-
టీడీపీ అంతమే.. మా పంతం
అనంతపురం క్రైం: ‘టీడీపీ కోసం నా భర్త, బావ ప్రాణాలు కోల్పోయారు. ఎన్నో ఏళ్లుగా ఆ పార్టీకి సేవ చేస్తున్నాం. అయినా మాకు తీవ్ర అన్యాయం చేశారు. డబ్బున్నోళ్లకు సీట్లు అమ్ముకుని కురుబ కులస్తులకు మొండిచేయి చూపారు. ఆ పార్టీని బొంద పెట్టేదాకా విశ్రమించం. రాష్ట్రంలోని కురుబలంతా టీడీపీ ఓటమే ధ్యేయంగా పనిచేస్తాం’ అని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి, కురుబ సంఘం రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు, మాజీ కార్పొరేటర్ బుల్లే శివబాల ధ్వజమెత్తారు. ఆమె మంగళవారం అనంతపురం నగర శివారులోని చెరువుకట్ట శ్మశాన వాటికలో భర్త నాగరాజు సమాధిపై ఉన్న ‘టీడీపీ కార్యకర్త’ అనే నేమ్బోర్డును తొలగించారు. ఆ పార్టీని బొంద పెట్టేదాకా విశ్రమించబోమని భర్త సమాధిపై శపథం చేశారు. టీడీపీ రాష్ట్ర కార్యదర్శి పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ సందర్భంగా ఆమె విలేకరులతో మాట్లాడుతూ.. నలభై ఏళ్లుగా టీడీపీనే కుటుంబంగా..కుటుంబమే పారీ్టగా పని చేశామన్నారు. పార్టీ కోసం తన భర్తతో పాటు బావ పావురాల కిష్టాను కోల్పోయామని చెప్పారు. తనకు అనంతపురం అసెంబ్లీ లేదా పార్లమెంటు అభ్యర్థిగా అవకాశం ఇస్తామని లోకేశ్ పాదయాత్రలో హామీ ఇచ్చారన్నారు. అనంతపురం అర్బన్తో కనీస పరిచయం లేని దగ్గుపాటికి సీటిచ్చిన చంద్రబాబు.. పార్టీ కోసం కష్టపడిన ప్రభాకరచౌదరికి మొండిచేయి చూపారని మండిపడ్డారు. చంద్రబాబు నా వెంట్రుకతో సమానమన్న గుమ్మనూరు జయరాంకు గుంతకల్లు అభ్యర్థిగా, కాంట్రాక్టులు చేసుకునే అమిలినేని సురేంద్రబాబుకు కళ్యాణదుర్గం అభ్యర్థిగా అవకాశం కల్పించి.. చాలా ఏళ్లుగా పార్టీనే నమ్ముకుని ఉన్న తనలాంటి బీసీలకు అన్యాయం చేశారని ధ్వజమెత్తారు. బీసీల పార్టీ అని పదేపదే చెప్పే టీడీపీ అధినేత చంద్రబాబు వాస్తవానికి బీసీలను ఏనాడూ పట్టించుకోలేదని శివబాల విమర్శించారు. 2019 ఎన్నికల్లో వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ముగ్గురు కురుబలకు మంత్రులుగా, ఎమ్మెల్యేలుగా అవకాశం కల్పించారని చెప్పారు. వైఎస్సార్సీపీతోనే బీసీలకు గుర్తింపు దక్కిందని చెప్పారు. -
హీరోయిన్పై చేయి చేసుకున్న డైరెక్టర్.. క్లారిటీ ఇదే!
ఇటీవల యంగ్ హీరోయిన్, మలయాళ భామ మమితా బైజు పేరు వార్తల్లో తెగ వైరలవుతోంది. ఈ ఏడాది ఆమె నటించిన చిత్రం ప్రేమలు బాక్సాఫీస్ వద్ద సూపర్హిట్గా నిలిచింది. మలయాళంలో హిట్ కావడంతో తెలుగులోనూ ఈ సినిమాను విడుదల చేయనున్నారు. ఇదిలా ఉండగా.. ఓ డైరెక్టర్ తనపై అనవసరంగా చేయి చేసుకున్నారంటూ మమితా ఆరోపించినట్లు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. తమిళ దర్శకుడు బాల తెరకెక్కించిన వనంగాన్ సినిమా షూటింగ్ సమయంలో ఈ సంఘటన జరిగినట్లు పలువురు రాసుకొచ్చారు. (ఇది చదవండి: డైరెక్టర్ తిట్టడమే కాదు, కొట్టాడు కూడా!: ప్రేమలు హీరోయిన్) అయితే తాజాగా తనపై వస్తున్న వార్తలపై మమితా బైజు స్పందించింది. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది. నాపై మీడియాలో వస్తున్న వార్తలు అవాస్తమని కొట్టి పారేసింది. బాలతో ‘వనంగాన్’ సినిమా కోసం ఏడాది పాటు పని చేసినట్లు తెలిపింది. కానీ ఆయన చాలా సున్నిత మనస్తత్వం కలిగిన వ్యక్తి అని.. నన్ను ఏ రకంగాను ఇబ్బంది పెట్టలేదని తెలిపింది. అతను నాపై ఎప్పుడూ చేయి చేసుకోలేదని.. కొన్ని కమిట్మెంట్స్ ఉండడం వల్లే ఆ సినిమా నుంచి తప్పుకున్నట్లు మమితా వివరించింది. కాగా.. ప్రేమలు సినిమా తెలుగు రైట్స్ రాజమౌళి తనయుడు కార్తికేయ దక్కించుకున్నారు. ఈ నెల 8న ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. మలయాళంలో ఫిబ్రవరి 9న విడుదలై రూ.50కోట్లకు పైగా వసూలు చేసింది. కాగా.. వణంగాన్ మూవీ నుంచి మమిత బైజుతో పాటు సూర్య కూడా బయటకు వచ్చేశారు. దీంతో దర్శకుడు అరుణ్ విజయ్ను హీరోగా పెట్టి సినిమా పూర్తి చేశాడు. రోషిణి ప్రకాశ్, సముద్రఖని, మిస్కిన్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ మూవీ మార్చిలో విడుదల కానుంది. -
Mamitha Baiju: డైరెక్టర్ చేతిలో చీవాట్లు తిన్న హీరోయిన్ (ఫోటోలు)
-
డైరెక్టర్ తిట్టడమే కాదు, కొట్టాడు కూడా!: ప్రేమలు హీరోయిన్
