-
టీడీపీ పని ఔటేనా? అశోక్ గజపతి రాజు మాటల్లో అంతరార్థం ఏంటీ?
తెలుగుదేశం పార్టీ పని అయిపోయిందా? పార్టీ చరిత్రలోనే ఇంతటి అధ్వాన్న పరిస్థితులు ఎన్నడూ లేవా? చంద్రబాబు నాయకుడి అసమర్ధ సారధ్యమే తెలుగుదేశం పార్టీకి ఈ దుస్థితిని తెచ్చిపెట్టిందా? ఇక పార్టీకి భవిష్యత్తు లేనట్లేనా? టిడిపి సీనియర్ నేత మాజీ మంత్రి అశోక్ గజపతి రాజు మనోభావాలను గమనిస్తే ఈ ప్రశ్నలన్నింటికీ ఔను అన్న సమాధానాలే వస్తాయి. పార్టీ దుస్థితిని చూసి తట్టుకోలేకపోయిన అశోక్ గజపతి రాజు వంటి సీనియరే ఇక పార్టీలో యాక్టివ్గా ఉండలేనని చెప్పేసినట్లు సమాచారం. అంతగా అవసరం అనుకుంటే సలహాలు మాత్రమే ఇస్తానని ఆయన అన్నారని పార్టీ వర్గాల్లోనే కలకలం రేగుతోంది. తెలుగుదేశం పార్టీ నడక ఎలా సాగుతోంది? ఒకప్పుడు ఎలా ఉండేది? ఇపుడు ఎంత బలహీనంగా అడుగులు పడుతున్నాయి? ఎన్టీయార్ టిడిపిని స్థాపించినప్పుడు ఆయనతో పాటు చాలా మంది నేతలు రాజకీయ ప్రస్థానాలు ప్రారంభించారు. చాలా మంది రాజకీయ జీవితాలు అప్పుడే మొదలయ్యాయి. అప్పటి టిడిపి నేతలందరికీ అది ఒక స్వర్ణ యుగం. ఎన్నో విలువలతో ఏర్పడిన నాటి టిడిపి ఎన్టీయార్ తోనే కనుమరుగు అయిపోయింది. ఇపుడున్న టిడిపి చంద్రబాబు నాయకత్వంలో పాతాళం దిశగా శరవేగంగా దిగజారిపోతోంది. కాంగ్రెస్ వ్యతిరేకతలోంచి ఎన్టీయార్ టిడిపిని స్థాపించారు. ఆ కాంగ్రెస్ అధినేతలు రాహుల్ గాంధీతో నేరుగా చేతులు కలిపిన రోజునే టిడిపిలో ఎన్టీయార్ తాలూకు ఆనవాళ్లు ఏమన్నా ఉంటే అవి మాయం అయిపోయాయి గత సిద్ధాంతాలకు కాలం చెల్లింది. చంద్రబాబు నాయుడి అవకాశవాద రాజకీయాలు టిడిపిని దివాళా తీయించాయనే చెప్పాలి. ఎన్టీయార్ పార్టీ పెట్టినపుడు అందులో ఉండి ఆ తర్వాత ఎన్టీయార్ కు వెన్నుపోటు పొడిచినపుడు చంద్రబాబుతో అంటకాగిన సీనియర్ నేతలు సైతం టిడిపిని చంద్రబాబు నడిపిస్తోన్న తీరు పట్ల తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఇటువంటి పార్టీలో ఇక క్రియాశీలకంగా కొనసాగలేం అని నిర్ణయించేసుకుంటున్నారు. తాజాగా ఉత్తరాంధ్రలో ఎన్టీయార్ హయాంలో మంత్రిగా పనిచేసి ఆయన వెన్నుపోటు సమయంలో చంద్రబాబు శిబిరంలో ఉన్న అశోక్ గజపతి రాజు ప్రస్తుతం టిడిపి తీరుపై కోపంగా ఉన్నారు. ఒకపక్క బిజెపితో ప్రత్యక్ష స్నేహం. మరోవైపు కాంగ్రెస్ తో చీకటి స్నేహం. ఇంత దగుల్బాజీ రాజకీయాలను తన కెరీర్ లోనే చూడలేదని అశోక్ గజపతి రాజు తన అనుయాయులతో అంటున్నట్లు సమాచారం. పార్టీ అధినేతగా చంద్రబాబు అనుసరిస్తోన్న వైఖరి..