-
No Headline
సాక్షి : రాజాంలో వైఎస్సార్ సీపీ హ్యాట్రిక్ ఖాయమేనా? డాక్టర్ రాజేష్ : రాజాంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కచ్చితంగా హ్యాట్రిక్ సాధిస్తుంది. 2014 నుంచి ఇప్పటివరకూ ఈ పార్టీకి రాజాంలో ఓటమి లేదు. ఈ ధపా ఎన్నికల్లో కూడా అత్యధిక ఓట్లు మెజార్టీ సాధించి రికార్డు సృష్టిస్తాం. అటు రాష్ట్రమంత్రి బొత్స సత్యనారాయణ, జెడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు, ఇటు ఎంపీ బెల్లాన చంద్రశేఖర్, ఎమ్మెల్సీ పాలవలస విక్రాంత్ల సహాయ సహకారాలు మాకు పుష్కలంగా ఉన్నాయి. నియోజకవర్గ ప్రజలకు ఏ సమస్య వచ్చినా మేం ఉన్నామంటూ పాలవలస రాజశేఖరం కుటుంబంతో పాటు ఇటు సిరిపురపు వెంకటరమణారావు కుటుంబం అండగా నిలుస్తోంది. రాజాం మున్సిపాల్టీతో పాటు నాలుగు మండలాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఏక నాయకత్వం ఉంది. ఒకే మాట, ఒకే బాటలో ఉన్నారు. వీరందరి సహాయం మాకు మెండుగా ఉంది. వీటికి తోడు సీఎం వై.ఎస్.జగన్మోహన్రెడ్డి అందించిన సంక్షేమ పథకాలు మాకు అండగా ఉన్నాయి. ప్రజలంతా ఈ సంక్షేమ పథకాలు లబ్ధిపొందారు. కచ్చితంగా ఓట్లు వేసి అత్యధిక మెజార్టీ ఇస్తారు. -
No Headline
విలేకరులతో మాట్లాడుతున్న డిప్యూటీ మేయర్ కోలగట్ల శ్రావణివిజయనగరం: వైఎస్సార్సీపీ విజయనగరం నియోజకవర్గం ఆధ్వర్యంలో తలపెట్టిన బైక్ ర్యాలీకి అనూహ్య స్పందన లభించింది. మరో నాలుగు రోజుల్లో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో బుధవారం సాయంత్రం నిర్వహించిన ర్యాలీలో మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని వైఎస్సార్సీపీ అభ్యర్థులకు మద్దతుగా నినాదాలు చేశారు. మహిళలు చేపట్టిన ర్యాలీతో ప్రధాన రహదారులు జనసంద్రంగా మారాయి. జై జగన్.. జైజై జగన్.. రావాలి జగన్.. కావాలి జగన్ వంటి నినాదాలు హోరెత్తాయి. కోలగట్ల వీరభద్రస్వామి నివాసం నుంచి ప్రారంభమైన మహిళా బైక్ ర్యాలీ ఐస్ ఫ్యాక్టరీ జంక్షన్, కోట జంక్షన్, దాసన్నపేట, ఖాదర్నగర్, ప్రేమ సమాజం, మూడు లాంతర్లు, కన్యకా పరమేశ్వరి ఆలయం, సీఎంఆర్ జంక్షన్, రైల్వేస్టేషన్, ఆర్టీసీ కాంప్లెక్స్, అంబేడ్కర్ జంక్షన్ మీదుగా కోలగట్ల నివాసానికి చేరింది. బైక్ ర్యాలీని ప్రారంభించిన వైఎస్సార్సీపీ రాష్ట్ర మహిళా అధికార ప్రతినిధి, డిప్యూటీ మేయర్ కోలగట్ల శ్రావణి మాట్లాడుతూ.. నియోజకవర్గ అభివృద్ధి కోలగట్ల వీరభద్ర స్వామితోనే సాధ్యమని చెప్పారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్రెడ్డి నేతృత్వంలో సంక్షేమ, అభివృద్ధి పాలన సాగుతోందన్నారు. ఎన్నికల హామీలు శతశాతం అమలు చేశారని కొనియాడారు. అభివృద్ధి, సంక్షేమ పాలన చూసి ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబునాయుడు అక్కసుతో వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. చంద్రబాబు చేస్తున్న నీచ రాజకీయాలకు చరమగీతం పాడాలని పిలుపునిచ్చారు. మహిళా సాధికారతకు కృషి చేసిన జగన్ మోహన్రెడ్డికి రెండు ఓట్లను రాఖీలుగా భావించి బహుమతిగా ఇస్తామని తెలిపారు. ఎంపీగా బెల్లాన చంద్రశేఖర్ను, ఎమ్మెల్యేగా కోలగట్ల వీరభద్రస్వామిని గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ ముచ్చు లయా యాదవ్, ఏఎంసీ చైర్పర్సన్ శశిభార్గవి, మున్సిపల్ మాజీ వైస్ చైర్పర్సన్ లెంక వరలక్ష్మి, బీసీ నాయకురాలు గదుల సత్యలత, వివిధ డివిజన్ల కార్పొరేటర్లు , మహిళ నాయకులు, కార్యకర్తలు, కోలగట్ల అభిమానులు పాల్గొన్నారు. -
లలితమ్మా నీకో దండం..!
ఎస్.కోట నెట్వర్క్: నియోజకవర్గానికి ప్రజా ప్రతినిధి.. ఎమ్మెల్యే. ఆ పదవిలో ఉన్నవారు కృషి చేస్తే.. ప్రభుత్వం నుంచి దండిగా నిధులు వస్తాయి. దీర్ఘకాలిక సమస్యలు పరిష్కారమవుతాయి. ప్రజలకు సంక్షేమ పథకాలు అందుతాయి. ఆ నియోజకవర్గం అభివృద్ధి పథంలో పయనిస్తోంది. ముఖచిత్రమే మారిపోతుంది. అయితే... ఎస్.కోట ఎమ్మెల్యేగా పదేళ్ల పాటు పని చేసిన కోళ్ల లలితకుమారి నియోజకవర్గ అభివృద్ధిని పక్కన పెడితే.. ప్రతిష్టను దిగజార్చారన్నది ఇక్కడి జనం మాట. ఏ గ్రామానికి వెళ్లి అడిగినా ఆమె చేసినది శూన్యమన్న మాటే వినిపిస్తోంది. పదేళ్ల ఎమ్మెల్యే పదవిని ఆస్తులు కూడబెట్టేందుకే వినియోగించుకున్నారన్న అపవాదు ఉంది. ఓట్ల చీలికతో పదవి దక్కినా.. ప్రజలకు చేసిన మేలు ఒక్కటంటే ఒక్కటీ లేకపోవడం గమనార్హం. ఇప్పుడు మళ్లీ ఏదో ఉద్ధరిస్తానంటూ ఎన్నికల ప్రచారానికి ఊరూరా తిరుగుతున్న ఆమెను జనం ఛీత్కరిస్తున్నారు. చేసినది చాలు అంటూ మొహంచాటేస్తు న్నారు.. ప్రజలకు ఎవరు మేలు చేస్తారో మాకు తెలుసు అంటూ చెబుతుండడంతో ఆమె తట్టుకోలేకపోతోంది. ఓటమి ఖాయమని తేలిపోవడంతో అనవసరంగా బరిలో దిగామంటూ పలువురి వద్ద నిట్టూర్చుతోందట. మామ పేరు చెప్పినా ప్రజలు హర్షించడంలేదంటూ వాపోతున్నట్టు సమాచారం. కోళ్ల పాలనలో ప్రగతి సున్నా... ● విశాఖ–అరకు రోడ్డును అభివృద్ధి చేస్తాం, అరకును ఆంధ్రా ఊటీ చేస్తామంటూ చంద్రబాబుతో కలిసి కోళ్ల లలితకుమారి చెప్పిన మాటలు నీటిమీద రాతలే అయ్యాయి. విశాఖ–అరకు రోడ్డుపై కనీసం గోతులు పూడ్చలేకపోయారు. ● వేపాడ మండల ప్రజల రాకపోకలకు ఆధారమైన సోంపురం–ఆనందపురం రోడ్డు రాళ్లుతేలి గాత లు, గోతులు మయమైనా ఏనాడూ ఒక్క రూపా యి ఖర్చుచేసి అభివృద్ధి చేయలేదు. జనం కష్టాలను ఆమె పట్టించుకోలేదన్నది ఇప్పటికీ ఈ ప్రాంతీయులు విమర్శిస్తారు. ● ఏడు మండలాల ప్రజలకు ఆరోగ్య ప్రదాయనిగా ఉన్న ఎస్.కోట కమ్యూనిటీ ఆస్పత్రిని ఏరియా ఆస్పత్రిగా మార్చేస్తానంటూ ఉత్తుత్తి ప్రసంగాలకే ఆమె పరిమితమయ్యారు. ప్రభుత్వం నుంచి ఒక్కరూపాయి తెచ్చుకోలేకపోయారు. ● మండలాల్లోని పీహెచ్సీల్లో సదుపాయాలు, వైద్య సిబ్బంది, మందుల నిల్వలపై కనీసం ఆలోచన కూడా చేయలేదు. ● జామి, లక్కవరపుకోట మండల కేంద్రాల్లో ప్రభు త్వ జూనియర్ కళాశాలలు తెస్తామంటూ ఊకదంపుడు ప్రసంగాలు చేశారే తప్ప విద్యార్థుల చదువు కష్టాలు పట్టించుకోలేదు. ● రోడ్డు సదుపాయం లేక నియోజకవర్గంలోని గిరిజన గ్రామాల ప్రజలు ఇబ్బందులు పడినా పదేళ్ల లో ఒక్కటంటే ఒక్క రోడ్డు మార్గాన్నీ పూర్తిగా నిర్మించలేదు. ● ఇళ్లు, మరుగుదొడ్లు, రైతు రథాలు, పింఛన్లు ఇలా.. ఏ ప్రభుత్వ పథకం కావాలన్నా జన్మభూమి కమిటీల కాళ్లు పట్టుకోవాల్సిన దుస్థితి. ముడుపులు చెల్లించుకోవాల్సిన పరిస్థితి. ఇదేమటని ఎమ్మెల్యే వద్ద ప్రాథేయపడినా కనీసం పట్టించుకోలేదు. జన్మభూమి కమిటీల వసూళ్లలో ఆమెకూ వాటా చేరడమే దీనికి కారణమన్నది జనం మాట. ● వేపాడ మండలంలోని మారిక, ఎస్.కోట మండలంలోని దబ్బగుంట రోడ్లకు అటవీశాఖ అనుమతులు తేవడంలో లలితకుమారి విఫలమయ్యారు. ఒకటి కాదు రెండు కాదు ఆమె పదేళ్లు పదవిలో ఉన్నారు.. ఏదో చేస్తారని ఆశించి ప్రజలు పట్టం కట్టారు. ‘కోట’ను అభివృద్ధి చేయాలని పదేపదే విన్నవించారు. ఆ పార్టీ పెద్దలు సైతం ఆమె ఇంటి చుట్టూ తిరిగారు. ఏళ్లు గడిచాయే తప్ప ఒక్క అభివృద్ధి పనీ తలపెట్టలేదు. ఒక్క కుటుంబానికి కూడా సరిగా ‘సంక్షేమం’ అందజేయలేదు. అన్నా.. తమ్ముడూ.. బావా.. మరిదీ.. అక్కా.. చెల్లీ అంటూ తీపిమాటలు వడ్డించడమే తప్ప మనసుపెట్టి ప్రజలకు మేలు చేయడం ఆమెకు తెలియదు. అందుకే.. ఇప్పుడు ఎస్.కోట ప్రజలందరూ ఆమెకో దండం అంటూ ఛీత్కరిస్తున్నారు. చాలుచాలు మీ పాలన అంటూ మోహం మీదే చెబుతున్నారు. తీపి మాటలు.. చేతగాని పనులు పదేళ్లు పదవిలో ఉన్నా ‘కోట’ అభివృద్ధికి చేసినది శూన్యం పేదలకు అందని ‘సంక్షేమం’ ప్రజల కష్టాలు పట్టించుకోని నైజం మామ పేరుతోనే కాలక్షేపం దోచుకో.. దాచుకోవడానికే అధికారం అన్నట్టు పాలన ఆమె పేరు చెబితేనే భగ్గుమంటున్న ప్రజలు ఆమెకు.. ఆమె పాలనకో దండం అంటూ నిట్టూర్పు -
రాజాంలో గెలుపు తథ్యం
