక్షులు, వెంకటగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి నేదురుమల్లి రామ్కుమార్రెడ్డి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. వైఎస్సార్ కాంగ్రెస్పార్టీ మండల అధ్యక్షులు కాల్తిరెడ్డి శ్రీనివాసులరెడ్డి, సర్పంచ్ వెంకటరణమ్మ, నారాయణ తదితరులు పాల్గొన్నారు. వైఎస్సార్సీపీలో 50 కుటుంబాల చేరిక నాయుడుపేట టౌన్: పట్టణంలోని సంజయ్గాంధీ కాలనీలో స్థానిక వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కాకు జగదీష్రెడ్డి సారధ్యంలో 50 కుటుంబాలు సోమవారం రాత్రి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరాయి. ఎమ్మెల్యే అభ్యర్థి సంజీవయ్య సతీమణి కిలివేటి సుభాషిణి అక్కడి నాయకులు కామిరెడ్డి మోహన్రెడ్డితో కలిసి వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఆ పార్టీలో ఇమడలేం నారాయణవనం: మండలంలోని అరణ్యంకండ్రిగ పంచాయతీకి చెందిన ఇద్దరు యువకులు వైఎస్సార్సీపీలో చేరారు. వారికి ఎమ్మెల్యే అభ్యర్థి నూకతోటి రాజేష్ కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. కాగా రెండు వారాల క్రితం పంచాయతీ పరిధిలోని కప్పలమాదిగ ఇళ్లుకు చెందిన సురేష్, జీఎన్ కండ్రిగకు చెందిన సురేష్ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కోనేటి ఆదిమూలం ఆధ్వర్యంలో టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. తిరిగి వారు సోమవారం రాత్రి వైఎస్సార్సీపీలో చేరారు. టీడీపీలో ఇమడలేకే మళ్లీ వైఎస్సార్సీపీలో చేరినట్టు వారు పేర్కొన్నారు. అరణ్యంకండ్రిగ ఉప సర్పంచ్ మురళి, మాజీ వైస్ ఎంపీపీ వెంకటేష్, నాయకులు ఆపిల్, కార్తవరాయన్ పాల్గొన్నారు. -
టీడీపీలో భగ్గుమంటున్న విభేదాలు
సైదాపురం: సైదాపురం మండలంలో టీడీపీ నేతల మధ్య రోజురోజుకు విభేదాలు తార స్థాయికి చేరుకుంటున్నాయి. ఇటీవలే పార్టీలో చేరిన నేత వల్ల మరిన్ని వివాదాలు చెలరేగుతున్నాయి. మండలంలోని మర్లపూడి గ్రామంలో ఆదివారం అర్ధరాత్రి టీడీపీలో వర్గ పోరు శ్రుతిమించింది. టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కురుగొండ్ల రామకృష్ణ ఎదుటే టీడీపీ జెండాలను తగలబెట్టిన విషయం విధితమే. ఈ విషయం మరువకముందే సోమవారం ఓ నేత ఇంటి వద్ద రామసాగరం నేతల మధ్య తీవ్ర స్థాయిలో వివాదాలు చెలరేగాయి. ఈ క్రమంలోనే రామసాగరం పంచాయతీ పరిధిలో మంగళవారం రాత్రి మాజీ ఏఎంసీ చైర్మన్ బీ మస్తాన్ నాయుడు, మాజీ సర్పంచ్ సుబ్రమణ్యం నాయుడు మధ్య వివాదం చోటు చేసుకుంది. దీంతో మనస్తాపం చెందిన మాజీ ఏఎంసీ చైర్మన్ బీ.మస్తాన్నాయుడితో పాటు గ్రామ టీడీపీ అధ్యక్షుడు జనార్దన్నాయుడు, బూత్ కమిటీ కన్వీనర్ కురుగొండ ఈశ్వరయ్యతో పాటు ఆయన అనుచరులు సుమారు 500 మంది టీడీపీకి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. ఇది మండలంలో చర్చనీయాంశమైంది. -
