-
ఆలయ కార్యదర్శిపై అమానుష దాడి
ఏలూరు టౌన్ : ఏలూరు కండ్రికగూడెం ప్రాంతంలో శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయంలో దేవుని సొమ్మును కాజేశారని ప్రశ్నించిన ఆలయ కార్యదర్శిపై పాత ఆలయ కమిటీ సభ్యుడు, టీడీపీ కార్యకర్త రెడ్డి నాగరాజు అమానుష దాడికి తెగబడ్డాడు. నూతన ఆలయ కార్యదర్శి అచ్యుతకుమారిపై రాడ్డుతో దాడిచేసి, ఆమెను వివస్త్రను చేసేందుకు ప్రయత్నించడంతో బాధితురాలు తీవ్ర గాయాలపాలైంది. ప్రస్తుతం ఆమె ఏలూరు జీజీహెచ్ వైద్యుల పర్యవేక్షణలో చికిత్స పొందుతున్నారు. ఏలూరు ఎమ్మెల్యే, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు ఆళ్ళ నాని బాధితురాలిని బుధవారం ఆస్పత్రిలో పరామర్శించారు. దాడి వివరాలు తెలుసుకుని వెంటనే విచారణ చేపట్టి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని పోలీసు అధికారులను కోరారు. బాధితుల కథనం మేరకు.. ఏలూరు 27వ డివిజన్ కండ్రికగూడెం ప్రాంతంలో శ్రీ వేంకటేశ్వరస్వామి గుడికి ఇటీవలే కొత్త కార్యవర్గం ఏర్పాటైంది. రాజరాజేశ్వరినగర్కు చెందిన సావన్ అచ్యుతకుమారి ఆలయ నూతన కార్యదర్శిగా వ్యవహరిస్తున్నారు. ఆలయానికి సంబంధించి నిధులు భారీఎత్తున గోల్మాల్ అయ్యాయని ఆమె గుర్తించారు. సుమారు రూ.40 లక్షలు పక్కదారి పట్టినట్లు తెలుసుకుని పాత కార్యవర్గ సభ్యులను ఆమె ప్రశ్నించారు. దీంతో పాత, కొత్త కార్యవర్గాల మధ్య వివాదం మొదలైంది. ఇదిలా ఉంటే.. శ్రీవారి కళ్యాణ మహోత్సవాలను ఆచ్యుతకుమారి ఆధ్వర్యంలో వైభవంగా నిర్వహిస్తుండడంతో పాత కార్యవర్గ సభ్యుడు రెడ్డి నాగరాజు అతని భార్య ఇద్దరూ కలిసి ఆలయ ప్రాంగణంలో పుస్తక వ్యాపారం చేసుకునేందుకు అవకాశమివ్వాలని అచ్యుతకుమారిని కోరారు. ఆలయంలో వ్యాపారం చేయడానికి వీల్లేదని, అవసరమైతే ఉచితంగా పుస్తకాల పంపిణీకి అనుమతి ఉంటుందని ఆమె స్పష్టంచేశారు. ఈ విషయంలో వివాదం చెలరేగడంతో రెడ్డి నాగరాజు అచ్యుతకుమారిపై దాడికి తెగబడ్డాడు. రాడ్డు తీసుకుని ఆమెను తలపైన తీవ్రంగా కొట్టడంతో పాటు ఆమె చీరను లాగేసి వివస్త్రను చేసేందుకు ప్రయత్నించాడు. దీంతో.. అక్కడున్న వారు అతనిని అడ్డుకున్నారు. తీవ్ర గాయాలతో అచ్యుతకుమారి అపస్మారక స్థితిలోకి వెళ్లడంతో ఆమెను ఏలూరు జీజీహెచ్కు తరలించారు. నిధుల గోల్మాల్పై నిలదీయడంతో.. రెడ్డి నాగరాజుతో పాటు ఉమామహేశ్వరరావు, ప్రసాద్బాబు తదితరుల ఆధ్వర్యంలో ఆలయ నిధులను పక్కదారి పట్టించారనే ఆరోపణలు ఉన్నాయని ఆస్పత్రిలో ఆమె చెప్పారు. లక్షలాది రూపాయల నిధులకు లెక్కలు లేకపోవడంతో వారిని నిలదీయగా.. రెడ్డి నాగరాజు సమయం కోసం వేచిచూసి దాడిచేశారన్నారు. -
ప్రతిపక్షాలు సీఎం జగను ఎదుర్కొలేక కుట్రలు చేస్తున్నాయి: ఆళ్ల నాని
-
3న ఏలూరులో ‘సిద్ధం’ బహిరంగ సభ!