సాక్షి ప్రతినిధి, విజయనగరం: ‘రాజాం పారిశ్రామికంగా, విద్యాపరంగా అభివృద్ధి చెందుతున్న ప్రాంతం. పారిశ్రామికవేత్త గ్రంధి మల్లికార్జునరావు పెట్టిన ఇంజినీరింగ్ కాలేజీ, ఆస్పత్రితోనే రాజాంకు పేరొచ్చింది. గతంలో పాలించిన టీడీపీ వల్ల ఒరిగిందేమీ లేదు. చంద్రబాబు 2014 ఎన్నికల్లో ఇచ్చిన హామీలే 2019లోనూ చెప్పారు. 2019లో చెప్పినవే ఇప్పుడూ చెబుతున్నారు. అంటే ఆయన చెప్పడమే తప్ప చేసిందేమీ లేదని అర్థమవుతోంది. కానీ ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్రెడ్డి కరోనా కాలం పోను మిగిలిన మూడేళ్ల స్వల్ప కాలంలోనే రూ.2 వేల కోట్ల మేర సంక్షేమ పథకాలు అమలుచేశారు. రూ.600 కోట్లతో పలు అభివృద్ధి పనులు చేశారు. అందుకే ప్రజామద్దతు కచ్చితంగా ఫ్యాన్కే ఉంద‘ని గెలుపు తథ్యమని రాజాం అసెంబ్లీ నియోజకవర్గంలో వైఎస్సార్సీపీ అభ్యర్థి డాక్టర్ తలే రాజేష్ అన్నారు. 2014 నుంచి వరుసగా రెండు పర్యాయాలు విజయకేతనం ఎగురవేసిన వైఎస్సార్సీపీ మరోసారి విజయం సాధిస్తుందన్నారు. బుధవారం ‘సాక్షి’కి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.. సాక్షి : వైద్య వృత్తిలో ఎంతో పేరుప్రఖ్యాతలు సాధించిన మీరు రాజకీయాల్లోకి అడుగుపెట్టడానికి ప్రధాన కారణం? డాక్టర్ రాజేష్ : ఎప్పటినుంచో నేను వై.ఎస్.రాజశేఖరరెడ్డి అభిమానిని. ఓదార్పుయాత్ర నుంచి వై.ఎస్.జగన్మోహన్రెడ్డి అభిమానిగా మారాను. ఓదార్పు యాత్రలోనూ, ప్రజా సంకల్పయాత్రలో పాల్గొన్నారు. నాకు అనూహ్యంగా రాజాం టికెట్ ఇచ్చారు. ఆయన నమ్మకాన్ని నిలబెడతాను. అందరి కృషితో రాజాంలో వైఎస్సార్సీపీ విజయం సాధించడం ఖాయం. సాక్షి : స్థానికుడిగా రాజాం ఎలా ఉంటే బాగుంటుందని ఆశిస్తున్నారు? డాక్టర్ రాజేష్ : అభివృద్ధిపరంగా రాజాం అనేది రోడ్డు విస్తరణ సమస్యతో ఇబ్బంది ఉండేది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాతే రోడ్డు విస్తరణ జరిగింది. రూ.30 కోట్లు నిధులు మంజూరయ్యాయి. తొలివిడత పనులు పూర్తయ్యాయి. రెండో విడత జరుగుతున్నాయి. అంతకుముందు 2014 ఎన్నికల్లో చంద్రబాబు రాజాంలో రోడ్డు విస్తరణ, రింగు రోడ్డు హామీ ఇచ్చారు. 2019లో అదే హామీ ఇచ్చారు. ఇప్పుడు 2024 లో కూడా అదే చెబుతున్నారు. ఆర్టీసీ బస్టాండ్ నిర్మిస్తామమన్నారు. అది కూడా చేయలేదు. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇవేమి చెప్పకుండానే రోడ్డు విస్తరణ చేశారు. రాజాంలో రూ.1.80 కోట్ల ఖర్చుతో కేవలం మూడునెలల్లో ఆర్టీసీ కాంప్లెక్స్ను అందుబాటులోకి తెచ్చారు. మాట తప్పడంలో చంద్రబాబును మించిన నేతలేరు. మాట నిలబెట్టుకోవడంలో జగన్ను మించిన లీడర్ లేరు. రాజాంలో మెడికల్ కళాశాల ఉంటే బాగుంటుంది. శానిటేషన్, తాగునీటి సమస్యలను పూర్తి స్థాయిలో పరిష్కరించాల్సి ఉంది. కొన్ని వర్గాలకు సంబంధించి శ్మశానవాటికలు నిర్మించాలని, కులసంఘాలకు అన్నింటికీ ఒకేచోట పదెకరాల విస్తీర్ణంలో కమ్యూనిటీ హాళ్లు నిర్మించి అన్ని కులాలు అన్నదమ్ముల్లా ఉండేలా చూడాలని ఉంది. సంతకవిటిలో సాయన్నచానల్ ఆధునికీకరణ బాధ్యతగా తీసుకున్నాం. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలోనే వంగర మండలంలో అర్థాంతరంగా ఉన్న కిమ్మి–రుషింగి వంతెనను పూర్తీచేసి ప్రారంభించారు. 1998లో హామీ ఇచ్చి వదిలేసిన సంతకవిటి మండలంలోని వాల్తేరు గ్రామం వద్ద నాగావళి నదిపై వంతెనను రూ. 37 కోట్లు నిధులు వెచ్చించి పనులు ప్రారంభించాం. అవి ఇప్పుడు పిల్లర్లు నిర్మాణ స్థాయిలో ఉంది. సాక్షి : కుటుంబం నుంచి ప్రోత్సాహం ఎలా ఉంది? డాక్టర్ రాజేష్ : వైద్య వృత్తి చాలా విలువైనది. రాజకీయం కూడా అంతే బాధ్యతతో కూడుకున్నది. ఇక్కడ రాజాంలో 12 ఏళ్లకు పైగా వైద్యునిగా సేవలు అందించాను. 12 వేలకు పైగా ఆర్థోపెడిక్ ఆపరేషన్లు చేసి ప్రజల్లోకి వెళ్లాను. నియోజకవర్గంలో అన్ని మండలాల్లో, అన్ని వర్గాల ప్రజలతో మంచి సంబంధాలు ఉన్నాయి. నా భార్య డాక్టర్ మాధవీలత కూడా నాకు వెన్నుదన్నుగా నిలుస్తున్నారు. ఆమె కూడా ఇక్కడ గైనిక్గా ఎన్నో వేలమందికి సేవలు అందించారు. మా తండ్రి తలే భద్రయ్య రెండు పర్యాయాలు పాలకొండ ఎమ్మెల్యేగా చేశారు. ఇక్కడ నియోజకవర్గ ప్రజలతో మంచి సంబంధాలు ఉన్నాయి. వీటికి తోడు వైఎస్సార్ పెట్టిన ఆరోగ్య శ్రీ పథకం నాలాంటి ఎంతో మంది యువ డాక్టర్లకు ఆదర్శంగా మారింది. ఆ వైద్యులు, ఆ ఆపరేషన్లు ద్వారా లబ్ధిపొందినవారంతా ఇప్పుడు మా వెంట నిలుస్తున్నారు. ఈ రాజకీయ జీవితంలో కూడా మంచి సేవలు అందిస్తాను. రాజాంకు హామీలివ్వడమే తప్ప చంద్రబాబు చేసిందేమీ లేదు 2014 నుంచి ఇప్పటివరకూ ఎన్నికలైనప్పుడల్లా అవే హామీలు సీఎం జగన్మోహన్రెడ్డి స్వల్ప కాలంలోనే ఎంతో అభివృద్ధి రోడ్లు, వంతెనలు వైఎస్సార్సీపీ పాలనలో పూర్తి ప్రజామద్దతు కచ్చితంగా ఫ్యాన్కే ‘సాక్షి’ ప్రత్యేక ఇంటర్వ్యూలో వైఎస్సార్సీపీ అభ్యర్థి డాక్టర్ తలే రాజేష్ -
ఎన్నికల ఏర్పాట్ల బాధ్యత సెక్టార్ అధికారులదే..
● జిల్లా ఎన్నికల అధికారి నాగలక్ష్మి విజయనగరం అర్బన్: ఎన్నికల రోజున పోలింగ్ బూత్ల వద్ద పక్కాగా ఏర్పాట్లు చేయాలని జిల్లా ఎన్నికల అధికారి నాగలక్ష్మి అధికారులను ఆదేశించారు. పోల్ డే మేనేజ్మెంట్ సిస్టం ప్రకారం విధులు నిర్వహించాలన్నారు. సెక్టార్ అధికారులతో బుధవారం నిర్వహించిన వీడి యో కాన్ఫరెన్స్లో ఆమె మాట్లాడారు. అన్ని పోలింగ్ స్టేషన్లలో ఎన్నికల సిబ్బందికి సరైన ఆహారం సమయానికి అందించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. మాక్పోల్ సమయానికి జరిగేలా చూడాలని, ఆర్వో, పీఓలతో సమన్వయం చేసుకోవాలన్నారు. సెక్టార్లో ఉన్న అందరి ఫోన్ నంబర్లను నోట్ చేసుకోవాలని తెలిపారు. పోలింగ్ స్టేషన్ వద్ద బార్ కోడింగ్, లైటింగ్, తాగునీరు, షెడ్లు, అవసరమైన చోట జనరేటర్ ఏర్పాట్లు చేయాలన్నారు. క్యూ లైన్ నిర్వహణ, ఈవీఎంల రీప్లేస్మెంట్ తదితర అంశాలను సెక్టార్ అధికారులే చూడాలన్నారు. ఎన్నికల సిబ్బందికి టీఏ, డీఏల చెల్లింపులు, పోల్ రిపోర్ట్లు, అనెగ్జర్ 5, 6 అందించే బాధ్యత సెక్టార్ అధికారులదేనని స్పష్టం చేశారు. పోలింగ్ ప్రారంభమైన రెండు గంటల లోపల అన్ని పోలింగ్ కేంద్రాలను తనిఖీ చేయాలని, ముగిసే లోపల మరోసారి సందర్శించాల ని సూచించారు. వీడియో కాన్ఫరెన్స్లో జేసీ కార్తీక్, డీఆర్వో అనిత పాల్గొన్నారు. -
పాలిసెట్– 2024 ప్రవేశ పరీక్ష ఫలితాలు విడుదల
విజయనగరం రూరల్: పాలిసెట్–2024 ప్రవేశ పరీక్ష ఫలితాల్లో జిల్లా విద్యార్థులు 87.68 శాతం ఉత్తీర్ణత సాధించారు. గత నెల 27న జిల్లా వ్యాప్తంగా 24 కేంద్రాల్లో నిర్వహించిన ప్రవేశ పరీక్షకు రికార్డు స్థాయిలో 7,786 మంది హాజరుకాగా బుధవారం ప్రకటించిన ప్రవేశ పరీక్షా ఫలితాల్లో 6,827 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. వరుసగా మూడో ఏడాది ఉత్తీర్ణత శాతంలో బాలికలే పైచేయి సాధించి సత్తాచాటారు. ఈ ఏడాది ప్రవేశ పరీక్షకు 4,604 మంది బాలురు హాజరుకాగా, 85.84 శాతంతో 3,952 మంది ఉత్తీర్ణత సాధించగా, బాలికల్లో 3182 మంది హాజరై 90.35 శాతంతో 2,875 మంది ఉత్తీర్ణులయ్యారు. జిల్లా స్థాయిలో ప్రథమ ర్యాంకు సాధించిన వడ్డి త్రినయిణి రాష్ట్ర స్థాయిలో 155 ర్యాంకు, టీవీఎస్ శ్రీనిథ్అపూర్వ్కు జిల్లా స్థాయిలో రెండో ర్యాంకు, రాష్ట్ర స్థాయిలో 272 ర్యాంకు, తొత్తడి శైలేష్ జిల్లా స్థాయిలో మూడో ర్యాంకు, రాష్ట్ర స్థాయిలో 285వ ర్యాంకు సాధించారు. పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు పాలిసెట్ ఫలితాలను పీవోఎల్వైసీఈటీఏపీ.ఎన్ఐసీ.ఐఎన్, ఎంఎఎన్ఏబీఏడీఐ.సీవో.ఐఎన్ (మనబడి) వెబ్సైట్లలో పరిశీలించుకోవచ్చని జిల్లా కన్వీనర్, ఎంఆర్ఏజీఆర్ విజయనగరం ప్రభుత్వ ఐటీఐ ప్రిన్సిపాల్ జె.ఆశారమణి తెలిపారు. దరఖాస్తుల ఆహ్వానం గుర్ల: ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హ్యండ్లూమ్ టెక్నాలాజీలో డిప్లమో కోర్సులకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్టు జిల్లా చేనేత, జౌళి శాఖ అధికారి ఆర్.వి.మురళీ కృష్ణ బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. వెంకటగిరి, తిరుపతిలోని కాలేజీలకు జూన్1లోపు ఆన్లైన్ దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఇతర వివరాలకు సెల్: 93999 36872, 98661 69908 నంబర్లను సంప్రదించాలని కోరారు. ● జిల్లా ఉత్తీర్ణత శాతం: 87.68 ● గతేడాది కంటే 1.55 శాతం పెరిగిన ఉత్తీర్ణత ● బాలికలు 90.35 శాతం, బాలురు 85.84 శాతం ఉత్తీర్ణత -
అభివృద్ధి అంటే ఇదే కదా...