ఓట్ల కొనుగోళ్లపై కూటమి ఫోకస్
పోస్టల్ బ్యాలెట్ ఓట్ల పోలింగ్లో అనుకూలంగా లేకపోవడంతో కూటమి అభ్యర్థులు షాక్కు గురయ్యారు. దీంతో పల్లెలు, పట్టణాలు, నగరాల్లోని ఓటర్ల కొనుగోలుపై దృష్టి సారించారు. తిరుపతి నగరంలో కూటమి అభ్యర్థి తాను అక్రమంగా సంపాదించిన సొమ్ముతో కొందరు ఓటర్లను ప్రలోభాలకు గురిచేసినట్లు ప్రచారం జరుగుతోంది. నగరంలో ఇద్దరు కార్పొరేటర్లను భారీగా నగదు, బంగారం ఆభరణాలు ఇచ్చి కొనుగోలు చేసినట్లు విశ్వసనీయ సమాచారం. మరికొందరు కార్పొరేటర్ల కోసం ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. ఇకపోతే ఎన్నికల సమయంలో తమకు అనుకూలంగా ఉండేందుకు కొందరు అధికారులను రోజూ మద్యం బార్లకు తీసుకెళ్లి బేరసారాలు అడుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. మద్యం బార్లలో కుదిరిన బేరంతో కొందరు అధికారులు నగదు, బంగారు ఆభరణాలు తీసుకొస్తుండగా తోటి సిబ్బంది ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినట్లు విశ్వసనీయ సమాచారం. ఇదిలా ఉంటే.. శ్రీకాళహస్తి నియోజకవర్గ పరిధిలో బొజ్జల అనుచరులు వాట్సాప్ కాల్ చేసి బెదిరింపులకు గురిచేస్తున్నారు. కుటుంబ యజమాని ఫోన్ తియ్యకపోతే.. ఆ గ్రామాల్లో ఉన్న అనుచరుల ద్వారా బంధువులపై ఒత్తిళ్లు చేస్తున్నారు. ఇది ఒక్క శ్రీకాళహస్తిలోనే కాదు.. కుప్పం నుంచి గూడూరు వరకు నిత్యం గ్రామాల్లో జరుగుతున్న తంతు. కూటమి అభ్యర్థుల మాట వినకపోతే వారితో గొడవలకు దిగి ప్రశాంతంగా ఉన్న పల్లెల్లో చిచ్చుపెడుతున్నారు. -
రెండో రోజు 86.66 శాతం పోలింగ్
తిరుపతి అర్బన్: జిల్లాలో పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ ప్రశాంతంగా సాగింది. రెండో రోజు అయిన సోమవారం 86.66శాతం నమోదైనట్టు జిల్లా ఎన్నికల అధికారులు పేర్కొన్నారు. పోస్టల్ బ్యాలెట్కు మరో రెండు రోజులు అవకాశం ఉండడంతో వంద శాతం నమోదయ్యే అవకాశం ఉందని తెలిపారు. జిల్లా వ్యాప్తంగా పోస్టల్ బ్యాలెట్ ఓట్లు 22,299 ఉండగా.. ఇప్పటివరకుర 19,508 ఓట్లు పోలయ్యాయని తెలిపారు. ఓటింగ్ సరళి పరిశీలన పోస్టల్బ్యాలెట్ ఓటింగ్ సరళిని జిల్లా ఎన్నికల అధి కారి, కలెక్టర్ ప్రవీణ్కుమార్ పరిశీలించారు. సోమవారం ఆయన తిరుపతి,చంద్రగిరి, శ్రీకాళహ స్తి, సత్యవేడు, సూళ్లూరుపేట నియోజకవర్గాల్లో పర్యటించారు. ఆయా నియోజకవర్గాల్లో ఈవీఎంలను పరిశీలించి సిబ్బందికి పలు సూచనలు చేశారు. మరో అవకాశంసార్వత్రిక ఎన్నికల డ్యూటీలోని ఉద్యోగులకు మే1వ తేదీలోపు ఫారం–12ను సమర్పించలేకపోయిన వారికి పోస్టల్ బ్యాలెట్ ఓటు వేయడానికి మంగళ, బుధవారాలు అవకాశం కల్పించినట్లు కలెక్టర్ ప్రవీణ్కుమార్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. వారికి కేటాయించిన ఫెసిలిటేషన్ సెంటర్లో తమ పోస్టల్ బ్యాలెట్ ఓటును సద్వినియోగం చేసుకోవాలని కోరారు. -
మీ నమ్మకాన్ని నిలబెడతాం!