మలయాళంలో చిన్న చిత్రంగా విడుదలై సూపర్ హిట్ టాక్తో దూసుకుపోతోంది ప్రేమలు మూవీ. ఈ మూవీ తెలుగులోనూ రిలీజ్ చేయాలన్న ఆలోచనలో ఉన్నారు. ఈ విషయాన్ని పక్కన పెడితే ప్రేమలు చిత్రంలో హీరోయిన్గా నటించింది మమిత బైజు. ఈ మూవీ కంటే ముందు వణంగాన్ సినిమాలో నటించే ఛాన్స్ వచ్చింది. అయితే చిత్రీకరణ సమయంలో దర్శకుడు తనను దూషించడంతో పాటు కొట్టాడని వెల్లడించింది హీరోయిన్. ఎక్స్పర్ట్లా యాక్ట్ చేయాలి.. ఓ యూట్యూబ్ ఛానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మమిత బైజు మాట్లాడుతూ.. వణంగాన్ మూవీలో ఓ సంగీతపరికరాన్ని వాయించే సన్నివేశం ఉంటుంది. నేను అప్పటికే ప్రాక్టీస్ చేసిన అమ్మాయిలా నటించాలా? లేదంటే మొదటిసారి దాన్ని ప్రయత్నిస్తున్నట్లు యాక్ట్ చేయాలా? అని అడిగాను. డైరెక్టర్ బాలా.. అనుభవం ఉన్న కళాకారిణిగా నటించమన్నాడు. అప్పుడు నేను డ్రమ్స్ వాయిస్తూ అనుభవం ఉన్న అమ్మాయిగా పాట పాడాలి అంతేగా అనుకున్నాను. కొన్నిసార్లు డైరెక్టర్ తిట్టాడు.. కానీ ఇంతలో ఆయన నన్ను ఆపి నా వెనకాల ఉన్న అమ్మాయిని చూపించి అలా చేయమన్నాడు. ఇంతలోనే రెడీ అన్నాడు. నేను షాకయ్యాను. ఎందుకంటే వాళ్లు ఏం పాడుతున్నారో నాకసలు అర్థం కావట్లేదు. మూడు టేకులయ్యాయి. మధ్యలో కొన్నిసార్లు డైరెక్టర్ తిట్టాడు. అయితే సెట్లో ఎప్పుడైనా కోప్పడతానని, దాన్ని సీరియస్గా తీసుకోవద్దని నాకు ఎప్పుడో చెప్పాడు. కాబట్టి నేను దానికి మానసికంగా రెడీ అయ్యే సెట్లోకి వచ్చాను. కానీ ఆయన దూషణతో ఆగిపోలేదు, కొట్టాడు కూడా! తిట్టడమే కాదు కొట్టాడు కూడా! హీరో సూర్య సర్కు ఇదంతా తెలుసు. వారు ఎంతోకాలంగా కలిసి పని చేస్తున్నారు. వారి మధ్య ఆ అనుబంధం ఉంది. కానీ నాకిదంతా కొత్త కదా' అని చెప్పుకొచ్చింది. కాగా వణంగాన్ మూవీ నుంచి మమిత బైజుతో పాటు సూర్య కూడా బయటకు వచ్చేశారు. దీంతో దర్శకుడు అరుణ్ విజయ్ను హీరోగా పెట్టి సినిమా పూర్తి చేశాడు. రోషిణి ప్రకాశ్, సముద్రఖని, మిస్కిన్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ మూవీ మార్చిలో విడుదల కానుంది. -
వరలక్ష్మి శరత్ కుమార్ ఇంతలా కష్టపడిందా.. రివీల్ చేసిన టాప్ డైరెక్టర్
వరలక్ష్మి శరత్ కుమార్ను ప్రశంసించని వారు ఉండరనే చెప్పాలి. ఆమె స్టార్ వారసురాలైనా ప్రతిభతోనే కథానాయకిగా రంగ ప్రవేశం చేసింది. వరలక్ష్మి శరత్కుమార్ సూపర్ బెల్లీ డ్యాన్సరన్న విషయం చాలామందికి తెలియదు. ఆమె కూడా ఎక్కడా ప్రస్తావించలేదు. తన తండ్రి శరత్ కుమార్ సిఫార్సునే తీసుకోని ఆమె ప్రతిభనే నమ్ముకుని వివిధ రకాల పాత్రల్లో నటిస్తూ బహుభాషా నటిగా రాణిస్తోంది. ఆమెను దర్శకుడు బాలా తనకు నచ్చిన నటి అని ప్రశంసించడం విశేషం. సేతు, నందా, శివ పుత్రుడు వంటి పలు సంచలన విజయాలను సాధించిన చిత్రాల దర్శకుడు బాలా. ఈయన ప్రస్తుతం కోలీవుడ్లో వణంగాన్ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఇందులో మొదట నటుడు సూర్య కథానాయకుడిగా నటించారు. ఆ తర్వాత అనివార్య కారణాలవల్ల ఆయన చిత్రం నుంచి వైదొలగడంతో నటుడు అరుణ్ విజయ్ ఆ పాత్రను పోషిస్తున్నారు. ఈ చిత్ర షూటింగ్ పూర్తి చేసుకుని ప్రస్తుతం నిర్మాణ కార్యక్రమాలు జరుగుతున్నాయి. దర్శకుడు బాలా ఇటీవల ఒక భేటీలో మాట్లాడుతూ తాను చాలా తక్కువ మంది కథానాయకిలతోనే చిత్రాలు చేశానని, అందులో తనకు నచ్చిన నటి వరలక్ష్మి శరత్ కుమార్ అని పేర్కొన్నారు. తాను ఇంతకుముందు తెరకెక్కించిన తారై తప్పట్టై చిత్రం షూటింగ్లో ఘనంగా నటించిన ఆర్కే సురేష్కు నటి వరలక్ష్మి శరత్ కుమార్కు మధ్య జరిగిన సన్నివేశంలో ఆమె ఒంటి ఎముక చిట్లినా లెక్కచేయకుండా మళ్లీ మళ్లీ టేక్ చెప్పినా నటించారని చెప్పారు. అసలు ఆర్కే సురేష్ ఆమైపె బలంగా పడాలన్నారు. షార్ట్ సరిగ్గా రావాలని తాను గట్టిగా అరవడంతో ఆర్కే సురేష్ ఆమైపె బలంగానే పడ్డారన్నారు. అలా తొలి షాట్ లోనే వరలక్ష్మి శరత్ కుమార్ ఒంటి ఎముక చిట్లిందన్నారు. ఆమె తనతో ఆ విషయాన్ని చెప్పలేదన్నారు. తాను పర్ఫెక్షన్ కోసం మరో రెండు మూడు టేకులు చేశానన్నారు. ఆమె కాదనకుండా నటించారని చెప్పారు. ఆ తర్వాత ఆమె ఊరికి తిరిగి వచ్చిన తర్వాత తదుపరి షెడ్యూల్ చిత్రీకరిస్తున్నప్పుడు తన ఒంటి ఎముక చిట్లినదానికి సంబంధించిన ఎక్స్రేను చూపించడంతో ఇది నిజమా అని అడిగానన్నారు. దాంతో ఆమె నిజమేనని చెప్పి చాలా కష్టపడినట్లు చెప్పారన్నారు. అలా ఆమె కఠిన శ్రమజీవి అని దర్శకుడు బాలా పేర్కొన్నారు. -
నా అనుకున్న వాళ్లే హీరో విక్రమ్ను తొక్కేశారా.. ఆయనకు జరిగిన నష్టం ఏంటి?