సమస్యల కోటగా పేరుపడిన శృంగవరపుకోటలో 2019లో వైఎస్సార్సీపీ జెండాను ప్రజలు ఎగురవేశారు. సంపూర్ణ మద్దతు ఇచ్చారు. అంతే.. కేవలం 59 నెలల జగన్మోహన్రెడ్డి పాలనలో ఎస్.కోట ప్రగతి పట్టాలెక్కింది. సంక్షేమ, అభివృద్ధిపాలన చేరువైంది. ఇంటింటా ‘నవరత్న’కాంతులు వెదజల్లుతున్నాయి. ● జగన్మోహన్రెడ్డి అధికారంలోకి వచ్చిన వెంటనే కేంద్రంపై ఒత్తిడి తెచ్చి విశాఖ–అరకు రోడ్డుకు జాతీయ హైవేగా గుర్తింపు తీసుకొచ్చారు. అభివృద్ధికి నాంది పలికారు. అర్ధంతరంగా వదిలేసిన బ్రిడ్జిలు, కల్వర్టులు నిర్మాణాలను రూ.9కోట్ల ఖర్చుతో పూర్తిచేశారు. ● రూ.39 కోట్ల ఖర్చుతో సోంపురం–ఆనందపురం రోడ్డును అభివృద్ధి చేశారు. ● ఎస్.కోటలో ఉన్న 30 పడకల సీహెచ్సీని వంద పడకల ఏరియా ఆస్పత్రిగా స్థాయిపెంచారు. రూ.12.60 కోట్లతో ఆస్పత్రికి కావాల్సిన హంగులు కల్పిస్తున్నారు. ● నియోజకవర్గంలోని 7 పీహెచ్సీల కొత్త భవనాలు, ఆధునీకరణకు రూ 8.25 కోట్లు కేటాయించడంతో పనులు చురుగ్గా సాగుతున్నాయి. పీహెచ్సీల్లో రెండో వైద్యాధికారిని నియమించి నిరంతర వైద్యసేవలను అందుబాటులోకి తెచ్చారు. ● ఎస్.కోట మండలంలోని ధర్మవరం జిల్లా పరిషత్ హైస్కూల్లో బాలికల జూనియర్ కళాశాల, జామిలో ప్రభుత్వ జూనియర్ కళాశాల ఏర్పాటుచేసి ఇంటర్మీడియట్ విద్యను అందుబాటులోకి తెచ్చారు. నియోజకవర్గం వ్యాప్తంగా రెండు వందల స్కూళ్లను నాడు–నేడు నిధులతో అభివృద్ధి చేశారు. ఆహ్లాదకరంగా తీర్చిదిద్దారు. ● జల్జీవన్ మిషన్ కింద రూ.200 కోట్ల ఖర్చుతో 137 గ్రామాలకు ఇంటింటికీ కుళాయి నీటి సరఫరా పనులు చకచకా సాగుతున్నాయి. ● నియోజకవర్గంలో పదివేల మంది పేదలకు ఇళ్ల స్థలాలు కేటాయించారు. ఒక్కో లబ్ధిదారుకు రూ. 1.80లక్షల చొప్పున ఆర్థిక సాయం చేస్తున్నారు. పేదల సొంతింటి కల నెరవేర్చారు. స్థానిక ప్రజాప్రతినిధు చొరవతో వేపాడ మండలం మారిక, ఎస్.కోట మండలంలోని దబ్బగుంట గిరిశిఖర గ్రామాలకు అటవీశాఖ అనుమతులతో రోడ్లు పనులు చకచకా సాగుతున్నాయి. ● నియోజకవర్గంలో కేవలం 59 నెలల పాలనలో రూ.750 కోట్లతో వివిధ అభివృద్ధి పనులు చేపట్టాగా, వివిధ సంక్షేమ పథకాల కింద 70,291 మందికి రూ.2,335 కోట్ల ఆర్థిక ప్రయోజనం చేకూరింది. ● విశాఖ నుంచే పరిపాలన జరుగుతుందని మేనిఫెస్టోలో ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్రెడ్డి ప్రకటించడంతో నియోజకవర్గ వాసుల్లో హర్షం వ్యక్తమవుతోంది. విద్య, ఉపాధి, వ్యాపార, రాజకీయ అవకాశాలు అందిపుచ్చుకోవచ్చని ఆశిస్తున్నారు. -
టీడీపీకి బైబై.... వైఎస్సార్సీపీకి జైజై
విజయగనరం: మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని కేల్ పురం యాత వీధికి చెందిన పలు కుటుంభాలు టీడీపీని వీడి వైఎస్సార్సీపీలో చేరాయి. వారందరికీ డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి కండువాలు వేసి పార్టీలోకి ఆహ్వానించారు. ఆ ప్రాంత వైఎస్సార్సీపీ నాయకులు తాళ్లపూడి పండు, రమణమూర్తి, జామాన శ్రీనివాసరావు ఆధ్వర్యంలో యాతవీధి ప్రాంతానికి చెందిన 25 కుటుంబాలు వారు కోలగట్ల సమక్షంలో వైఎస్సార్సీపీ తీర్థం పుచ్చుకున్నారు. సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్సార్సీపీ బలపర్చిన అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించేందుకు కృషి చేస్తామని చెప్పారు. వైఎస్సార్సీపీలోకి చేరిన 25 కుటుంబాలు -
భారీగా చేరికలు
రాజాం: పట్టణ పరిధిలోని పలు వార్డుల నుంచి టీడీపీ కార్యకర్తలు వైఎస్సార్సీపీలో చేరారు. మున్సిపాలిటీ పరిధి మల్లయ్యపేటకు చెందిన 100 టీడీపీ కుటుంబాలు వైఎస్సార్సీపీ తీర్థం పుచ్చుకోగా.. వారందరికీ ఎమ్మెల్యే అభ్యర్థి తలే రాజేష్ కండువాలు వేసి ఆహ్వానించారు. పార్టీలో చేరిన వారు మాట్లాడుతూ, జగన్ మోహన్రెడ్డి అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు ఆకర్షితులై పార్టీలో చేరినట్లు చెప్పారు. కార్యక్రమంలో పార్టీ రాజాం టౌన్ కన్వీనర్ పాలవలస శ్రీనివాసరావు, స్థానిక వైఎస్సార్సీపీ నాయకులు కెల్ల సతీష్, యందవ చిన్నబాబు, సింబాల రాము, అల్లెన జయలక్ష్మి, యందవ సుశీల తదితరులు ఉన్నారు. అలాగే మున్సిపాలిటీ పరిధి గాయత్రీకాలనీకి చెందిన 50 కుటుంబాలు టీడీపీని వీడి ఎమ్మెల్యే తలే రాజేష్ ఆధ్వర్యంలో వైఎస్సార్సీపీలో చేరారు. -
ఫెసిలిటేషన్ కేంద్రాల పరిశీలన
విజయనగరం అర్బన్: పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ ప్రక్రియను త్వరగా పూర్తి చేయాలని కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి నాగలక్ష్మి ఆదేశించారు. జేఎన్టీయూ విజయనగరం గురజాడ (జీవీ) యూనివర్సిటీలో ఏర్పాటు చేసిన రెండు ఫెసిలిటేషన్ కేంద్రాలను బుధవారం ఆమె సందర్శించారు. ఈ సందర్భంగా ఓటింగ్ ప్రక్రియ, ఏర్పాట్లను పరిశీలించారు. వీలైనంత వేగంగా పోలింగ్ ప్రక్రియను నిర్వహించాలని సూచించారు. అసిస్టెంట్ కలెక్టర్ వెంకట త్రివినాగ్, పోస్టల్ బ్యాలెట్ నోడల్ అధికారి కె.సందీప్కుమార్, డీఆర్డీఏ పీడీ ఎ.కల్యాణ చక్రవర్తి, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ సుధారాణి, మెప్మా పీడీ సుధాకరరావు, మున్సిపల్ కమిషనర్ మల్లయ్యనాయుడు, అసిస్టెంట్ కమిషనర్ తిరుమలరావు, తదితరులు పాల్గొన్నారు. రిసెప్షన్ సెంటర్ వద్ద పటిష్ట ఏర్పాట్లు ఎన్నికల రోజు ఏర్పాటు చేసే రిసెప్షన్ సెంటర్ వద్ద పటిష్టమైన ఏర్పాట్లు చేయాలని వేదిక ఇన్చార్జ్లను కలెక్టర్ ఆదేశించారు. పటిష్టంగా బారికేడ్లు ఏర్పాటు చేయాలన్నారు. కౌంటర్ల వద్ద, ప్రాంగణంలో లైటింగ్ ఏర్పాటు చేయా లని సూచించారు. పర్యటనలో వేదిక ఇన్చార్జ్లు ఎస్సీ కార్పొరేషన్ ఈడీ సుధారాణి, డిప్యూటీ సీఈఓ కె.రాజ్కుమార్, పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ అధికారులు పాల్గొన్నారు. సజావుగా ఏపీ ఈసెట్ ఎచ్చెర్ల క్యాంపస్: ఏపీ ఈసెట్–2024 ఆన్లైన్ పరీక్ష బుధవారం సజావుగా జరిగింది. చిలకపాలేంలోని శ్రీ శివానీ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్లో మొదటి షిఫ్ట్లో 100కి 90 మంది, రెండో షిఫ్ట్లో 100 కి 99 మంది, ఎచ్చెర్ల శ్రీ వెంకటేశ్వరా ఇంజినీరింగ్ కాలేజ్లో మొదటి షిఫ్ట్లో 100 కి 98, రెండో షిఫ్ట్లో 100 కి 95 మంది హాజరయ్యారు. మొత్తం 400 మందికి రెండు పరీక్ష కేంద్రాలను కేటాయించగా, 382 మంది హాజరయ్యారు. ప్రత్యేక పరిశీలకులు పరీక్ష పర్యవేక్షించారు. సారా స్థావరాలపై పోలీసుల దాడులు మెళియాపుట్టి: మండలంలోని సవర కుడ్డబ గ్రామంలో డీటీఎఫ్, ఎస్ఈబీ, ఇంటెలిజెన్స్ బృందాలు సమన్వయంతో బుధవారం సారా తయారీ స్థావరాలపై దాడులు చేశాయి. ఈ దాడుల్లో 1100 లీటర్ల పులిసిన బెల్లపు ఊటలను ధ్వంసం చేశారు. 20 లీటర్ల నాటుసారాని స్వాధీనం చేసుకున్నారు. వ్యక్తిపై కేసునమోదు చేశారు. శ్రీకాకుళం ఎస్ఈబీ జేడీ గంగాధరం సూచనల మేరకు దాడులు నిర్వహించినట్లు సిబ్బంది తెలిపారు. దాడుల అనంతరం ఆయా గ్రామాల ప్రజలకు నాటుసారా తయారీ వల్ల కలిగే నష్టాలపై అవగాహన కల్పించారు. పలాస డీటీఎఫ్ సీఐ, రామచంద్ర కుమార్, టెక్కలి ఎస్ఈబీ సీఐ రాజశేఖర్ నాయుడు, పలువురు సిబ్బంది ఉన్నారు. -
ఓటే వజ్రాయుధం
● ఎన్నికల పరిశీలకులు తలాత్ పర్వేజ్ ● స్వీప్ కార్యక్రమంలో భాగంలో బైక్ ర్యాలీ విజయనగరం అర్బన్: ఓటు వజ్రాయుధం వంటిదని, ఈ నెల 13వ తేదీన జరిగే పోలింగ్లో ప్రతీ ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ఎన్నికల సాధారణ పరిశీలకుడు తలాత్ పర్వేజ్ ఇక్బాల్ రోహిల్లా పిలుపునిచ్చారు. స్వీప్ కార్యక్రమంలో భాగంగా ఓటు హక్కుపై అవగాహన కల్పిస్తూ విజయనగరం పట్టణంలో బుధవారం భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. ర్యాలీను కలెక్టరేట్ వద్ద తలాత్ పర్వేజ్, అసిస్టెంట్ కలెక్టర్ వెంకట త్రివినాగ్ ప్రారంభించారు. స్వయంగా మోటార్ సైకిల్ నడిపి ర్యాలీలో పాల్గొన్నారు. ఈ ర్యాలీ ఆర్అండ్బీ జంక్షన్, మయూరి, ఆర్టీసీ కాంప్లెక్స్, అంబేడ్కర్ జంక్షన్, కోట, మూడు లాంతర్లు, గంటస్తంభం మీదుగా రాజీవ్ క్రీడామైదానం వరకు సాగింది. అక్కడ మానవహారాన్ని నిర్వహించి ఓటర్లతో ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా తలాత్ పర్వేజ్ మాట్లాడుతూ ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంలో జరుగుతున్న ఈ ఎన్నికలు, ప్రజాస్వామ్య మనుగడకు మూలాధారమని పేర్కొన్నారు. ఎన్నికలు స్వేచ్ఛగా, పారదర్శకంగా నిర్వహించేందుకు ఎన్నికల కమిషన్ అన్ని చర్యలు తీసుకుందన్నారు. జిల్లాలో ఓటింగ్ శాతాన్ని పెంచేందుకు వివిధ రూపాల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. -
‘నిఘా మరింత పెంచాలి’
కొత్తూరు: ఎన్నికలు సమీపిస్తున్నందున చెక్పోస్టుల వద్ద నిఘాను మరింత పెంచాలని స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో జాయింట్ డైరెక్టర్ గంగాధర్ అన్నారు. ఆయన కొత్తూరు మండలం కర్లెమ్మ అంతర్ జిల్లా చెక్పోస్టును బుధవారం రాత్రి తనిఖీ చేశారు. ఎన్నికలు దగ్గరలో ఉన్నందున నగదు, మద్యం వంటివి అక్రమంగా రవాణ జరిగే అవకాశం ఉందని, సెబ్ స్టేషన్ సిబ్బంది, మరింత అప్రమత్తంగా ఉండాలన్నారు. తనిఖీల్లో స్థానిక సీఐ జమరామరెడ్డి, ఎస్ఐ శ్రావణి, సిబ్బంది పాల్గొన్నారు. తలసేమియా బాధితులను ఆదుకుందాం శ్రీకాకుళం అర్బన్: తలసేమియాతో బాధపడుతున్న చిన్నారులకు అండగా నిలిచేందుకు ప్రతిఒక్కరూ రక్తదానానికి ముందుకు రావాలని లయన్స్ క్లబ్ శ్రీకాకుళం సెంట్రల్ అధ్యక్షుడు పొన్నాడ రవికుమార్, మెంటార్ నటుకుల మోహన్, జోన్ చైర్పర్సన్ బి.దేవభూషన్, కోశాధికారి శిల్లా మణి కోరారు. ప్రపంచ తలసేమియా దినం సందర్భంగా బుధవారం నగరంలోని లయన్స్ బ్లడ్ బ్యాంకులో రక్తదాన శిబిరం నిర్వహించారు. కార్యక్రమంలో బ్లడ్ బ్యాంకు మేనేజర్ కె.సునీల్, రవి, సాహు, దాతలు ఈ.నాగరాజు, జి.సురేష్కుమార్, ఎస్.సత్యనారాయణ, బి.దుర్గాప్రసాద్ పాల్గొన్నారు. -
వసూల్ రాజాలు పీక్కుతిన్నారు..!