ఆయన మాటల తీరు కూడా అభ్యంతరకరంగానే ఉన్నాయని అశోక్ గజపతిరాజు భావిస్తున్నారని అంటున్నారు. ఎన్నికల ప్రచారంలో నిన్న కాక మొన్ననే చంద్రబాబు నాయుడు శింగనమల నియోజక వర్గంలో వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ ఒక టిప్పర్ డ్రైవర్ కు టికెట్ ఇస్తే చంద్రబాబు నాయుడు దాన్ని హేళన చేస్తూ పేదలను అవమానిస్తూ డ్రైవర్ల పట్ల తనకున్న ఏవగింపును చాటుకున్నారు. దీనిపై సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోలింగ్ జరుగుతోంది. దీనికి కౌంటర్ గా వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ అధినేత జగన్ మోహన్ రెడ్డి మాట్లాడుతూ.. ఔను చంద్రబాబూ.. మాది పేదల పార్టీ కాబట్టే పేదవాడైన టిప్పర్ డ్రైవర్ కు ఇచ్చాం..మరో చోట ఉపాధి హామీ కూలీకి టికెట్ ఇచ్చాం? మీలా మాది పెత్తందార్ల పార్టీ కాదు కదా అని చురకంటించారు. ఇపుడు రాష్ట్ర వ్యాప్తంగా చంద్రబాబు నాయుడి వెకిలి మాటలు.. దానికి జగన్ మోహన్ రెడ్డి దీటైన సమాధానం పైనే చర్చ నడుస్తోంది. దీంతోనే సెల్ఫ్ గోల్ వేసుకున్న చంద్రబాబు నాయుడు వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ తెచ్చిన వాలంటీర్ వ్యవస్థపై కక్ష సాధింపుతో ఎన్నికల వేళ వాలంటీర్ల చేత పింఛన్లు, సంక్షేమ పథకాలు ఇప్పించకుండా ఆంక్షలు విధించాలంటూ నిమ్మగడ్డ రమేష్ చేత ఈసీకి ఫిర్యాదు చేయించారు. ఆ ఫిర్యాదు అందుకున్న ఈసీ వాలంటీర్లపై ఆంక్షలు విధించింది. దాంతో ఒకటో తారీఖున తెల్లవారు జామునే పింఛన్లను తమ ఇంటికి తెచ్చి ఇచ్చే వాలంటీర్లు ఏప్రిల్ ఒకటో తేదీన రాకపోవడంతో అవ్వాతాతలు, దివ్యాంగులు నరకయాతన పడ్డారు. దీనికంతటికీ కారణం చంద్రబాబు నాయుడి టిడిపి పార్టీయే అని తెలుసుకుని వారు మండిపడుతున్నారు. ఎన్నికల వేళ వాలంటీర్లపై ఆంక్షలు విధించేలా చేసి ఏదో విజయం సాధించామని చంద్రబాబు అనుకున్నారు. కానీ ఈ నేలబారు రాజకీయంతో ప్రజల్లో ఆయనపట్ల వ్యతిరేకత ఎన్నో రెట్లు పెరిగిందంటున్నారు రాజకీయ పండితులు. ఇక పొత్తుల కోసం బిజెపి అగ్రనేతల కాళ్లా వేళ్లా పడి చంద్రబాబు నాయుడు ఢిల్లీలో వెంపర్లాడ్డం కూడా టిడిపి సీనియర్లకు నచ్చడం