● ఆశీర్వదించండి.. అండగా ఉంటాం ● బీసీల ఆత్మీయ సదస్సులో ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులు మేరిగ, నేదురుమల్లి, గురుమూర్తి పిలుపు వెంకటగిరి(సైదాపురం): ‘ఎమ్మెల్యే, ఎంపీగా తమను గెలిపించండి.. మీ నమ్మకాన్ని నిలబెడతాం.. మీకు వెన్నంటూ ఉంటూ సేవ చేస్తాం’ అని వైఎస్సార్సీపీ వెంకటగిరి ఎమ్మెల్యే అభ్యర్థి నేదురుమల్లి రామ్కుమార్రెడ్డి, తిరుపతి ఎంపీ అభ్యర్థి డాక్టర్ ఎం.గురుమూర్తు స్పష్టం చేశారు. వెంకటగిరిలోని ఎన్జేఆర్ భవనంలో ఎమ్మెల్యే అభ్యర్థి నేదురుమల్లి రామ్కుమార్రెడ్డి ఆధ్వర్యంలో సోమవారం జరిగిన బీసీ ఆత్మీయ సభలో వారు మాట్లాడుతూ మీకు సేవ చేయడానికే రాజకీయ రంగప్రవేశం చేశానని, ఎమ్మెల్యేగా గెలిపిస్తే మీ నమ్మకాన్ని నిలబెట్టుకుంటామని హామీ ఇచ్చారు. గత 40 ఏళ్లుగా వెంకటగిరి నియోజకవర్గ ప్రజలతో నేదురుమల్లి కుటుంబానికి అనుబంధం ఉందని, ఐదేళ్లకు ఒకసారి వచ్చిపోయే రకం కాదని చెప్పారు. మీ కుటుంబ సభ్యుడిగా..మీలో ఒకరిగా వ్యవహరిస్తామన్నారు. ప్రజల కష్టసుఖాల్లో అండగా ఉంటామని తెలిపారు. బాధ్యతగా.. నిజాయితీగా పనిచేస్తామని.. ఆశీర్వదించాలని ఆయన కోరారు. బీసీలకు వైఎస్సార్కాంగ్రెస్ పార్టీ అండదండలు ఎప్పుడూ ఉంటాయని హామీ ఇచ్చారు. వారం రోజుల్లో జరిగే సార్వత్రిక ఎన్నికల్లో బీసీలంతా ఏకమై వైఎస్సార్సీపీ విజయానికి సైనికుల్లా కృషిచేయాలని పిలుపునిచ్చారు. 66 శాతం నిధులు బీసీలకే రాష్ట్రంలో బీసీల అభ్యున్నతికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని, ఇందులో భాగంగా నిధులు కూడా 66 శాతం బీసీలకు కేటాయించారని తిరుపతి ఎంపీ అభ్యర్థి గురుమూర్తి తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో బీసీ సంక్షేమానికి 56 కార్పోరేషన్లు ఏర్పాటు చేసి వారికి పదవుల్లో కూడా సముచిత స్థానం కల్పించారని గుర్తుచేశారు. గతంలో బీసీలంటేనే ఎన్నికల్లో వాడుకోవడం...వదిలేయడం మాత్రమేనని, వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి బీసీ సంక్షేమానికి అహర్నిశలు కృషిచేస్తున్నట్లు తెలిపారు. నిరంతరం శ్రమిస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని అఖండ మెజార్టీతో గెలుపించాలని ఆయన పిలుపునిచ్చారు. కార్యక్రమంలో జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు ఆర్.కృష్ణయ్య, ఎంపీ బీదా మస్తాన్రావు, ఎమ్మెల్సీ పోతుల సునీత, బీసీ కార్పొరేషన్ రాష్ట్ర చైర్మన్ సురేంద్ర, నియోజకవర్గ పరిశీలకులు కొడవలూరు ధనంజయ్యరెడ్డి, వైఎస్సార్సీపీ నాయకులు బొలిగర్ల మస్తాన్యాదవ్, మున్సిపల్ చైర్మన్ నక్కా భానుప్రియ, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ దొంతు శారద, పద్మశాలి కార్పొరేషన్ రాష్ట్ర డైరెక్టర్ నక్కా వెంకటేశ్వర్లు, చేనేత విభాగం రాష్ట్ర కార్యదర్శి మాడా జానకీరామయ్య, నాయకులు దొంతు బాలకృష్ణ, సైదాపురం మండల కన్వీనర్ మన్నారవు రవికుమార్యాదవ్, మున్సిపల్ కౌన్సిలర్లు, వైఎస్సార్సీపీ నేతలు పాల్గొన్నారు. -
నిధుల గోల్మాల్