గంట్యాడ: గంట్యాడ మండలంలోని ఓ గ్రామంలో ఇల్లు మంజూరుకు ఓ మహిళా లబ్ధిదారును జన్మభూమి కమిటీ మెంబర్ రూ.20 వేలు ఇవ్వాలని అడిగాడు. డబ్బులు ఇస్తేనే ఇల్లు మంజూరవుతుంది. లేదంటే లేదని తెగేిసి చెప్పేశాడు. దీంతో చేసేది లేక ఆ లబ్ధిదారు అడిగినంత ఇచ్చేసింది. ● బొండపల్లి మండలంలో అంగన్వాడీ పోస్టు నిమత్తం ఓ మహిళ దగ్గర రూ.3 లక్షలు డిమాండ్ చేశారు. డబ్బులిస్తే పోస్టు మంజూరు చేస్తామని చెప్పడంతో చేసేది లేక అడిగినంత ఆమె కూడా చెల్లించింది. ● గంట్యాడ మండలంలో ట్రాక్టర్ కోసం ఓ రైతును జన్మ భూమి కమిటీ మెంబర్ రూ.30 వేలు డిమాండ్ చేశాడు. రూ.30 వేలు ఇస్తేనే ట్రాక్టర్ మంజూరు చేయిస్తానని చెప్పడంతో ఆ రైతు చేసేది లేక చివరికి జన్మభూమి కమిటీ సభ్యుడు అడిగినంత ముట్ట జెప్పాడు. ● టీడీపీ పాలనలో 2014–2019 మధ్య కాలంలో జన్మభూమి కమిటీలు, టీడీపీ నేతలు చెప్పిందే శాసనం. అన్న విధంగా పాలన జరి గింది. ప్రతి దాంట్లోను వారు అధికార దర్పాన్ని ప్రదర్శించారు. వారి ఆజ్ఞ లేనిది ఏపనీ జరిగేది కాదు, ఏ ఫైల్ ముందుకు కదిలేది కాదు. అధికారులు సైతం జన్మభూమి కమిటీ ఆదేశాలకు జీ హుజూర్ అనేవారు. జన్మభూమి కమిటీలకు అడిగినంత ఇవ్వలేక ప్రజలు తీవ్ర ఇబ్బందిపడేవారు. ఒక విధంగా చెప్పాలంటే జన్మభూమి కమిటీలు జనాన్ని పీక్కుతిన్నాయనే ఆరోపణలు తీవ్రంగా వినిపిస్తున్నాయి. పంట నష్ట పరిహారంలోనూ దోపిడీ అతివృష్టి, అనావృష్టి కారణంగా జరిగే పంట నష్టానికి ఇచ్చే పరిహారం, ఇన్పుట్ సబ్సిడీలోను టీడీపీ నాయకులు అక్రమాలకు పాల్పడ్డారు. పంటనష్టం జరగకపోయినా, భూమి లేని వారికి కూడ పంటనష్టం రాయించుకుని అధిక మొత్తంలో పరిహారం కాజేశారు. పంటనష్ట పరిహారంలో ఒక్కో టీడీపీ నేత రూ.50 వేల నుంచి రూ.లక్షల వరకు వసూలు చేశారు. ● టీడీపీ జన్మభూమి కమిటీలు చేసిన ఈ ఆగడాలు, అక్రమాలు, వసూళ్లను భరించలేకపోయిన రాష్ట్రప్రజలు ఆ పార్టీకి తగిన విధంగా బుద్ధి చెప్పారు. రాష్ట్ర చరిత్రను తిరగరాశారు. కనీవినీ ఎరుగని విధంగా గడిచిన సార్వత్రిక ఎన్నిక(2019)ల్లో వైఎస్సార్సీపీకి 151 ఎమ్మెల్యే సీట్లు కట్టబెట్టి తెలుగుదేశం పార్టీని తుంగలో తొక్కి జన్మభూమి కమిటీలపై తమకున్న ఆక్రోశాన్ని తీర్చుకున్నారు. -
పోలింగ్లో ఏజెంట్లే కీలకం
హిరమండలం: సార్వత్రిక ఎన్నికల పోలింగ్లో ఏజెంట్లది కీలక పాత్ర. పోలింగ్ బూత్లో ఉన్న ఏజెంట్లందరూ ఒక్కటైపోతే దొంగ ఓటర్లు సులువుగా ఓటు వేసుకునే అవకాశం ఉంటుంది. అందుకే పార్టీ నాయకులు ఏజెంట్ల ఎంపిక విషయంలో చాలా అప్రమత్తంగా ఉంటారు. ఎవరైతే పార్టీకి విధేయులుగా ఉంటారో వారినే నియమిస్తారు. దొంగ ఓట్లు వేసే వారిని అడ్డుకోవడం, ఒక వేళ దొంగ ఓటు వేయడానికి ఎవరైనా వస్తే వారిని గుర్తించి పోలింగ్ అధికారులకు తెలియజేయడం వంటివి చేస్తుంటారు. ఓటర్లను పోలింగు ఏజెంట్లు గుర్తించిన తర్వాతే ఓటు వేసేందుకు పోలింగు సిబ్బంది అనుమతిస్తారు. వాస్తవంగా ప్రతి పోలింగ్స్టేషన్లోనూ అభ్యర్థుల తరఫున ఏజెంట్లను నియమించుకునేందుకు ఎన్నికల సంఘం అనుమతిస్తుంది. ఇందుకు ముందుస్తుగా వారి వివరాలను ఎన్నికల అధికారులకు అందజేయాలి. ఆ తర్వాత ఎన్నికల అధికారి ఫొటో గుర్తింపు కార్డు ఇస్తారు. గతంలో ఎన్నికల అధికారుల ఫొటోలు లేకుండా గుర్తింపు కార్డులు మంజూరు చేసేవారు. ఒకరి తరఫున మరొకరు ఏజెంట్లుగా వ్యవహరించే అవకాశం ఉన్నందున ఎన్నికల అధికారులు ఫొటో గుర్తింపు కార్డులను ఇస్తున్నారు. నియామకం ఇలా.. ప్రతి అభ్యర్థి తమకు నమ్మకమైన వారికి ఆధార్ కార్డు, మొబైల్ నంబర్తో పాటు ఓటరు జాబి తాలోని సీరియల్ నంబర్ను తీసుకుని ముందుగా పార్టీ కార్యాలయాలకు పంపిస్తారు. అక్కడ నుంచి అనుమతి వచ్చిన తర్వాత ఎన్నికల అధికారులకు ఆ జాబితా అందజేస్తారు. వారి పరిశీలన అనంతరం ఎన్నికల అధికారులు ప్రత్యేకంగా ఏ పోలింగ్ స్టేషన్లో ఏజెంటుగా వ్యవహరించాలి.. అనే వివరాలతో గుర్తింపు కార్డులను మంజూరు చేస్తారు. ఒక పోలింగ్ స్టేషన్కు సంబంధించిన గుర్తింపు కార్డు పొంది మరో కేంద్రంలో ఏజెంటుగా వ్యవహరించేందుకు అనుమతించరు. ఎవరు అర్హులంటే..? ● పోలింగ్ ఏజెంట్గా వ్యవహరిస్తున్న వ్యక్తి పోలింగ్ కేంద్రంలో గానీ ఆ పరిధిలో ఉంటే గ్రామంలో గానీ ఓటరై ఉండాలి. ● ఓటు హక్కు లేని వారిని నియమించరు. ● పోలింగ్ కేంద్రంలో ఓటు వేయడానికి వచ్చే వారిని గుర్తించేందుకు మాత్రమే ఏజెంట్లను ని యమిస్తారు. అంతేకానీ వారికి ఎలాంటి అధికారాలు ఉండవు. ● పోలింగ్ ఏజెంటుగా ఉన్నవారు పోలింగ్ కేంద్రంలో ఎలాంటి ప్రచారం చేయకూడదు. ● ఏదైనా పార్టీ తరఫున కేంద్రంలో ప్రచారం చేస్తున్నట్లు పోలింగ్ సిబ్బంది గమనిస్తే ముందుగా హెచ్చరించిన తరువాత బయటకు పంపిస్తారు. ● ప్రతి పోలింగ్ కేంద్రంలో ఒక అభ్యర్థికి ఇద్దరు చొప్పున ఏజెంట్లును నియమించుకునే వీలుంది. ● ఇద్దరు ఏజెంట్లు ఒకేసారి ఉండేందుకు అనుమతించరు. ● లోక్సభ అభ్యర్థి తరఫున ఇద్దరు, అసెంబ్లీ ఎన్నికల అభ్యర్థి తరఫున ఇద్దరు చొప్పున ఏజెంట్లను నియమిస్తారు. ● ఏజెంట్లు పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్ల జాబితాలను చూడాల్సి ఉంది. దొంగ ఓటర్లను గుర్తించే అవకాశం -
No Headline
న్, సివిల్ సర్జన్లు రోగులకు వైద్య సేవలు అందించే వారు . ప్రభుత్వ సర్వజన ఆస్పత్రిగా మారిన తర్వాత ప్రొఫెసర్లు, అసోసియేసిట్ ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు రోగులకు సేవలు అందిస్తున్నారు. ఆస్పత్రిలో కార్పొరేట్ తరహాలో చికిత్స అందుతోంది. సూపర్ స్పెషాలిటీ సేవలు మినహా అన్ని సేవలు అందుతున్నాయి. అన్ని విభాగాల్లో నలుగురు నుంచి పది మంది వరకు వైద్యులు ఉండడంతో రోగులు గంటల తరబడి నిరీక్షించాల్సిన అవసరం లేకపోయింది.. ఆస్పత్రిలో విభాగాలు.. ఆస్పత్రిలో ఈఎన్టీ, డెంటల్ , ఎన్సీడీ, ఏఆర్టీ, కంటి, చర్మవ్యాధులు, జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీ, న్యూరో సర్జరీ, న్యూరో ఫిజిషీయన్, పల్మనాలజీ, ఎమర్జెన్సీ మెడిసిన్, ఫోరిన్సిక్, బయోకెమిస్ట్రీ వంటి విభాగాలు ఉన్నాయి. అదేవిధంగా డిజిటల్ ఎక్సరే, ఈసీజీ, సిటిస్కాన్, ఎంఆర్ఐ స్కాన్ , 2డీ ఎకో సేవలు కూడా అందుబాటులో ఉన్నాయి. అన్ని రకాల వైద్య పరీక్షలు చేసే లేబరేటరీ ఉంది. ఇందులో క్యాన్సర్ నిర్ధారణ ఎఫ్ఎన్ఏసీ వంటి పరీక్షలు కూడా నిర్వహిస్తున్నారు.అత్యవసర కేసులకూ వైద్యం.. జిల్లా ఆస్పత్రిగా ఉన్నప్పడు ఆస్పత్రి నుంచి కేజీహెచ్కు ఎక్కువుగా రిఫరల్స్ వెళ్లేవి. సర్వజన ఆస్పత్రి అయిన తర్వాత చాలా రిఫరల్స్ తగ్గాయి. ఇక్కడ సౌకర్యం లేని వాటిని మాత్రమే రిఫర్ చేస్తున్నారు. మిగతా అత్యవసర కేసులకు ఇక్కడే సేవలు అందిస్తున్నారు. గతంలో పాము కరిచినా, విషయం తాగి అపస్మారక స్థితికి చేరుకున్నా కేజీహెచ్కు రిఫర్ చేసేవారు. ప్రస్తుతం వెంటిలేటర్తో కూడిన ఐసీయూ సౌకర్యం ఉండడంతో ఇప్పడు అటువంటి కేసులకు సర్వజన ఆస్పత్రిలోనే సేవలు అందిస్తున్నారు. అదేవిధంగా పల్మనాలజీ, న్యూరో, నెఫ్రాలజీ వంటి సేవలు కూడా కళాశాల ఏర్పాటు వల్ల ప్రస్తుతం అందుబాటులోకి వచ్చాయి. -
అంబకండి, తునివాడ గ్రామాల్లో పలువురు..
రేగిడి: మండలంలోని అంబకండి గ్రామానికి చెందిన పది యాదవ కుటుంబాలు వైఎస్సార్సీపీలో చేరారు. గ్రామానికి చెందిన జోగ వెంకటరమణతో పాటు మరో తొమ్మిది కుటుంబాలను ఎమ్మెల్సీ పాలవలస విక్రాంత్ పార్టీలోకి ఆహ్వానించారు. కార్యక్రమంలో ఎంపీటీసీ సభ్యురాలు పుర్లి సత్యవతి, సంకిలి పీఏసీఎస్ అధ్యక్షుడు లావేటి వెంకటవేణుగోపాలనాయుడు, మాజీ సర్పంచ్ లావేటి గణపతిరావునాయుడు, లావేటి హరిబాబు, ఎవర్న సత్యనాయుడు, పాలవలస ధవళేశ్వరరావు, తదితరులు పాల్గొన్నారు. అలాగే తునివాడ గ్రామానికి చెందిన 50 కుటుంబాలు టీడీపీనీ వీడి, మరో 50 మంది యువత జనసేనను వీడి వైఎస్సార్సీపీ తీర్థం పుచ్చుకున్నారు. టీడీపీకి చెందిన మాజీ సర్పంచ్ రుంకు వైకుంఠరావు, పప్పల శ్రీనివాసరావు, తదితరులతో పాటు జనసేన నుంచి బొత్స రవికుమార్, కళ్లేపల్లి జ్ఞానేశ్వరరావు, కళ్లేపల్లి రవికుమార్, పల్లి వాసు, కొత్తవలస శివ, గుమ్మడి కిరణ్, తదితరులకు ఎమ్మెల్సీ విక్రాంత్ కండువాలు వేసి పార్టీలోకి ఆహ్వానించారు. కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ సలహా మండలి అధ్యక్షుడు గేదెల వెంకటేశ్వరరావు, వైస్ ఎంపీపీ టంకాల అచ్చెన్నాయుడు, మండల పార్టీ కన్వీనర్ వావిలపల్లి జగన్మోహనరావు, ఎంపీటీసీ సభ్యుడు వంజరాపు శ్రీనివాసరావు, విశ్రాంత ఉపాధ్యాయులు వంజరాపు వెంకటరావు, న్యాయవాది వంజరాపు సుధ, తదితరులు పాల్గొన్నారు. -
అభివృద్ధికి ఆకర్షితులై...
