తూర్పుగోదావరి, మామిడికుదురు: సముద్ర తీరంలోని కరవాక గ్రామంలో అనధికారికంగా మద్యం విక్రయిస్తున్న వారి ఆట కట్టించారు సచివాలయ మహిళా పోలీసు. సహచర సచివాలయ ఉద్యోగులతో కలిసి ఆమె మద్యం విక్రయిస్తున్న రేకాడి వెంకటసూర్యనారాయణ ఇంటికి వెళ్లారు. ఇంటి పంచన సంచిలో రహస్యంగా దాచి ఉంచిన మద్యం సీసాలను ధన్యశ్రీ స్వాధీనం చేసుకున్నారు. మద్యం సీసాలను స్వాధీనం చేసుకుంటున్న ధన్యశ్రీని సూర్యనారాయణ కుటుంబ సభ్యులు అడ్డుకున్నప్పటికీ వారిని లెక్క చేయకుండా 22 మద్యం బాటిళ్లతో ఉన్న సంచిని స్వాధీనం చేసుకుని గ్రామ పంచాయతీకి తీసుకువచ్చారు. ఈ క్రమంలో సహచర సచివాలయ ఉద్యోగులు మహిళా పోలీసుకు అండగా నిలిచారు. అనంతరం సమాచారాన్ని నగరం పోలీసుకు అందించారు. స్వాధీనం చేసుకున్న మద్యం బాటిళ్లను నగరం పోలీసులకు స్వాధీనం చేశామని పంచాయతీ కార్యదర్శి కె.వెంకటేశ్వరరావు తెలిపారు. ఈ సందర్భంగా ఎంతో తెగువ చూపిన మహిళా పోలీసుతో పాటు సచివాలయ ఉద్యోగులను స్థానికులు అభినందించారు.
అనధికార మద్యాన్ని పట్టించిన మహిళా పోలీసు
Published Tue, Feb 18 2020 1:19 PM
Advertisement
Advertisement
ఈనాడు సంస్థల ఛైర్మన్ రామోజీరావు కన్నుమూత
రాజీనామా చేసి వెళ్లిపోండి.. టీడీపీ కార్యకర్తల అల్టిమేటం
పట్టలేని సంతోషం.. మర్చిపోలేని విషాదం.. రెండూ ఈ నెలలోనే!
పిఠాపురం వర్మపై జనసేన దాడి
ఇదేం వ్యాధి..నిద్రలో షాషింగ్ చేయడమా..?
టీడీపీ యథేచ్ఛదాడులతో ఏపీలో ఆటవిక పరిస్థితులు: వైఎస్ జగన్
పాస్వర్డ్ మర్చిపోయాడు.. 11 ఏళ్ల తరువాత చూస్తే రూ. కోట్ల డబ్బు
T20 WC 2024: పాక్ను మట్టికరిపించిన అమెరికా జట్టులో సగం మంది మన వారే..!
తప్పక చదవండి
- అమాంతం పెరిగిన చిరాగ్ ఫ్యాన్ ఫాలోయింగ్
- మోదీ ప్రమాణస్వీకారం.. అంబానీ, షారుక్ ఫోటో వైరల్
- కెనడాలో భారత సంతతి యువకుడి హత్య!
- ఎన్నికల ఫలితాల రోజు మార్కెట్ పతనంపై సుప్రీం కోర్టులో పిటిషన్
- టీ20 ప్రపంచకప్ 2024లో తొలి వికెట్ డౌన్
- రోడ్డు ప్రమాదంలో నలుగురు యూట్యూబర్ల దుర్మరణం
- గ్రూప్–1 పరీక్ష రాసి వస్తుండగా విషాదం
- ఆల్టైమ్హైలో స్టాక్మార్కెట్ సూచీలు.. 23,400 మార్కు చేరిన నిఫ్టీ
- వందేభారత్, జనశతాబ్ధి రైళ్లకు తప్పిన ప్రమాదం
- పాత మోదీపై ‘కొత్త మోదీ’ నెగ్గగలరా?
Advertisement