వరదయ్యపాళెం మండలంలోని చిన్నపాండూరు పీహెచ్సీ గ్రామీణ అలవెన్స్ నిధులు గోల్మాల్పై విచారణ చేపట్టారు. – 8లోకత్తితో నరికి చంపుతారంట ఆదిమూలం కుమారుడు సుమన్ తమను బెదిరిస్తున్నారంటూ టీడీపీ నేతలు కొందరు వీడియో ద్వారా మీడియాకు సమాచారం ఇచ్చారు. ఆదిమూలం అభ్యర్థిత్వం తమకు ఇష్టం లేక మౌనంగా ఉంటే.. తమను వేధింపులకు గురిచేస్తున్నారంటూ ఆందోళన వ్యక్తం చేశారు. ఆదిమూలం కుమారుడు సుమన్ తమను కత్తితో నరికి చంపుతానంటూ బెదిరిస్తున్నారని వీడియో విడుదల చేశారు. టీడీపీ నేతలు విడుదల చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇదిలా ఉంటే.. మాజీ ఎమ్మెల్యే హేమలతను చులకన చేస్తూ మాట్లాడినట్లు ప్రచారం జరుగుతోంది. మాజీ ఎమ్మెల్యేకి ఓటు బ్యాంకింగ్ లేదని, ఇప్పుడు ఆమెను చూసి ఎవ్వరూ ఓటేసే పరిస్థితి లేదని హేమలత అనుచరులకు ఫోన్లు చేసినట్లు సత్యవేడులో టీడీపీ శ్రేణులు చర్చించుకుంటున్నారు. ఆమెకు ఓట్లు లేవని, హేమలత వచ్చినా తనకు ఏ మాత్రం ప్రయోజనం ఉండదని అనుచరుల వద్ద ప్రస్తావించినట్లు తెలిసింది. అదేవిధంగా శ్రీకాళహస్తి మాజీ ఎమ్మెల్యేలు ఎస్సీవీ నాయుడు, సత్రవాడ మునిరామయ్య పైన కూటమి అభ్యర్థి బొజ్జల సుధీర్రెడ్డి తన అనుచరుల వద్ద అనుచిత వ్యాఖ్యలు చేసినట్లు ప్రచారం జరుగుతోంది. ‘వాళ్లను చూసి ఎవడు ఓట్లు వేస్తాడయ్యా.. మా కుటుంబాన్ని చూసే ఓట్లేస్తారు. వాళ్లు సపోర్ట్ చేసినా చెయ్యకపోయినా నాకు వచ్చే ఇబ్బంది ఏమీ లేదు’ అని స్పష్టం చేసినట్లు శ్రీకాళహస్తిలో టీడీపీ శ్రేణులు చర్చించుకుంటున్నారు. – 8లో -
తెలుగు తమ్ముళ్ల అత్యుత్సాహం
శ్రీకాళహస్తి: స్కిట్ కళాశాలలో జరుగుతున్న పోస్టల్ బ్యాలెట్ సమయంలో తెలుగు తమ్ముళ్లు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారు. ఇండిపెండెంట్లకు సంబంధించిన ఏజెంట్ ఫారాలు దక్కించుకుని పదేపదే టీడీపీ నాయకులు లోపలికి, బయటకు రావడం విమర్శలకు తావిస్తోంది. దీనికితోడు పసుపు గొడులు పట్టుకుని, పసుపు కండువాలు ధరించి వైఎస్సార్ సీపీ శిబిరం వద్దకు వచ్చి ప్రచారం చేస్తూ కవ్వింపు చర్యలకు పాల్పడుతున్నారు. ఈ క్రమంలో ఇరువర్గాల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. పోలీసులు కల్పించుకుని టీడీపీ వారిని మందలించి శిబిరాల వద్దకెళ్లి ప్రచారం చేసుకోవాలని సూచించారు. అయినా వినకపోవడంతో సీఐ అజయ్ కల్పించుకుని కేసులు పెడతామని హెచ్చరించడంతో మిన్నకుండిపోయారు. కూటమి హామీలు బూటకం భాకరాపేట : కూటమి మేనిఫెస్టో అంతా బూటకమని, దాన్ని నమ్మి ఓట్లేస్తే సంక్షేమ పథకాలన్నీ ఆగిపోవడం గ్యారంటీ అని చిత్తూరు ఎంపీ అభ్యర్థి ఎన్. రెడ్డెప్ప తెలిపారు. సోమవారం ఎన్నికల ప్రచారంలో భాగంగా చిన్నగొట్టిగల్లు ఇంటింటికీ వెళ్లి ఫ్యాను గుర్తుకు ఓట్లేసి గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కూటమిని రాష్ట్ర ప్రజలు స్వీకరించడం లేదన్నారు. ఇప్పటి వరకు చరిత్రలో కనీవిని ఎరుగని రీతిలో సంక్షేమ పథకాలు నేరుగా లబ్ధిదారులకు అందించిన ఘనత సీఎం జగనన్నకే దక్కుతుందన్నారు. ఇప్పుడు ఎన్ని జెండాలు జత కట్టినా జగనన్న అజెండా మాత్రం పేదల సంక్షేమమేనన్నారు. చంద్రబాబునాయుడు 2014 ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రైతు రుణమాఫీ చేయకుండా వారిని నిలువునా ముంచేశారని గుర్తుచేశారు. అదే వైఎస్సార్సీపీ ప్రభుత్వం మేనిఫెస్టోను పవిత్ర గ్రంధంగా భావించి అమలు చేసినట్టు తెలిపారు. అందుకే ప్రజల సంపూర్ణ మద్దతు జగనన్నకే ఉందని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ ఫ్యాను గుర్తుపై రెండు ఓట్లేసి ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులను గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు కొండారెడ్డి, జేసీఎస్ కన్వీనర్ ఖదీర్అహ్మద్, సర్పంచ్ మనోహర్, డివిజన్ పార్టీ అధ్యక్షుడు అక్బర్ఖాన్, మాజీ సర్పంచ్ భాస్కర్రెడ్డి, మార్కెట్ కమిటీ డైరెక్టర్ బావాజీ, పార్టీ నాయకులు ఇర్షాద్, షాబ్జాన్, శివ, భాస్కర్, రియాజ్ పాల్గొన్నారు. -