చీపురుపల్లి: ఈ సైకిల్ మాకొద్దు మరి తొక్కలేం బాబూ.. అంటూ ఆ పార్టీని నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున వీడుతున్నారు. అమలు కాని హామీలు ఇచ్చిన చంద్రబాబు పార్టీలో తాము ఉండలేమంటూ గరివిడి మండలంలోని గొట్నంది గ్రామానికి చెందిన 50 కుటుంబాలు టీడీపీకి గుడ్బై చెప్పేశాయి. అందులో భాగంగానే చీపురుపల్లిలోని వైఎస్సార్సీపీ కార్యాలయంలో గొట్నంది గ్రామానికి చెందిన నక్క రవి, నక్క గౌరి, నక్క శివ, నక్క కృష్ణ, నక్క మనోజ్, బొత్స తిరుపతి, కల్లేపల్లి జాన్, కె.సూరిబాబు, నక్క రామకృష్ణ, నక్క రాంబాబు, దిలీప్, అజయ్, సింహాద్రి, ప్రసాద్, కిశోర్, పొట్నూరు అప్పారావు, తదితరులు వైఎస్సార్సీపీ తీర్థం పుచ్చుకున్నారు. వీరందరికీ జెడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు కండువాలు వేసి పార్టీలోకి ఆహ్వానించారు. కార్యక్రమంలో రాజాం నియోజకవర్గ పరిశీలకుడు కేవీ సూర్యనారాయణరాజు, వైఎస్సార్సీపీ గరివిడి మండల అధ్యక్షుడు మీసాల విశ్వేశ్వరరావు, లెంక శ్రీరాములు, రాళ్లపూడి గణేశ్, తదితరులు ఉన్నారు. వైఎస్సార్సీపీలోకి భారీగా వలసలు కుదేలవుతున్న టీడీపీ, జనసేన పార్టీలు -
చికిత్స పొందుతూ వృద్ధుడి మృతి
భోగాపురం: మండలంలోని అమటాం రావివలస పంచాయతీ దల్లిపేట గ్రామానికి చెందిన దల్లి అప్పలరాములు (60) విజయనగరం ప్రభత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం రాత్రి మృతి చెందినట్లు హెచ్సీ పీవీఎస్ఎన్ఎన్ మూర్తి తెలిపారు. వివరాలు ఇలా ఉన్నాయి.. దల్లిపేటకు చెందిన దల్లి అప్పలరాములు భార్య ఏడాది కిందట అనారోగ్యంతో చనిపోయింది. ఉన్న ఇద్దరు కుమారులు బతుకుదెరువు కోసం విశాఖపట్నం వెళ్లిపోయారు. అప్పటినుంచి మద్యానికి బానిసైన అప్పలరాములు మంగళవారం ఉదయం అనుకోకుండా ఫినాయిల్ తాగి అపస్మారక స్థితికి చేరుకున్నాడు. ఈ సమయంలో ఇంటికి వచ్చిన ఆయన చెల్లి నరసయ్యమ్మ అన్న పరిస్థితి చూసి స్థానికుల సహాయంతో విజయనగరం ప్రభుత్వాస్పత్రికి తరలించింది. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతుడి కుమారుడు దల్లి ఆదినారాయణ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు హెచ్సీ పీవీఎస్ఎన్ఎన్ మూర్తి తెలిపారు. ఎన్నికల నియమావళి ఉల్లంఘిస్తే చర్యలు ● ఎస్పీ ఎం. దీపిక భోగాపురం: ఎన్నికల నియమావళి ఉల్లంఘిస్తే కఠిన చర్చలు తప్పవని ఎస్పీ ఎం. దీపిక హెచ్చరించారు. ఈ నెల 13న సార్వత్రిక ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో మండలంలోని ముక్కాంలో ఆమె వివిధ పార్టీలకు చెందిన నాయకులతో బుధవారం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ఓటర్లను ఎవరైనా ప్రలోభాలకు, భయభ్రాంతులకు గురిచేస్తే కఠిన చర్చలు తప్పవన్నారు. ఎన్నికలు ప్రశాంతంగా జరిగేందుకు ప్రతిఒక్కరూ సహకరించాలన్నారు. తప్పుడు సమాచారాన్ని సామాజిక మధ్యమాల ద్వారా వ్యాప్తి చేయరాదని సూచించారు. కార్యక్రమంలో డీఎస్పీ ఆర్. గోవిందరావు, సీఐ రవికుమార్, ఎస్సైలు సూర్యకుమారి, తాతారావు, సిబ్బంది, గ్రామస్తులు పాల్గొన్నారు.సార్వత్రిక ఎన్నికల నిర్వహణకు పటిష్ట ఏర్పాట్లు ● మూడువేల మందితో పటిష్ట బందోబస్తు ● పోలింగ్ రోజున 144 సెక్షన్ అమలు ● ఎస్పీ ఎం.దీపిక విజయనగరం క్రైమ్: సార్వత్రిక ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించేందుకు పటిష్ట ఏర్పాట్లు చేపట్టినట్లు జిల్లా ఎస్పీ ఎం.దీపిక పేర్కొన్నారు. మే 13న నిర్వహించే ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు చేపట్టాల్సిన చర్యలపై పోలీస్ అధికారులతో జిల్లా పోలీస్ కార్యాలయంలో బుధవారం నిర్వహించిన సమావేశంలో దిశానిర్దేశం చేశారు. జిల్లా వ్యాప్తంగా 1015 గ్రామాల్లో ఎన్నికల మీటింగ్లు నిర్వహించి, ఎన్నికల నిబంధనలు, పాటించాల్సిన విధి, విధానాలపై అవగాహన కల్పించామన్నారు. కేంద్ర పోలీస్ బలగాలు, స్థానిక పోలీసులు, ఉన్నతాధికారులు ఇప్పటికే 149 గ్రామాలను సందర్శించారని, ఫ్లాగ్ మార్చ్లు నిర్వహించి, ప్రజలు స్వేచ్ఛగా తమ ఓటు హక్కు వినియోగించుకునేలా భరోసా కల్పించామన్నారు. పోలింగ్ అనంతరం సంబంధిత పోలింగ్ కేంద్రాల నుంచి ఈవీఎంలను, ఎన్నికల మెటీరియల్ను సురక్షితంగా చేర్చాలన్నారు. జేఎన్టీయూ, లెండి ఇంజినీరింగ్ కళాశాలల్లోని స్ట్రాంగ్ రూమ్లకు వెళ్లే మార్గంలో ట్రాఫిక్ అవాంతరాలు ఏర్పడకుండా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. పోలింగ్ రోజున పార్టీ అభ్యర్థులు పాటించాల్సిన విధి, విధానాలపై అవగాహన కల్పించాలని అధికారులను ఆదేశించారు. పోలింగ్ కేంద్రాలకు 200 మీటర్ల దూరంలో మాత్రమే పార్టీ కార్యకర్తలు ఉండేలా, ఎటువంటి పార్టీ జెండాలు, గుర్తులు ఉండకుండా చర్యలు చేపట్టాలన్నారు. పోలింగ్ రోజున 144 సెక్షన్ అమలు పోలింగ్ రోజున 144 సీఆర్పీసీ అమల్లో ఉన్న కారణంగా ఇద్దరు కంటే ఎక్కువమంది గుంపుగా ఉండకుండా చర్యలు చేపట్టాలన్నారు. ఎన్నికల కమిషన్ సూచించిన నిబంధనలు ప్రతీ ఒక్కరూ పాటించేలా చూడాలన్నారు. పోలింగ్ ముగిసిన తర్వాత కూడా గ్రామాల్లో ఎటువంటి అల్లర్లు, వివాదాలు చెలరేగకుండా గస్తీ, పెట్రోలింగ్ నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. ఎన్నికలను శాంతియుతంగా నిర్వహించేందుకు సుమారు మూడువేల మందితో పోలీస్ బందోబస్తు ఏర్పాటుచేస్తున్నామని తెలిపారు. సమావేశంలో విజయనగరం డీఎస్పీ ఆర్.గోవిందరావు, బొబ్బిలి డీఎస్పీ పి.శ్రీనివాసరావు, సీఐలు కేకేవీ విజయనాథ్, ఇ.నరసింహమూర్తి, ఎం.శ్రీనివాసరావు, రవికుమార్, ఎన్.వి.ప్రభాకర్, బి.వెంకటరావు, కె.రామారావు, ఇతర పోలీస్ అధికారులు పాల్గొన్నారు. -
సంక్షేమ పాలన మెచ్చి..
చీపురుపల్లి రూరల్ (గరివిడి): రాష్ట్రంలో జరిగిన అభివృద్ధిని చేసి వైఎస్సార్సీపీలోకి చేరికలు జోరందుకున్నాయని విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. గరివిడి మండలంలోని వెదుళ్లవలసలో బుధవారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా కొండదాడి పంచాయతీ పరిధి చిన వెంకటాపురం, పెద వెంకటాపురం.. వెదుళ్లవలస పంచాయతీ పరిధి ఆవగూడెం గ్రామాల నుంచి టిడిపికి చెందిన 56 కుటుంబాలు మంత్రి బొత్స సత్యనారాయణ సమక్షంలో వైఎస్సార్సీపీ తీర్థం పుచ్చుకున్నాయి. ఆయా గ్రామాలకు చెందిన పాసి బంగారప్పుడు, పాసి రాజప్పుడు, బాగు శ్రీరాములు, మండాది ఆదినారాయణ, మంత్రి చిన్నోడు, లండ గోవింద్, నక్కేల జోగులు, బాగు అప్పయ్య, పల్లె ఈశ్వరరావు, గులివిందల రాము, తదితర 56 కుటుంబాలకు చెందిన వారందరికీ మంత్రి బొత్స సత్యనారాయణ కండువాలు వేసి పార్టీలోనికి ఆహ్వానించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, రాష్ట్రంలో గతంలో ఎన్నడూ జరగనంత అభివృద్ధి జరిగిందన్నారు. రానున్న ఎన్నికల్లో వైఎస్సార్సీపీ విజయం తధ్యమని.. జగన్ మోహన్రెడ్డి మరోసారి ముఖ్యమంత్రి కావటం ఖాయమని జోష్యం చెప్పారు. సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగాలంటే ప్రతిఒక్కరూ ఫ్యాన్ గుర్తుపై ఓటు వేయాలని కోరారు. కార్యక్రమంలో ఉత్తరాంధ్ర డిప్యూటీ రీజనల్ కోఆర్డినేటర్, జిల్లా పరిషత్ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు, ఏఎంసీ మాజీ చైర్మన్ మీసాల విశ్వేశ్వరరావు, వైస్ ఎంపీపీ గుడివాడ శ్రీరాములనాయుడు, స్థానిక సర్పంచ్ గుడివాడ తమ్మినాయుడు, తదితరులు పాల్గొన్నారు. వైఎస్సార్సీపీలో చేరిన 56 కుటుంబాలు కండువాలు వేసి ఆహ్వానించిన మంత్రి బొత్స సత్యనారాయణ -
ప్రతి ఇంటికీ ఆడబిడ్డనయ్యా