సినీ పరిశ్రమలో ఎందరో హీరోలు ఉన్నారు. వారిలో ఎలాంటి బ్యాగ్రౌండ్ సపోర్ట్ లేకుండా ఎదిగిన వారు కూడా ఉన్నారు. అలాంటి అరుదైన కథానాయకుల్లో కోలీవుడ్ స్టార్ హీరో విక్రమ్ ఒకరు. అయితే కెరీర్ ప్రారంభంలో తమిళ చిత్రాలతో పాటు నేరుగా తెలుగు మూవీస్లోనూ యాక్ట్ చేశారు విక్రమ్. విభిన్నమైన కథలతో, పాత్రలతో తనదైన ముద్ర వేసుకున్నారు. ప్రయోగాలు చేయడంలో తనకు తానే సాటి అని నిరూపించుకున్నారు. పేరుకు కోలీవుడ్ హీరో అయినప్పటికీ దాదాపు అన్ని భాషల్లో ఆయనకు అభిమానులు ఉన్నారు. అయితే విక్రమ్ సినిమా కెరీర్ ఆరంభం సవాళ్లతో కూడుకున్నది. విక్రమ్ను దురదృష్టవంతుడని కూడా అప్పట్లో కోలీవుడ్లో అనేవారు. విక్రమ్ కెరీర్ ప్రారంభంలో ఒకదాని తర్వాత ఒకటిగా ఏడు సినిమాలు పరాజయం చెందాయి. దీంతో విక్రమ్ను సినీ ప్రపంచం దురదృష్టవంతుడిగా ముద్ర వేసింది. కానీ 1999లో బాలా దర్శకత్వంలో వచ్చిన సేతు సినిమాతో విక్రమ్ జీవితం మారిపోయింది. వంద రోజుల పాటు హౌస్ఫుల్ కలెక్షన్స్తో కొనసాగింది. సేతు సినిమాతో తమిళనాట కొత్త ఉదయానికి సాక్షిగా విక్రమ్ నిలిచాడు. అక్కడి నుంచి విక్రమ్ వెనక్కి తిరిగి చూడలేదు. మేనమామతో విక్రమ్కు కష్టాలు విక్రమ్ సినీ ఇండస్ట్రీలో కష్టాలు పడుతున్నప్పుడు ఆయన కజిన్, హీరో ప్రశాంత్ కోలీవుడ్లో సూపర్స్టార్గా కొనసాగుతున్నాడు. అతను నటించిన ప్రతి సినిమా సూపర్ హిట్టే. సౌత్ ఇండియాలోని అన్ని భాషల్లోకి ఆయన సినిమాలు విడుదల అయ్యేవి. హీరో ప్రశాంత్ తండ్రి త్యాగరాజన్ విక్రమ్కి సొంత మేనమామ అవుతాడు. ఆయనకు తమిళ చిత్రసీమలో ఒక నటుడు, డైరెక్టర్, నిర్మాతగా మంచి గుర్తింపు ఉంది. కానీ త్యాగరాజన్ తన మేనళ్లుడు అయిన విక్రమ్కు ఎలాంటి సహాయం చేయడానికి ముందుకు రాలేదు. ప్రశాంత్ కూడా విక్రమ్ గురించి ఎక్కడా మాట్లాడకుండా అప్పట్లో దూరం పాటించాడు. విక్రమ్ కూడా వారి గురించి ఎక్కడా మాట్లాడలేదు. విక్రమ్ నటించిన ఏడు సినిమాలు వరుసగా పరాజయం పాలయ్యాయి. దీంతో విక్రమ్ అన్ లక్కీ యాక్టర్ అనే ముద్ర పడింది. విక్రమ్తో సినిమా చేస్తే నష్టపోతామని అందరూ అనుకున్నారు. అలాంటి సమయంలోనే దర్శకుడు బాలాను విక్రమ్ కలిశాడు. విక్రమ్ హీరోగా ఆయన 'సేతు' సినిమాను తెరకెక్కించాడు. అయితే సినిమాను కొనుగోలు చేసేందుకు డిస్ట్రిబ్యూటర్లు సిద్ధంగా లేరు. చివరకు చిత్ర నిర్మాతలు తక్కువ మొత్తానికే ఇచ్చేశారు. వారికి థియేటర్లు కూడా తక్కువగానే దొరికాయి. సినిమా భారీ హిట్ అయినా నిర్మాతలు అంతగా లాభపడలేదు. దీనికి విక్రమ్ కూడా కారణమని చెప్పారు. అతనికి ఇండస్ట్రీలో బ్యాక్గ్రౌండ్ ఉన్నా కూడా వారి పేర్లు ఎక్కడా ఉపయోగించుకోకుండా ఉండటం అని పలువురు చెప్పుకొచ్చారు. విక్రమ్ మామ కొడుకు అయిన ప్రశాంత్ అప్పట్లో పెద్ద స్టార్. కానీ ప్రశాంత్ మాత్రం విక్రమ్ ఎవరో తనకు తెలియనట్లు ఉండేవాడు. సేతు సినిమాకు మరిన్నీ థియేటర్లు కావాలని నిర్మాతలు మాట సాయం కోరినా ప్రశాంత్ స్పందించలేదట. దీంతో ఇరువురి కుటుంబాల మధ్య ఏదో ఒక గొడవ జరిగిందని తర్వాత అందరూ భావించారు. అందుకే విక్రమ్ కోసం త్యాగరాజన్, ప్రశాంత్ ఎలాంటి రికమెండేషన్ చేయలేదని పలువురు విశ్లేషకులు ఇప్పటికీ చెబుతారు. విక్రమ్కు వచ్చిన సినిమా అవకాశాలను కూడా రానీయకుండా త్యాగరాజన్ ప్రయత్నించినట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. దీంతో విక్రమ్ అవకాశాల కోసం ఎంతగానో కష్టపడాల్సి వచ్చింది. చివరకు విక్రమ్ తన లక్ష్యాన్ని చేరుకుని సూపర్ స్టార్ అయ్యాడు. కానీ ఈరోజు హీరో ప్రశాంత్ అంటే చాలామందికి తెలియని స్థితిలో ఆయన ఉన్నారని చెప్పవచ్చు. ఇప్పటికీ హీరో విక్రమ్ తన మేనమామ కుటుంబంతో ఎలాంటి సంబంధం లేకుండానే ఉన్నారు. ఒకప్పుడు రాబోయే తరానికి సూపర్ స్టార్ అని అనుకున్న ప్రశాంత్ ఇప్పుడు సినిమా ప్రపంచంలోనే లేరు. అప్పట్లో ఆయనతో పాటు ఎంట్రీ ఇచ్చిన అజిత్, విజయ్, విక్రమ్ నేడు సూపర్ స్టార్లుగా ఎదిగారు. చియాన్ విక్రమ్ ఎప్పటికీ తమిళ సినిమా సూపర్ స్టార్. పొన్నియన్ సెల్వన్ విజయంతో జోరుమీద ఉన్న ఆయన.. త్వరలో తంగళన్, ధ్రువనక్షత్రం చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. -
జనసేన బి ఫారం చెల్లదట..!
