-
టీడీపీ గూండాగిరికి పోలీసుల వత్తాసు
సాక్షి, అమరావతి: యథేచ్ఛగా సాగుతున్న టీడీపీ శ్రేణుల దాడులు, దౌర్జన్యాలు, విధ్వంసాన్ని అరికట్టేందుకు తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని వైఎస్సార్ సీపీ డిమాండ్ చేసింది. వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలే లక్ష్యంగా పక్కా పన్నాగంతో జరుగుతున్న దాడులను డీజీపీ హరీశ్కుమార్ గుప్తా దృష్టికి తెచ్చింది. పార్టీ నేతలు అంబటి రాంబాబు, మేరుగు నాగార్జున, పేర్ని వెంకట్రామయ్య(నాని), లేళ్ల అప్పిరెడ్డి తదితరులు బుధవారం రాష్ట్ర పోలీసు ప్రధాన కార్యాలయంలో డీజీపీని కలసి ఈ మేరకు వినతిపత్రం సమర్పించారు. పల్నాడు, తిరుపతి, అనంతపురం జిల్లాల్లో టీడీపీ గూండాలు దాడులకు తెగబడిన 21 ఘటనలకు సంబంధించి పూర్తి ఆధారాలను అందచేశారు. ఎన్నికల షెడ్యూల్ ప్రకటించినప్పటి నుంచి టీడీపీ విధ్వంసం సృష్టించే పన్నాగాన్ని అమలు చేస్తోందన్నారు. వైఎస్సార్సీపీ నేతలు శాంతియుతంగా వ్యవహరిస్తున్నా కవ్వింపు చర్యలకు పాల్పడుతూ దాడులకు దిగుతోందని తెలిపారు. వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలు, వారి కుటుంబ సభ్యుల భద్రతకు తగిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. హింసాత్మక ఘటనలపై నిష్పక్షపాతంగా దర్యాప్తు జరిపి కారకులపై కఠిన చర్యలు చేపట్టి వీటికి అడ్డుకట్ట వేయాలని డిమాండ్ చేశారు. అనంతరం వైఎస్సార్సీపీ నేతలు డీజీపీ కార్యాలయం వద్ద మీడియాతో మాట్లాడారు.దౌర్జన్యాలకు కొమ్ముకాసిన పోలీసులు: అంబటి టీడీపీ గూండాలు బరితెగించి దాడులకు పాల్పడుతుంటే పోలీసులు చోద్యం చూశారు. రాజకీయ ఒత్తిళ్లతో పోలీసు అధికారులను ఈసీ హఠాత్తుగా బదిలీ చేసింది. వారిని మార్చిన తరువాత కూడా హింసాత్మక సంఘటనలు యథేచ్ఛగా సాగుతున్నాయి. దీనికి ఈసీ ఏం సమాధానం చెబుతుంది? అవగాహనలేని డీజీపీ, డీఐజీలు, ఎస్పీలు, ఇతర అధికారులను నియమించడంతోనే హింసాత్మక సంఘటనలు జరుగుతున్నాయి. ఈసీ తీసుకున్న తప్పుడు నిర్ణయాలతో రాష్ట్రం రావణ కాష్టంలా మారింది. ఢిల్లీ నుంచి వచ్చిన ఆదేశాలు, పురందేశ్వరి సూచనల ప్రకారం ఈసీ అడ్డగోలుగా వ్యవహరించింది. అసలు పోలీసు వ్యవస్థ ఉందా? అనే సందేహం కలుగుతోంది. కొందరు పోలీసు అధికారులు టీడీపీతో కుమ్మక్కయ్యారు. టీడీపీ గూండాలు పోలింగ్ బూత్లలో దౌర్జన్యం చేస్తున్నా, వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తల ఇళ్లపై పడి దాడులు చేస్తున్నా పోలీసు యంత్రాంగం ఏమాత్రం అడ్డుకోలేకపోయింది. ఎన్నికలు సక్రమంగా నిర్వహించడంలో పోలీసు యంత్రాంగం విఫలమైంది. వైఎస్సార్సీపీ నేతలను హౌస్ అరెస్ట్లు చేసిన పోలీసులు టీడీపీ శ్రేణులు స్వైర విహారం చేసినా కన్నెత్తి చూడలేదు. నన్ను హౌస్ అరెస్ట్ చేసి నా ప్రత్యర్థిని మాత్రం యథేచ్ఛగా తిరగనిచ్చారు. నా నియోజకవర్గంలో రీపోలింగ్ అవసరం లేదని ఈసీ ఎలా చెబుతుంది? వెబ్ కెమెరా రికార్డింగ్లను పరిశీలించకుండా ఏకపక్షంగా నిర్ణయాన్ని ఎలా ప్రకటిస్తుంది? ఇందుకు ఈసీ సమాధానం చెప్పాలి.దాడులు.. ఆపై కేసులు: పేర్ని నానిటీడీపీ పక్కా పన్నాగంతో దాడులకు పురిగొల్పుతోంది. కర్రలు, కత్తులు, రాడ్లు చేతబట్టుకుని పచ్చ ముఠాలు దాడులకు పాల్పడుతున్నా పోలీసులు పట్టించుకోవడం లేదు. దీన్ని ప్రశ్నించిన వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలపై తిరిగి కేసులు బనాయించడం దారుణం. పోలింగ్ అనంతరం హింసకు పోలీసుల వైఫల్యమే కారణం. పల్నాడు ఎస్పీకి ఎన్నిసార్లు ఫోన్లు చేసినా పట్టించుకోలేదు. రిటైర్డ్ అధికారిని పోలీస్ పరిశీలకుడిగా ఈసీ నియమించడం ఏమిటి? ఆయనకు ఏం జవాబుదారీతనం ఉంటుంది? బీజేపీ, టీడీపీ నేతలకు సహకరించాలంటూ ఆయన పోలీసు అధికారులను బెదిరించారు. మా కార్యకర్తలపై హత్యాయత్నం కేసులు పెడుతున్నారు. పురందేశ్వరి చెప్పిన విధంగా పోలీసు అధికారులను మార్చిన చోటే హింసాత్మక సంఘటనలు జరుగుతున్నాయి. పక్కా కుట్రతో పోలీసు అధికారులను బదిలీ చేసి టీడీపీ, బీజేపీ, జనసేన విధ్వంసానికి పాల్పడుతున్నట్లు స్పష్టమవుతోంది. దీనికి పోలీసులతోపాటు ఈసీ కూడా సమాధానం చెప్పాలి. వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తల భద్రత కోసం ప్రజాస్వామ్యయుతంగా పోరాడతాం.చంద్రబాబుపై చర్యలు తీసుకోవాలని ఈసీకి వైఎస్సార్సీపీ ఫిర్యాదు’రాష్ట్రంలో హింస, దాడులు, అల్లర్లలో ప్రధాన ముద్దాయి చంద్రబాబేనని, ఆయనపై తక్షణమే చర్యలు తీసుకోవాలని వైఎస్సార్సీపీ డిమాండ్ చేసింది. మంత్రులు అంబటి రాంబాబు, మేరుగు నాగార్జున, జోగి రమేష్, వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు పేర్ని నాని, నంబూరు శంకరరావు, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి బుధవారం ఎన్నికల సంఘం కార్యాలయంలో ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్కుమార్ మీనాను కలిసి ఈ మేరకు ఫిర్యాదు చేశారు. గొడవలకు సంబంధించిన ఆధారాలు అందజేశారు. రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో తెలుగుదేశం పార్టీ ఇటీవల చేసిన హింసాకాండపై సమగ్ర విచారణ జరిపి తగిన చర్యలు తీసుకోవాలని అభ్యర్థించారు. ముఖ్యంగా పల్నాడులో ఉద్దేశపూర్వకంగా, ప్లాన్ ప్రకారం దాడులు చేశారని తెలిపారు. పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని, కూటమి పార్టీలకు కొమ్ముకాస్తున్నారని వారు వివరించారు. -