లేదు. ఒక్క శాతం ఓట్లు కూడా లేని బిజెపితో పొత్తుకోసం చంద్రబాబు నాయుడు అంతలా దేబిరించాల్సిన అవసరం ఏముందని? సీనియర్లు నిప్పులు చెరుగుతున్నారు. ఈ తరుణంలోనే ఉత్తరాంధ్ర సీనియర్ నేత అశోక్ గజపతి రాజు తన అనుచరులతో మాట్లాడుతూ టిడిపి ఇంత అధ్వాన్న స్థితికి పడిపోడానికి కారణం చంద్రబాబు అసమర్ధ నాయకత్వమే అని పెదవి విరిచారట. ఇక ఈ పార్టీలో యాక్టివ్ గా ఉండలేనని అస్త్ర సన్యాసం ప్రకటించారట. పార్టీ నాయకత్వానికి కావాలని అనుకుంటే సలహాలు సూచనలు ఇస్తాను తప్ప నేనైతే యాక్టివ్ పాలిటిక్స్ లో ఉండలేని అని తేల్చి చెప్పేశారట. ఈ ఎన్నికల్లో టిడిపి ఘోర పరాజయం ఖాయమన్న సంకేతాలను చాలా సర్వేలు అందించాయి. జగన్ మోహన్ రెడ్డి నిర్వహిస్తోన్న మేమంతా సిద్ధం బస్సు యాత్రకు లక్షలాదిగా జనం తరలి వస్తోంటే చంద్రబాబు నాయుడి ప్రజాగళానికి జనం మొహం చాటేస్తున్నారు. ప్రజలు ఎటు వైపు మొగ్గు చూపుతున్నారో ఈ కార్యక్రమాలే చాటి చెబుతున్నాయంటున్నారు రాజకీయ పండితులు. ఈ ఎన్నికల్లో టిడిపి ఓటమి తర్వాత పార్టీలోని సీనియర్లంతా ఒక్కసారిగా చంద్రబాబు పై తిరుగుబాటు చేయడం ఖాయమంటున్నారు వారు. -
చంద్రబాబు నాయకత్వ తీరుపై గుర్రుగా ఉన్న అశోక్ గజపతి రాజు
-
పార్టీ కోసం ఇంత కష్టపడి పని చేస్తే.. వేదికపైకి పిలవరా..?
బాదుడే బాదుడు కార్యక్రమం పేరుతో పొందూరు మండలం దళ్లవలసకు టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు హాజరైన దృశ్యమిది. పార్టీకి మంచి ఊపు వచ్చిందని.. జనాలంతా టీడీపీవైపే ఉన్నారంటూ చంద్రబాబు హడావుడి చేసిన సందర్భమిది. కానీ, అప్పట్లో ఆ సభకు జనాల్లేక కుర్చీలు వెలవెలబోయాయి. ప్రాంగణమంతా ఖాళీ కుర్చీలతో దర్శనమిచ్చింది. సాక్షాత్తు చంద్రబాబు హాజరైన సభకొచ్చిన దుస్థితి ఇది. సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం : అటు చంద్రబాబు హాజరైన సభ, ఇటు టీడీపీ జిల్లా కేడర్ అంతా ప్రతిష్టాత్మకంగా తీసుకున్న మినీ మహానాడు సభ చూస్తే టీడీపీకి అంత సీన్ లేదని స్పష్టమవుతోంది. తమకు వాపు తప్ప బలం లేదనే విషయం టీడీపీ కేడర్కు, ఆ పార్టీ శ్రేణులకు బోధపడుతోంది. బయట ఎంత హంగామా, హడావుడి చేసినా.. జనాల్లోనే కాదు టీడీపీ సానుభూతి పరుల్లో కూడా ఆదరణ లేదని విషయం అర్థమయ్యేలా గత ఏడాది చంద్రబాబు సభ, ఈ ఏడాది మినీ మహానాడు సభ తేటతెల్లం