సాక్షి, పార్వతీపురం మన్యం: ఏజెన్సీలో గిరిజన ప్రజలందరికీ నేను ఆత్మబంధువును. నియోజకవర్గంలో ప్రతి ఇంటికీ ఆడబిడ్డనయ్యాను. పదేళ్లుగా పాలకొండ నియోజకవర్గ ప్రజలు నన్ను ఆదరిస్తూ అండగా నిలుస్తున్నారు. ఈ ప్రేమాభిమానాలు మున్ముందూ ఇలాగే సాగాలని దేవుడిని ప్రార్థిస్తున్నా. నియోజకవర్గంలోని 102 సచివాలయాల పరిధిలోని దాదాపు 78 వేల గడపల వద్దకు వెళ్లి వారందరితో మమేకమయ్యా. కష్టసుఖాలు తెలుసుకున్నా. ఇన్ని వేల కుటుంబాలను నాకు ఇచ్చింది జగనన్నే.’’ అని పాలకొండ నియోజకవర్గ వైఎస్సార్సీపీ అభ్యర్థిని విశ్వాసరాయి కళావతి అన్నారు. పాలకొండ నియోజకవర్గంలో ఇంతవరకు చేసిన అభివృద్ధి, ఇంకా చేయబోయే పనులు..కూటమి దుష్ప్రచారం తదితర అంశాలను ‘సాక్షి’తో ముఖాముఖిలో ఆమె వివరించారు. వివరాలు ఆమె మాటల్లోనే.. ప్రజల కోసమే..పదవిమా కుటుంబంలో చాలామంది ఎమ్మెల్యేలున్నారు. నేను రెండుసార్లు గెలిచాను. పదవులు మాకు ము ఖ్యం కాదు. విలువలతో కూడిన ఎదుగుదల మా పెద్దల నుంచి నేర్చుకున్నా. అందుకే ఎప్పుడూ నిరా డంబరంగా ఉంటా. మా ప్రజల ప్రతి కష్టసుఖంలో నూ తోడుగా ఉంటా. వారితో కలిసిపోతాను. ఎప్పు డూ ప్రజల్లోనే ఉండాలని మా అధినేత జగన్మోహన్రెడ్డి చెబుతుంటారు. అందుకే అందరూ నన్ను ఆశీర్వదిస్తూ, వారి బిడ్డగా చూసుకుంటారు. ఇప్పు డు ప్రచారానికి వెళ్లినప్పుడు కూడా ఎక్కడికక్కడ బ్రహ్మరథం పడుతున్నారు. మళ్లీ వచ్చేది వైఎస్సార్సీపీ ప్రభుత్వమే. జగన్మోహన్రెడ్డి నేతృత్వంలో మరింతగా ప్రజలకు సేవ చేసుకుంటాం.ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి అయితేనే తమకు మేలు చేస్తాడన్న నమ్మకం, భరోసా గిరిజనులందరిలోనూ ఉందని వైఎస్సార్సీపీ పాలకొండ ఎమ్మెల్యే అభ్యర్థి విశ్వాస రాయి కళావతి అన్నారు. గడిచిన ఐదేళ్ల కాలంలో వివిధ సంక్షేమ పథకాల కింద దాదాపు రూ.1,300 కోట్ల మేర నియోజకవర్గంలోని పేదలకు అందించామని చెప్పారు. నాన్ డీబీటీ కింద సుమారు రూ.218 కోట్ల మేర వివిధ పథకాల ద్వారా లబ్ధిదారులు పొందారని వివరించారు. గడిచిన 59 నెలల కాలంలోనే ఇదంతా సాధించామని చెప్పారు. ఎన్నికలొచ్చాయని ప్రజల ముందుకు బూటకపు హామీలతో వస్తున్న విషపు కూటమి నేతలను ఎవరూ నమ్మవద్దని హితవు పలికారు.సంపూర్ణంగా మహిళా సాధికారత2019 ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు జగన్మోహన్రెడ్డి ప్రభుత్వంలో అమలు చేసిన నవరత్నాల పథకాలు ప్రతి ఇంటికీ అందాయి. జీవితాలను బాగు చేశాయి. గతంలో ఏ ప్రభుత్వమూ ఇన్ని పథకాలను విజయవంతంగా 99 శాతం అమలు చేసింది లేదు. 2024లో అధికారంలోకి వచ్చిన తర్వాత అమ్మ ఒడి పథకాన్ని రూ.17 వేలకు పెంచుతున్నాం. రైతులకు ఇచ్చే భరోసా మొత్తం రూ.16 వేలు అవుతుంది. దీనివల్ల రైతుకు మరింత సాయం అందించేవారమవుతాం. మహిళల సాధికారత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలోనే సాధ్యమైంది. ప్రతి పథకం మహిళలకే అందుతోంది. చేయూత పథకం ద్వారా ఎంతో మంది స్వయం ఉపాధి పొందారు. కొందరు భూములు, బంగారం కొనుగోలు చేసుకుని భవిష్యత్తు అవసరాలకు ఉంచుకున్నారు.నిన్ను ఎలా నమ్ముతారు బాబూ..గత టీడీపీ హయాంలో నియోజకవర్గ ప్రజలకు, ముఖ్యంగా గిరిజనులకు ఎటువంటి పథకాలూ అందలేదు. కనీసం రేషన్కార్డులు, ఆధార్ కార్డులు వంటివి కూడా లేవు. వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాతే వలంటీర్ల ద్వారా లబ్ధిదారులను గుర్తించి ప్రతి ఇంటికీ మేలు చేశాం. ఇప్పుడు ప్రతిపక్షాలన్నీ కూటమిగట్టి..బూటకపు హామీలిస్తున్నాయి. అవేవీ నమ్మశక్యంగా లేవు. 2014 మేనిఫెస్టోలో చంద్రబాబు ఇచ్చిన 600 హామీల్లో ఎన్ని అమలు చేశారు? పోనీ, ఇప్పుడు మేనిఫెస్టో కూడా ఉమ్మడిగా ఇచ్చే ధైర్యం చేయలేకపోయారు. కూటమిలోని బీజేపీ దూరంగా ఉంది. అంటే..దాని అమలు మీద వారిలో వారికే నమ్మకం లేదు. ఇంక ప్రజలు ఎలా నమ్ముతారు..అభివృద్ధి అంటే ఇది కాదా?59 నెలల కాలంలో గతంలో ఏ ప్రభుత్వమూ చేయని అభివృద్ధి నియోజకవర్గంలో చేసి చూపించాం. కొన్ని పెండింగ్ పనులు మిగిలిపోయాయంటే..అది గత టీడీపీ ప్రభుత్వ కక్షపూరిత వైఖరే. ఆ విషయం విజ్ఞులైన నియోజకవర్గ ప్రజలు, మేధావులందరికీ తెలుసు. మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నియోజకవర్గంలో 4,086 మందికి ఇళ్ల పట్టాలిచ్చాం. ఇంటి నిర్మాణానికి ఆర్థిక సహాయం అందించాం. కిమ్మి–రుషింగి వంతెన నిర్మాణం రూ.27.50 కోట్లతో పూర్తి చేశాం. సీతంపేటలో సుమారు రూ.50 కోట్లతో మల్లీ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మాణం జరుగుతోంది. సీతంపేట ఆస్పత్రిని రూ.19 కోట్లతో అప్గ్రేడ్ చేశాం. టీటీడీ ద్వారా రూ.10 కోట్లతో ఆలయాన్ని నిర్మించాం. 146 దేవాలయాలకు ఒక్కో గుడికి రూ.10 లక్షలు చొప్పున టీటీడీ దేవస్థానం నుంచి మంజూరు చేయించాం. బత్తిలిలో రూ.2.5 కోట్లతో మోడల్ పోలీస్స్టేషన్ నిర్మాణం చేపట్టాం. నియోజకవర్గంలో రూ.214 కోట్లతో సుమారు 234 కి.మీ. మేర రోడ్లు, 41 కి.మీ మేర డ్రైన్లు వేశాం. 102 సచివాలయాల నిర్మాణం, ఆర్బీకేలు, వెల్నెస్ సెంటర్ల నిర్మాణం, నాడు–నేడు ద్వారా పాఠశాలల అభివృద్ధి మా హయాంలోనే చేపట్టాం. గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో గుర్తించిన సమస్యల పరిష్కారానికి రూ.20 లక్షల నుంచి రూ.40 లక్షలు చొప్పున వెచ్చించి మరిన్ని పనులు చేశాం. సంక్షేమ పథకాల లబ్ధి కోసం మరో రూ.1,500 కోట్లకుపైగా వెచ్చించాం. ఇదంతా అభివృద్ధి కాదా? ముందు ప్రభుత్వాలు ఇవేవీ ఎందుకు చేయలేదు? మాపై దుష్ప్రచారం చేస్తున్న వారు వీటికి సమాధానం చెప్పగలరా? కరోనా వంటి కష్టకాలంలో పేదలకు మా ప్రభుత్వం అండగా నిలిచింది. అందుకే ఇప్పుడు ధైర్యంగా వారి వద్దకు వెళ్లగలుగుతున్నాం. పెండింగ్లో ఉన్న ఇరిగేషన్ ప్రాజెక్టుల పనులు ప్రాధాన్యతా క్రమంలో పూర్తి చేస్తాం.పర్యాటకంగా అభివృద్ధి, ఉపాధిసీతంపేటలో పర్యాటకంగా అభివృద్ధికి అనేక అవకాశాలున్నాయి. రూ.2.5 కోట్లతో అడలి వ్యూపాయింట్, గిరిజన మ్యూజియం అభివృద్ధితోపాటు, మరికొన్ని ప్రాంతాలు, జలపాతాలపై దృష్టి సారించాం. ఇప్పటికే ఇక్కడ అడ్వెంచర్పార్కు ఉంది. నేను అభివృద్ధి కోరుకునేదానిని. టూరిజం కోసం అప్పట్లోనే ప్రశ్నించా. యువతకు కూడా స్థానికంగా నే ఉపాధి కల్పించాలన్న ఉద్దేశంతో పరిశ్రమలు తె చ్చే ఆలోచన ఉంది. ఈ విషయం ముఖ్యమంత్రి దృష్టిలో పెట్టాం. దాదాపు 10 వేల మంది వరకూ ఇక్క డే ఉపాధి లభిస్తే బాగుంటుందన్నది నా ఆలోచన.కూటమికి ప్రజలే బుద్ధి చెబుతారు..కూటమి పేరుతో ఓట్ల కోసం వస్తున్న వారి గత చరిత్ర ఎలాంటిదో ఇక్కడ అందరికీ తెలుసు. వారి అవినీతి గురించి ఎంత చెప్పినా తక్కువే. వారికి ప్రజలే ఓట్ల ద్వారా బుద్ధి చెబుతారు. -
జిల్లాలో ప్రారంభమైన హోమ్ ఓటింగ్
విజయనగరం అర్బన్: జిల్లాలో హోమ్ ఓటింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. పోలింగ్ కేంద్రాలకు వచ్చి ఓటు వేయడానికి అవకాశంలేని 85 ఏళ్లు పైబడిన వయోవృద్ధులు, 40 శాతం దివ్యాంగత్వం దాటిన విభిన్న ప్రతిభావంతులు తమ ఇంటివద్దనే ఓటు వేసే అవకాశాన్ని ఎన్నికల కమిషన్ ఈ ఏడాది కొత్తగా అందుబాటులోకి తీసుకువచ్చింది. హామ్ ఓటింగ్ సదుపాయాన్ని వినియోగించుకోవడానికి 86 మంది దివ్యాంగులు, 156 మంది వయోవృద్ధులు దరఖాస్తు చేసుకున్నారు. వీరి ఇళ్లకు వెళ్లి ఓటు తీసుకునే ప్రక్రియ మంగళవారం ప్రారంభించారు. సెక్టార్ అధికారుల పర్యవేక్షణలో పీఓలు, బీఎల్వోలు, మైక్రో అబ్జర్వర్లు, పోలీస్ సిబ్బంది, దరఖాస్తు చేసినవారి ఇంటింటికి వెళ్లి, రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో హోమ్ ఓటింగ్ చేయించారు. 15 నుంచి రామనారాయణంలో ఉచిత వ్యక్తిత్వ వికాస శిబిరం విజయనగరం రూరల్: ప్రముఖ ఆధ్యాత్మిక, పర్యాటక కేంద్రం రామనారాయణంలో ఈ నెల 15 నుంచి 17వరకు ఉచిత వ్యక్తిత్వ వికాస శిక్షణ శిబిరం నిర్వహించనున్నట్టు ఎన్సీఎస్ ట్రస్టీ నారాయణం శ్రీనివాస్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రతిరోజూ ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు శిక్షణ శిబిరం జరుగుతుందన్నారు. బెంగళూరుకు చెందిన రచయిత శ్రీరామ చక్రధర్ శిక్షణ శిబిరానికి హాజరై వ్యక్తిత్వ వికాస శిక్షణపై అవగాహన కల్పిస్తారన్నారు. శిక్షణకు హాజరయ్యే వారికి విజయనగరం ఆర్టీసీ కాంప్లెక్ ఎదురుగా ఉన్న ఎన్సీఎస్ మల్టిఫ్లెక్స్ నుంచి ఉచిత బస్సు సౌకర్యం, మధ్యాహ్నం భోజన సౌకర్యం కల్పిస్తామని తెలిపారు. శిక్షణకు హాజరయ్యే వారు ఈ నెల 12వ తేదీ లోగా తమ పేర్లును రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని, వివరాలకు సెల్: 93470 17144, 89197 67705 నంబర్లను సంప్రదించాలన్నారు. నేడూ పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ ● మూడో రోజు 3,638 బ్యాలెట్ల నమోదు విజయనగరం అర్బన్: ఇతర జిల్లాల్లో పనిచేస్తూ ఓటు హక్కు ఉన్న 494 మంది ఉద్యోగులకు బుధవారం (8వ తేదీ) ఓటింగ్ అవకాశం కల్పిస్తున్నట్టు జిల్లా ఎన్నికల అధికారి ఎస్.నాగలక్ష్మి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. షెడ్యూల్ ప్రకారం గతనెల 22వ తేదీలోగా ఫారం–డి సమర్పించిన వారికి మంగళవారంతో పోస్టల్ బ్యాలెట్ సౌకర్యం ముగిసింది. రాష్ట్ర ఎన్నికల కమిషన్ ముఖ్య అధికారి ముఖేష్కుమార్ మీనా ఆదేశాల మేరకు ఇతర జిల్లాల్లో పనిచేస్తూ ఇక్కడ ఓటుహక్కు కలిగిన ఆరోగ్యశాఖ సిబ్బంది 463 మంది, అగ్నిమాపక శాఖ ముగ్గురు, జిల్లా జైళ్ల శాఖకు చెందిన నలుగురు, ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ శాఖ–18, పౌర సంబంధాల శాఖకు చెందిన ఆరుగురికి పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్కు అవకాశం కల్పించారు. -
ఆ కష్టాలు మాకొద్దు ‘రాజా’..!