-
ఆస్పత్రిలో చేరిన ప్రముఖ నటుడు
ఇటీవల సినీ ఇండస్ట్రీలోని ప్రముఖులు రోగాల బారిన పడటం కలవరపెడుతోంది. ఇప్పటికే పలువురు నటీనటులు ప్రాణాంతక వ్యాధుల బారిన పడి కోలుకున్నారు. తాజాగా మరో నటుడు అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరారు. కాలేయ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న మలయాళ నటుడు బాలా కేరళలోని కొచ్చిలో ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. అతనికి కాలేయ మార్పిడి చేయాలని వైద్యులు సూచించారు. మలయాళంలో పలు చిత్రాల్లో క్యారెక్టర్ రోల్స్ నటించారు బాలా. బాలా ప్రముఖ తమిళ చిత్రనిర్మాత శివ సోదరుడు. అతను ప్రస్తుతం సూర్య చిత్రంతో బిజీగా ఉన్నాడు. ఆస్పత్రికి వెళ్లిన ప్రముఖులు ఉన్ని ముకుందన్, బాదుషా, వినుషా మోహన్ అతని ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ విషయాన్ని నిర్మాత ఎన్ఎమ్ బాదుషా తన ఫేస్బుక్ ఖాతాలో పంచుకున్నారు. బాలా చివరిసారిగా అనుప్ పందళం దర్శకత్వం వహించిన షెఫీక్కింటే సంతోషం చిత్రంలో నటించారు. గతేడాది విడుదలైన ఈ చిత్రంలో బాలా అమీర్ అనే పాత్రలో కనిపించారు. అనూప్ పందళం స్వయంగా రాసిన ఈ చిత్రంలో ఉన్ని ముకుందన్ ఒక ముఖ్యమైన పాత్రలో కనిపించారు. అలాగే కొన్ని తమిళ చిత్రాలలో కూడా పనిచేసిన బాలా.. మలయాళ చిత్ర పరిశ్రమలో బలంగా పునరాగమనం చేయాలని భావిస్తున్నారు. బిలాల్, స్థలం, మై డియర్ మచాన్స్ సినిమాలతో బాలా ఫేమ్ సంపాదించారు. -
‘బలగం’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫోటోలు)
-
బలగం మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)
-
ఘనంగా బిగ్బాస్ ఫేమ్ బాలాదిత్య కూతురి నామకరణం.. ఫోటోలు వైరల్
-
ఊహించని ట్విస్ట్ ఇచ్చిన సూర్య.. ఆ సినిమా నుంచి ఔట్
హీరో సూర్య–దర్శకుడు బాలది హిట్ కాంబినేషన్. ఈ ఇద్దరి కలయికలో వచ్చిన ‘నందా’, ‘పితామగన్’ (శివపుత్రుడు) మంచి విజయాన్ని సొంతం చేసుకున్నాయి. అందుకే 19 ఏళ్ల తర్వాత మళ్లీ బాల దర్శకత్వంలో సూర్య హీరోగా సినిమా ఆరంభమైనందుకు అభిమానులు ఆనందపడ్డారు. ‘వణంగాన్’ టైటిల్తో ఈ చిత్రం ఆరంభమైంది. అయితే ఊహించని ట్విస్ట్ ఇచ్చారు సూర్య–బాల. ఈ చిత్రం నుంచి సూర్య తప్పుకున్నారు. ఈ విషయం గురించి బాల ఓ లేఖ విడుదల చేశారు. ‘‘వణంగాన్’ కథలో చేసిన మార్పుల వల్ల ఈ కథ సూర్యకి తగ్గట్టుగా ఉంటుందా? అనే ఫీలింగ్ కలిగింది. నా మీద, ఈ కథ మీద సూర్య పూర్తి నమ్మకంతో ఉన్నారు. అంత గౌరవం, ప్రేమ చూపించే నా తమ్ముడికి చేదు అనుభవం ఎదురు కాకుండా చూడటం ఒక అన్నయ్యగా నా బాధ్యత. అందుకే మేమిద్దరం (సూర్య–బాల) ఒక అవగాహనకు వచ్చాం. ఈ సినిమా నుంచి తను (సూర్య) తప్పుకోవడం కరెక్ట్ అని నాకు, సూర్యకి అనిపించింది. ఇందుకు సూర్య బాధపడ్డారు. భవిష్యత్తులో మేం కలిసి సినిమా చేస్తాం’’ అని ఆ లేఖలో పేర్కొన్నారు బాల. కాగా ‘వణంగాన్’ పనులు కొనసాగుతాయని బాల స్పష్టం చేశారు. అయితే సూర్య స్థానంలో ఏ హీరోని తీసుకోవాలనుకుంటున్నారో బయటపెట్టలేదు. -
విడాకులు తీసుకున్న స్టార్ డైరెక్టర్... 18 ఏళ్ల బంధానికి ముగింపు!
చిత్ర పరిశ్రమలో విడాకుల పరంపర కొనసాగుతూనే ఉంది. ఇప్పటికే సమంత, ధనుష్, అమీర్ ఖాన్తో పాటు పలువురు సీనీ ప్రముఖులు విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించి అభిమానులకు షాకివ్వగా.. తాజాగా మరో స్టార్ డైరెక్టర్ భార్యతో లీగల్గా విడిపోయినట్లు ప్రకటించారు. కోలీవుడ్ దర్శకుడు బాలా తన భార్య మధుమలార్కు డివోర్స్ ఇచ్చాడు. దాదాపు 18 ఏళ్ల పాటు సాగిన వీరి వివాహ బంధానికి నేటితో తెరపడింది. గత నాలుగేళ్లుగా బాల, మధుమలార్ విడి విడిగా ఉంటున్నారు. మ్యూచువల్ విడాకులకు అప్లై చేసిన ఈ జంటకు తాజగా ఫ్యామిలీ కోర్టు విడాకులు మంజూరు చేసింది. వీరికి ఒక కూతురు ఉంది. ఇక దర్శకుడి బాల.. తమిళ్లోనే కాకుండా తెలుగులోనూ సుపరిచితుడు. ఆయన దర్శకత్వం వహించిన శివపుత్రుడు, శేషు, వాడు- వీడు చిత్రాలు తెలుగులో కూడా భారీ విజయాన్ని అందుకున్నాయి. అలాగే 2008లో బాల 'నాన్ కాదవుల్' చిత్రానికి ఉత్తమ దర్శకుడిగా జాతీయ అవార్డు అందుకున్నారు. తాజాగా సూర్యతో ఓ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. -
సీక్రెట్గా రెండో పెళ్లి, రిసెప్షన్ ఫొటో వదిలిన నటుడు
దర్శకుడు శివ సోదరుడు, పాపులర్ నటుడు బాలా ఇటీవలే ఓ ఇంటివాడయ్యాడు. ఎలిజబెత్ ఉదయన్ అనే వైద్యురాలిని సీక్రెట్గా రెండో పెళ్లి చేసుకున్నాడు. ఓనం పండుగనాటి నుంచే వీరిద్దరూ పెళ్లి పీటలెక్కుతున్నట్లు వార్తలు వచ్చాయి. తాజాగా ఈ రూమర్లకు ఫుల్స్టాప్ పెడ్తూ తన భార్యను అభిమానులకు పరిచయం చేశాడీ నటుడు. రిసెప్షన్లో తన భార్యతో కలిసి దిగిన ఫొటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. దీంతో అభిమానులు ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. కాగా బాలా 2010లో ప్లేబ్యాక్ సింగర్ అమృత సురేశ్ను పెళ్లాడాడు. కానీ వీరిద్దరి మధ్య మనస్పర్థలు రావడంతో 2019లో విడిపోయారు. వీరికి అవంతిక అనే కూతురు కూడా ఉంది. ఇక బాలా సినిమాల విషయానికి వస్తే అతడు రజనీకాంత్ హీరోగా నటిస్తున్న 'అన్నాత్తే' చిత్రంలో ఓ ముఖ్య పాత్రలో కనిపించనున్నాడు. View this post on Instagram A post shared by Actor Munna Simon (@munnasimon) View this post on Instagram A post shared by Actor Munna Simon (@munnasimon) -
