‘‘ఒకవేళ మళ్లీ బతికే అవకాశం వస్తే క్యాన్సర్ గురించి అందరికీ అవగాహన కలిగించడానికి నా వంతు కృషి చేస్తాను అని నాకు క్యాన్సర్ అని తెలియగానే ప్రామిస్ చేసుకున్నాను’’ అన్నారు నటి మనీషా కొయిరాలా. 2012లో మనీషాకు ఒవేరియన్ క్యాన్సర్ ఉన్న విషయం బయటపడింది. విదేశాలు వెళ్లి చికిత్స చేయించుకుని, సంపూర్ణ ఆరోగ్యంతో ఆమె ముంబై చేరుకున్నారు. భయంకరమైన వ్యాధి సోకిన విషయం తెలిశాక తనలో ఆత్మస్థయిర్యం పెంచే కథనాల కోసం మనీషా వెతికారట. అయితే క్యాన్సర్ని జయించిన క్రికెటర్ యువరాజ్ సింగ్, నటి లిసా రేల ‘సక్సెస్ స్టోరీ’ తప్ప వేరే ఎవరిదీ కనిపించలేదట. అందుకే ఓ పుస్తకం రాయాలనుకున్నారామె. ‘హీల్డ్’ పేరుతో తాను రాసిన పుస్తకాన్ని ‘జైపూర్ లిటరేచర్ ఫెస్టివల్’లో ఆవిష్కరించారామె. ఈ నెల 24 నుంచి 28 వరకూ ఈ వేడుక జరిగింది. ఈ సందర్భంగా మనీషా కొయిరాలా మాట్లాడుతూ –‘‘మన జీవితంలో మనకేదైనా చేదు అనుభవం ఎదురైనప్పుడు దాన్ని అధిగమించడానికి మనం ఏం చేశామో ఇతరులకు చెప్పాలి. అప్పుడు వాళ్ల మనసులో ఉన్న భారం తగ్గుతుందని నమ్మాను.. అందుకే ‘హీల్డ్’లో నా అనుభవాలు చెప్పాను. క్యాన్సర్ అనగానే ముందుగా ఎవరికైనా వచ్చే ఆలోచన ‘మరణం’. నాక్కూడా ఆ ఆలోచనే వచ్చింది. వ్యాధి గురించి తెలిసిన రోజు రాత్రి ఒంటరిగా గడిపాను. ఖాట్మండు నుంచి ముంబైకి వచ్చాను. అంతకుముందు లెక్కపెట్టలేనన్ని సార్లు ఆ ప్రయాణం చేశాను. కానీ మొదటిసారి నాకా జర్నీ విచిత్రంగా అనిపించింది.
నా గురువు దగ్గర భయంగా ఉందని చెప్పాను. ‘భయాన్ని వదిలించుకో. అయినా ఎందుకు భయపడుతున్నావు?’ అని అడిగారాయన. ‘మరణానికి’ అన్నాను. ‘మరణించడం అంటే ఏంటి?’ అన్నారాయన. ‘తెలియదు. చెప్పలేను’ అన్నాను. ‘మరి భయం ఎందుకు?’ అన్నారు. అంతే.. భయాన్ని పూర్తిగా మనసులోంచి తీసేశాను. భయం అనేది మనల్ని ఇంకా కుంగిపోయేలా చేస్తుందని అర్థమైంది. ఆత్మవిశ్వాసం పెంచుకున్నాను. మనకేదైనా జరగరానిది జరిగితే జీవితం అంతే అనుకోకూడదు. భయపడకూడదు. సవాళ్లను స్వీకరించాలి. జయించాలనుకున్నాను. జయించాను. నిజానికి అంతకుముందు జీవితాన్ని ఇష్టం వచ్చినట్లుగా జీవించాను. ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేశాను. అందుకే క్యాన్సర్ ఓ టీచర్లా నన్ను ఆవహించింది. అదొక పాఠం అయింది. ఇప్పుడు నా జీవితం అంటే నాకు చాలా విలువ. నా ఆరోగ్యం అంటే ఎంతో విలువ. ఆరోగ్యంగా లేకపోతే జీవితాన్ని ఆనందంగా గడపలేమని అర్థం చేసుకున్నాను. అందుకే జాగ్రత్తగా ఉంటున్నాను’’ అన్నారు.