విజయనగరం: విజయనగరం.. చారిత్రక నేపథ్యం కలిగిన నగరం. ఏళ్ల తరబడి రాజుల పాలనలో ఉన్నా అభివృద్ధి శూన్యం. రాజులను నమ్మి జనం అధికారం కట్టబెట్టినా అది అలంకార ప్రాయంగానే చూశారు. ప్రజల కష్టాలు అరణ్యరోదనగానే మిగి లాయి. ఏ నాడూ ప్రజల సమస్యలు తెలుసుకోవాలన్న ధ్యాస, మంచిచేయాలన్న తపన రాజరిక కుటుంబానికి లేకపోవడమే దీనికి కారణం. ఓ వైపు నగర జనాభా పెరుగుతున్నా... కాలనీలు విస్తరించినా ఆ స్థాయిలో సౌకర్యాలు కల్పించేందుకు కనీ సం కృషి చేయలేదు. ఆ ఆలోచన కూడా రాలేదు. కేంద్ర మంత్రిగా పనిచేసిన అశోక్ గజపతిరాజు కోటదాటి బయటకు వచ్చిన సందర్భాలు అరుదు. జనానికి రాజు మొహం కనిపించిందంటే అదే మహాభాగ్యంగా ఉండేది. ఎన్నికల వేళ జనంలోకి రావడం.. తర్వాత బంగ్లాకు లేదంటే ఢిల్లీకి పరిమితం కావ డమే ఏళ్ల తరబడి సాగుతున్న తంతు. 2014–19 మధ్య టీడీపీ హయాంలో నగర వాసులు దాహార్తితో అల్లాడినా మంత్రిగా ఉండి కనీసం పట్టించుకోలేదు. గుక్కెడు తాగునీటి కోసం బంగ్లా వద్ద ఆందోళనలు చేసినా కనికరించలేదు. రోడ్ల విస్తరణ పరిస్థితీ అంతే. తవ్వేసి వదిలేశారు. పాడైన రోడ్లపై రాకపోకలకు పట్టణ వాసుల అవస్థలు వర్ణనాతీతం. పదవీ కాలమంతా కోట, పరిసరాలను అందంగా తీర్చిదిద్దేందుకే పరిమితమయ్యారు. అన్ని రంగాల్లో నగర అభివృద్ధిని మసకబారించారన్న అపవాదను అశోక్ మూటగట్టుకున్నారు. కార్పొరేషన్ స్థాయిలో సదుపాయాల కల్పనకు అశోక్ కనీసం ఆలోచన చేయలేదని జనం బహిరంగంగానే విమర్శిస్తున్నారు. నగరంలోని శివారు కాలనీల పరిస్థితి అయితే ఐదేళ్ల కిందట దుర్భరం. తాగునీరు, డ్రైనేజీలు, రోడ్ల సదుపాయాలు కల్పించాలని ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా అశోక్ కనీసం పట్టించుకోలేదు. ఇప్పుడు కుమార్తె తరఫున ప్రచారానికి వస్తున్న అశోక్ను జనం బహిరంగంగానే నిలదీస్తున్నారు. మీరు పదవులు అనుభవించడమే తప్ప జనానికి ఏ రోజైనా మేలు చేశారా..? కనీసం మా సమస్యలు ఆలకించారా..? మాట్లాడేందుకు అవకాశం కల్పించారా..? అంటూ ప్రశ్నిస్తున్నారు.జనాభా పెరిగినా..విజయనగరంలో 2001 సంవత్సరంలో సుమారు లక్ష వరకు ఓటర్లు ఉండగా... 2005 నాటికి 1.05 లక్షల మంది ఓటర్లు ఉన్నారు. 2011 జనాభా లెక్కల ప్రకారం 2.44 లక్షల జనాభా ఉండగా.. 2014 సంవత్సరం నాటికి జనాభా సంఖ్య సుమారు 3 లక్షలు ఉండేది. అప్పట్లో గాజులరేగ, జమ్ము, ధర్మపురి, అయ్యన్నపేట, వేణుగోపాలపురం, కెఎల్పురం ప్రాంతాలను విజయనగరం మున్సిపాలిటీలో విలీనం చేయడంతో పట్టణ విస్తీర్ణం పెరిగింది. వీటి పరిధిలో గుర్తింపు పొందిన మురికివాడలు 80 వరకు ఉండేవి. వీరిలో అర్హులైన వారికి హౌస్ఫర్ ఆల్ పథకంలో ఇళ్ల నిర్మాణానికి దరఖాస్తులు స్వీకరించగా.. లబ్ధిదారుల నుంచి టీడీపీకి చెందిన దిగవ స్థాయి నాయకులు లంచాలు వసూలు చేసి చివరికి ఇల్లు అప్పగించకుండా మోసం చేసినట్టు కొందరు బహిరంగంగానే విమర్శిస్తున్నారు. 2014–19 మధ్య రూ.279 కోట్లతో రెండువేల పనులు చేపట్టేందుకు అప్పటి టీడీపీ పాలకవర్గం ఆమోదించగా... అందులో రూ.93 కోట్లతో 700 పనులు మాత్రమే పూర్తిచేయగలింది.నాటికి నేటికీ తేడా చూడు..రాజులు కోట, బంగ్లాకే పరిమితమైతే.. నేటి పాలకులు జనం మధ్యనే ఉంటూ.. జనం అవసరాలు తెలుసుకుంటూ అభివృద్ధి పనులు చకచకా పూర్తిచేస్తున్నారు. పెరుగుతున్న జనాభా అవసరాలకు అనుగుణంగా నగరాన్ని తీర్చిదిద్దుతున్నారు. కేవలం జగన్మోహన్రెడ్డి ప్రభుత్వ 59 నెలల పాలనలో ఇది మన విజయనగరం అని మురిసిపోయేలా.. గర్వంగా చెప్పుకునేలా అన్ని కూడళ్లను అందంగా తీర్చిదిద్దారు. నగరవాసులకు ఆహ్లాదాన్ని పంచేలా చెరువు గట్లను పార్కులుగా మలిచారు. మహిళల కోసం రాష్ట్రంలోనే తొలిసారిగా పార్కును నిర్మించారు. తాగునీటి పథకాలు నిర్మించి నగరవాసులకు శాశ్వతంగా తాగునీటి కష్టాలను దూరం చేశారు. శివారు కాలనీలకు రోడ్లు వేశారు. విద్య, వైద్య సదుపాయాలను అందుబాటులోకి తెచ్చారు. సరస్వతీ నిలయాలకు సొబగులద్దారు. నగరంలో రోడ్ల విస్తరణ పనులు పూర్తిచేశారు. నగరానికి ఏ వైపు నుంచి వచ్చిన వారికై నా ఇది మన విజయనగర వైభవం అని చాటిచెప్పేలాహంగులు కల్పించారు.పాలకుడంటే జనం కష్టాలు తెలిసిన వాడు.. తెలుసుకునేవాడై ఉండాలి.. ప్రజల అవసరాలు ఎప్పటికప్పుడు తీర్చగలగాలి. ఆపద సమయంలో నేనున్నాంటూ ఆపన్నహస్తం అందించి ఆదుకోవాలి. ఓ విజన్తో నగరాభివృద్ధికి కృషిచేస్తూ.. ప్రతీ ఒక్కరికీ మంచి చేయాలన్న తపనతో ముందుకు సాగాలన్నది జనం మాట. అధికారాన్ని అలంకారంగా భావించి.. కష్ట కాలంలో కోటదాటని పాలకులు.. ఎన్నికల వేళ ప్రజల వద్దకు వస్తుంటే ఛీకొడుతున్నారు. దాహార్తితో అల్లాడుతున్నా పట్టించుకోని రాజులు.. రోడ్ల విస్తరణ పనులు పూర్తిచేయనివారు.. విజయనగర వైభవాన్ని మసకబారించేలా వ్యవహరించే రాజరిక పాలన మాకొద్దంటూ మొహంమీదే చెబుతున్నారు. అనునిత్యం అందుబాటులో ఉంటూ.. కార్పొరేట్ స్థాయికి తగ్గట్టుగా విజయనగర అభివృద్ధికి అనునిత్యం పాటుపడే నాయకుడే పాలకుడుగా ఉండాలని సుస్పష్టం చేస్తున్నారు. -
గజపతినగరం మామిడిబంద కాలనీ...
రోడ్ షో బృందం: చంద్రబాబు మళ్లీ వస్తే ఉచితంగా ఇసుక ఇస్తానంటున్నారు. గతంలో ఆయన పాలనలో ఇసుక ఉచితమేనా? కర్రి వెంకటరమణ, భవననిర్మాణ కార్మికుడు: చంద్రబాబు చెప్పేవన్నీ అబద్ధాలే. అప్పుడెప్పుడూ ప్రజలకు ఇసుక ఉచితం కాదు. టీడీపీ నాయకుల దగ్గర డబ్బులు పెట్టి కొనుక్కోవాల్సిందే. నాలాంటి భవన నిర్మాణ కార్మికులను ఆదుకున్నది వై.ఎస్.జగన్మోహన్రెడ్డి మాత్రమే. జగనన్న కాలనీల్లో నిర్మాణ పనులతో మూడేళ్లుగా చేతినిండా పని దొరుకుతోంది. అంతేకాదు నా భార్య శస్త్ర చికిత్సకు వేలాది రూపాయలు ఖర్చు అవుతుందంటే ఆరోగ్యశ్రీలో ఉచితంగా చేయించారు. మా పిల్లలను ఉన్నత విద్య చదివించుకుంటున్నాం. మద్యం అలవాటు పడినవాళ్లు మాత్రం వాళ్లకు కావాల్సిన బ్రాండ్ దొరకలేదని, రేట్ పెరిగిపోయిందని ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు తప్ప సంక్షేమ పథకాలు అందుకున్న ప్రతి కుటుంబం జగన్మోహన్రెడ్డి వైపే ఉంటుంది. -
పార్వతీపురం నియోజకవర్గం సీతానగరం...