చేసింది. నమ్మినోళ్లను మోసగించడమే తప్ప చేసేందేమీ లేకపోవడం వల్ల ఈ పరిస్థితి దాపురించిందనే వాదన జిల్లా వ్యాప్తంగా వినిపిస్తోంది. ఎందుకీ పరిస్థితి..? ఓట్లేసిన ప్రజల్నే కాదు పార్టీని నమ్ముకుని పనిచేసే నాయకులకు కూడా విలువ లేకపోవడంతోనే టీడీపీకి ఈ దుస్థితి అని ఆ పార్టీ శ్రేణులే పెదవి విరుస్తున్నాయి. అధికారంలో ఉన్నంత సేపు ప్రజల్ని మోసగించాం, కష్టపడి పనిచేసే కేడర్ను నియంతృత్వ పోకడతో ఇబ్బంది పెడుతున్నాం, ఇక సభలకు, సమావేశాలకు జనాలు, పార్టీ శ్రేణులు ఎందుకొస్తారు, ఎవరు తీసుకొస్తారనే వాదన ఆ పార్టీలోనే మొదలైంది. వాస్తవంగా టీడీపీ మినీ మహానాడును భారీ జన సమీకరణతో నిర్వహించాలని జిల్లా నాయకత్వం భావించింది. అందుకు తగ్గ సన్నాహాక సమావేశాలు కూడా నిర్వహించుకుంది. ఎవరెవరు ఎక్కడెక్కడ నుంచి ఎంతమందిని తీసుకురావాలి అనేదానిపై ప్లాన్ చేసుకున్నారు. కానీ, వారి వ్యూహాలు బెడిసికొట్టాయి. ప్రజలే కాదు టీడీపీ సానుభూతి పరులు కూడా ఆసక్తి చూపలేదు. మినీ మహానాడుకు ముఖం చాటేశారు. ప్రజల నుంచి స్పందన లేకపోవడం వల్లే ఈ పరిస్థితి ఏర్పడిందని టీడీపీ శ్రేణులు విశ్లేషించుకుంటున్నాయి. ఎన్ని ఏర్పాట్లు చేసినా, ఎంత హడావుడి చేసినా స్పందన లేకపోవడం చూసి ఇంతవరకు తమకున్నది వాపే తప్ప బలుపు కాదనే విషయం స్పష్టమవుతోందని పలువురు చర్చించుకున్న పరిస్థితి కన్పించింది. గొండు, మామిడిలకు అవమానం శ్రీకాకుళం, పాతపట్నం, ఎచ్చెర్ల నియోజకవర్గాల నుంచి టికెట్ రేసులో ఉన్న గొండు శంకర్, మామిడి గోవిందరావు, కలిశెట్టి అప్పలనాయుడే ప్రస్తుతం పార్టీలో యాక్టివ్గా పనిచేస్తున్నారు. తమకు టిక్కెట్ వస్తుందన్న ఆశతో భారీగా ఖర్చు పెట్టి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. కానీ, పార్టీ అధిష్టానం గానీ, జిల్లా నాయకత్వం గానీ గుర్తించడం లేదు. అయినప్పటికీ ఏదో ఒక రోజున పార్టీ గుర్తించక మానదా అని లక్షలు ఖర్చు పెట్టి, పార్టీ ఫండ్ కింద లక్షలాది రూపాయలిచ్చి ప్రజల్లో ఉంటున్నారు. ఎంతో కొంతమందిని తమవైపు తిప్పుకుని పార్టీ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. వీరిని కూడా జిల్లా నాయకత్వంతో పాటు అధిష్టానం తరచూ అవమానాలకు గురి చేస్తోంది. కరివేపాకులా గొండు శంకర్ను శ్రీకాకుళం నియోజకవర్గంలో తీసిపారేస్తుండగా, పాతపట్నంలో