కొంతమంది పోలీసులు టీడీపీ వాళ్ళతో కుమ్మక్కై: అంబటి
-
టీడీపీ అరాచకం.. డీజీపీకి వైఎస్సార్సీపీ ఫిర్యాదు
సాక్షి, గుంటూరు: టీడీపీ దాడులు, హింసాత్మక చర్యలపై డీజీపీకి వైఎస్సార్సీపీ ఫిర్యాదు చేసింది. ఆ పార్టీ నేతలు మేరుగు నాగార్జున, అంబటి రాంబాబు, పేర్ని నాని డీజీపీని కలిసి ఫిర్యాదు చేశారు.అనంతరం మంత్రి అంబటి రాంబాబు మంగళగిరి డీజీపీ కార్యాలయం దగ్గర మీడియాతో మాట్లాడుతూ, పోలింగ్ బూత్లలో హింస జరుగుతుంటే పోలీసులు అడ్డుకోలేదన్నారు. ఎన్నికలు సజావుగా నిర్వహించడంలో పోలీసులు పూర్తిగా విఫలమయ్యారన్నారు. కొంతమంది పోలీసులు టీడీపీకి కొమ్ము కాశారని మండిపడ్డారు.‘‘వైఎస్సార్సీపీ నేతలను ఎక్కడికక్కడ హౌస్ అరెస్ట్లు చేశారు.టీడీపీ నేతలు మాత్రం విచ్చలవిడిగా తిరిగారు. కూటమి ఫిర్యాదుతో ఈసీ పోలీస్ అధికారులను మార్చింది. అధికారులను మార్చిన తర్వాత కూడా హింస ఎందుకు జరిగింది?’’ అంటూ అంబటి రాంబాబు ప్రశ్నించారు.‘‘పోలీసు వ్యవస్థలో కొంతమంది టీడీపీ వారితో కలిసిపోయారు. మాకు బాగా ఓట్లు పడేచోట భారీగా పోలీసులను పెట్టారు. టీడీపీకి బలమైన గ్రామాలలో పోలీసులను పెట్టలేదు. దీంతో వారు పోలింగ్ బూత్లను క్యాప్చర్ చేశారు. నన్ను హౌస్ అరెస్టు చేసి, నా ప్రత్యర్థిని యథచ్చగా తిరగనిచ్చారు. చాలా దుర్మార్గపు చర్యలకు దిగారు. పోలీసు అధికారులను ఉన్నట్టుండి మార్చారు. అలా మార్చితే మేలైన పరిస్థితులు ఉండాలి కదా? మరి ఎందుకు హింస జరిగింది?. అధికారులను మార్చిన తర్వాత ఎందుకు హింస జరిగింది?. అవగాహన లేని డీజీపి, ఎస్పీలను పెట్టడం వలన హింస జరిగింది’’ అని అంబటి రాంబాబు పేర్కొన్నారు.‘‘ఎన్నికల కమిషన్ తీసుకున్న తప్పుడు నిర్ణయం వలనే ఈ పరిస్థితి ఏర్పడింది. పోలీసు పరిశీలకుడు ఢిల్లీ ఆదేశాలు, పురంధేశ్వరి ఆదేశాలతోనే చేశారు. సీఎస్, డీజీపీలను ఢిల్లీకి పిలిచారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. తన నియోజకవర్గంలో రీపోలింగ్ అవసరం లేదని ఈసీ ఎలా చెబుతుంది?. వెబ్ కెమెరాలను విశ్లేషించకుండా ఇలాంటి నిర్ణయం ఎలా తీసుకుంటారు?’’ అంటూ అంబటి రాంబాబు ప్రశ్నించారు.పక్కా ప్లాన్ ప్రకారమే ఈ దారుణాలు: మాజీ మంత్రి పేర్నిటీడీపీ నేతలు, కార్యకర్తలు యథేచ్చగా కర్రలు, రాడ్లతో దాడులు చేశారు. మా వాళ్లు ఎదురు తిరిగితే మాపై కేసులు పెడుతున్నారు. పోలింగ్ తర్వాత జరుగుతున్న హింసలకు పోలీసుల వైఫల్యమే కారణం. పల్నాడు ఎస్పీకి ఫోన్లు చేసినా పట్టించుకోలేదు?. రిటైర్డ్ అధికారిని పోలీసు అబ్జర్వర్ని పెడితే ఏం జవాబుదారీతనం ఉంటుంది. బీజేపి, కూటమికి సహకరించమని పోలీసు అధికారులనే ఆయన బెదిరించారు. మా కార్యకర్తలపై హత్యానేరం కేసులు పెడుతున్నారు. పురంధేశ్వరి చెప్పినట్టు పోలీసు అధికారును మార్చినచోటే హింస జరిగింది. అంటే పక్కా ప్లాన్ ప్రకారమే ఈ దారుణాలకు పాల్పడ్డారు -
అక్కడ రీ-పోలింగ్ ?
-
టీడీపీ దాడులపై అంబటి స్ట్రాంగ్ రియాక్షన్
-
రిగ్గింగ్ జరిగింది.. రీపోలింగ్ జరపాల్సిందే: మంత్రి అంబటి
సాక్షి, పల్నాడు జిల్లా: సీఎం జగన్ను మళ్లీ సీఎం చేయాలనే తపన ఓటర్లలో కనిపించిందని మంత్రి అంబటి రాంబాబు అన్నారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మహిళలు, వృద్ధులు, దివ్యాంగులు పెద్దసంఖ్యలో ఓటేశారన్నారు. ‘‘పోలింగ్ శాతం పెరగటం అంటే అది పాజిటివ్ ఓటింగ్. మహిళా సాధికారత కోసం సీఎం జగన్ కృషి చేశారు. మహిళలంతా సీఎం జగన్కే ఓటు వేశారు. రాష్ట్యవాప్తంగా ఓటర్లలో చైతన్యం కనిపించింది’’ అంబటి రాంబాబు అన్నారు.టీడీపీ నేతలు అరాచకాలకు తెగబడ్డారు. మేం ఫిర్యాదు చేసినా పోలీసులు స్పందించలేదు. పల్నాడులో పోలీసు యంత్రాంగం విఫలమైంది. టీడీపీతో పోలీసులు కుమ్మక్కైయ్యారా?’’ అంటూ అంబటి నిలదీశారు. పల్నాడులో పోలీసు యంత్రాంగం విఫలమైంది. మా కార్యకర్తలకు రక్షణ కల్పించలేని పరిస్థితి ఏర్పడింది. నన్ను తిరగకుండా అడ్డుకున్నారు. ఒక బూత్లో వెయ్యి ఓట్లు రిగ్గింగ్ చేశారు. రీపోలింగ్ నిర్వహించబోమన్న మాట సరికాదు. దమ్మాలపాడు, నార్నేపాడులో రిగ్గింగ్ జరిగిన పోలింగ్ కేంద్రాల్లో రీ పోలింగ్ నిర్వహించాలి’’ అని అంబటి రాంబాబు డిమాండ్ చేశారు.‘‘ఉదయం 6 గంటల నుండి అర్ధరాత్రి వరకూ పోలింగ్ జరిగింది. ఇది ప్రతిష్టాత్మకమైన ఎన్నిక. రాష్ట్ర ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ ఐదేళ్లపాటు పాలన చేసిన తర్వాత జరిగిన ఎన్నిక. చంద్రబాబు, జగన్ పాలన చూసినవారు ఓటు వేయడానికి పోటెత్తిన తీరు ఆశ్చర్యం కలిగింది. మహిళలు, వృద్ధులు తెల్లవారుజామునే బూత్ లకు చేరుకున్నారు. తమ సంక్షేమ పాలన మళ్ళీ తెచ్చుకోవడానికి ప్రజలు ముందుకు వచ్చారు’’ అని అంబటి చెప్పారు.