పార్వతీపురం అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని సీతానగరం మండల కేంద్రంలో చిన్న దుకాణం నిర్వహిస్తున్న భాగ్యలక్ష్మిని రోడ్ షో బృందం పలుకరించింది. రోడ్ షో బృందం: మహిళలకు ఎవరి పాలన బాగుంది? భాగ్యలక్ష్మి: డ్వాక్రాలో ఉన్నవాళ్లందరి రుణాలు మాఫీ చేస్తామంటే 2014 ఎన్నికల్లో చంద్రబాబుకు ఓటేశాం. అధికారంలోకి వచ్చాక పసుపు కుంకుమ అని రూ.10 వేలు చేతిలో పెట్టారు. అతన్ని నమ్మినవారంతా బ్యాంకు వాళ్లతో ఇబ్బందులు పడ్డాం. కానీ జగన్మోహన్రెడ్డి చేస్తానంటే చేస్తారంతే. ఆసరా, చేయూత, సున్నా వడ్డీ పథకాలన్నీ ఎంతో ఉపయోగపడుతున్నాయి. మేమైతే జగన్మోహన్రెడ్డికే ఓటేస్తాం. పార్వతీపురం మండలం వెంకంపేట... పార్వతీపురం మండలం వెంకంపేట గ్రామంలో రచ్చబండపై కూర్చున్నవారిని పలుకరించాం. అక్కడున్న రైతులు వైఎస్ జగన్మోహన్రెడ్డి పాలనపై సంతృప్తి వ్యక్తంచేశారు. పెదిరెడ్డి సింహాచలనాయుడు, రైతు: గతంలో ఏ సమస్యలతోనైతే రైతులు ఇబ్బందిపడ్డారో జగన్మోహన్రెడ్డి వాటన్నింటికీ పరిష్కారం చూపించారు. వైఎస్సార్ రైతుభరోసా కేంద్రం మాకు చేయూతగా ఉంది. మా రైతుల గ్రూపుకి యంత్రసాయం కింద ట్రాక్టరు కూడా ఇచ్చారు. విత్తనాల నుంచి పంటల కొనుగోలు చేసేంతవరకు రైతు భరోసా కేంద్రాలు అండగా నిలుస్తున్నాయి. ● -
ఓట్ల కోసమే దుష్ప్రచారం
● జగన్మోహన్రెడ్డి ప్రభుత్వంలో రైతులకు మేలే తప్ప నష్టం ఉండదు ● ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్పై అపోహలు కల్పిస్తున్న టీడీపీ, ఎల్లోమీడియా ● వైఎస్సార్సీపీ ప్రభుత్వంపై ప్రజలకు నమ్మకం ఉంది ● ఈ ఎన్నికల్లోనూ విజయం తథ్యం ● ‘సాక్షి ప్రత్యేక ఇంటర్వ్యూలో గజపతినగరం ఎమ్మెల్యే బొత్స అప్పలనర్సయ్య సాక్షి ప్రతినిధి, విజయనగరం: చంద్రబాబు 14 ఏళ్ల పాలనలో ఉమ్మడి విజయనగరం జిల్లాలకు చేసిన మేలు ఒక్కటీ లేదని గజపతినగరం ఎమ్మెల్యే బొత్స అప్పలనర్సయ్య చెప్పారు. చెప్పుకోవడానికి ఏమీ లేక ఓట్ల కోసం ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్పై దుష్ప్రచారానికి దిగడం నీచాతినీచమని ధ్వజమెత్తారు. జగన్మోహన్రెడ్డి ప్రభుత్వంలో రైతులకే మేలే తప్ప నష్టం ఉండదని విస్పష్టంగా చెప్పారు. గజపతినగరం అసెంబ్లీ నియోజకవర్గంలో వైఎస్సార్సీపీ అభ్యర్థిగా మరోసారి బరిలోకి దిగిన ఆయన తన విజయంపై ధీమా వ్యక్తం చేశారు. ‘సాక్షి’కి ప్రత్యేకంగా ఇంటర్వ్యూ ఇచ్చారు. సాక్షి: టీడీపీ, జనసేన పార్టీ నాయకులు ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్రెడ్డి, వైఎస్సార్సీపీ నాయకులపై హద్దులు మీరి దుష్ప్రచారం చేయడం వెనుక లక్ష్యమేమిటి? అప్పలనర్సయ్య: అధికారం దక్కదనుకున్నప్పుడే చంద్రబాబు అండ్ కో దుష్ప్రచారం ఆకాశమంత ఎత్తులో చేస్తుంది. తొలి నుంచి వారి తీరే అంత. సొంత మామకు వెన్నుపోటుతో తొలుత ముఖ్యమంత్రి పదవి పొందిన చంద్రబాబు 1999 సంవత్సరంలో బీజేపీ అనుకూల గాలితో రెండోసారి ఆ కుర్చీ ఎక్కారు. అలా తొమ్మిదేళ్లు అధికారంలో ఉన్నా హైటెక్ పేరుతో హంగామా తప్ప రాష్ట్రంలో అత్యంత ప్రధానమైన వ్యవసాయ రంగాన్ని విస్మరించారు. విద్యుత్ చార్జీలు తగ్గించాలని ఉద్యమిస్తే బషీర్బాగ్లో రైతులపై కాల్పులు జరిపించి ముగ్గురి ప్రాణాలు బలిగొన్నారు. అప్పట్లో చంద్రబాబుపై తీవ్ర వ్యతిరేకత వచ్చింది. అదే సమయంలో అలిపిరి ఘటనతో సానుభూతి వస్తుందని ముందస్తు ఎన్నికలకు వెళ్లినా ప్రజలు అతన్ని ఇంటికి పంపించారు. వై.ఎస్.రాజశేఖరరెడ్డి సంక్షేమ నినాదంతో ముఖ్యమంత్రి అయ్యారు. ఇచ్చిన హామీల కన్నా మిన్నగా రాష్ట్రాన్ని ఇటు సంక్షేమంలో, అటు అభివృద్ధిలో ముందుకు నడిపించారు. అందుకే 2009 ఎన్నికల్లోనూ ఆయనకే ప్రజలు పట్టం కట్టారు. అప్పుడు కూడా ఇదే చంద్రబాబు, ఆయన అనుకూల పచ్చమీడియా కట్టుకథలు, అభూత కల్పనలతో ప్రజలను భయభ్రాంతులను చేయడానికి ప్రయత్నించినా తమ వివేచనతో నిర్ణయం తీసుకున్నారు. 2014 ఎన్నికల్లో 600 హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన బాబు ప్రజలను మోసం చేయడంతో 2019 ఎన్నికల్లో ఓటుతో గట్టిగా బుద్ధిచెప్పారు. వై.ఎస్.జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి పదవి చేపట్టినప్పటి నుంచి సంక్షేమ, అభివృద్ధి పాలన అందించారు. కరోనా కష్టకాలంలో చంద్రబాబు హైదరాబాద్ జూబ్లీహిల్స్ ప్యాలెస్ గేట్లు మూసేసుకుంటే, జగన్మోహన్రెడ్డి మాత్రం నిరంతర పర్యవేక్షణతో ప్రజలను కంటికి రెప్పలా కాపాడుకున్నారు. విపత్తు నిర్వహణలో ఆయన శైలిని పొరుగు రాష్ట్రాల నాయకులూ ప్రశంసించారు. నవరత్నాల్లాంటి సంక్షేమ పథకాలతో పాటు నాణ్యమైన విద్య, వైద్యాన్ని అందించారు. 59 నెలల పాలనలో మేనిఫెస్టోలోని 99 శాతం హామీలను నెరవేర్చారు. మన ఉమ్మడి విజయనగరం జిల్లానే చూసుకుంటే చంద్రబాబు చేయలేక చేతులెత్తేసిన భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం, విజయనగరంలో ప్రభుత్వ మెడికల్ కాలేజీ, కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం, జాతీయ రహదారుల విస్తరణ తదితర పనులన్నీ కొలిక్కి తీసుకొచ్చారు. వీటన్నింటి నుంచి ప్రజల దృష్టి మరల్చడానికి చంద్రబాబు అండ్ కో దుష్ప్రచారానికి తెగించారు. అంతే తప్ప వారి ఆరోపణల్లో వాస్తవం లేదు. సాక్షి: ఎన్డీఏ ప్రభుత్వం ప్రతిపాదించిన ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ను ఇప్పుడు అదే కూటమిలోనున్న టీడీపీ, జనసేన వ్యతిరేకించడం వెనుక ఉద్దేశం ఏమై ఉంటుంది? అప్పలనర్సయ్య: టీడీపీ, జనసేన ఆ యాక్ట్ను వ్యతిరేకించట్లేదు. దుష్ప్రచారం చేస్తున్నాయి. వాస్తవానికి భూహక్కు చట్టం అన్నివిధాలా రైతులకు ఉపయోగపడుతుంది. మేలు చేస్తుంది. దశాబ్దాల నుంచి రీసర్వే జరగలేదు. నాటి రెవెన్యూ రికార్డులు సరిగాలేవు. చాలామంది రైతులకు యాజమాన్య హక్కుపత్రాలు లేవు. కోర్టుల్లో సివిల్ లిటిగేషన్లు పెరిగిపోతున్నాయి. కలెక్టరేట్లకు వచ్చే ఫిర్యాదుల్లో అధిక భాగం భూవివాదాలే. ఇంట్లో ఏ అత్యవసరం వచ్చినా భూమిని అమ్ముకోవడానికీ వీల్లేని పరిస్థితుల్లో ఎంతోమంది అష్టకష్టాలు పడ్డారు. వీటన్నింటికీ పరిష్కారంగా భూసర్వే చేయించాలని రైతులు చాలామంది కోరుకున్నారు. కేంద్రంలోని బీజేపీ సారథ్యంలోని ఎన్డీఏ ప్రభుత్వం కూడా సమగ్ర భూసర్వేకు మొగ్గు చూపించింది. నాడు అసెంబ్లీలో జరిగిన చర్చలో వైఎస్సార్సీపీ ప్రజాప్రతినిధులతో పాటు పయ్యావుల కేశవ్ తదితర టీడీపీ నాయకులు కూడా ఈ భూసర్వే చట్టంపై హర్షం ప్రకటించారు. తీరా ఎన్నికలు వచ్చేసరికి ఓట్లకోసం దాన్నే టీడీపీ నాయకులు రైతులకు బూచిగా చూపిస్తూ దుష్ప్రచారం చేస్తున్నారు. ఇది చాలా నీచమైన పని. సాక్షి: వచ్చే వారమే పోలింగ్. మీ ప్రచారం ఎలా సాగుతోంది? అప్పలనర్సయ్య: అన్నివిధాలా వైఎస్సార్సీపీ ముందుంది. ఏ గ్రామాలకు వెళ్లినా మహిళల నుంచి మంచి స్పందన వస్తోంది. జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం ప్రతి సంక్షేమ పథకంలోనూ వారికే పెద్దపీట వేసింది. గర్భంలోనున్న శిశువు నుంచి ఇంట్లోనున్న వృద్ధుల వరకూ ప్రతి ఒక్కరి సంక్షేమానికి గతంలో ఎన్నడూలేనివిధంగా తీసుకున్న చర్యలు వారిని ఆలోచింపజేస్తున్నాయి. నాణ్యమైన విద్య ప్రభుత్వ పాఠశాలల్లో, అత్యాధునిక వైద్యం ప్రభుత్వ ఆసుపత్రుల్లో అందించడాన్ని వారు చూస్తున్నారు. సాక్షి: నవరత్నాల ప్లస్పై ప్రజల స్పందన ఎలా ఉంది? అప్పలనర్సయ్య: గత 59 నెలల పాలనలో క్రమం తప్పక 130 సార్లు బటన్ నొక్కి నవరత్నాలను అందించిన వై.ఎస్.జగన్మోహన్రెడ్డిని మరోసారి ముఖ్యమంత్రి చేసుకోవాలని అన్నివర్గాల వారు ఆశిస్తున్నారు. ఇచ్చిన మాట ప్రకారం నవరత్నాల ప్లస్ కోసం మరో 130 సార్లు బటన్ నొక్కుతారని బలంగా నమ్ముతున్నారు. అందుకోసం ఎమ్మెల్యేకు ఒకటి, ఎంపీకి ఒకటి రెండు బటన్లు నొక్కాలన్న జగన్మోహన్రెడ్డి పిలుపునకు సానుకూలంగా స్పందించే అవకాశం ఉంది. మళ్లీ వచ్చేది వైఎస్సార్సీపీ ప్రభుత్వమే. సాక్షి: మీ నియోజకవర్గానికి అభివృద్ధి ప్రణాళిక ఏమిటి? అప్పలనర్సయ్య: విద్య, వైద్యం, రోడ్లు, గ్రామాల్లో మౌలిక వసతుల అభివృద్ధికి గత ఐదేళ్లలో ప్రాధాన్యం ఇచ్చాం. మళ్లీ అధికారంలోకి వచ్చిన వెంటనే తోటపల్లి బ్రాంచ్ కెనాల్, ఏడువంపుల గెడ్డ, ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ప్రాజెక్టు పనులు సత్వర పూర్తిచేసి ప్రతి ఎకరానికి సాగునీరు అందిస్తాం. గజపతినగరంలో వంద పడకల ఆస్పత్రి ప్రారంభిస్తాం. డిగ్రీ కాలేజీ భవనాల నిర్మాణం పూర్తిచేస్తాం. అక్కడక్కడా మిగిలిన రోడ్ల నిర్మాణ పనులన్నీ సత్వరమే చేయిస్తాం. జగన్మోహన్రెడ్డి ప్రభుత్వంలో గ్రామస్వరాజ్యాన్ని సాకారం చేస్తాం. సాక్షి: భూ సర్వేకు రైతుల సహకారం ఎలా ఉంది? అప్పలనర్సయ్య: ఉమ్మడి విజయనగరం జిల్లాలో వ్యవసాయమే ప్రధానం. ఎక్కువ మంది రైతులు, వ్యవసాయ కూలీ కుటుంబాలే. భూ సర్వే వల్ల నష్టపోయామని ఇప్పటివరకూ ఒక్కరైనా జిల్లాలో చెప్పారా? లేకపోయినా అదో భూతంలా టీడీపీ నాయకులు, ఎల్లోమీడియా తప్పుడు ప్రచారం చేస్తోంది. రైతులు మాత్రం భూసర్వే సహకరిస్తున్నారు. అధికారుల సమక్షంలో హక్కులు పొందుతున్నారు. సాక్షి: భూహక్కు సాకార దిశగా వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో ఎలాంటి చర్యలు తీసుకున్నారు? అప్పలనర్సయ్య: పేదల వద్దనున్న డి.పట్టా భూములు, చుక్కల భూములు వాస్తవానికి ప్రభుత్వ భూములు. వాటిని ఏళ్ల తరబడి సాగుచేసుకోవడమే తప్ప అత్యవసర ఆర్థిక అవసరాలకు అమ్ముకోవడానికి వీల్లేని పరిస్థితి. వారికి మేలు చేసేలా ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం భూహక్కు కల్పించింది. లక్షలాది ఎకరాల డి.పట్టా భూములను జిరాయితీగా మార్పు చేసింది. చుక్కల భూములకు మోక్షం కల్పించింది. వేలాది మంది గిరిజనులకు గతంలో ఎన్నడూ లేనివిధంగా భూపట్టాలు ఇచ్చారు. అలాంటి జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం ప్రజల భూమి ఎందుకు లాక్కొంటుంది? 14 ఏళ్ల పాలనలో రైతులకు మంచి పనులు ఒక్కటైనా చేశానని చంద్రబాబు చూపించగరా?
Pagination
స్టార్ హీరోలతో యాక్టింగ్.. ఆ కమెడియన్ ఇలా అయిపోయాడేంటి!
భర్తతో విడిపోయిన హీరోయిన్.. కూతురితో కలిసి..
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
సీఎం నితీష్కు షాకిచ్చి.. లాలూ చెంతకు బడా నేత!
టీడీపీ నేతలు కలసి రాకపోవడంతో నైరాశ్యం
ఓటమి భయంతో వసంత బూతు పురాణం
సంక్షేమం వైఎస్సార్ సీపీతోనే సాధ్యం
మేనిఫెస్టో అమలు ఘనత వైఎస్ జగన్దే
వైఎస్సార్ సీపీలో కొనసాగుతున్న చేరికలు
మరోసారి సీఎం వైఎస్ జగన్ను ఆశీర్వదించండి
రూ.1000 కోట్లు దాటిన టాటా కంపెనీ లాభం
ఆఖరికి మోదీ కూడా..దిగజారుడు మాటలు ఎందుకు..?
సంక్షేమ పథకాలతో ప్రతి కుటుంబంలో సంతోషం
తప్పక చదవండి
- సీఎం నితీష్కు షాకిచ్చి.. లాలూ చెంతకు బడా నేత!
- Lok Sabha Election 2024: ఐదో విడత బరిలో..695 మంది
- ఐఏఎఫ్ కాన్వాయ్పై దాడి ఘటన..
- నాడు తిట్లు.. నేడు కౌగిలింతలు!
- నల్ల ఖజానా గేట్లు తెరచిన బాబు
- ‘సూపర్ సీఎం’ పాండియన్!
- షర్మిలా.. మా బకాయిలిచ్చేయ్!
- భరత్.. వైజాగ్ ఇప్పుడు గుర్తొచ్చిందా?
- Sakshi.com ఇప్పుడు సరికొత్తగా మీ ముందుకు
- బర్త్ డే స్పెషల్.. విజయ్ దేవరకొండ ఎక్కడ తప్పు చేస్తున్నాడు?
Advertisement