సాక్షి ప్రతినిధి, ఏలూరు: వైఎస్సార్సీపీ ఎన్నికల శంఖారావం బహిరంగసభ ‘సిద్ధం’కు ఏలూరు ముస్తాబవుతోంది. ఉమ్మడి తూర్పు, పశ్చిమ గోదావరి, కృష్ణా జిల్లాల్లోని 50 అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి లక్షలాది మంది పార్టీ కేడర్ సభకు రానున్న క్రమంలో విస్తృతంగా ఏర్పాట్లు చేస్తున్నారు. బుధవారం సభా ప్రాంగణంలో జరుగుతున్న పనులను పార్టీ ముఖ్యులు పరిశీలించారు. గోదావరి జిల్లా రీజనల్ కో–ఆర్డినేటర్, ఎంపీ పెద్దిరెడ్డి మిథున్రెడ్డి, సీఎం ప్రోగ్రామ్స్ కో–ఆర్డినేటర్, ఎమ్మెల్సీ తలశిల రఘురాం, ఏలూరు జిల్లా పార్టీ అధ్యక్షుడు, ఎమ్మెల్యే ఆళ్ల నాని, దెందులూరు ఎమ్మెల్యే కొఠారు అబ్బయ్యచౌదరి, ఏలూరు ఎంపీ అభ్యర్థి కారుమూరి సునీల్కుమార్యాదవ్, చింతలపూడి అసెంబ్లీ అభ్యర్థి కంభం విజయరాజు తదితరులు ఏర్పాట్లను పరిశీలించారు. అనంతరం సభా ప్రాంగణంలో ‘సిద్ధం’ పోస్టర్లను ఆవిష్కరించారు. 110 ఎకరాల ప్రాంగణంలో.. ఏలూరు నగర సమీపంలో, దెందులూరు జాతీయ రహదారి వద్ద 110 ఎకరాల స్థలంలో సభావేదిక నిర్మాణ పనులు చురుగ్గా సాగుతున్నాయి. భారీ వేదిక నిర్మాణం, పదుల సంఖ్యలో గ్యాలరీలు.. కార్యకర్తలందరికీ దగ్గరగా వెళ్లి అభివాదం చేసేందుకు సభా వేదిక నుంచి వాక్వే ఏర్పాటు పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. సభా ప్రాంగణం వెనుక భాగంలో హెలీప్యాడ్ను ఏర్పాటు చేశారు. 50 నియోజకవర్గాల నుంచి లక్షలాది మంది రానున్న క్రమంలో వాహనాల పార్కింగ్తో సహా ఎక్కడా ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తుగా అన్ని జాగ్రత్తలూ తీసుకున్నారు. సభా ప్రాంగణానికి సమీపంలోని దెందులూరు ఊరు ప్రారంభంలో 40 ఎకరాల ప్రాంగణాన్ని, అలాగే సభా ప్రాంగణానికి, ఆటోనగర్కు మధ్యలో 25 ఎకరాల ప్రాంగణం, మరో రెండు పార్కింగ్ స్థలాలు, ఆటోనగర్ లోపల, ఆశ్రం కళాశాల, ఏలూరు ప్రారంభంలోని రియల్ ఎస్టేట్ వెంచర్లో మొత్తం 150 ఎకరాల స్థలాన్ని పార్కింగ్ కోసం కేటాయించి జిల్లాల వారీగా వచ్చే వాహనాలకు ప్రత్యేక ఏర్పాట్లు చేయనున్నారు. బుధవారం ఎంపీ మిథున్రెడ్డి ఏర్పాట్లను పరిశీలించారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు ఆళ్ల నాని మాట్లాడుతూ ఏలూరు జిల్లా రాజకీయ చరిత్రలో కనీవినీ ఎరుగని రీతిలో ‘సిద్ధం’ బహిరంగ సభ జరుగుతుందని, 3న మధ్యాహ్నం 2 గంటలకు సీఎం జగన్ సభా ప్రాంగణానికి చేరుకుని పార్టీ కేడర్కు దిశా నిర్దేశం చేస్తారని వివరించారు. ఏర్పాట్లను పరిశీలించిన వారిలో కలెక్టర్ ప్రసన్నవెంకటేష్, ఎస్పీ డీ.మేరీప్రశాంతి తదితరులున్నారు. -