ఓట్ల శాతం పెరిగితే ప్రభుత్వ వ్యతిరేక ఓటు అనుకునేవాళ్లం, కానీ ఈసారి సీఎం జగన్ కోసం తాపత్రయపడి ఓటు వేశారు. ఈ ఎన్నికల్లో మహిళలే ఎక్కువగా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. మహిళలు 70 శాతం ఫ్యాన్ గుర్తుకే ఓటు వేశారు. అమ్మఒడి, డ్వాక్రా రుణమాఫీ, ఇళ్ల పట్టాలు మహిళలకు ఇచ్చి వారి సాధికారతకు కృషి చేశారు. ఎన్నికల్లో ప్రభుత్వ వ్యతిరేకత ఎక్కడా లేదు. జగన్ కోసం ఓటర్లు పడిన తపన, తాపత్రయం స్పష్టంగా కనిపించింది’’ అని అంబటి రాంబాబు పేర్కొన్నారు.చంద్రబాబు, పవన్ కళ్యాణ్, ఎల్లో మీడియా ఎవరు ప్రయత్నాలు చేసినా వైఎస్సార్సీపీ వైపే ఉన్నారు. సత్తెనపల్లి లోనూ నేను భారీ మెజారిటీతో గెలవబోతున్నాను. ఏ ఎన్నికల్లోనూ జరగని హింస ఈ ఎన్నికల్లో జరిగింది. డీజీపీ, ఐజీ, ఐపీఎస్ లను మార్చారు. ఇంతమందిని మార్చినా నిష్పక్షపాతంగా ఎన్నికలు జరగలేదు. లా అండ్ ఆర్డర్ ను పోలీసులు కాపాడలేదు. గొడవలు జరిగినపుడు పోలీసులకు ఫోన్ చేసినా గంటల తరబడి రీచ్ కాలేదు. పోలీసులు అట్టర్ ఫెయిల్ అయ్యారు’’ అంబటి దుయ్యబట్టారు.దాడులు జరిగిన తర్వాత చాలాసేపటికి పోలీసులు వచ్చారు. నకిరేకల్ ఎస్ఐ నన్ను అక్కడ తిరగటానికి వీల్లేదన్నారు. ఎస్పీకి కాల్ చేస్తే నన్ను ఇంటికి వెళ్లిపోమన్నారు. కానీ నియోజకవర్గంలో నీ చాలా ప్రాంతాల్లో కన్నా లక్ష్మీ నారాయణ తిరిగారు. మీ అంతు తేల్చుతా అంటూ కన్నా కుమారుడు ఓటర్లను బెదిరించారు. రూరల్ సీఐ రాంబాబు టీడీపీతో కలిసిపోయాడు. టీడీపీ వద్ద డబ్బులు తీసుకుని వారికి పనిచేశాడు’’ అని అంబటి నిప్పులు చెరిగారు.‘‘దమ్మాలపాడు బూత్లో పోలీసులను మేనేజ్ చేసి ఓట్లు వేయించారు. ఎలక్షన్ కమిషన్కి ఫిర్యాదు చేశాను. రీపోలింగ్ కి డిమాండ్ చేస్తున్నాను. నా అల్లుడు ఉమేష్ కారుపై దాడి చేశారు. చీమలమర్రి, దమ్మాలపాడు, నాగనుపాడు, గుల్లపల్లి, మాదల సహా అనేక ప్రాంతాల్లో ఎలక్షన్ సక్రమంగా జరగలేదు. ఎలక్షన్ కమిషన్ను అక్కడి కెమెరాలు పరిశీలించాలని కోరుతున్నాను. కొన్నిచోట్ల పోలింగ్ ఆఫీసర్స్ కొల్యూడ్ అయిపోయారు. ఎవరి ఓటు వాళ్లు వేస్తే సమస్య లేదు. అందరి ఓటు ఒక్కరే వేస్తే అది పద్ధతి కాదు.. ఎలక్షన్ అథారిటీస్కి ఫిర్యాదు చేశాను. చంద్రబాబు మోసగాడు.. ప్రజల్ని 14ఏళ్లు మోసం చేశాడు. ఇచ్చిన ప్రతీ హామీని నెరవేర్చిన మొనగాడు జగన్. మోసగాడిని ఓడించి, మొనగాడిని గెలిపించనున్నారు’’ అని అంబటి రాంబాబు చెప్పారు. -
పోలింగ్ ఏజెంట్ పై టీడీపీ మూకల దాడి
-
టీడీపీ కార్యకర్తల దాడి అంబటి స్ట్రాంగ్ కౌంటర్
-
అల్లుడి గురించి ఎవరికీ తెలియని విషయాలు...అంబటి సంచలన వ్యాఖ్యలు
-
పవన్ రాజకీయాలకు ఏమాత్రం పనికిరారు: అంబటి
-
ఆ రాయి ప్రజల గుండెలపై పడినట్లే..
సత్తెనపల్లి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిపై విజయవాడ నడిబొడ్డున జరిగిన హత్యాయత్నంతో రాష్ట్రం నివ్వెరపోయిందని, ఆయనపై విసిరిన రాయి తెలుగుప్రజల గుండెలపై పడినట్లేనని రాష్ట్ర జలవనరులశాఖ మంత్రి అంబటి రాంబాబు చెప్పారు. పల్నాడు జిల్లా సత్తెనపల్లిలోని వైఎస్సార్సీపీ నియోజకవర్గ కార్యాలయంలో సోమవారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ముఖ్యమంత్రి జగన్పై దాడి జరిగి ఆయన నుదిటికి బలమైన గాయం తగిలితే.. ఇది ఎన్నికల ముందు సింపతీ కోసం డ్రామా అని చంద్రబాబు, లోకేశ్, పవన్కళ్యాణ్ విమర్శించడాన్ని ఖండించారు. దేశంలో అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రుల్లోకెల్లా అత్యంత ప్రజాదరణ, ప్రజాబలం ఉన్న ఏకైక ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అని చెప్పారు. ఆయనకు సింపతీ అవసరమేంటని ప్రశ్నించారు. జగన్ అధికారంలో ఉన్నంతకాలం ఆర్థికంగా దెబ్బతినిపోతామని భావించి చంద్రబాబు వర్గీయులు తమ నాయకుడిపై కక్షగట్టి కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. 175 స్థానాల్లో గెలుస్తామనే ప్రగాఢమైన విశ్వాసం తమకుందని చెప్పారు. కూటమి పరిస్థితి అగమ్యగోచరంగా మారిందని ఎద్దేవా చేశారు. జగన్కు వస్తున్న ప్రజాదరణను చూసి ఆయన్ని హత్యచేయడానికి చంద్రబాబు కుట్ర చేస్తున్నాడనేది వాస్తవమన్నారు. చంద్రబాబునాయుడు అధికారం లేకుంటే సహించలేడని, బతకలేడని చెప్పారు. తాను కలలుగనే అధికారం దక్కడం లేదనే కక్షతో, ఈర్షితో కుట్రలు, దారుణాలకు ఒడిగడుతున్నాడని ధ్వజమెత్తారు. హింసను ప్రోత్సహిస్తూ కుట్రలు పన్నుతున్నాడన్నారు. ఈసారి తమ నాయకుడిపై రాయిగానీ, మరొకటేదైనా పడితే రాష్ట్ర ప్రజలు చంద్రబాబును క్షమించరని చెప్పారు. రాష్ట్రంలో 175 స్థానాల్లో 151 గెల్చుకుని అధికారంలోకొచి్చన ప్రజాదరణ గలిగిన తెలుగు నాయకుడు జగన్కు గాయం అయితే తెలుగుప్రజలకు గాయమైనట్లు కాదా.. అని ప్రశ్నించారు. జనసేన అభ్యర్థి మనోహర్ గెలిస్తే తెనాలి సర్వనాశనమేనన్నారు. రాజకీయ పరిజ్ఞానం లేని తిక్కలోడు పవన్కళ్యాణ్ అని ఎద్దేవా చేశారు. పవన్ ప్రసంగాలన్నీ బూతులేనన్నారు. బూతులు మాట్లాడే నేతల్ని పిఠాపురం ప్రజలు శాసనసభకు ఎందుకు పంపుతారని ప్రశ్నించారు. ఏది నాటకమో, ఏది నిజమో ప్రజలంతా గమనిస్తూనే ఉన్నారన్నారు. కుట్రలు, కుతంత్రాలకు పాల్పడుతున్న పవన్, చంద్రబాబుకు ఎన్నికల కౌంటింగ్ తర్వాత రాజకీయ సమాధి తప్పదని జోస్యం చెప్పారు. -