జగనన్నతోనే బీసీలకు సముచిత స్థానం
గూడూరురూరల్ : జగనన్నతోనే బీసీలకు న్యాయం జరుగుతుందని, ఈనెల 13న జరిగే ఎన్నికల్లో బీసీలందరూ వైఎస్సార్సీపీని గెలిపించి జగన్మోహన్రెడ్డిని మరలా సీఎంగా ఆశీర్వదించాలని రాజ్యసభ సభ్యులు ఆర్.కృష్ణయ్య, బీద మస్తాన్రావు పిలుపునిచ్చారు. గూడూరు పట్టణంలోని సాయినగర్లో ఏర్పాటైన పీవీఆర్ కల్యాణ మండపంలో సోమవారం జయహో బీసీల ఆత్మీయ సమ్మేళనం అట్టహాసంగా సాగింది. ఈ సమావేశానికి నియోజకవర్గంలోని బీసీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. బీసీ సంఘం జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యులు ఆర్.కృష్ణయ్య మాట్లాడుతూ బీసీ నాయకులు ముఖ్యమంత్రులుగా ఉన్న రాష్ట్రాల్లో కూడా బీసీలకు న్యాయం జరగలేదని, కేవలం సీఎం జగన్మోహన్రెడ్డి మాత్రమే బీసీలను గుర్తించి రాజకీయంగా ప్రాధాన్యత కల్పించారని తెలిపారు. ప్రతిపక్ష నాయకులు చెప్పే మాటలు నమ్మి మోసపోవద్దని సూచించారు. రాజ్యసభ సభ్యులు బీద మస్తాన్రావు మాట్లాడుతూ బీసీలకు చట్ట సభల్లో రిజర్వేషన్లు కల్పించేందుకు కృషి చేసిన నాయకుడు జగన్ మోహన్రెడ్డి అన్నారు. ఈనెల 13న జరిగే సార్వత్రిక ఎన్నికల్లో గూడూరు ఎమ్మెల్యే అభ్యర్థి మేరిగ మురళీధర్ను, తిరుపతి ఎంపీ అభ్యర్థి మద్దిల గురుమూర్తిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. అనంతరం ఆయా నియోజకవర్గాల అభ్యర్థులు మాట్లాడుతూ ప్రతిపక్షాలు విషం చిమ్మడమే పనిగా పెట్టుకున్నాయని, వారు చెప్పే మోసపూరిత వాగ్దానాలను నమ్మొద్దని హితవు పలికారు. బడుగు, బలహీనవర్గాలను అక్కున చేర్చుకున్న జగనన్నకు ఇంకో అవకాశం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. సమావేశంలో ఎమ్మెల్సీ పోతుల సునీత, స్వచ్ఛాంద్ర కార్పొరేషన్ చైర్పర్సన్ పొనకా దేవసేనమ్మ, పట్టణ అధ్యక్షుడు బొమ్మిడి శ్రీనివాసులు, జేసీఎస్ నియోజకవర్గ ఇన్చార్జ్ చేవూరు విజయమోహన్రెడ్డి, జిల్లా అధికార ప్రతినిధి నాసిన నాగులు, దేవరాల సుబ్రమణ్యం, తాళ్లూరు శ్రీనివాసులు, బాలిబోయిన రమేష్, మండ్ల సురేష్బాబు, ట్రేడ్ యూనియన్ నాయకులు రాజారెడ్డి, రాజేష్కుమార్, మొబీన్బాషా, ప్రసాద్గౌడ్, గురుస్వామి, రాజేష్ యాదవ్, కటికాల శేషగిరి, రమేష్ యాదవ్, కోదండరామయ్య, షంషీర్, సాయి పాల్గొన్నారు. -
9న క్రికెట్ సెలెక్షన్స్
తిరుపతి రూరల్: చిత్తూరు జిల్లా క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సీనియర్స్, అండర్ –19 క్రికెట్ సెలెక్షన్స్ చేపట్టనున్నట్లు జిల్లా అధ్యక్షుడు ఎం.శ్రీనివాసులు తెలిపారు. ఈనెల 9వ తేదీన తిరుపతి రూరల్ మండలం, తుమ్మలగుంట వైఎస్ఆర్ గ్రౌండ్స్ వేదికగా ఈ సెలెక్షన్స్ ఉంటాయన్నారు. 2024– 25కి గాను చేపట్టే సీనియర్స్ జట్టుకు వయోపరిమితి లేదన్నారు. అండర్ –19కు మాత్రం 2005 సెప్టెంబర్ 1వ తేదీ నుంచి 2010 సెప్టెంబర్ 1 మధ్య జన్మించిన వారు అర్హులుని తెలిపారు. అండర్ – 19 వారు ఉదయం 8 గంటలకు హాజరు కావాలన్నారు. సీనియర్స్ మధ్యాహ్నం 2 గంటలకు హాజరు కావాలని సూచించారు. క్రీడాకారులు తెల్లని దుస్తులు, సొంత క్రీడా సామగ్రితో రావాలని కోరారు. తమ వెంట ఆధార్ కార్డు, జనన ధ్రువీకరణ పత్రం (ఫామ్ –5) తీసుకురావాలన్నారు. వివరాలకు మురుగన్ 9849026131, చినబాబు 7981880381ను సంప్రదించాలని సూచించారు. -