‘వలంటీర్ల వ్యవస్థపై విషం.. చంద్రబాబు, పవన్ కుట్రలను తిప్పికొట్టాలి’
సాక్షి, ఏలూరు జిల్లా: వలంటీర్ల వ్యవస్థపై కొంతమంది విషం చిమ్ముతున్నారని మాజీ మంత్రి ఆళ్ల నాని మండిపడ్డారు. ఆదివారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, ప్రతిపక్షాల కుట్రలను ప్రజలు అర్థం చేసుకుని తిప్పికొట్టాలన్నారు. గతంలో ఎప్పుడూ జరగని అభివృద్ధి రాష్ట్రంలో జరుగుతోందన్నారు. వలంటీర్ల వ్యవస్థను కూల్చడానికి చంద్రబాబు, పవన్ కల్యాణ్ కుట్రలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. చంద్రబాబు ఇచ్చిన స్క్రిప్ట్ను పవన్ చదువుతున్నాడు. వలంటీర్ వ్యవస్థ అధ్యయనం చేయకుండా దిగజారి మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. వలంటీర్ల తల్లిదండ్రులు సైతం బాధ పడేలా పవన్ నీచంగా మాట్లాడుతున్నారు. మహిళల అక్రమ రవాణాకు, వలంటీర్లకు సంబంధం ఏంటి? అంటూ ఆళ్ల నాని ప్రశ్నించారు. చదవండి: బాబూ పవనూ.. నీ తొక్కలో లెక్క తప్పింది చూస్కో! ‘‘తణుకు సభలో పవన్ తీరు పరాకాష్టకు చేరింది. ఉన్మాదిలా,అసాంఘిక శక్తిలా మాట్లాడాడు. వలంటీర్ల ఆత్మ స్థైర్యం దెబ్బతినేలా మాట్లాడాడు. మామిడి పళ్ల బుట్టలో రెండు కుళ్లి పోతే వాటిని తేసి బయట పడేస్తారు.. బుట్ట మొత్తం పారేయరు. పవన్ రెండు నాలుకల ధోరణి ప్రజలు గమనించాలి. పవన్ కల్యాణ్ అసత్య ప్రచారాలు మనుకోవాలి. వలంటీర్ల జోలికొస్తే చూస్తూ ఊరుకోమని ఆళ్ల నాని హెచ్చరించారు. -
‘జన్మభూమి కమిటీల దోపిడీలు పవన్కు ఇష్టమేమో..?’
సాక్షి, ఏలూరు: పవన్ కల్యాణ్ పోరాటం.. ఆరాటం అంతా చంద్రబాబు కోసమేనని మాజీ మంత్రి ఆళ్లనాని మండిపడ్డారు. వాలంటీర్లపై అనుచిత వ్యాఖ్యలు చేసిన పవన్ కల్యాణ్.. వారికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. సోమవారం ఏలూరులో ప్రెస్మీట్ నిర్వహించిన ఆళ్ల నాని.. ‘ వాలంటీర్లపై నీచంగా మాట్లాడతావా?, పవన్ కన్నా క్రిమినల్ ఎవరున్నారు..?, నీ గెలుపు మీదే నీకు నమ్మకం లేకపోతే.. నీ పార్టీవాళ్ళు నిన్నెలా నమ్ముతారు?, పవన్ పోరాటం.. ఆరాటం.. అంతా బాబు కోసమే. జగన్ గద్దెదించి.. మరి ఎవర్ని గద్దెనెక్కిస్తాడో చెప్పే ధైర్యం లేని వ్యక్తి పవన్. చంద్రబాబు హయాంలో కాగ్ అక్షింతలు వేయని సంవత్సరం ఏదైనా ఉందా..?, జగన్ని ఏకవచనంతో పిలిచే అర్హత నీకెక్కడిది?,–వందజన్మలెత్తినా జగన్ స్థాయికి చేరుకోలేవు. బాబు అధికారం కోసం చేసే నీ పోరాటం