యూజ్ అండ్ త్రో మాదిరిగా పార్టీ కోసం ఖర్చు పెట్టించుకుని మామిడి గోవిందరావును వదిలేస్తున్నారు. ఇక, ఎచ్చెర్లలో కలిశెట్టి అప్పలనాయుడు పరిస్థితి చెప్పనక్కర్లేదు. కాకపోతే, కాశీకి వెళ్లడం వలన కలిశెట్టి అప్పలనాయుడు బుధవారం మినీ మహానాడుకు హాజరు కాలేదు. అదే ఆయనకు అదృష్టమని చెప్పాలి. లేదంటే తీవ్ర అవమానానికి గురయ్యేవారేమో!. వేదికపైకి పిలవరా..? టీడీపీ కార్యాలయంలో నిర్వహించిన మినీ మహానాడుకు అశోక్ గజపతిరాజు, యనమల రామకృష్ణుడు తదితర కీలక నేతలు రావడంతో తమ బలం చూపించి, అధిష్టానం మెప్పు పొందుదామని భావించిన గొండు శంకర్కు, మామిడి గోవిందరావుకు తీవ్ర అవమానమే ఎదురైంది. కార్యక్రమం కోసం భారీగా ప్లెక్సీలను దారి పొడవునా ఏర్పాటు చేశారు. అంతేకాకుండా తమ బలం చూపుకునేందుకు శాయశక్తులా ప్రయత్నించి తమ వెంట వచ్చిన జనాన్ని తీసుకొచ్చారు. కానీ, జిల్లా నాయకత్వం వీరిని కనీసం గుర్తించలేదు. పెద్ద ఎత్తున డబ్బులు ఖర్చు పెట్టి, కార్లతో శ్రేణులను తీసుకొచ్చిన గొండు శంకర్ను, మామిడి గోవిందరావును వేదికపైకి పిలవలేదు. కిందనే కూర్చోమని హుకుం జారీ చేశారు. దీంతో గొండు శంకర్, మామిడి గోవింద వెంట వచ్చిన టీడీపీ శ్రేణులు ఒక్కసారి షాక్కు గురయ్యారు. పార్టీ కోసం కష్టపడుతున్న నాయకులను వాడుకుని వదిలేస్తారా? అని ఒక్కసారిగా వారి అనుచరులు అంతా అక్కడి నుంచి వెళ్లిపోయారు. వచ్చిన కొద్దిపాటి కార్యకర్తలు కూడా వెళ్లిపోవడంతో మినీ మహానాడు సభా ప్రాంగణమంతా ఖాళీ కుర్చీలతో బోసిపోయింది. గొండు శంకర్కు, మామిడి గోవిందరావుకే కాకుండా టీడీపీకి అవమానకరంగా సభ సాగింది. టీడీపీ శక్తియుక్తులన్నీ ఉపయోగించి, జిల్లా పార్టీ కార్యాలయంలో నిర్వహించిన టీడీపీ మినీ మహానాడు సభ ఇది. టీడీపీ పెద్దలంతా హాజరైన సభకు భారీగా జన సమీకరణ చేశారు. జనం అదే ట్రీట్మెంట్ ఇచ్చారు. అధికారంలో ఉండగా మేలు చేయని పార్టీ...మళ్లీ ఏదో చేస్తుందని ఎలా నమ్మగలమంటూ ప్రజలే కాదు ఆ పార్టీ శ్రేణులు కూడా మొఖం చాటేశాయి. దీంతో కుర్చీలన్నీ ఖాళీగా వెలవెలబోయాయి. జనం లేక చాలాసేపు సభను ప్రారంభించలేని పరిస్థితిని టీడీపీ ఎదుర్కొంది. -
సెల్ఫీలు తీసుకుని బాబు, అశోక్ గజపతిరాజు సెల్ఫిష్ లుగా మారారు : రోజా
-
‘అశోక విలాపం’ ఇప్పుడెందుకు.. ఇన్నాళ్లకు నిద్రలేచి నిందలు వేస్తారా?