విద్యార్థి దశ ఎంతో కీలకం
గూడూరు రూరల్: జీవితంలో ఉన్నతంగా ఎదిగేందుకు విద్యార్థి దశ ఎంతో కీలకమని రాజ్యసభ సభ్యులు, నెల్లూరు వైఎస్సార్సీపీ ఎంపీ అభ్యర్థి వేణుంబాక విజయసాయిరెడ్డి అన్నారు. గూడూరు పట్టణ సమీపంలోని ఆదిశంకర ఇంజినీరింగ్ కళాశాలలో సోమవారం యూత్ ఎంపవర్మెంట్ మోటివేషనల్ ప్రోగ్రాం కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఆయన విచ్చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులు విజయసాయిరెడ్డి ఫేస్ మాస్కులు ధరించి వినూత్నంగా ఆయనకు స్వాగతం పలికారు. అనంతరం విజయసాయిరెడ్డి మాట్లాడుతూ విద్యార్థులు తమ కమ్యూనికేషన్ స్కిల్స్ పెంపొందించుకున్నప్పుడే భవిష్యత్ ఉంటుందన్నారు. అన్ని భాషల్లో పట్టుండాలని, అప్పుడే ఏ రంగంలో అయినా రాణించవచ్చని చెప్పారు. ఇంజినీరింగ్ అయిపోయిన తరువాత ఉద్యోగ రంగంలో అయినా లేదా వ్యాపార రంగంలో అయినా మంచి అవకాశాలు ఉన్నాయని, వాటిని అందిపుచ్చుకోవాలని సూచించారు. అనంతరం విజయసాయిరెడ్డిని కళాశాల యాజమాన్యం ఘనంగా సన్మానించారు. కళాశాల డైరెక్టర్ మోహన్, ప్రిన్సిపల్ ధనుంజయ, ఏఓ రామయ్య, హెచ్ఓడీలు, పాల్గొన్నారు. ప్రశాంతంగా హోంఓటింగ్ శ్రీకాళహస్తి: జిల్లాలో హోం ఓటింగ్ ప్రక్రియ ప్రశాంతంగా సాగిందని కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి ప్రవీణ్కుమార్ తెలిపారు. సోమవారం ఆయన మండలంలో జరుగుతున్న హోంఓటింగ్ ఎన్నికల సరళిని పరిశీలించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ 85 ఏళ్లు నిండిన వృద్ధులు, దివ్యాంగులు తాము ఇంటి వద్ద ఓటు వేస్తామని ఫారం–12డీ ద్వారా దరఖాస్తు చేసుకున్నవారందరూ ఇంటి వద్దనే ఓటు వేసే అవకాశన్ని కేంద్ర ఎన్నికల సంఘం కల్పించిందన్నారు. తిరుపతి జిల్లాలో మొత్తం 1139 మంది ఓటర్లు ఉండగా.. అందులో సోమవారం ఒక్కరోజే 955 మంది తమ ఓటు హక్కు వినియోగించుకున్నట్టు ఆయన వెల్లడించారు. మిగిలిన వారు కూడా ఇంటి వద్దనే ఓటు వేయవచ్చని చెప్పారు. -
ఆ పోలింగ్ కేంద్రాలపై ప్రత్యేక దృష్టి
తిరుపతి అర్బన్: జిల్లాలో సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలపై ప్రత్యేక దృష్టి సారించాలని సార్వత్రిక ఎన్నికల రాష్ట్ర ప్రత్యేక పోలీస్ పరిశీలకులు దీపక్మిశ్రా ఆదేశించారు. సోమవారం ఆయన కలెక్టరేట్లో సంబంధిత అధికారులతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కులమతాలకు అతీతంగా పోలీసులు విధులు నిర్వహించాలని చెప్పారు. జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ప్రవీణ్కుమార్ మాట్లాడుతూ జిల్లాలో మొత్తం 2140 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయన్నారు. 8 చోట్ల అంతర్ రాష్ట్ర చెక్ పోస్టులు, 6 అంతర్ జిల్లాల చెక్ పోస్టులు, ఇంటిగ్రేటెడ్ చెక్ పోస్టులు 2 ఏర్పాటు చేసినట్టు వెల్లడించారు. ఎస్పీ కృష్ణకాంత్ పటేల్ మాట్లాడుతూ ఇప్పటివరకు మొత్తం రూ.20.28 కోట్ల విలువైన వాటిని సీజ్ చేసినట్టు వెల్లడించారు. -
సామాజిక న్యాయం జగనన్నతోనే సాధ్యం