వృథానే’ అని ఆళ్ల నాని ధ్వజమెత్తారు. ఆళ్ల నాని ఏమన్నారంటే.. రాజకీయ అవగాహన లేని నాయకుడు పవన్ వారాహి అపజయ యాత్రలో భాగంగా పవన్కళ్యాణ్ నిన్న ఏలూరులో కొంతమంది జనసేన కార్యకర్తలతో మీటింగ్ పెట్టాడు. రాజకీయపార్టీ పెట్టి పదేళ్లు దాటిన తరుణంలో తమ పార్టీ గురించి, తాము ఏ దశలో ఉన్నామో ఆపార్టీ అధినేతగా ఆయన కార్యకర్తలకు వివరిస్తారేమోనని అందరూ ఎదురు చూశారు. అయితే, పవన్కళ్యాణ్ మాత్రం ఎప్పటిలాగానే తన రాజకీయ అవగాహన లేమిని ప్రదర్శించుకున్నారు. ఆయనకు ఈ రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులపై.. నియోజకవర్గాల్లోని ప్రజా సమస్యలపై ఏమాత్రం అవగాహన లేదు. కేవలం, ఆయన మిడిమిడి జ్ఞానంతో వారాహి యాత్ర మొత్తం బూతులు, దూషణలతోనే సాగుతుంది. ప్రభుత్వ పనితీరుపై బురదజల్లే ఆరోపణలు, గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్రెడ్డిపై వ్యక్తిగత దూషణలకే పవన్కళ్యాణ్ పరిమితమయ్యాడు. ప్రజాప్రతినిధులను నోటికొచ్చినట్లు తిట్టడమే కాకుండా.. చివరికి ప్రజల్ని కూడా ‘మీరు నాకు ఓట్లేయలేదు’ అని తన అక్కసు వెళ్లగక్కిన పవన్కళ్యాణ్ తీరు అందరూ చూస్తున్నారు. వారాహి యాత్రను ప్రజలు అసహ్యించుకుంటున్నారు మొదటి యాత్రంటే ఏదో తెలిసీ తెలియనితనంతో ముగించాడనుకుందాం. రెండోవిడత యాత్ర ప్రారంభంతోనే నిన్న పవన్కళ్యాణ్ మరింత దిగజారిపోయి ప్రవర్తించాడు. ఆయన మాటల్ని చూస్తే ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతీ వ్యక్తి అసహ్యించుకునే పరిస్థితికి వచ్చేశాడు. ప్రజలు ఎన్నుకున్న ప్రజాప్రతినిధులను తిడుతున్నాడు. మా నాయకుడు, గౌరవ ముఖ్యమంత్రి గారిని పట్టుకుని వ్యక్తిగతంగా ఏకవచనంతో మాట్లాడుతాడు. చివరికి ఈ రాష్ట్రంలో అత్యంత పవిత్రమైన ప్రజాసేవలందించే వాలంటీర్లను కూడా వదిలిపెట్టకుండా పవన్కళ్యాణ్ దూషిస్తున్నాడు. ఒక రాజకీయ సిద్ధాంతం, రాజకీయ లక్ష్యం లేకుండా వారాహి యాత్ర పేరుతో ఇష్టానుసారంగా నోరుపారేసుకుంటున్న పవన్కళ్యాణ్ తీరును ప్రజలు అసహ్యించుకుంటున్నారు. ఏలూరు సభలో పవన్కళ్యాణ్ ఇక్కడి ప్రజల్ని ఉద్దరించే మాటలేమైనా చెబుతాడేమోనని అందరూ ఎదురుచూశారు. చంద్రబాబుతో కలిసి ఆయన రాబోయే కాలంలో ప్రజల్ని ఉద్ధరించడానికి ఎలాంటి మ్యానిఫెస్టోను ప్రకటించబోతున్నారోనని చూసినవాళ్లకు చివరికి నిరాశే మిగిలింది. ఏలూరు సభ నుంచే తాను ముఖ్యమంత్రి గారిని ఏకవచనంతో పిలుస్తానంటూ అదేదో ప్రజలకు మేలు చేసే మ్యానిఫెస్టో అంశంగా ప్రకటించడం ఆయన దిగజారుడుతనాన్ని