సాక్షి,రాజమండ్రి(తూర్పు గోదావరి): 'మీరు అధికారంలో ఉన్నారు.. కేంద్ర మంత్రిగా పనిచేశారు.. అప్పుడు కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకించలేకపోయారు.. ఇన్నాళ్ళ తరువాత నిద్రలేచి నిందలు వేస్తారా అశోక్ గజపతి రాజు గారూ..' అంటూ వైఎస్సార్ సీపీ పార్లమెంటరీ చీఫ్ విప్, రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్ రామ్ సూటిగా ప్రశ్నించారు. వైసీపీ ఎంపీల పనితీరు బాగోలేదని అశోక గజపతి రాజు చేసిన వ్యాఖ్యలను ఎంపీ భరత్ దృష్టికి పలువురు విలేకరులు తీసుకువచ్చారు. ఈ అంశంపై స్పందించిన ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘ఆనాడు ఎన్డీఏ ప్రభుత్వంలో అశోక గజపతి రాజు కేంద్ర మంత్రి కదా.. కేబినెట్లో ప్రత్యేక హోదా ఇవ్వం.. స్పెషల్ ప్యాకేజీ ఇస్తాం అన్నప్పుడు ఈ మంత్రి గారు నిద్రపోయారా’ అని ప్రశ్నించారు. ఆ ముంపు మండలాలు ఇస్తేనే సీఎంగా ప్రమాణం చేస్తానన్న చంద్రబాబు ఆనాడు ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తేనే సీఎంగా ప్రమాణం, సంతకం చేస్తానంటే అప్పుడే వచ్చేది కదా' అన్నారు. టీడీపీ చంద్రబాబు వల్ల ఈ రాష్ట్రానికి తీరని అన్యాయం జరిగిందన్నారు. ఆనాడే ప్రత్యేక హోదా ఇవ్వకుంటే ఎన్డీఏ నుండి బయటకు వస్తే.. రాష్ట్రానికి ఈ ఖర్మ ఉండేది కాదన్నారు. మేము అప్పటి టీడీపీ ఎంపీల్లా సన్నాయి నొక్కులు నొక్కడం లేదని, అవకాశం వచ్చినప్పుడల్లా కేంద్ర ప్రభుత్వాన్ని మొహమాటం లేకుండా నిలదీస్తూనే ఉన్నామన్నారు. ఉత్తర కుమారా..లోకేష్ నీకతేంది? ఉత్తర ప్రగల్భాలు పలుకుతున్న ఉత్తర కుమారా.. లోకేష్ అసలు నీ కతేందీ.. ధరలు పెరిగాయని ఈ గందర గోళం ఏమిటని ఎంపీ భరత్ ప్రశ్నించారు. అసలు నీ భాష ఏంటో, నీ బాధ ఏంటో మాకు సరే.. నీ కూడా తిరిగే వారికే అర్థం కాదన్నారు. యువగళమా అది గందరగోళమో అర్థం కావడం లేదన్నారు. నీ కుటుంబ సభ్యులకు అక్షరాభ్యాసం చేసేటప్పుడు అయినా బూతులు రాకుండా చూసుకో.. మొన్నా మధ్య సోషల్ మీడియాలో ఒక పోస్ట్ హల్చల్ అవుతుంటే చూస్తే.. ఏందిరా బాబూ.. ఆ అక్షరాలు దిద్దించడం.. అసలు ఫస్ట్ నువ్వు అక్షరాలు నేర్చుకో అంటూ హితబోధ చేశారు. కాపురం చూస్తే తెలంగాణాలో.. రాజకీయ డ్రామాలు ఆంధ్రప్రదేశ్ లోనా, మీలాంటి వారి చేతిలో ఎలా ఈ రాష్ట్రాన్ని పెడతారని అనుకుంటున్నారో అర్థం కావడం లేదన్నారు. ఏపీలో ప్రజలు చాలా విజ్ఞులని, గతంలో చేసిన మీ పాలన చూశాక మళ్ళా ఈ రాష్ట్ర ప్రజలు అధికారం ఇస్తారని ఎలా అనుకుంటున్నారని ప్రశ్నించారు. నేనెప్పుడూ..