కూటమిగా వస్తూ కుట్రలు చేస్తున్నారు.. బాబు, పవన్ పై ఫైర్ అయిన అంబటి
-
కుట్ర ప్రకారమే దాడి.. బాబు, పవన్పై అంబటి ఆగ్రహం
-
‘సీఎం జగన్ పాలనలో పచ్చ బ్యాచ్ ఆటలు సాగవని బాబుకు తెలుసు’
సాక్షి, సత్తెనపల్లి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి గురించి మాట్లాడే అర్హత పవన్కు లేదన్నారు మంత్రి అంబటి రాంబాబు. సీఎం జగన్ పాలనలో చంద్రబాబు ఆటలు సాగవని పచ్చ బ్యాచ్కు తెలుసు. అందుకే ఇలా దాడికి ప్లాన్ చేశారని మంత్రి అంబటి ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా, సీఎం జగన్ సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. సీఎం జగన్ ఏరోజు ఏరోజు సానుభూతి కోసం ప్రయత్నించలేదు. సంక్షేమ పథకాలే సీఎం జగన్ను గెలిపిస్తాయి. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ను ఒంటరిగా ఎదుర్కొనే దమ్ము ప్రతిపక్షాలకు లేదు. అందుకే కూటమిగా వస్తూ కుట్రలు చేస్తున్నాయి. మీరు ముగ్గురు కలిసినా 30 మంది కలిసినా సీఎం జగన్ను ఓడించలేరు. సీఎం జగన్పై దాడిని ప్రధాని మోదీ కూడా ఖండించారు. కానీ, చంద్రబాబు, పవన్లకు మాత్రం వెటకారంగా ఉంది. నాదెండ్ల మనోహార్ కోసం ప్రచారం చేసేందుకు పవన్ వచ్చారు. నాదెండ్లకు ఓటు వేస్తే తెనాలి నాశనమే. ముఖ్యమంత్రి జగన్ గాయంపై పవన్ కల్యాణ్ ఇష్టమొచ్చినట్టు మాట్లాడారు. పవన్ సినిమా యాక్టర్ కాబట్టి చూసేందుకు వస్తున్నారు. సీఎం జగన్ పేదల పక్షపాతి కనుక ఆయనను చూసేందుకు, కలిసేందుకు వస్తున్నారు. సీఎం జగన్ గురించి మాట్లాడే అర్హత పవన్కు లేదు. పవన్ ఎన్నోసార్లు అనుచితంగా మాట్లాడారు. మళ్లీ వైఎస్సార్సీపీ నేతలు బూతులు తిడతారంటూ ఆరోపిస్తారు. గతంలో పవన్ తాను మాట్లాడిన బూతులు మరచిపోయారా?. దీనికి పవన్ ఏం సమాధానం చెబుతారు?. అధికారం లేకుండా చంద్రబాబు బతకలేడు. టీడీపీ వాళ్లు అశాంతిని సృష్టిస్తారు. వైస్సార్సీపీ కార్యకర్తలు జాగ్రత్తగా ఉండాలి అని సూచించారు. -
చంద్రబాబు నీచ రాజకీయాలను ప్రజలు గమనిస్తున్నారు
-
సీఎం జగన్పై దాడి: స్పందించిన ప్రధాని మోదీ..వైఎస్సార్సీపీ నేతలు..
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిపై రాయితో దాడికి పాల్పడ్డాడు ఓ ఆగంతకుడు. మేమంతా సిద్ధం బస్సుయాత్రలో భాగంగా సింగ్నగర్కు చేరుకున్న క్రమంలో సీఎం జగన్పై రాయితో దాడి చేశారు. బస్సుపై నుంచి ప్రజలకు అభివాదం చేస్తున్న సమయంలో సీఎం జగన్పై దాడి జరిగింది. ఆ రాయి అత్యంత వేగంగా సీఎం జగన్ కనుబొమ్మకు తాకింది. ప్రథమ చికిత్స తర్వాత మళ్లీ బస్సుయాత్ర కొనసాగింది. అనంతరం వైద్యుల సలహామేరకు మెరుగైన చికిత్స కోసం విజయవాడ ప్రభుత్వ ఆస్పత్రికి కేసరపల్లి క్యాంప్నుండి సీఎం జగన్ చేరుకున్నారు. అక్కడ వైద్యులు సీఎం జగన్ గాయానికి తదుపరి చికిత్స చేశారు. గాయానికి రెండు కుట్లు పడ్డాయని వైద్యులు తెలిపారు. వైద్యుల చికిత్స అనంతరం సీఎం జగన్ కేసరపల్లికి బయల్దేరారు. సీఎం జగన్తో పాటుగా వైఎస్ భారతీ ఉన్నారు. గాయం కారణంగా సీఎం వైయస్ జగన్ను విశ్రాంతి తీసుకోవాలని వైద్యుల సూచించారు. దీంతో నేడు సీఎం జగన్ యాత్రకు విరామం ప్రకటించారు. తదుపరి కార్యక్రమాన్ని ఆదివారం విడుదల చేస్తామని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తెలిపింది. కాగా, సీఎం జగన్పై దాడి ఘటన నేపథ్యంలో బీఆర్ఎస్ నేతలు కేటీఆర్, హరీష్ రావు స్పందించారు. ట్విట్టర్ వేదికగా కేటీఆర్..‘జగన్ అన్నా జాగ్రత్తలు తీసుకోండి. మీరు సురక్షితంగా ఉన్నారు సంతోషం. సీఎం జగన్పై జరిగిన దాడిని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. ప్రజాస్వామ్యంలో హింసకు స్థానం లేదు. ఎన్నికల సంఘం ద్వారా కఠినమైన చర్యలు చేపట్టాలని నేను ఆశిస్తున్నాను’ అంటూ కేటీఆర్ ట్వీట్ చేశారు. Glad you are Safe. Take care @ysjagan Anna Strongly condemn the attack on AP CM Jaganmohan Reddy Garu. Violence has no place in democracy and I hope strict preventive measures are put in place by ECI pic.twitter.com/fTBTe17I2T — KTR (@KTRBRS) April 13, 2024 మరోవైపు హరీష్ రావు ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ..‘సీఎం జగన్పై దాడి హేయమైన చర్య. ప్రజాస్వామ్యంలో హింసకు తావులేదు’ అని పేర్కొన్నారు. ఘటనకు బాధ్యులైన వారిని శిక్షించాలని డిమాండ్ చేస్తూ.. జగన్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ సైతం జగన్పై దాడిని ఖండించారు. రాజకీయ విభేదాలు ఎప్పుడూ హింసాత్మకంగా మారకూడదని పేర్కొన్నారు. ప్రజాస్వామ్యంలో ఉన్నప్పుడు సభ్యత, పరస్పర గౌరవాన్ని కాపాడుకోవాలని సూచించారు. I condemn the stone-throwing on Hon'ble Andhra Pradesh CM Thiru @ysjagan. Political differences should never escalate to violence. Let's uphold civility and mutual respect as we engage in the democratic process. Wishing him a quick recovery. https://t.co/YtYoOJbVy1 — M.K.Stalin (@mkstalin) April 13, 2024 సీఎం జగన్పై రాయితో జరిగిన దాడి ప్రధాని నరేంద్ర మోదీ స్పంధించారు. సీఎం జగన్ త్వరగా కోలుకోవాలని ప్రార్ధిస్తున్నానంటూ ఆయన ఎక్స్లో పోస్ట్ చేశారు. I pray for the speedy recovery and good health of Andhra Pradesh CM @ysjagan Garu. — Narendra Modi (@narendramodi) April 13, 2024 అంబటి రాంబాబు మాట్లాడుతూ.. సీఎం జగన్పై దాడి చంద్రబాబు పనే అన్నారు. ఈ ఘటన బాబు ప్రోద్భలంతోనే జరిగింది. చంద్రబాబు దుర్మార్గమైన ఆలోచనలు చేస్తున్నారు. ప్రజాస్వామ్యంలో ఇలాంటి దాడులు చేయడం సరికాదు. చంద్రబాబు, పవన్, బిజెపి ముగ్గురూ కలిసినా జగన్ను ఏమీ చేయలేరు. ఈ ఎన్నికల్లో చంద్రబాబుకు రాజకీయ సమాధి తప్పదని అంబటి రాంబాబు అన్నారు. పేర్ని నాని మాట్లాడుతూ.. సీఎం జగన్కు వస్తున్న ప్రజాదరణను చూసి ఓర్వలేక ఇలా దాడులు చేయడానికి తెగబడ్డారు. ఎంతమంది కలి వచ్చినా జగన్ను ఏమీ చేయలేక రాళ్ల దాడి చేశారు. సీఎం జగన్కు లోతుగా గాయమైంది. రెండు కుట్లు పడే అవకాశం ఉందని వైద్యులు చెప్పారు. తల నుంచి రక్తం కారుతుంటే వైద్యులు ప్రధమ చికిత్స చేశారు. త్వరలోనే సీఎం జగన్పై ఎవరు దాడి చేయించారో అన్నీ బయటకు వస్తాయి అన్నారు. మేకపాటి విక్రమ్రెడ్డి మాట్లాడుతూ.. సీఎం జగన్పై జరిగిన దాడిని ఖండిస్తున్నా. సీఎంపై టీడీపీ గూండాలు దాడి చేయడం అమానుషం. ఇలాంటి దాడులు చేయడమే టీడీపీ పాలసీ. ఎన్నికల్లో ఓటమి తప్పదని టీడీపీ నేతలు ఇలా దాడులకు తెగబడుతున్నారు అని విక్రమ్రెడ్డి అన్నారు. ట్విట్టర్లో రాజ్యసభ సభ్యులు, ఎంపీ అభ్యర్థి విజయసాయి రెడ్డి.. ► రాష్ట్ర ముఖ్యమంత్రిపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాను. ► చంద్రబాబు నాయుడు ఏనాడు అభివృద్ధి నమ్ముకుని రాజకీయాలు చెయ్యలేదు. ► హింస, కుట్రలు, కుతంత్రాలు నమ్ముకుని పిరికిపంద రాజకీయాలు చేస్తున్నారు. ► చంద్రబాబు పిరికిపంద రాజకీయాలు చేస్తున్నారని ఇవాళ జరిగిన దాడితో మరోసారి రుజువైంది. నారాయణ స్వామి,డిప్యూటీ సీఎం కామెంట్స్ ► మానవ జన్మ ఎత్తున చంద్రబాబు నాయుడు నరరూప రాక్షసుడు ► సిఎం జగన్ మోహన్ రెడ్డి కు బస్సు యాత్ర లో వస్తున్న ప్రజాభిమానం చూసి తట్టుకోలేక రాళ్ళ దాడి చేయించాడు ► నర హంతకుడు చంద్రబాబు నాడు ఎన్టీఆర్ కు వెన్నుపోటు పొడిచాడు, ఇప్పుడు ప్రజాభిమానంతో దూసుకువెళ్తున్న జగన్ యాత్ర పై రాళ్ళ దాడి చేయించాడు ► చంద్రబాబు ను ప్రజలు క్షమించరు, రానున్న ఎన్నికలలో ప్రజలు తగిన బుద్ధి చెప్తారు ► మా ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఎంతో సహనంతో ఉండమంటున్నారు, చంద్రబాబుకు ప్రజలే మీ అంతుచూస్తారు ► మా ముఖ్యమంత్రి కి ఏదైనా జరిగితే మేమే మీ అంతు చూస్తాం అంటూ హెచ్చరిక మాజీమంత్రి బాలినేని కామెంట్స్ ► విజయవాడలో సీఎం జగన్మోహన్ రెడ్డి పై దాడి హేయమైన చర్య ► దాడి వెనుక కుట్రకోణం ఉంది..పూర్తి స్థాయి విచారణ జరగాలి ► దాడులతో ఎన్నికలలో గెలవాలని చంద్రబాబు చూస్తున్నారు ► దాడులు చేసి వైఎస్సార్సీపీని బయపెట్టాలనేది మీ భ్రమ ► చంద్రబాబు కి మతి భ్రమించింది....ప్రస్ట్రేషన్ లో చంద్రబాబు ఏమి చేస్తున్నాడో ఆయనకే తెలియదు ► బస్సు యాత్రలో జగన్మోహన్ రెడ్డి కి వస్తున్న ప్రజాదరణ చూసి టీడీపీ ఓర్వలేకపోతోంది ► టీడీపీ సభలకు జనం రాకపోవడం తో చంద్రబాబు కి ఫ్రైస్ట్రేషన్ ఎక్కువైంది సీఎం జగన్ పై జరిగిన దాడిని తీవ్రంగా ఖండించిన కోవూరు ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి, ఉదయగిరి నియోజకవర్గం ఇంచార్జ్ మేకపాటి రాజగోపాల్ రెడ్డి.. ► పక్క ప్లాన్ ప్రకారమే రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పై టిడిపి గుండాలు రాళ్లతో దాడి చేశారు ► సీఎం జగన్కు వస్తున్న ఆదరణను చూసి టిడిపి నేతల కడుపు మండుతోంది.. వచ్చే ఎన్నికల్లో టిడిపికి ప్రజలు సరైన గుణపాఠం చెబుతారు సీఎం జగన్ పై దాడిని ఖండించిన ప్రభుత్వ విప్ భీమవరం ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ ► విజయవాడలోని అజిత్ సింగ్ నగర్ లో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పై ప్రతిపక్షాలు దాడి చేయడం దారుణం ► ప్రజాదారణ కలిగిన ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిని ఎదుర్కొనలేక ఇటువంటి దాడులు చేయడం సిగ్గుచేటు ► రాష్ట్రంలో 175 సీట్లకు గాను 175 సీట్లను ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గెలుచుకుంటున్నారని అనేక సర్వేల ఫలితాలు వెల్లడిస్తున్న నేపథ్యంలో ప్రతిపక్షాలు వైసిపికి రాబోయే విజయాన్ని తట్టుకోలేకపోతున్నాయి ► ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పై దాడి దిగిన వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలి డిమాండ్ చేసిన ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ ముఖ్యమంత్రి మీద భౌతిక దాడులు చేసే స్థాయికి దిగజారిపోయారు: హోం మంత్రి తానేటి వనిత ► బస్సు యాత్ర చేస్తున్న సీఎం జగన్ పై టిడిపి నాయకులు చేసిన