తెలియజేసింది. పిచ్చిపిచ్చిగా నోటికొచ్చినట్లు వాగే పవన్కళ్యాణ్కు అసలు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్రెడ్డి గారి పేరును ఉచ్ఛరించే అర్హత కూడా లేదని మనవి చేసుకుంటున్నాను. మా నాయకుడ్ని ఏకవచనంతో పిలవడానికి పవన్కళ్యాణ్ ఎవరు..? అసలు, నీ స్థాయి.. నీ అర్హతలేంటని ప్రశ్నిస్తున్నాను. గ్లామర్ తగ్గుతుందనే పాదయాత్ర చేయలేదా..? గతంలో ఒకసారి ఇదే పవన్కళ్యాణ్ పాదయాత్ర చేస్తానన్నాడు. కొంతకాలానికి నేను పాదయాత్ర చేస్తే శాంతిభద్రతల సమస్య వస్తుంది. నా పాదయాత్రతో ప్రజలకు నష్టం కలిగే ప్రమాదముందని ఆయన నోటితో కుంటిసాకులు చెప్పాడు. పాదయాత్ర ప్రతిపాదనను విరమించుకున్నాడు. నేను ఈ సందర్భంగా ప్రశ్నిస్తున్న విషయమేంటంటే, ‘నువ్వు ప్రజల మధ్యకు వెళ్లే సువర్ణావకాశమైన పాదయాత్రను ఎందుకు కాదనుకున్నావు..? ఎండలో, వానలో తిరిగి ప్రజల మధ్య నలిగి నల్లగా నువ్వు కమిలిపోతే.. నీకు సినిమా అవకాశాలు రావనే భయంతోనే పాదయాత్ర చేయంది..? అంటే, నీకు ప్రజాసేవ చేయాలనే తపన లేదు కనుకనే ప్రజల మధ్య తిరిగే సువర్ణావకాశాన్ని గ్లామర్ కోసం వదులుకున్నావు.’ దీన్నిబట్టి చూస్తే నీకు ప్రజల మేలు కంటే... నీకు డబ్బు తెచ్చిపెట్టే సినిమాలే ఎక్కువని అందరికీ అర్ధమవుతుంది కదా..? వందజన్మలెత్తినా జగన్ గారి స్థాయికి చేరుకోలేవు 3648 కిలోమీటర్ల పాదయాత్ర చేసి ప్రజల మధ్యకు వెళ్లి వారి సమస్యలపై అవగాహన చేసుకున్న నాయకుడు జగన్మోహన్రెడ్డి గారు. ఆయన ముఖ్యమంత్రి అయ్యాక ప్రజలకు ఏం చేస్తారో చెప్పారు. మ్యానిఫెస్టోలో ప్రకటించిన ప్రతీ హామీని నెరవేర్చారు. ఇప్పటికే 99.5 శాతం మ్యానిఫెస్టో హామీల్ని అమలు చేసిన గొప్ప ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్రెడ్డి గారితో పవన్కళ్యాణ్కు ఎక్కడ పోలిక ఉంది..? నువ్వు వందజన్మలెత్తినా మా నాయకుడు జగన్ గారి స్థాయికి చేరుకోలేవు. లేనిపోని వ్యక్తిగత ఆరోపణలతో రాజకీయ లబ్ధిని పొందాలనుకునే వపన్కళ్యాణ్ ప్రయత్నాలు ఆకాశం మీద ఉమ్మేసిన చందంగా ఉంటాయనడంలో సందేహమేదీలేదు. పవన్ అబద్ధాలకు అంబేద్కర్ ఆత్మక్షోభిస్తుంది? పట్టుమని పది అసెంబ్లీ నియోజవర్గాల్లో పర్యటించక ముందే పవన్కళ్యాణ్లో అంత నిరాశా నిస్పృహలెందుకు..? ఎవరి మీద ఆయన అక్కసు..? ఈరోజు ఆయన సభకొచ్చిన పార్టీ కార్యకర్తలు, అభిమానులు కూడా మా జగన్గారికే ఓటేస్తామని బహిరంగంగా చెబుతుంటే.. తనను ఎందుకు గెలిపించరని పవన్కళ్యాణ్లో అసహనం పెరిగిపోతుంది. అంబేద్కర్ మహానుభావుడి