ఫెయిర్ అండ్ యమి
ఇంట్లో టీవీ పెడితే యమి గౌతమ్ కనిపిస్తుంది. ఫెయిర్ అండ్ లవ్లీ యాడ్ లేని రోజు ఉంటుందా? యమి ఆ క్రీమ్ పూసుకుని మెరిసే సౌందర్యవతి. ఫెయిర్ అండ్ లవ్లీ మోడల్గా మాత్రమే కాదు నటిగా కూడా ఆమె బాలీవుడ్లో పై వరుసలో ఉంది. ఈ అందమైన జీవితంలోనూ సవాళ్లు ఉంటాయి. ప్రశ్నలు ఉంటాయి. వాటిని అధిగమిస్తూ యమి విజేతగా నిలిచింది. కొన్నేళ్ల క్రితం ఉదయం నాలుగ్గంటలకు యమి గౌతమ్ ఫోన్ మోగింది. చేసింది ఒక ప్రముఖ పత్రిక నుంచి జర్నలిస్ట్. ‘ఏంటి?’ అని అడిగింది యమి. ‘మీ మీద ట్రోలింగ్ జరుగుతోంది.. దీనికి మీ సమాధానం ఏమిటి?’ అని అడిగాడు జర్నలిస్ట్. అప్పటికి ట్రోలింగ్ అంటే ఏమిటో యమికి తెలియదు. ‘ట్రోలింగ్ అంటే?’ అని అడిగింది. ‘మిమ్మల్ని తిట్టి పోస్తున్నారు’ అన్నాడతను. ‘ఎందుకు?’ అని అడిగింది నెర్వస్గా. ఇంతలో ఫోన్ కట్ అయ్యింది. అభయ్ డియోల్ బాలీవుడ్లో పేరున్న నటుడు. తన ఫేస్బుక్ పేజిలో ఒక పోస్ట్ పెట్టాడు. ‘సినిమా తారలు అనవసరంగా కలరిజమ్ను ప్రచారం చేస్తున్నారు. తెల్లరంగే గొప్పది అనే ఈ ప్రచారం ఆ రంగు లేని వారందరినీ అవమానించే స్థాయిలో ఉంది. షారుక్ఖాన్, ఐశ్వర్యరాయ్, సోనమ్కపూర్, షాహిద్ కపూర్, జాన్ అబ్రహమ్... వీళ్లంతా తెల్లగా చేసే క్రీములంటూ ఫెయిర్నెస్ క్రీములను ప్రమోట్ చేస్తున్నారు. ఇది కరెక్ట్ కాదు’ అని పోస్ట్ పెట్టాడు. ఈ వరుసలో యమి పేరు కూడా ఉంది. ఎందుకంటే ఫెయిర్నెస్ క్రీముల్లో ఫెయిర్ అండ్ లవ్లీ అగ్రస్థానంలో ఉంది. దాని బ్రాండ్ అంబాసిడర్ యమి. దాంతో సోషల్ మీడియాలో యమి మీద విమర్శలు వెల్లువెత్తాయి. భిన్నమైన రంగులు ఉన్నవారిని న్యూనత పరిచే ఇటువంటి యాడ్స్లో నటించేవారికి కనీస ఆలోచన లేదని చాలామంది రాశారు. ఇలా జరుగుతుందని యమి ఊహించలేదు. దానికి ఎలా రియాక్ట్ కావాలో కూడా తెలియదు. ఆ రోజంతా వెక్కివెక్కి ఏడుస్తూ కూచుంది. అసలు ఇందుకేనా ఈ రంగంలోకొచ్చింది? ∙∙ యమికి పుస్తకం తప్ప అద్దం తెలియదు. పుస్తకమే తన అద్దం అన్నట్టుగా ఎప్పుడూ అందులోనే తల దూర్చి ఉండేది చిన్నప్పుడు. వాళ్లది హిమాచల్ ప్రదేశ్లోని బిలాస్పూర్. తండ్రి ముకేష్ గౌతమ్ చిన్నస్థాయి పంజాబీ సినిమాల దర్శకుడు. ఆయన పంజాబీ. తల్లి అంజలి గౌతమ్ హిమాచల్ కొండజాతి మూలాలున్న స్త్రీ. యమి గౌతమ్ బాల్యం బిలాస్పూర్లో గడిచినా హైస్కూల్, కాలేజ్ చండీగఢ్లోనే సాగాయి. చిన్నప్పటి నుంచి చదువు మీదే ఆమె ధ్యాస. ఐ.ఏ.ఎస్ చేయాలనేది కల. స్కూలు సొంతదే అయినా ఆ స్కూల్లో ఆమె చాలా బిడియంగా తిరుగుతూ ఉండేది. నలుగురి ఎదుటకు రావడానికి చాలా సంకోచించేది. వాళ్ల తాతను ఇంప్రెస్ చేయడానికి ఒకసారి టీచర్లు యానివర్సరీ డేలో ఏదో కవిత చదివించాలని ప్రయత్నిస్తే యమి స్కూల్ వదిలి ఇంటికి పారిపోయింది. ఇలాంటి అమ్మాయిలకు చదువే కరెక్ట్ అని అనుకున్నారు అందరూ. కాని విధి వేరేగా ఆమె ప్రయాణాన్ని నిశ్చయించింది. అలా స్కూల్ వదిలి బిడియంతో పారిపోయిన అమ్మాయి ఇవాళ వందలాది మంది చూస్తూ ఉండగా కెమెరా ముందు డైలాగ్ చెప్పగలుగుతోంది. ఇది వింత కాకపోతే మరేమిటి? ∙∙ యమి లా డిగ్రీలో చేరింది. ఫైనలియర్లో ఉంది. ఆ రోజు ముంబైలో ఉండే బంధువులు చుట్టపు చూపుగా వాళ్లింటికి వచ్చారు. అందులో ఒకామె టీవీ రంగంలో పని చేసింది. ఆమె యమిని చూసిన మరుక్షణం నుంచి నువ్వు టీవీలో పనిచెయ్ టీవీలో పనిచెయ్ అని వెంటబడింది. ‘అమ్మా... ఏమిటి ఈ నస’ అని కిచెన్లోకి వచ్చి విసుక్కుంది యమి, తల్లితో. కాని ఆ వచ్చినామె వద్దన్నా యమి ఫొటో తీసుకుని ముంబై వెళ్లింది. ఆ తర్వాత తనకు తెలిసిన ప్రొడక్షన్ హౌస్లన్నింటిలో చూపించింది. ఒక ప్రొడక్షన్ హౌస్ వారు యమి ఫొటోను చూసి ‘వెంటనే రమ్మనమనండి’ అని అన్నారు. ఇప్పుడు నిర్ణయం తీసుకోవాలి. వెళ్లాలా వద్దా. ‘ఏమో.. ట్రై చేయరాదూ’ అని తల్లిదండ్రులు అన్నారు. అలా తన 20వ ఏట యమి ముంబైలో అడుగుపెట్టింది. వెంటనే రెండు సీరియల్స్లో పాత్రలు దొరికాయి. ‘కలర్స్’ టీవీలో ప్రసారమైన ‘యే ప్యార్ నా హోగా కమ్’ సీరియల్తో యమి స్టార్ అయిపోయింది. ఆ వెంటనే ‘ఫెయిర్ అండ్ లవ్లీ’ ఆమెను తన మోడల్గా ఎంపిక చేసుకుంది. కన్నడ రంగం నుంచి తొలిగా ‘ఉల్లాస ఉత్సాహ’ సినిమాలో హీరోయిన్ ఆఫర్ వచ్చింది. ఇది మన తెలుగు ‘ఉల్లాసంగా ఉత్సాహంగా’కు రీమేక్. హీరో కన్నడ స్టార్ గణేష్. అయితే ఆమెకు బాలీవుడ్లో పేరు రావాలి. అక్కడ హిట్ కావాలి. ‘వికీ డోనర్’ ఆ అవకాశం ఇచ్చింది. దర్శకుడు సూజిత్ సర్కార్ హీరో జాన్ అబ్రహమ్ను వొప్పించి అతడు నిర్మాతగా ఒక చిన్న సిన్మాకు దర్శకత్వం వహించే చాన్స్ కొట్టాడు. కథాంశం కొత్తది. ప్రత్యుత్పత్తి కేంద్రాలకు ‘వీర్యాన్ని డొనేట్ చేస్తూ’ జీవించే కుర్రాడికథ అది. ఆ పాత్రకు కొత్తవాడైన ఆయుష్మాన్ ఖురానాను తీసుకున్నాడు. అతడి ప్రియురాలిగా యమి గౌతమ్ను తీసుకున్నాడు సూజిత్. ‘వికీ డోనర్’ పెద్ద హిట్. ఆ వెంటనే తెలుగులో అల్లుశిరీష్తో ‘గౌరవం’, తరుణ్తో ‘యుద్ధం’ సినిమాలు చేసింది యమి. అవి సరిగ్గా ఆడలేదు. అజయ్ దేవగణ్తో చేసిన ‘యాక్షన్ జాక్సన్’ కూడా సత్ఫలితం ఇవ్వలేదు. కాని