జీవితం విలువ తెలిసింది
Published Wed, Jan 30 2019 12:00 AM
Advertisement
మళ్లీ చరిత్ర సృష్టిస్తున్నాం
చేతులు కాలాక ఆకులు పట్టుకున్న ఈసీ
ఓటీటీలోకి వచ్చేసిన మిడిల్ క్లాస్ మూవీ.. స్ట్రీమింగ్ అందులోనే?
వరల్డ్కప్ జట్టులో నో ఛాన్స్: రోహిత్పై కేఎల్ రాహుల్ కామెంట్స్ వైరల్
ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు అలెర్ట్.. మారిన విత్ డ్రా నిబంధనలు
ఎన్ఆర్ఐతో విధి ఆడిన వింత నాటకం.. విషాదం
స్వాతి మలివాల్ డ్రామా.. బీజేపీ కుట్రే ఇదంతా: సంచలన వీడియో బయట పెట్టిన ఆప్
Heeramandi Jewellery ఎవరీ సినిమా నగల స్పెషలిస్ట్ జంట
పెళ్లి చేసి పల్లకిలో పంపాలనుకున్నాం.. కానీ : పుణే బాధితులు కన్నీరుమున్నీరు
దమ్ముంటే ఆ ప్రాంతంలో రీపోలింగ్ పెట్టాలి
మెరుగైన ఉద్యోగం కోసం.. ఇవి నేర్చుకోవాల్సిందే
రూ.2.5 కోట్లకు రూ.10 కోట్లు.. విరుష్క జంటకు లాభాల పంట!
పిన్నెళ్లి వీడియోపై సీఈవో సంచలన ప్రకటన
'స్టార్ హీరోతో లవ్.. పేరెంట్స్ బలవంతం వల్లే పెళ్లి చేసుకున్నా'
SRH vs RR: ‘సన్రైజర్స్ కాదు!.. రాజస్తాన్కే గెలిచే ఛాన్స్’
సమ్మర్ ట్రిప్లో ఎంజాయ్ చేస్తున్న ప్రియాంక మోహన్
6 నెలల్లోనే ప్రజలతో ఛీ కొట్టించుకున్న ఏకైక సీఎం రేవంత్: ఈటల
రూ. 2,599 కోట్లు వడ్డీతో సహా 15 రోజుల్లో కట్టాలి..
హమాస్ చెరలో ఇజ్రాయెల్ మహిళా సైనికులు! వీడియో విడుదల
తప్పక చదవండి
- 6 నెలల్లోనే ప్రజలతో ఛీ కొట్టించుకున్న ఏకైక సీఎం రేవంత్: ఈటల
- పెళ్లి చేసి పల్లకిలో పంపాలనుకున్నాం.. కానీ : పుణే బాధితులు కన్నీరుమున్నీరు
- అలాంటి వార్తలతో నాతో పాటు కుటుంబం మొత్తం బాధ పడింది: లయ
- పవిత్ర-చందు మరణం.. అదే అసలు కారణమన్న నరేశ్
- Raisin Water : ఎండు ద్రాక్ష నీళ్లు తాగితే ఇన్ని లాభాలా
- ‘నాగి..నిన్ను కొట్టాలి.. ‘బుజ్జి’ గ్లింప్స్పై ప్రభాస్ రియాక్షన్
- భార్యతో హార్దిక్కు విభేదాలు?.. అతడి వల్లే అంటూ నటాషా పోస్ట్!
- ‘ప్రజ్వల్ రేవణ్ణ దౌత్య పాస్పోర్టు రద్దు చేయండి’
- జీహెచ్ఎంసీలో కామ పిశాచి.. కమిషనర్ రియాక్షన్
- అంబానీల అతిథులకు కరీంనగర్ కానుకలు
Advertisement