సాక్షిగా అన్నీ నిజాలే మాట్లాడుతానని చెబుతూ.. అన్నీ అబద్ధాలే మాట్లాడాడు నిన్న పవన్కళ్యాణ్. అయన మాట్లాడిన దూషణలకు ఆ అంబేద్కర్ మహానుభావుడే చిన్నబుచ్చుకుని ఆయన ఆత్మ క్షోభించి ఉంటుందని ప్రజలంతా అనుకున్నారు. వాలంటీర్లపై నీచపు మాటలా? వాలంటీర్ వ్యవస్థ పట్ల ఏమాత్రం గౌరవం లేకుండా నీచాతీ నీచంగా మాట్లాడిన పవన్కళ్యాణ్ వ్యాఖ్యల్ని మేం ఖండిస్తున్నాం. ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం చేపట్టిన అద్భుతమైన సంస్కరణల్లో సచివాలయాలు- వాలంటీర్ వ్యవస్థ ఒకటి. మహాత్మ గాంధీ కలలుగన్న గ్రామ స్వరాజ్యాన్ని నెరవేరుస్తున్న ఈ వాలంటీర్లు ప్రభుత్వ సేవలన్నింటినీ ఇంటి గడప వద్దకే తీసుకొస్తూ.. ప్రతీ ఇంటిలో ఒక అక్క, చెల్లెలు, తమ్ముడు, అన్నగా కనిపిస్తూ ప్రజలకు సేవలందిస్తున్నారు. అలాంటి పవిత్రమైన వాలంటీర్ వ్యవస్థను అగౌరవపరచడానికి నీకు సిగ్గుందా.. పవన్కళ్యాణ్..? ఈరోజు ఎక్కడా పైసా అవినీతి లేకుండా ప్రభుత్వసేవల్ని పారదర్శకంగా అందిస్తున్న వ్యవస్థే ఈ వాలంటీర్ వ్యవస్థ. ఇప్పటికైనా నీ మాటలను వెనక్కి తీసుకుని క్షమాపణలు చెప్పాలని హితవు పలుకుతున్నాను. జన్మభూమి కమిటీల దోపిడీలు పవన్కు ఇష్టమేమో..? చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు జన్మభూమి కమిటీలంటూ... ప్రతీ పనికీ లంచం సమర్పించాలంటూ హుకుం చేసిన గత జ్ఞాపకాలు ప్రతీ ఒక్కరికీ తెలుసు. చివరికి వృద్ధులకు పింఛన్లు ఇవ్వాలన్నా కూడా గంటల తరబడి పడిగాపులుతో లంచాలిచ్చుకుని పింఛన్లు తీసుకున్న పరిస్థితి. ప్రభుత్వ సంక్షేమ పథకాల లబ్ధిదారుల ఎంపికలోనూ జన్మభూమి కమిటీల అవినీతి అంతా ఇంతా కాదు. ఇవన్నీ అప్పట్లో ఈ పవన్కళ్యాణ్కు బాగా ఇష్టమైన కార్యక్రమాలుగా ఉన్నాయేమో..ఇవన్నీ ఏమీలేకుండా అత్యంత పారదర్శకంగా నడుస్తున్న ఇప్పటి వాలంటీర్ వ్యవస్థంటే పవన్కు ఎందుకు నచ్చడంలేదు..? అత్యంత నిస్వార్థంగా జగన్ గారి స్ఫూర్తితో ప్రభుత్వంలో భాగస్వామ్యం అవుతూ మహత్తరమైన ప్రజాసేవ చేసే వాలంటీర్లంటే మీకెందుకు కక్ష అని ప్రశ్నిస్తున్నాను. ఇందుకు పవన్ కల్యాణ్ సమాధానం చెప్పాలి. పవన్కళ్యాణే పెద్దక్రిమినల్ కోవిడ్ సమయంలో ఇక్కడ ప్రజల్ని పట్టించుకోకుండా చంద్రబాబు, పవన్కళ్యాణ్ లు.. హైదరాబాద్లో తమ ప్యాలెస్లలో కూర్చొన్నారు. అయితే, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా శ్రీ వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రజల్ని కోవిడ్ సమయంలో ఆదుకునే కార్యచరణ ప్రణాళికలో