రాళ్లదాడిని ఖండిస్తున్నా ► జగనన్న బస్సు యాత్ర ఎంతో ప్రజాధరణ పొందడం చూడలేక దాడికి దిగారు ► ఒంటరిగా జగనన్నను ఢీకొట్టలేక నిన్న మొన్న జనసేన ను తెచ్చుకున్నా ఏమీ చేయలేకపోయారు ► తాజాగా బిజెపితో జతకట్టిన మైలేజ్ సాధించలేకపోయారు ► జగన్ను ఏమీ చేయలేని పరిస్థితుల్లో షర్మిలమ్మను ఇంటి నుంచి బయటకు లాగి కాంగ్రెస్లో పెట్టారు ► ఎంతసేపు జగన్ మీద రాజకీయంగా కుట్ర చేయాలి అదే వారి ఆలోచన సీఎం జగన్ పై దాడి పిరికిపంద చర్య: అవంతి శ్రీనివాస్ మాజీ మంత్రి ► సీఎం జగన్ పై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం ► దాడులు తెలుగుదేశం పార్టీ సంస్కృతి ► గత కొన్ని రోజుల నుంచి టీడీపీ కార్యకర్తలను చంద్రబాబు లోకేష్ రెచ్చగొడుతున్నారు ► సీఎం జగన్ కు ప్రపంచవ్యాప్తంగా కరుడుగట్టిన అభిమానులు ఉన్నారు ► వారు కూడా తిరిగి దాడులు చేస్తే టిడిపి నేతలు పరిస్థితి ఏంటి ► దాడులు అనేవి వైఎస్ఆర్సిపి సంస్కృతి కాదు సీఎం జగన్ పై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం: గుడివాడ అమర్నాథ్ ► చంద్రబాబు పాతకాలపు రాజకీయాలను మానుకోవాలి ► సీఎం జగన్ పై దాడి చేస్తే భయపడతారని చంద్రబాబు భ్రమ పడుతున్నారు ► గతంలో వంగవీటి రంగాను చంద్రబాబు కిరాతకంగా చంపించారు ► నేడు మళ్లీ సీఎం జగన్ పై విజయవాడలో దాడి చేయించారు ► దాడులు చేయిస్తే సీఎం సభలు సమావేశాలు నిర్వహించరని చంద్రబాబు భ్రమ పడుతున్నారు ► మూడు పార్టీలు కలిసి పొత్తు పెట్టుకున్న చంద్రబాబు సభలకు జనాలు రావడం లేదు ► ఓడిపోతామనే భయంతో చంద్రబాబు దాడులకు పాల్పడుతున్నారు ► చంద్రబాబు రోడ్లు మీద తిరుగుతున్నారు ► మేము దాడులు చేయాలంటే నిమిషం పని..దాడులు చేయడం వైఎస్ఆర్సిపి సంస్కృతి కాదు ► 2019 ఎన్నికల ఫలితాలే మళ్లీ పునరావతమవుతాయి -
చంద్రబాబు డ్యాన్స్ పై అంబటి సెటైర్లు
-
చంద్రబాబు పార్టీలో పోటీ చేసేందుకు నేతలే లేరు
-
పవన్, చంద్రబాబు పొలిటికల్ డాన్సర్లే: మంత్రి అంబటి
సాక్షి, సత్తెనపల్లి: టీడీపీ అధినేత చంద్రబాబు దిగజారి మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు మంత్రి అంబటి రాంబాబు. అసలు చంద్రబాబు పార్టీలో పోటీ చేసేందుకు నేతలే లేరని ఎద్దేవా చేశారు. మేము వదిలేసిన వ్యక్తులకు టీడీపీలో టికెట్ ఇచ్చి పోటీ చేయిస్తున్నారని సెటైర్లు వేశారు. కాగా, మంత్రి అంబటి ఆదివారం మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు సభలన్నీ అట్టర్ ఫ్లాప్. సందుల్లో మీటింగ్లు పెట్టి జనం రాలేందంటే మీ పరిస్థితి ఏంటో అర్థమవుతుంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని విమర్శించే నైతిక అర్హత చంద్రబాబుకు లేదు. ఎక్కడ పదువులు అనుభవించి ఇప్పుడు ఎక్కడ మాట్లాడుతున్నారు. చంద్రబాబుకు సిగ్గు, శరం లేదు. లావు కృష్ణదేవరాయులు మా పార్టీ నుంచి వెళ్లి సైకిల్ ఎక్కాడు. వైఎస్సార్ టికెట్ ఇస్తే గెలిచిన వ్యక్తి జంగా కృష్ణమూర్తి. బాబుతో పొత్తు అంటే సమాధి కట్టడమే.. చంద్రబాబు ఇష్టం వచ్చిన మాట్లాడారు. చంద్రబాబు పక్కన ఉన్న ముగ్గురు ఎవరు?. తన పార్టీ అభ్యర్థుల పేర్లు కూడా చంద్రబాబుకు గుర్తు లేవు. చంద్రబాబు, పవన్లను నేను విమర్శించానే తప్ప తిట్టలేదు. సొంత పార్టీ నేతలే చంద్రబాబును తిడుతున్నారు. కన్నా లక్ష్మీనారాయణ తిట్టిన తిట్లు చంద్రబాబుకు గుర్తు లేదు. పొత్తు పెట్టుకోవడం సమాధి కట్టేయడమే చంద్రబాబు పని. ఇది గతంలోనే కన్నా చెప్పారు. విమర్శలు మరింత ఘాటుగా చేస్తాను. కానీ, దిగజారి మాట్లాడను. సీఎం వైఎస్ జగన్ దెబ్బకు టీడీపీ తట్టుకునే పరిస్థితి లేదు. 175 స్థానాల్లో గెలిచి మళ్లీ వైఎస్ జగనే ముఖ్యమంత్రి అవుతారు. సర్వేలన్నీ ఇప్పటికే వైఎస్సార్సీపీ విజయాన్ని తేల్చేశాయి. ఎన్నికల్లో ఓటమి ఖాయం కావడంతో చంద్రబాబు ఫ్రస్ట్రేషన్లో ఉన్నారు. కుప్పంలో కూడా చంద్రబాబు గెలవడం కష్టమే. పిఠాపురంలో పవన్ కల్యాణ్ కూడా ఓడిపోతాడు. పవన్కు రాజకీయాలెందుకు? అసలు పవన్కు రాజకీయాలు ఎందుకు?. రెండు రోజలు ప్రచారం చేసి ఐదు రోజలు పడుకుంటాడు. రాష్ట్రమంతటా పవన్ తిరిగే పరిస్థితి లేదు. డబ్బుల కోసం కక్కుర్తిపడే అవసరం నాకు లేదు. చంద్రబాబు నాపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు. పోలవరాన్ని ఏటీఎంలా వాడుకున్నది ఎవరు?. చంద్రబాబు చేసిన తప్పిదంతోనే పోలవరం ఆలస్యమవుతోంది. సంక్రాంతికి డాన్స్లు చేస్తే తప్పేంటి?. పండుగకు కుటుంబ సభ్యులతో డాన్స్ చేస్తే తప్పా?. చంద్రబాబులా నేను పొలిటికల్ డాన్సర్ను కాదు. రోజుకో పార్టీతో డాన్స్ చేస్తే వ్యక్తి చంద్రబాబు. పవన్ కల్యాణ్, చంద్రబాబు ఇద్దరూ పొలిటికల్ డాన్సర్లే’ అంటూ సెటైరికల్ కామెంట్స్ చేశారు. -
దుమ్ములేపుతున్న అంబటి ఎన్నికల ప్రచారం
-
వలంటీర్లపై ఈసీ నిర్ణయం దురదృష్టకరం
