తళుక్కుమనే మెరుపు! | Sakshi
Sakshi News home page

తళుక్కుమనే మెరుపు!

Published Sat, Jan 12 2019 10:15 PM

Funday beauty tips 13-01-2019 - Sakshi

ముఖ సౌందర్యానికి కాసింత సమయాన్ని వెచ్చిస్తే చాలు... తళుక్కుమనే మెరుపు మీ సొంతమవుతుందంటున్నారు నిపుణులు. ముఖంపైన ఉండే మృతకణాలు, మొటిమలు, మచ్చలు పూర్తిగా తొలగిపోవాలంటే... శ్రద్ధ చూపించడం చాలా అవసరం. ముందుగా క్లీనప్, స్క్రబ్‌ వంటివి చేసుకుని ఆవిరి పట్టించుకుని ఫేస్‌ప్యాక్‌ వేసుకుంటే ముఖం కాంతివంతం మారుతుంది. మచ్చ లేని మృదువైన అందం మీ సొంతమవుతుంది. ఇంకెందుకు ఆలస్యం? ఇలా ప్రయత్నించండి.

కావల్సినవి : క్లీనప్‌ : కొబ్బరి పాలు – 2 టీ స్పూన్లు, కలబంద గుజ్జు – 1 టీ స్పూన్‌ స్క్రబ్‌ : బియ్యప్పిండి – 1 టీ స్పూన్, కీరదోస గుజ్జు – 2 టీ స్పూన్లు, కొబ్బరి నూనె – పావు టీ స్పూన్‌ మాస్క్‌ : గడ్డ పెరుగు –1 టీ స్పూన్, ముల్తానీ మట్టి – 1 టీ స్పూన్, అరటిపండు గుజ్జు – 2 టీ స్పూన్లు, దానిమ్మ రసం – 1 టీ స్పూన్‌
తయారీ : ముందుగా కొబ్బరి పాలు, కలబంద గుజ్జు ఒక చిన్న బౌల్‌లో పోసుకుని బాగా కలుపుకోవాలి. ఆ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి రెండు నిమిషాల తర్వాత మెత్తని క్లాత్‌తో క్లీన్‌ చేసుకోవాలి. ఇప్పుడు బియ్యప్పిండి, కీరదోస గుజ్జు, కొబ్బరి నూనె ఒక బౌల్‌లోకి తీసుకుని బాగా కలుపుకుని ఇంచుమించు ఐదు నిమిషాల పాటు స్క్రబ్‌ చేసుకోవాలి. తర్వాత చల్లని నీళ్లతో ముఖాన్ని శుభ్రం చేసుకుని ఆవిరి పట్టించుకోవాలి. ఇప్పుడు గడ్డ పెరుగు, ముల్తానీ మట్టి, అరటిపండు గుజ్జు, దానిమ్మ రసం ఒక బౌల్‌లోకి తీసుకుని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఆ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసుకుని, ఇరవై నిమిషాల పాటు ఆరనివ్వాలి. తర్వాత గోరువెచ్చని నీళ్లతో ముఖం కడగాలి. ఇలా వారానికి రెండు సార్లు చెయ్యడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. ముఖానికి ఫేస్‌ ప్యాక్‌ వేసిన తర్వాత సబ్బు పెట్టకపోవడం మంచిది. 

 
Advertisement
 
Advertisement