సూపర్ స్టార్ నే ఎంపీ రఘురామ రాజు చేసిన వ్యాఖ్యలపై ఎంపీ భరత్ స్పందించారు. నేను ఏక చిత్ర నటుడినైనా.. హీరోనే.. చేయాలనుకుంటే ఎన్ని సినిమాలోనైనా హీరోగా నటిస్తా, ప్రజలను మెప్పిస్తా.. సూపర్ స్టార్ అనిపించుకుంటా అన్నారు. నీకూ ఒక కామెడీ క్యారెక్టర్ ఇప్పిస్తా..గోచీ పెట్టుకుంటావు కదా అంటూ ఎద్దేవా చేశారు. అరటి ఆకు స్టోరీ.. పార్లమెంటరీలో అందరూ నవ్వుకున్నారు.. నోరు అదుపులో పెట్టుకో రఘూ అంటూ ఎంపీ భరత్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. అభివృద్ధిని స్వాగతించండి.. విశాఖలో గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ లో రూ.13లక్షల కోట్ల ఎంఓయూలు వచ్చాయని, ఇవి చూసి ప్రతిపక్షాలు ఏడుస్తున్నాయని ఎంపీ భరత్ వ్యాఖ్యానించారు. రాయలవారి కొలువులో అష్ట దిగ్గజాల మాదిరిగా దేశ విదేశాల నుండి ఎందరో పారిశ్రామిక దిగ్గజాలు వస్తే..అభినందించడం పోయి దీనికి కూడా వారి సహజసిద్ధమైన విమర్శలు చేయడం ప్రతిపక్షాల నైజాం బయటపడిందన్నారు. ఆరోగ్యకరమైన విమర్శలు ప్రగతికి దోహదపడతాయి కానీ..ఇలా ప్రతీ దానికీ విమర్శిస్తే ప్రజల్లో నవ్వులపాలవుతారని ఎంపీ భరత్ అన్నారు. చదవండి: నాడు కూలీ... నేడు ఓనర్! కాదేది అతివకు అసాధ్యం
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
యూనీసెఫ్ ఇండియా నేషనల్ అంబాసిడర్గా 'కరీనా కపూర్'
‘ఆప్’ స్టార్ క్యాంపెయినర్ల లిస్టులో కేజ్రీవాల్ పేరు
టీ20 వరల్డ్కప్ వస్తోంది.. బుమ్రాకు విశ్రాంతి ఇవ్వండి: జాఫర్
హీరామండి సిరీస్లో పెద్ద తప్పులు.. ఇవి కూడా చూసుకోరా?
భూకబ్జాలు చేసేవారికి ఈ యాక్ట్ రావడం ఇష్టముండదు: సజ్జల
ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు.. 25 ఏళ్లలో..
రేపు దేశవ్యాప్తంగా నీట్ పరీక్ష.. ఏపీలో 29 పరీక్షా కేంద్రాలు
Best Pictures Of The Day : ఈ రోజు ఉత్తమ చిత్రాలు (03-05-2024))
లైంగిక ఆరోపణల కేసు.. రేవణ్ణ అరెస్టు
ఆర్సీబీతో మ్యాచ్.. గుజరాత్ జట్టులోకి కొత్త ప్లేయర్! తుది జట్లు ఇవే
తప్పక చదవండి
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
- రాకాసి నర్సుకు 760 ఏళ్ల జైలు శిక్ష : అసలు ఏమైందంటే..!
- బీజేపీలో చేరిన ఢిల్లీ మాజీ కాంగ్రెస్ చీఫ్ అరవిందర్ సింగ్
- నాలుగుసార్లు అబార్షన్ అయిందా? క్లారిటీ ఇచ్చిన స్టార్ హీరోయిన్
- రాయ్బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
- మా భూమి మాది కాకపోతే మరెవరిది రామోజీ..?: మంత్రి బొత్స
- చంద్రబాబు మేనిఫెస్టో మాయలు గుర్తున్నాయా?: సీఎం జగన్
- 2024 లోక్సభ ఎలక్షన్స్.. 9 లక్షల మందికి ఉపాధి!
- Tech Layoffs 2024: షాకింగ్ రిపోర్ట్: ఒక్క నెలలోనే 21 వేల టెకీలకు ఉద్వాసన
Advertisement