వరుణ్ ధావన్తో చేసిన ‘బద్లాపూర్’ సూపర్ డూపర్ హిట్ అయ్యింది. ఇప్పుడు ఏకంగా హృతిక్ రోషన్ సరసన నటించే చాన్స్ వచ్చింది. ‘కాబిల్’ కూడా ప్రేక్షకులు హిట్ చేశారు. ఇటీవల ఆమె వికీ కౌశల్తో చేసిన ‘ఉరి: ద సర్జికల్ స్ట్రయిక్’, ఆయుష్మాన్ ఖురానాతో చేసిన ‘బాలా’ సూపర్ డూపర్ హిట్స్ అయ్యాయి. ఉరిలో ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్గా, బాలాలో అమాయకమైన స్మాల్టౌన్ గర్ల్గా యమి తన ముద్ర వేసింది. ఇప్పుడు ఆమె బాలీవుడ్లో ఎదిగిన నటి. స్టార్ పెర్ఫార్మర్. పెద్ద బేనర్లు, ఆమె చేస్తే బాగుండు అనుకునే స్క్రిప్ట్లు ఆమెకోసం వెయిట్ చేస్తున్నాయి. ∙∙ ‘తెల్లరంగు గొప్పది, నల్లరంగు తక్కువది అనే భావన తప్పు. తెల్లరంగు ఉన్నవారికే అవకాశాలు వస్తాయి, ఉద్యోగాలు వస్తాయి, వాళ్లనే అందరూ అభిమానిస్తారు అని ప్రచారం చేయడం కూడా తప్పు. గతంలో ఆ ధోరణిలో యాడ్స్ వచ్చేవేమో. ఇప్పుడు మన సౌందర్యాన్ని మనం మరింత పెంచుకోవడం ఎలా అనే పాయింట్తో యాడ్స్ వస్తున్నాయి. అలాంటి యాడ్స్లో చేయడం తప్పు కాదు. నేను అలాంటి యాడ్స్నే చేస్తున్నానని గట్టిగా చెప్పగలను. అయినా నేను ఒక స్వతంత్రురాలిని. వేరొకరి ఆలోచనలు, భావధారను బట్టి నేను నా నిర్ణయాలను మార్చుకోను. ఏది సరైనదైతే అదే నేను చేస్తాను’ అని తన మీద వచ్చిన విమర్శలకు జవాబు ఇచ్చింది యమి ఆ తర్వాత. ∙∙ యమికి తన చెల్లెలు సురీలీ గౌతమ్తో, తమ్ముడు ఓజస్తో ఎక్కువ అటాచ్మెంట్ ఉంటుంది. తనకు షూటింగ్ లేకపోతే వారితోనే సమయాన్ని గడుపుతుంది. ఆమెకు పోల్ డాన్స్ తెలుసు. ప్రొఫెషనల్గా ఆ డాన్స్ను నేర్చుకుంది. మనం అనుకునే రంగం వేరు కావచ్చు, ప్రవేశించే రంగం వేరు కావచ్చు... కాని ఏ రంగంలో ఉన్నా ఆ రంగంలో చిత్తశుద్ధితో ప్రయత్నిస్తే గెలుపు అసాధ్యం కాదు అంటుంది యమి. ఆమె తమ బాహ్యసౌందర్యంతో పాటు మానసిక సౌందర్యాన్ని కూడా మెరుగు పెట్టుకుంటున్నదని ఆమె ఎదుగుదల, ఆలోచనలు, వ్యాఖ్యలు తెలియచేస్తున్నాయి. ఆమెను భవిష్యత్తులో మరింత అందంగా మనం చూడబోతున్నాం. – సాక్షి ఫ్యామిలీ -
‘రూ వంద కోట్ల క్లబ్ చేరువలో బాలా’
ముంబై : ఆయుష్మాన్ ఖురానా నటించిన బాలా బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు రాబడుతోంది. మల్టీప్లెక్స్ల్లో ఈ మూవీకి మంచి ఆదరణ దక్కుతోంది. శనివారం రూ 6 కోట్లు కలెక్ట్ చేసిన బాలా మొత్తం వసూళ్లు రూ 82.73 కోట్లు రాబట్టగా ఆదివారం రూ 90 కోట్ల మార్క్ దాటి రూ 100 కోట్ల క్లబ్కు చేరువవుతుందని బాలీవుడ్ ట్రేడ్ విశ్లేషకులు తరణ్ ఆదర్శ్ ట్వీట్ చేశారు. గత వారం విడుదలైన బాలా పాజిటివ్ రివ్యూలతో క్రమంగా వసూళ్లను కొల్లగొడుతూ నిలకడగా సాగుతోంది. బట్టతల కష్టాలను ఎదుర్కొనే వ్యక్తిగా ఆయుష్మాన్ ఖురానా అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పించగా, భూమి పెడ్నేకర్, యామి గౌతమ్లు సైతం తమ నటనతో ఆకట్టుకున్నారు. -
మా మధ్య మంచి కెమిస్ట్రీ ఉంది: హీరోయిన్
రియాలిటీ షోలతో, రేడియో జాకీగా ప్రత్యేక గుర్తింపు దక్కించుకున్న ఆయుష్మాన్ ఖురానా బాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చి వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. తొలి సినిమా ‘విక్కీ డోనర్’ నుంచి తాజాగా విడుదలైన బాలా మూవీ వరకు సమకాలీన సామాజిక సమస్యలే ఇతివృత్తంగా సాగే కథలు ఎంచుకుంటూ విలక్షణ నటుడిగా పేరొందాడు. గతేడాది బదాయీ హో, అంధాధున్లతో హిట్లు ఖాతాలో వేసుకున్న ఆయుష్మాన్.. తాజాగా బాలాతో 100 కోట్ల క్లబ్లో చేరేందుకు సిద్ధమయ్యాడు. దీంతో మూవీ యూనిట్ సంతోషంలో మునిగిపోయింది. ఈ క్రమంలో బాలా సినిమాలో అతడికి జోడీగా కనిపించిన భూమీ ఫడ్నేకర్ ఆయుష్మాన్తో కలిసి నటించడం తన అదృష్టంగా భావిస్తానన్నారు. ఓ ప్రముఖ వెబ్సైట్తో భూమి మాట్లాడుతూ.. ‘ తెరపై మా జంట చూడముచ్చటగా ఉంటుందని ఎంతో మంది కితాబిచ్చారు. మా మధ్య మంచి కెమిస్ట్రీ బాగుంటుందని చెప్పారు. అందుకేనేమో మూడు సినిమాల్లో జంటగా కనిపించినా ఇప్పటికీ మాపై ప్రేమను కురిపిస్తూనే ఉన్నారు. తనతో కలిసి పనిచేయడం అదృష్టంగా భావిస్తున్నా. సామాజిక సమస్యల నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాల్లో భాగం కావడం మరో విశేషం. వీటి ద్వారా ఎంతోమంది ఎదుర్కొనే సమస్యలను వినోదం కలగలిపి ప్రేక్షకుల ముందుకు తీసుకురావడంలో సఫలమయ్యాం’ అని పేర్కొన్నారు. కాగా భూమి ఫడ్నేకర్ తొలి సినిమా దమ్ లగా కే హైసాలో ఆయుష్మాన్ హీరో అన్న సంగతి తెలిసిందే. బాడీ షేమింగ్ కథాంశంగా తెరకెక్కిన ఈ సినిమా విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఇక ఆ తర్వాత వీరిద్దరూ కలిసి శుభ్ మంగళ్ సావధాన్(పురుషుల్లో సంతానలేమి ఇతివృత్తంగా), బాలా (బట్టతల కారణంగా యువకుడు పడే ఆవేదన ప్రధానాంశంగా) సినిమాల్లో నటించిన సంగతి తెలిసిందే. -
బట్టతల వ్యక్తిని పెళ్లి చేసుకుంటా: నటి