సాక్షి, అమరావతి/సత్తెనపల్లి: వలంటీర్లపై ఎన్నికల కమిషన్ తీసుకున్న నిర్ణయం వల్ల పెన్షన్ తీసుకునే అవ్వాతాతలు, వికలాంగులు తీవ్రంగా ఇబ్బంది పడతారని, ఈసీ నిర్ణయం దురదృష్టకరమని రాష్ట్ర జల వనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. ఈసీ నిర్ణయంపై శనివారం రాత్రి పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో మీడియాతో మాట్లాడుతూ.. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డిపై కక్షతో పేదలను ఇబ్బంది పెట్టేలా చంద్రబాబు వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు. వలంటీర్లపై చంద్రబాబు, పవన్ అనేక పర్యాయాలు అనుచిత వ్యాఖ్యలు చేశారన్నారు. ఇప్పుడు ఏకంగా నిమ్మగడ్డ రమేష్కుమార్ సాయంతో ఎన్నికల కమిషన్కు చంద్రబాబు ఫిర్యాదు చేయించారన్నారు. వారి వత్తిడికి తలొగ్గి వలంటీర్లను సంక్షేమ పథకాలు పంపిణీ చేయకుండా ఎన్నికల కమిషన్ నిర్ణయం తీసుకోవడం బాధాకరమన్నారు. కుట్రలతో చంద్రబాబు వలంటీర్లను బలి చేయాలనుకున్నారన్నారు. చంద్రబాబు తీరుతో రాష్ట్రంలో బలౌతున్నది వలంటీర్లు కాదని, అవ్వాతాతలు, వికలాంగులు, సంక్షేమ పథకాలు తీసుకుంటున్న లబి్ధదారులని మంత్రి అన్నారు. ఇప్పటికైనా ఈసీ తన నిర్ణయాన్ని పునరాలోచన చేసి వృద్ధులు, వికలాంగులకు అవస్థలు లేకుండా చూడాలని కోరారు. చంద్రబాబుకు బుర్రదొబ్బింది అత్యంత ఖరీదైన నేటి రాజకీయ పరిస్థితుల్లో సామాన్యులకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి టికెట్లు ఇస్తున్న చాణక్యతను, ఎత్తుగడలను అర్థం చేసుకోలేక చంద్రబాబుకు బుర్ర దొబ్బిందని మంత్రి రాంబాబు ఎద్దేవా చేశారు. విద్యావంతుడు, దళితుడు, టిప్పర్ డ్రైవర్గా జీవనం వెళ్లదీస్తున్న వీరాంజనేయులుకు సీఎం జగన్మోహన్రెడ్డి సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేసేందుకు టికెట్ ఇవ్వడంపై చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై మండిపడ్డారు. చంద్రబాబు డబ్బున్న కోటీశ్వరులకు, ఎన్నారైలకు, సంపన్నులకు టికెట్లు ఇస్తుండగా.. సీఎం జగన్మోహన్రెడ్డి అత్యంత సామాన్యులకు టికెట్లు ఇస్తూ సరికొత్త సంప్రదాయాన్ని తీసుకొస్తున్న వీరుడన్నారు. చంద్రబాబు ఇచ్చిన హామీలను తుంగలో తొక్కిన మోసగాడని విమర్శించారు. వృద్ధులు, వికలాంగులకు తీరని ద్రోహం: కారుమూరి వలంటీర్ల విధులు నిర్వహించకుండా జిత్తుల మారిన నక్కలా చంద్రబాబు అడ్డుకుని వృద్ధులు, వికలాంగులు, సంక్షేమ పథకాల లబ్ధిదారులకు తీరని ద్రోహం చేస్తున్నారని పౌర సరఫరాల శాఖ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు మండిపడ్డారు. ఈసీ నిర్ణయంపై స్పందిస్తూ.. నిమ్మగడ్డ రమేష్ ద్వారా ఎలక్షన్ కమిషన్కు లేఖ రాయించి వలంటీర్ల సేవలు నిలిపి వేయించిన నీచుడు చంద్రబాబు అన్నారు. ప్రజలకు మేలు చేసే ఏ కార్యక్రమమైనా చంద్రబాబుకు ద్వేషమే అన్నారు. ఎవరైనా ఏడుస్తుంటే చంద్రబాబు ఆనందిస్తాడని, ప్రజలు సంతోషంగా ఉంటే చంద్రబాబు ఏడుస్తాడని అన్నారు. వలంటీర్లు రాకపోవడంతో ఎండల్లో గంటల తరబడి క్యూలైన్లో నిలబడి పెన్షన్ తీసుకునే అవ్వాతాతలు సొమ్మసిల్లి పడిపోతే చంద్రబాబుకు సంతోషమని మండిపడ్డారు. చంద్రబాబు, ఆయన తోక పారీ్టలకు ఏనాడూ వలంటీర్లంటే ఇష్టం లేదని, వారిపై కక్షగట్టి విధులికప అడ్డుకుని ప్రజలకు ద్రోహం చేస్తున్నారని ధ్వజమెత్తారు. ‘నిమ్మగడ్డ రమేష్కుమార్తో ఫిర్యాదు చేయించడం దుర్మార్గం’ పెన్షన్ పంపిణీపై నిమ్మగడ్డ రమేష్కుమార్తో చంద్రబాబు ఫిర్యాదు చేయించడం దుర్మార్గమని, చంద్రబాబు పెత్తందారీ పోకడలతో ప్రజలకు ఇబ్బందులు తప్పడం లేదని ఎంపీ కేశినేని నాని, ఎమ్మెల్యేలు మల్లాది విష్ణు, వెలంపల్లి శ్రీని వాస్ మండిపడ్డారు. విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ.. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి చెప్పినట్టు ఇప్పుడు జరుగుతున్నది పేదలు, పెత్తందార్ల మధ్య యుద్ధమేనన్నారు. పేదలకు అందించే పెన్షన్లు నిలుపుదల చేయడం చాలా దారుణమన్నారు. మేధావుల ముసుగులో 64 లక్షల మంది పెన్షనర్ల నోట్లో మట్టికొట్టారన్నారు. నిమ్మగడ్డ రమేష్తో పాటు మరికొందరు చంద్రబాబు ఏజెంట్లుగా, తొత్తులుగా మారారన్నారు. చంద్రబాబు డైరెక్షన్లోనే పెన్షన్లు ఇవ్వొద్దని చెప్పించారన్నారు. దీనికి టీడీపీ కచ్చితంగా బాధ్యత తీసుకోవాల్సిందేనని అన్నారు. చంద్రబాబు పాలనలో మూడు రోజులు క్యూలో నిలబడితేనే పెన్షన్లు వచ్చేవి కాదని, జగన్ పాలనలో ఇప్పుడు నేరుగా ఇంటికే అందిస్తున్నా చంద్రబాబు అండ్ కో కుట్రలు చేస్తున్నారన్నారు. వృద్ధుల ఉసురు బాబుకు కచ్చితంగా తగులుతుందన్నారు. పెన్షన్ల పంపిణీ అంశంపై ఎన్నికల కమిషన్ పునరాలోచించుకోవాలన్నారు. వృద్ధుల్ని కష్టపెడతారా: వాసిరెడ్డి పద్మ ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల ఇంటిగడప వద్దకే చేరుస్తున్న వలంటీర్ల వ్యవస్థపై చంద్రబాబు, ఆయన బ్యాచ్ మొదటినుంచీ కుట్రలు చేస్తున్నారని, చివరకు ప్రజలకు సంక్షేమం అందకుండా చేయడానికి కూడా వెనుకాడలేదని వైఎస్సార్సీపీ మహిళా నేత వాసిరెడ్డి పద్మ మండిపడ్డారు. నిమ్మగడ్డ రమేష్కుమార్ ఫిర్యాదుతో సంక్షేమ పథకాల పంపిణీలో వలంటీర్లను ఉపయోగించవద్దంటూ శనివారం ఎన్నికల కమిషన్ ఆదేశాలు ఇవ్వడంపై వాసిరెడ్డి పద్మ స్పందించారు. ఇంట్లో మగాళ్లు లేనప్పుడు వలంటీర్లు వచ్చి తలుపులు