ఆర్థికవేత్తలు, మార్కెట్ కామెంటేటర్లపై అరుణ్ జైట్లీ వ్యాఖ్యలు
న్యూఢిల్లీ: నిత్యం పరస్పరం భిన్నమైన కామెంట్లతో హడావిడి చేసే ఆర్థికవేత్తలు, మార్కెట్ కామెంటేటర్లపై కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ తాజాగా వ్యంగ్యాస్త్రాలు సంధించారు. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా వారు మాటలు మార్చేస్తుంటారంటూ వ్యాఖ్యానించారు. సంక్షోభాన్ని గుర్తించడంలో ఎకానమిస్టుల వైఫల్యంపై ప్రముఖ ఆర్థికవేత్త లార్డ్ మేఘనాద్ దేశాయ్ రాసిన పుస్తకం ఆవిష్కరణ కార్యక్రమం జైట్లీ వ్యాఖ్యలకు వేదికైంది.
పుస్తకాన్ని ఆవిష్కరించిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘నేను గత రాత్రి టీవీలో గ్రీస్ రిఫరెండం ఫలితాలు చూశాను. మన దేశంలో పేరొందిన ఒక కామెంటేటర్ .. సోమవారం మన మార్కెట్లపై ఆ ఫలితాల ప్రభావం గురించి చెప్పుకొచ్చారు. సోమవారం మార్కెట్ల పరిస్థితి అత్యంత ఘోరంగా ఉంటుందని, పెద్ద షాక్ షాక్ తప్పదని.. ఏవేవో విశేషణాలన్నీ జోడించి చెప్పారు. సోమవారం మధ్యాహ్నం దాకా అదే పాట కొనసాగించారు. కానీ, ఆ తర్వాత వాస్తవ పరిస్థితులు క్రమంగా అర్థమయినట్లున్నాయి.
వెంటనే ఆయన అభిప్రాయాలూ మారిపోయాయి. విశ్లేషణ కూడా మారిపోయింది’ అని తెలిపారు. ఏడాది కాలంగా క్రూడ్ ధరల విషయంలోనూ ఇలాగే జరుగుతోందని జైట్లీ వ్యాఖ్యానించారు. రాబోయే సంక్షోభాలను, పరిణామాలను చాలా మంది ఎకానమిస్టులు ముందుగా ఎందుకు గుర్తించలేరన్నది తనకు అంతుబట్టని విషయమని జైట్లీ చెప్పారు. ఇక సరైన హెచ్చరికలు చేయకుండా అంతా జరిగిపోయాకా.. ‘మేం అప్పుడే చెప్పాం కదా’ అని చెప్పుకునే ఎకానమిస్టులు కొందరు ఉంటారని జైట్లీ చెప్పారు. ఏదైతేనేం.. ఇథమిత్థంగా ఇలాంటి వాటిని గురించి ముందస్తుగా అంచనా వేయగలిగే సామర్థ్యం ఏ కొద్ది మందికో పరిమితమన్నారు.
ఎప్పటికప్పుడు మాట మార్చేస్తుంటారు..
Published Tue, Jul 7 2015 12:17 AM
Advertisement
మళ్లీ చరిత్ర సృష్టిస్తున్నాం
చేతులు కాలాక ఆకులు పట్టుకున్న ఈసీ
ఓటీటీలోకి వచ్చేసిన మిడిల్ క్లాస్ మూవీ.. స్ట్రీమింగ్ అందులోనే?
వరల్డ్కప్ జట్టులో నో ఛాన్స్: రోహిత్పై కేఎల్ రాహుల్ కామెంట్స్ వైరల్
ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు అలెర్ట్.. మారిన విత్ డ్రా నిబంధనలు
ఎన్ఆర్ఐతో విధి ఆడిన వింత నాటకం.. విషాదం
స్వాతి మలివాల్ డ్రామా.. బీజేపీ కుట్రే ఇదంతా: సంచలన వీడియో బయట పెట్టిన ఆప్
Heeramandi Jewellery ఎవరీ సినిమా నగల స్పెషలిస్ట్ జంట
రేవ్ పార్టీ పై హీరో శ్రీకాంత్ రియాక్షన్
‘బిగ్ బ్రదర్’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫోటోలు)
సర్జరీలపై ట్రోలింగ్.. అర్థం చేసుకోకుండా తిడతారేంటి? మీ వల్ల..
ఏపీలో అల్లర్లపై.. డీజీపీకి సిట్ నివేదిక
ఫస్ట్టైమ్.. ఐటీని వెనక్కినెట్టిన బ్యాంకింగ్
భారత్లో ఐఫోన్ తయారీ.. ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన ప్రధాని మోదీ
నాట్స్ ఆధ్వర్యంలో లైఫ్ స్టైల్ మేనేజ్మెంట్ వెబినార్
నాట్స్ సహకారంతో కంప్యూటర్ శిక్షణ కేంద్రం ప్రారంభం!
హార్దిక్ అద్భుతమైన ప్లేయర్.. పాక్పై కచ్చితంగా చెలరేగతాడు: రైనా
భారత్ పేద దేశం.. 2050 నాటికి అందరూ ధనవంతులవుతారా?
తప్పక చదవండి
- భారత్ పేద దేశం.. 2050 నాటికి అందరూ ధనవంతులవుతారా?
- ఛత్తీస్గఢ్లో ఘోర రోడ్డు ప్రమాదం
- కేజ్రీవాల్కు బెదిరింపులు బీజేపీ పనే: ఆప్
- రూ. 5 కోట్లు దండుగ అన్నారు.. చెత్తలో పడేసిందంటూ: యశ్ తండ్రి
- AP: పలువురు డీఎస్పీలు, సీఐలను నియమించిన ఈసీ
- యాక్షన్ ఎంటర్టైనర్గా బిగ్బ్రదర్.. రిలీజ్ ఎప్పుడంటే?
- హైదరాబాద్లో మళ్లీ దంచికొడుతున్న వాన
- ‘28 శాతం జీఎస్టీ’, సుప్రీం వైపు.. గేమింగ్ కంపెనీల చూపు
- నాగబాబు ట్వీట్ వివాదం.. అల్లు అర్జున్ షాకింగ్ నిర్ణయం!
- ‘AI’తో ప్రమాదమే.. గాడ్ ఫాదర్ ఆఫ్ ఏఐ వార్నింగ్
Advertisement