పెళ్లనగానే అమ్మాయి తరపు బంధువులు.. ముందుగా అబ్బాయికి ఏమైనా ఉద్యోగం, ఆస్తిపాస్తులు ఉన్నాయా అని ఒకటికి రెండుసార్లు చూస్తారు. అయితే ముందూవెనకా ఎంతున్నా తలపై కాసిని వెంట్రుకలు లేకపోతే మాత్రం పెళ్లి కుదరదు అని తేల్చి చెప్పేస్తున్నారు కొంతమంది అమ్మాయిలు. బట్టతల కనిపించకుండా ఉండటం కోసం అబ్బాయిలు పడే పాట్లు చెప్పనలవి కాదు. ఇటీవల ఈ నేపథ్యంపై వచ్చిన సినిమా ‘బాలా’. ఇందులో హీరోగా నటించిన ఆయుష్మాన్ ఖురానా బట్టతల కష్టాలను, దాన్ని కప్పిపుచ్చుకోడానికి పడే బాధలను కళ్లకు కట్టినట్లు చూపించాడు. ఇందులో అతనికి భార్యగా నటించిన యామీ గౌతమ్కు తాజాగా ఓ ఆసక్తికర ప్రశ్న ఎదురైంది. వెండితెరపైనే కాకుండా నిజజీవితంలోనూ బట్టతల వ్యక్తిని పెళ్లి చేసుకుంటారా? అన్న ప్రశ్నకు బదులుగా ‘ఎందుకు చేసుకోకూడదు’ అని యామినీ తిరిగి ప్రశ్నించింది. బట్టతల అనేది పెళ్లికి అడ్డు కాదని జవాబిచ్చింది. నిజానికి బట్టతల ఉన్నావారు చాలా శాంతస్వరూపులని అభివర్ణించింది. అయితే, అసలు బట్టతల వ్యక్తులు ముందుగా వాళ్లని వాళ్లు ప్రేమించుకోవాలి.. ఆ తర్వాతే మిగతావాళ్ల నుంచి ప్రేమని కోరాలని.. ఇదే సినిమా ముఖ్య ఉద్దేశమని ఆమె పేర్కొంది. బాలా సినిమా విజయం పట్ల యామినీ సంతోషం వ్యక్తం చేసింది. ఆద్యంతం కడుపుబ్బా నవ్వించే సినిమాతో ప్రజలు బాగా కనెక్ట్ అయ్యారని, ఇందులో టిక్టాక్ స్టార్గా వైవిధ్యభరితమైన పాత్ర చేసే అవకాశం వచ్చినందుకు సంతోషిస్తున్నానంది. నవంబర్ 7న విడుదలైన ‘బాలా’ ఐదు రోజుల్లోనే రూ.61 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి విజయ ఢంకా మోగిస్తోంది. -
రూ. 50 కోట్ల క్లబ్లో చేరిన ‘బాలా’
ముంబై: వైవిధ్యభరిత చిత్రాలకు ప్రేక్షకాదరణ ఎప్పుడూ ఉంటుందనే విషయం ‘బాలా’ సినిమాతో మరోసారి నిరూపితమైంది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లతో సందడి చేస్తోంది. తాజాగా రూ. 50 కోట్ల చేరిపోయింది. ఆయుష్మాన్ ఖురానా హీరోగా తెరకెక్కిన ఈ సినిమా నవంబర్ 7న ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. మొదటి రోజు నుంచి మంచి వసూళ్లతో దూసుకుపోతుంది. విడుదలైన మొదటిరోజే బాక్సాఫీస్ను షేక్ చేస్తూ రూ.10 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి అందరినీ ఆశ్చర్యాల్లో ముంచెత్తింది. అక్కడితో ఆగకుండా రెండవరోజు రూ.15 కోట్లు, మూడో రోజు రూ.18 కోట్ల పైచిలుకు కలెక్షన్లు సాధించింది. వరుసగా నాలుగో రోజుకూడా బాక్సాఫీస్ వద్ద 8 కోట్లు రాబట్టింది. దీంతో మొత్తంగా ఈ సినిమా 50 కోట్ల క్లబ్లో చేరిందని ప్రముఖ బాలీవుడ్ సినీ ట్రేడ్ విశ్లేషకులు తరణ్ ఆదర్శ్ తన ట్విటర్ ఖాతాలో వెల్లడించారు. #Bala crosses ₹ 50 cr... Remarkable hold on Day 4... Trends better than Ayushmann’s last hit #DreamGirl [Day 4: ₹ 7.43 cr]... Holiday on Day 5 [#GuruNanakJayanti] should only boost biz... Fri 10.15 cr, Sat 15.73 cr, Sun 18.07 cr, Mon 8.26 cr. Total: ₹ 52.21 cr. #India biz. — taran adarsh (@taran_adarsh) November 12, 2019 అదే విధంగా ‘బాలా’ మూవీ సౌదీ అరేబియాలో సెన్సార్ పూర్తి చేసుకుందని.. నవంబర్ 14న ఈ చిత్రం సౌదీ ప్రేక్షకుల ముందుకు రానుందని తెలిపారు. కాగా సౌదీలో రిలీజ్ ఆయ్యే అయూష్మాన్ ఖురానా మొదటి చిత్రం ఇది. ఈ చిత్రంలో ఆయుష్మాన్ ఖురానా హీరోగా, భూమి పడ్నేకర్, యామీ గౌతమ్ హీరోయిన్లుగా నటించారు. అమర్ కౌశక్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఆయుష్మాన్ ఖురానా కెరీర్లోనే మొదటి రోజు అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగా నిలిచింది. ఈ సినిమాలో బట్టతల ఉన్నవారి బాధలను చూపించిన ఆయుష్మాన్ నటనకు ప్రేక్షకులు విశేషంగా ఆకర్షితులయ్యారు. బట్టతలతో హీరో పడే పాట్లు అందరికీ నవ్వు తెప్పిస్తాయి. ఈ ప్రయోగాత్మక చిత్రం అటు ప్రేక్షకులతోపాటు ఇటు విమర్శకుల నుంచీ ప్రశంసలు అందుకుంటోంది. #Bala clears Saudi Arabia censor... First movie of Ayushmann Khurrana to release in #SaudiArabia on 14 Nov 2019. pic.twitter.com/S6m2D7Yun5 — taran adarsh (@taran_adarsh) November 11, 2019 -
బాక్సాఫీస్ దగ్గర బట్టతల ‘బాలా’ మ్యాజిక్
వైవిధ్యభరిత చిత్రాలకు ప్రేక్షకాదరణ ఎప్పుడూ ఉంటుందనే విషయం ‘బాలా’ సినిమాతో మరోసారి నిరూపితమైంది. బాలీవుడ్ హీరో ఆయుష్మాన్ ఖురానా ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రం ‘బాలా’. భూమి పడ్నేకర్, యామీ గౌతమ్ హీరోయిన్లుగా నటించారు. నవంబర్ 7న బాలా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాలో బట్టతల ఉన్నవారి బాధలను చూపించిన ఆయుష్మాన్ నటనకు ప్రేక్షకులు విశేషంగా ఆకర్షితులయ్యారు. బట్టతలతో హీరో పడే పాట్లు అందరికీ నవ్వు తెప్పిస్తాయి. అమర్ కౌశక్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఆయుష్మాన్ ఖురానా కెరీర్లోనే మొదటి రోజు అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగా నిలిచింది. విడుదలైన మొదటిరోజే బాక్సాఫీస్ను షేక్ చేస్తూ రూ.10 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి అందరినీ ఆశ్చర్యాల్లో ముంచెత్తింది. అక్కడితో ఆగకుండా రెండవరోజు రూ.15 కోట్లు, మూడో రోజు రూ.18 కోట్ల పైచిలుకు కలెక్షన్లు సాధించింది. ఈ ప్రయోగాత్మక చిత్రం అటు ప్రేక్షకులతోపాటు ఇటు విమర్శకుల నుంచీ ప్రశంసలు అందుకుంటోంది. ఈ సినిమాలో నటించిన నటీనటులకు మంచి మార్కులే పడ్డాయి. -
‘బాలా’ ట్రైలర్ విడుదల
-
బట్టతల ఉంటే ఇన్ని బాధలా..?