కొడతారని, వలంటీర్లు మీ ఇంటికి వస్తే తరిమేయాలని చంద్రబాబు గతంలో అనేక మాటలు అన్నారన్నారు. చంద్రబాబు ,పవన్ , పచ్చ మీడియా కలిసి మొత్తం వలంటీర్ల వ్యవస్థనే తుంచేసే కుట్రలు చేశారన్నారు. ఎన్నికల కమిషన్ సైతం ప్రజల ఇబ్బందులు దృష్టిలో పెట్టుకోకుండా ఇటువంటి నిర్ణయం తీసుకోవడం బాధాకరమన్నారు. ‘వలంటీర్లపై ఫిర్యాదు చేయడానికి సిగ్గులేదా’ చంద్రబాబు ప్రయోజనాల కోసం పనిచేస్తున్న కొంతమంది మేధావుల ముసుగులో వలంటీర్లపై కుట్రలు చేస్తున్నారని శాసనమండలిలో విప్ లేళ్ల అప్పిరెడ్డి అన్నారు. వలంటీర్లు జీతాలు కోసం కాకుండా సేవా దృక్పథంతో పనిచేస్తున్నారన్నారు. చంద్రబాబు సహా ప్రతిపక్ష నాయకులంతా వలంటీర్లపై నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారన్నారు. స్వచ్ఛంద సంస్థల ముసుగులో కుహనా మేధావులు ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేశారన్నారు. వృద్ధులు, వికలాంగులకు పెన్షన్లు ఇవ్వడానికి వీలు లేదంటూ వలంటీర్లపై కంప్లైంట్స్ చేయటం దారుణమన్నారు. చంద్రబాబు ప్రయోజనాలను కాపాడటం కోసం నిమ్మగడ్డ రమేష్ పనిచేస్తున్నారన్నారు. పేదల కోసం పనిచేసే వలంటీర్లపై ఫిర్యాదు చేయటానికి సిగ్గు లేదా అని ప్రశి్నంచారు. ప్రజల్ని ఇబ్బంది పెట్టడమే: ఎమ్మెల్యే కన్నబాబు వలంటీర్లను నియంత్రించేందుకు చంద్రబాబు అండ్కో చేసిన ప్రయత్నాలు ప్రజలను ఇబ్బందులు పెడుతున్నాయని ఎమ్మెల్యే కురసాల కన్నబాబు అన్నారు. వలంటీర్లు ప్రజలకు గొప్పగా సేవలు అందిస్తున్నారన్నారు. ఈ ఐదేళ్ళ కాలంలో వలంటీర్లు లాంటి వ్యవస్థ పెట్టడానికి వేరే రాష్ట్రం ధైర్యం చేయలేకపోయిందన్నారు. ప్రజలకు గొప్ప సేవలందించే వలంటీర్లను నియంత్రించాలని చంద్రబాబు కుట్రలు చేస్తున్నాడన్నారు. సందర్భం వచ్చినప్పుడల్లా చంద్రబాబు, పవన్ వలంటీర్లపై దుర్మార్గమైన కామెంట్లు చేశారన్నారు. తాజాగా ఎన్నికల కమిషన్కు నిమ్మగడ్డ ద్వారా వలంటీర్లపై పిర్యాదు చేశారు. ఈ రెండు నెలలు పెన్షన్లు అందకుండా చేశామని చంద్రబాబు పండుగ చేసుకుంటున్నాడన్నారు. వలంటీర్లను నియంత్రిస్తే వైఎస్సార్సీపీని నియంత్రించామని అనుకోవడం చంద్రబాబు భ్రమ అన్నారు. -
‘వాలంటీర్లపై ఈసీ నిర్ణయం దురదృష్టకరం’
పల్నాడు జిల్లా: ఏపీలో సంక్షేమ పథకాలకు వాలంటీర్లతో డబ్బులు పంపిణీ చేయవద్దని కేంద్ర ఎన్నికల సంఘం తీసుకున్న నిర్ణయం దురదృష్టకరమన్నారు మంత్రి అంబటి రాంబాబు. ఎన్నికల సంఘం తీసుకున్న ఈ నిర్ణయం పునరాలోచించుకోవాలని అంబటి విజ్ఞప్తి చేశారు. ఎలక్షన్ కమిషన్ నిర్ణయం వల్ల పెన్షన్ తీసుకునే అవ్వా తాతలు, దివ్యాంగులు తీవ్ర ఇబ్బందులు పడతారన్నారు. ‘సీఎం జగన్పై కక్షతో చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్లు వాలంటర్లీపై అనేక అనుచిత వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు నాయుడు.. నిమ్మగడ్డ రమేష్ ద్వారా ఎలక్షన్ కమిషన్కి ఫిర్యాదు చేయించాడు. ఎన్నికల కమిషన్ ఇప్పటికైనా తన నిర్ణయాన్ని పునరాలోచించుకోవాలి. పెన్షన్లు తీసుకునే వారిపై కక్షతోనే చంద్రబాబు నాయుడు ఈ రకంగా వ్యవహరిస్తున్నాడు. చంద్రబాబు నాయుడు, కుట్రలు, కుతంత్రాలతో వాలంటీర్లను బలి చేయాలనుకుంటున్నాడు. ఇక్కడ బలవుతుంది వాలంటీర్లే కాదు.. అవ్వా తాతలు, దివ్యాంగులు, సంక్షేమ పథకాలు తీసుకుంటున్న లబ్ధిదారులు’ అని అంబటి స్పష్టం చేశారు. -
పవన్ కళ్యాణ్ ను ఇంతలా ఎవరు ర్యాగింగ్ చేసుండరు
-
అనిల్ వస్తే ఉరుములు మెరుపులు...అంబటి గూస్ బంప్స్ స్పీచ్
-
హోలీ సెలబ్రేషన్స్ లో దుమ్ములేపుతున్న మంత్రి అంబటి
Pagination
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
హీరామండి నటి షర్మిన్ సెగల్ భర్త ఎవరో తెలుసా? వేల కోట్ల ఆస్తి
పోలీసులు ఏ రాజకీయ పార్టీల ప్రలోభాలకు లోను కాకుండా నిస్పక్షపాతంగా పనిచెయ్యాలి
అభిషేక్ శర్మ తల్లి పాదాలకు నమస్కరించిన శుబ్మన్ .. ఫొటోలు వైరల్
ఓటీటీలోకి సుహాస్ లేటెస్ట్ హిట్ మూవీ.. మూడు వారాల్లోనే స్ట్రీమింగ్
SRH: సన్రైజర్స్ కెప్టెన్ చేసిన పనికి అభిమానులు ఫిదా
జనసేన డీలా.. పిఠాపురంలోనూ పవన్ గెలుపుపై అనుమానాలే....
డర్టీ ఫెలో ట్రైలర్ రిలీజ్
ఏపీ ఎన్నికల అల్లర్ల పై సిట్ విచారణ.. ఇప్పటికే పోలీసుల ఫై వేటు
సూర్య 'కంగువా'.. ఆ సీన్ కోసం ఏకంగా పదివేలమందిని!
ఈ బ్యూటీ ఎవరో గుర్తుపట్టారా?.. ఫేమస్ టీటీ ప్లేయర్!(ఫొటోలు)
తప్పక చదవండి
- అధికారులను మార్చిన చోటే అల్లర్లు: మంత్రి బొత్స
- ఫుడ్ ప్రాసెసింగ్ సెక్టార్లో కృత్రిమ మేధ!
- ఎవరీ శ్యామ్ రంగీలా? మోదీపై ఎందుకు పోటీ చేయాలనుకున్నారు
- లాలూ యాదవ్ కూతుళ్ళ పేర్ల వెనుక ఇంత హిస్టరీ ఉందా?
- జెరోధా ట్రేడర్లకు అలెర్ట్.. అదిరిపోయే ఫీచర్తో
- ఛాతిలో కొట్టాడు, కడుపులో తన్నాడు: స్వాతి మలీవాల్ సంచలన ఆరోపణలు
- APL వేలంలో నితీశ్ కుమార్ రెడ్డికి అత్యధిక ధర.. సరికొత్త రికార్డు
- ట్విటర్ నుంచి నాగబాబు ఔట్.. వారిద్దరూ వార్నింగ్ ఇచ్చారా..?
- ఎట్టకేలకు గుడ్ న్యూస్ చెప్పిన ప్రభాస్
- ఎల్లో గ్యాంగ్ బొక్క బోర్లా.. అసలు నిజం ఇదే..
Advertisement