ఈ వాలంటీర్ల వ్యవస్థ భాగస్వామ్యం అయింది. వాలంటీర్లు అందరూ తమ ప్రాణాల్ని లెక్కచేయకుండా ఇంటింటా సర్వేలు చేశారు. వైద్యసాయం అందించారు. ఆనాడు వాలంటీర్ల చొరవ కారణంగా ఇంటింటా ప్రభుత్వసేవలందాయి. అలాంటి వాలంటీర్లను పట్టుకుని మీరు మెచ్చుకోకపోయినా పర్వాలేదు. వాలంటీర్లను బ్రోకర్లు, క్రిమినల్స్ అంటూ పవన్కళ్యాణ్ మాట్లాడటానికి సిగ్గుందా..లేదా..? అని అడుగుతున్నాను. నిజానికి ఈ రాష్ట్రంలో అన్ని విధాలుగా ప్రజల్ని రెచ్చగొడుతున్న పవన్కళ్యాణ్ అనే వ్యక్తే పెద్ద క్రిమినల్ అని చెబుతున్నాను. వాలంటీర్లకు క్షమాపణలు చెప్పాలి పవన్కళ్యాణ్ మాట్లాడుతూ.. తనను, తన భార్యాబిడ్డల్ని ఎవరో అసభ్యంగా మాట్లాడుతున్నారని మొసలికన్నీరు పెడుతున్నారే.. మరి, ఈరోజు మీరు వాలంటీర్లను పట్టుకుని బ్రోకర్లు, క్రిమినల్స్ అంటే వారి కుటుంబాలు రోధించవా..? వారి ఏడుపు మీకు శాపంగా మారదా..? అని ప్రశ్నిస్తున్నాను. కనుక, ఇప్పటికైనా నువ్వు ఫ్రస్టేషన్లో మాట్లాడిన మాటల్ని వెనక్కితీసుకుని వాలంటీర్లకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నాను. చంద్రబాబు కోసం చేసే నీ పోరాటం వృథానే పట్టుమని పది నియోజకవర్గాల సమస్యలపై కూడా అవగాహన లేని పవన్కళ్యాణ్ ఎవరికోసం పోరాటం చేస్తున్నాడు. ఆయన ఎక్కడ పోటీ చేస్తాడో.. ఎక్కడ గెలుస్తాడో.. ఆయనకే దిక్కులేదు. మాటకొస్తే ప్రతీచోటా జగన్గారిని గద్దె దించాలంటూ పిలుపునిస్తున్నాడు కదా..? మరి, జగన్గారిని గద్దె దించితే.. ఆ తర్వాత గద్దెనెక్కేది ఎవరు..? పవన్కళ్యాణ్ మనసులో ఉన్నదేంటో బయటపెట్టాలి కదా..? చంద్రబాబును ఎక్కిస్తాడా..? లేదంటే, లోకేశ్ను గద్దెనెక్కిస్తాడా..? చంద్రబాబు అనే ప్రజాకంటకుడ్ని, దుర్మార్గుడ్ని అధికారంలోకి తెచ్చేదాకా పోరాటం చేస్తానని ఆరాటపడుతున్నాడు. ప్రభుత్వంపై లేనిపోని ఆరోపణలతో బురదజల్లినా.. మా జగన్గారిని వ్యక్తిగతంగా దూషించినా.. ఊగినా తూగినా కూడా పవన్కళ్యాణ్ ప్రయత్నాలన్నీ వృథాప్రయాసే. ఎందుకంటే, గతంలో చంద్రబాబుతో జతకట్టి, అధికారంలోకి వచ్చాక, టీడీపీ ప్రభుత్వం చేసిన దుర్మార్గాలపై నోరుమెదపని పవన్కళ్యాణ్ అంటేనే ప్రజలకి విరక్తి కలిగింది. కనుక, ఇప్పుడు ఆయన ఎన్ని యాత్రలతో ప్రజల్ని నమ్మించాలని చూస్తే వారు నమ్మరుగాక నమ్మరని స్పష్టంచేస్తున్నాను. రాష్ట్రంలో 175 నియోజకవర్గాలకు 175 చోట్లా వైఎస్ఆర్సీపీకే ప్రజా మద్ధతు ఉంటుందని, మరలా శ్రీ వైఎస్ జగన్మోహన్రెడ్డి గారే ముఖ్యమంత్రి అవుతారని ధీమాగా