● బీసీ ఆత్మీయ సదస్సులో జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య, ఎంపీ బీద మస్తాన్రావు వెల్లడి వెంకటగిరి(సైదాపురం): సామాజిక న్యాయం జగనన్నతోనే సాధ్యమని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య, ఎంపీ బీద మస్తాన్రావు స్పష్టం చేశారు. సోమవారం చిత్తూరు జిల్లా, వెంకటగిరి పట్టణంలోని ఎన్జేఆర్ భవనంలో వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి నేదురుమల్లి రామ్కుమార్రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బీసీ సదస్సులో వారు పాల్గొని ప్రసంగించారు. బీసీ సంక్షేమానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నిరంతరం పాటుపడుతున్నారని ఈ సందర్భంగా వారు కొనియాడారు. ఆంధ్రప్రదేశ్లో నాడు–నేడు, అమ్మఒడి, జనన్న గోరుముద్ద, ఇంగ్లిషు మీడియం చదువులు ప్రవేశ పెట్టి పేదల తలరాతలు మార్చుతున్నారని చెప్పారు. ఎన్నికల సమయంలో మాయమాటలు చెప్పి ప్రజలను మభ్యపెట్టేవారికి ఓటర్లు తమ ఓటుతో బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. తాను 32 ఏళ్లపాటు టీడీపీలో ఉన్నా తనకు ఏనాడూ ప్రాతినిధ్యం ఉన్న పదవికూడా ఇవ్వకుండా మోసం చేశారని ఎంపీ బీద మస్తాన్ రావు గుర్తుచేశారు. మచ్చలేని నేత, మంచివాడు వెంకటగిరి ఎమ్మెల్యే అభ్యర్థి నేదురుమల్లి రామ్కుమర్రెడ్డిని, తిరుపతి ఎంపీ అభ్యర్థి గురుమూర్తిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని వారు పిలుపునిచ్చారు. అనంతరం ఎమ్మెల్సీ పోతుల సునీత మాట్లాడారు. బీసీ కార్పొరేషన్ రాష్ట్ర చైర్మన్ సురేంద్ర, బీసీ నేత డాక్టర్ మస్తాన్యాదవ్ మాట్లాడుతూ బీసీలను వెన్నుపోటు పొడిచే పార్టీ టీడీపీ అని పేర్కొన్నారు. -
ఆరణిని అనర్హుడిగా ప్రకటించండి
తిరుపతి లీగల్: ఎన్నికల నియమావళిని ఉల్లంఘించిన జనసేన పార్టీ తిరుపతి ఎమ్మెల్యే అభ్యర్థి అరణి శ్రీనివాసులును అనర్హుడిగా ప్రకటించాలని అధికారులకు ఫిర్యాదుచేసినట్టు వైఎస్సార్సీపీ తిరుపతి జిల్లా లీగల్ సెల్ అధ్యక్షుడు మునిబాల సుబ్రమణ్యం (దొరబాబు) ఒక ప్రకటనలో పేర్కొన్నారు. గత శుక్రవారం ఎన్నికల ప్రవర్తన నియమావళిని ఉల్లంఘించి తిరుపతి సంజయ్ గాంధీ కాలనీలోని మదీనా మసీదులో ఎన్నికల ప్రచారం నిర్వహించిన జనసేన పార్టీ కార్యకర్తలపైన చర్యలు తీసుకోవాలని ఆదేశించాలని, అలాగే తన కార్యకర్తలను ఇందుకు ప్రోత్సహించి, ప్రేరేపించిన ఆ పార్టీ అభ్యర్థి ఆరణి శ్రీనివాసులును ఎన్నికల్లో పోటీనుంచి తప్పించి అనర్హుడిగా ప్రకటించాలని ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసినట్టు దొరబాబు తెలిపారు. ఆరణి శ్రీనివాసులు చేస్తున్న చట్ట వ్యతిరేక కార్యకలాపాలు రోజు రోజుకీ శ్రుతి మించుతున్నాయని దొరబాబు ఆగ్రహం వ్యక్తంచేశారు. ఈమేరకు తాను తిరుపతి శాసనసభ రిటర్నింగ్ అధికారిణికి, జిల్లా ఎన్నికల అధికారికి, రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేశానని ఆయన పేర్కొన్నారు. -
● తన లారీలతో ఇబ్బడిముబ్బడిగా అక్రమ వ్యాపారం ● జీరోదందాతో నడిపేస్తున్న వైనం ● అడ్డొస్తే అంతే సంగతులు
సాక్షి, నెట్వర్క్: వెంకటగిరి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కురుగొండ్ల రామకృష్ణ దందా అంతాఇంతా కాదు. 2014లో అధికారంలోకి వచ్చిన వెంటనే తన అవినీతి సామ్రాజ్యాన్ని మరింత విస్తరించారు. తన లారీలను నిత్యం జీరోదందా (ట్యాక్స్ చెల్లించకుండా సరుకుల అక్రమరవాణా)తో నడిపేవారు. చైన్నె స్థావరంగా చేసుకుని ఈ క్రమ వ్యాపారాన్ని సాగించేవారు. ఈయన పేరు చైన్నై నుంచి హైదరాబాద్ వరకు జాక్పాట్ రామకృష్ణ అని పిలుస్తుండేవారు. ఆయనకు సంబంధించిన లారీలను రూట్లో ఎవరూ అడ్డగించేవారు కాదు. ఎవరైనా అడ్డగిస్తే నేరుగా వారి కార్యాలయాలకే వెళ్లి హల్చల్చేసేవారు. 1990 ఆరంభంలో చేతిలో చిల్లగవ్వ లేని రామకృష్ణ అనతికాలంలోనే కోట్వీరుడిగా మారిపోయారు. తన చీకటి సామ్రాజ్యాన్ని చైన్నె నుంచి విజయవాడ వరకు విస్తరించారు. దందా..రాకృష్ణ పంథా నాయుడుపేటలో 90వ దశకంలో రెండో రకం గోతాలు అమ్ముకుంటున్న కురుగొండ్ల రామకృష్ణ తన బంధువులు ఇచ్చిన ఆర్థిక సహకారంతో ఓ లారీని కోనుగోలు చేశారు. ఆ తర్వాత ఆంధ్ర నుంచి చైన్నెకి ధాన్యాన్ని అక్రమంగా రవాణా చేయడం ప్రారంభించారు. ఈ అక్రమ వ్యాపారం మూడు పువ్వులు.. ఆరు లారీలుగా వర్థిల్లింది. దీంతో ఆయన తన అక్రమ దందాను మరింత విస్తరించి యథేచ్ఛగా కొనసాగించడం ప్రారంభించారు. రామకృష్ణపై 1991లో సూళ్లూరుపేట పోలీస్ స్టేషన్లో కేసు నం.12–91 నమోదైంది. అప్పట్లో ధాన్యం అక్రమ రవాణాను అడ్డుకున్న నాయుడుపేట మండల రెవెన్యూ అధికారి షంషేర్ అహ్మద్పై దౌర్జన్యాకి ఒడిగట్టడం వివాదాస్పదమైంది. రామకృష్ణ సంఘవ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడుతున్నారని అప్పట్లో జిల్లా ఉన్నతాధికారులు పీడీ యాక్ట్ అమలు చేసేందుకు ప్రయత్నించి విఫలమయ్యారు. అప్పటి రాపూరు ఎమ్మెల్యే నువ్వుల వెంకటరత్నం నాయుడు చలువతో ఆ కేసు లేకుండా రామకృష్ణ బయటపడగలిగారు. ఎస్ఆర్ఎల్టీ పేరుతో నేటికీ ఆ లారీలు జీరోదందా తంతును కొనసాగిస్తున్నారనే విమర్శలున్నాయి. గుట్కా, పాన్పరాగ్లు వంటి స్మగ్లింగ్ కార్యక్రమాలు రామకృష్ణ తన లారీల ద్వారా ఎగుమతి చేస్తుంటారన్న ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. బెంగళూరు నుంచి హైదరాబాద్, చైన్నె నుంచి హైదరాబాద్కు ఎటువంటి పన్నులు చెల్లించకుండానే తన లారీలు తిప్పుతున్నట్టు పుకార్లు షికార్లు చేస్తున్నాయి.
Pagination
స్టార్ హీరోలతో యాక్టింగ్.. ఆ కమెడియన్ ఇలా అయిపోయాడేంటి!
భర్తతో విడిపోయిన హీరోయిన్.. కూతురితో కలిసి..
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
మూడేళ్ల తర్వాత స్వదేశంలో నీరజ్ చోప్రా బరిలోకి
బీజేపీ విజయంతోనే అభివృద్ధి
ఆమే.. అధికం
ఎఫ్ఎస్టీలు అప్రమత్తంగా వ్యవహరించాలి
1,358 ఎకరాల్లో ఉద్యాన పంటలకు నష్టం
రైతులకు ఏ కష్టం రానివ్వం..
ఆ ఓటర్లే కీలకం..
కాంగ్రెస్ మోసాలను ఇంటింటా చెప్పండి..
పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రేమేందర్రెడ్డి
నేడు డిప్యూటీ సీఎం భట్టి పర్యటన
తప్పక చదవండి
- నన్ను నమ్మండీ! నేను ఇది వరకులా కాను!!
- బర్త్ డే స్పెషల్.. విజయ్ దేవరకొండ ఎక్కడ తప్పు చేస్తున్నాడు?
- ఒక్క క్లిక్తో ‘ఏపీ పాలిసెట్’ ఫలితాలు
- సుప్రీత మైండ్ బ్లోయింగ్ గ్లామర్.. ఫారెన్ వీధుల్లో కేతిక!
- ఐసీఎంఆర్ విడుదల చేసిన ఆహార మార్గదర్శకాలు ఇవే..
- పిట్రోడా వ్యాఖ్యల దుమారం.. నిర్మలా సీతారామన్ ఆగ్రహం
- పవన్ మూవీ రిలీజ్ డేట్కి టెండర్ వేసిన 'దేవర'?
- టీ20 వరల్డ్కప్ 2024 కోసం భారత బి టీమ్.. కెప్టెన్గా కేఎల్ రాహుల్..!
- ల్యాండ్ టైట్లింగ్ చట్టం నిజాలివిగో..
- బాబోస్తే ఆరోగ్యశ్రీ గో..వింద
Advertisement