చెబుతున్నాను. ఏలూరు అభివృద్ధికి చిత్తశుద్ధితో పనిచేస్తున్నా నేను ఏలూరు ఎమ్మెల్యేగా నియోజకవర్గ అభివృద్ధికి చిత్తశుద్ధితో పనిచేస్తుంటే.. నామీద పవన్కళ్యాణ్ ఏవేవో గాలిపోగేసి మాట్లాడినంత మాత్రానా ఎవరూ నమ్మరు. అండర్గ్రౌండ్ డ్రైనేజీ పనుల నిమిత్తం ఇప్పటికే రూ.150 కోట్లతో ప్రతిపాదనల్ని ప్రభుత్వానికి పంపాం. సుమారు రూ.500 కోట్లతో ఏలూరు మెడికల్ కళాశాల పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఇక్కడేదో అంతుచిక్కని వ్యాధులు ప్రబలుతున్నాయంటూ పవన్కళ్యాణ్ ఏవేవో అవగాహరాహిత్యంతో మాట్లాడుతున్నాడు. గతంలో ఇక్కడ ఒక అంతుచిక్కని వ్యాధి ప్రబలినప్పుడు గౌరవ ముఖ్యమంత్రి జగన్ గారు తరచూ సమీక్షలు జరిపి, ఢిల్లీనుంచి ఐసీఎంఆర్ నిపుణుల్ని పిలిపించి సర్వే చేయించి వారిచ్చిన నివేదిక ప్రకారం రూ.300 కోట్లతో ఏలూరుకు గోదావరి జలాల్ని తెచ్చే ప్రాజెక్టును కూడా త్వరలో ప్రారంభించనున్నాం. ఇప్పటికైనా పవన్కళ్యాణ్ నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడకపోతే.. ప్రజలు వారాహిని అడ్డుకుని మీకు తగిన బుద్ధిచెబుతారని హెచ్చరిస్తున్నాను.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
Watch Live: హిందూపురంలో సీఎం జగన్ ప్రచార సభ
డీబీటీ చివరిదశ చెల్లింపులకు మోకాలడ్డుతోన్న టీడీపీ.
కూలి పనికి పోతున్న కిన్నెర వాయిద్య కారుడు.. మాటలు చెబుతున్న సర్కారు
జగన్ మాటిచ్చాడంటే చేస్తాడు అనే నమ్మకమే నా వెంట ఇంత జనాన్ని నిలబెట్టింది
నా తొలి సంతకం వాళ్ళ కోసమే.. కూటమి మరో కుట్ర..!
శోభిత పోస్ట్.. సమంత స్టైలిష్ట్ రిప్లై
ముంబై ఎయిర్పోర్టులో 12 కోట్ల విలువైన బంగారం, ఐఫోన్లు సీజ్
ఎన్నికల వేళ కలకలం.. బీజేపీ మంత్రిని చంపేస్తామని బెదిరింపులు!
సంజయ్లీలా భన్సాలీ 'హీరామండి' వెబ్ సిరీస్ ఎలా ఉంది..?
నాడు మోదీకి వంట వండిన దీపక్.. ఇప్పుడేం చేస్తున్నారు?
తప్పక చదవండి
- కెనడాలో మనవడిని చూడ్డానికి వెళ్లి...మనవడితో సహా దుర్మరణం
- Banjara Hills: విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం.. నిండు ప్రాణం బలి
- తెలంగాణలో భానుడి భగభగలు..!
- అందుకే ఓడిపోయాం.. అయినా సరే: హార్దిక్ పాండ్యా
- తాతా.. నీకు టాటా..
- రోహిత్ వేముల ఆత్మహత్య కేసు మళ్లీ దర్యాప్తు చేస్తాం
- స్విమ్మింగ్ పూల్ ఒడ్డున ఎమ్మెల్యే వినూత్న నిరసన!
- తిరుమలలో వడగళ్ల వర్షం (ఫొటోలు)
- కందికుంట అడ్డంగా దొరికినా..
- నిందితుడిని హంతకుడని ఎలా ముద్ర వేస్తారు?
Advertisement