అయుష్మాన్ ఖురానా.. ప్రయోగాత్మక చిత్రాలు చేస్తూ బాలీవుడ్లో గొప్ప పేరు తెచ్చుకున్న క్రేజీ హీరో. విభిన్న పాత్రలు ఎంచుకుంటూ వరస విజయాలతో దూసుకుపోతున్నాడు. ‘డ్రీమ్ గర్ల్’ సినిమాలో అమ్మాయి గెటప్తో అలరించిన ఆయుష్మాన్.. ఇప్పుడు బట్టతల వల్ల కలిగే ఇబ్బందులు ఎలా ఉంటాయో సరదాగా చెప్పడానికి ‘బాలా’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. అమర్ కౌశిక్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ట్రైలర్ తాజాగా విడుదలైంది. ఇందులో హీరో చూడడానికి బాగానే ఉంటాడు కానీ బట్టతల ఉంటుంది. దీంతో అతన్ని చూసి అంతా నవ్వుతుంటారు. టోపీ పెట్టుకొని తన బట్టతలను కవర్ చేస్తుంటాడు. అయినప్పటికీ అందరి ముందు నవ్వులపాలవుతుంటాడు. జుట్టు పెరగడానికి మార్కెట్లో దొరికే ప్రతి ఆయుర్వేద నూనెలను వాడుతుంటాడు. అయినా జుట్టు పెరగడు. ఇంకా ఊడిపోతూనే ఉంటుంది. చివరకు ఆవు పేడను కూడా తలకు రాసుకుంటాడు. అయినా ఎలాంటి పెరుగుదల ఉండదు. దాంతో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయించుకోవాలని అనుకుంటాడు. డాక్టర్ వద్దకు వెళ్లి తన సమస్య చెప్పుకుంటాడు. అయితే తలలో జుట్టు ఇంజెక్ట్ చేయడానికి అతని శరీరంలో ఎక్కడా అంత జుట్టు లేదని, దాంతో పర్సనల్ పార్ట్స్లో వచ్చే వెంట్రుకలతో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయాలని డాక్టర్స్ అంటారు. దాంతో ఆయుష్మాన్ భయంతో పారిపోతాడు. ఇందులో యామి గౌతమ్, భూమి పెడ్నేకర్ కథానాయికలుగా నటించారు. హీరో యామిని ఇష్టపడతాడు. ఆమె ముందు విగ్గు పెట్టుకొని ప్రేమలో పడేస్తాడు. అయితే అతనికి బట్టతల ఉందన్న విషయాన్ని యామికి తెలిస్తే పరిస్థితేంటి? బట్టతల పోవడానికి అతను ఏన్ని పాట్లు పడ్డాడు? అన్నదే ఈ సినిమా కథ అని ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది. నవంబర్ 7న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. -
తమిళ ‘అర్జున్ రెడ్డి’ రెడీ!
టాలీవుడ్లో సెన్సేషన్ సృష్టించిన అర్జున్ రెడ్డి సినిమా తమిళ, హిందీ భాషల్లో రీమేక్ అవుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే హిందీ రీమేక్ కబీర్ సింగ్ పేరుతో రిలీజ్కు రెడీ అవుతుండగా తమిళ అర్జున్ ఆదిత్మ వర్మ కూడా షూటింగ్ పూర్తి చేసుకుంది. ముందుగా ఈ సినిమాను సీనియర్ డైరెక్టర్ బాల దర్శకత్వంలో తెరకెక్కించారు. అయితే బాల దర్శకత్వంలో రూపొందిన సినిమా అవుట్పుట్ నిర్మాతలకు నచ్చకపోవటంతో పూర్తి సినిమాను పక్కన పెట్టేసి గిరీశయ్య దర్శకత్వంలో తిరిగి షూట్ చేశారు. 50 రోజుల పాటు నాన్స్టాప్గా షూటింగ్ చేసి సినిమాను పూర్తి చేశారు. ఈ సినిమాతో విక్రమ్ తనయుడు ధృవ్ హీరోగా పరిచయం అవుతుండగా బాలీవుడ్ బ్యూటీ బాణిత సంధు హీరోయిన్గా నటిస్తున్నారు. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలు త్వరలో ప్రారంభించనున్నారు. -
బిందుమాధవికి భలేచాన్స్
నటి బిందుమాధవికి భలే చాన్స్ తలుపు తట్టనుందని సమాచారం. తెలుగింటి ఆడపడుచు అయిననీ అమ్మడు, తమిళంలో పలు చిత్రాల్లో నటించింది. కళుగు వంటి చిత్రాల్లో నటిగా చక్కని ప్రతిభను చాటుకుని ప్రశంసలు అందుకుంది. అయినా ఎందుకనో నటిగా రావలసినంత పేరు రాలేదు. ఈ మధ్య చేతిలో అకాశాలు లేక సొంత ఊరికి వెళ్లిపోయింది కూడా. అలాంటి బిందుమాధవికి అనుకోకుండా ఒక లక్కీచాన్స్ తలుపుతట్టిందన్నది తాజా సమాచారం. దర్శకుడు బాలా విషయానికి వస్తే ఈయన చిత్రాల్లో నటులెంత వాళ్లైనా పాత్రలే కనిపిస్తాయి. బాలా ప్రస్తుతం యువ హీరోలతో మల్టీస్టారర్ చిత్రాన్ని తెరకెక్కించడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇటీవల సూర్య హీరోగా చిత్రం చేయబోతున్నారనే ప్రచారం జరిగింది. బాలా కథను వినిపించారని, అది సూర్యకు బాగా నచ్చిందని టాక్ స్ప్రెడ్ అయింది. అయితే ప్రస్తుతం సూర్య వరుసగా చిత్రాలతో బిజీగా ఉన్నారు. ఆయన నటించిన ఎన్జీకే చిత్రం మేడే సందర్భంగా తెరపైకి రానుంది. కేవీ.ఆనంద్ దర్శకత్వంలో నటించిన కాప్పాన్ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుని సెప్టెంబరులో తెరపైకి రావడానికి ముస్తాబవుతోంది. ప్రస్తుతం సుధ కొంగర దర్శకత్వంలో సూరరై పోట్రు చిత్రంలో నటిస్తున్నారు. ఆ తరువాత శివ దర్శకత్వంలో ఒక చిత్రం, హరి దర్శకత్వంలో మరో చిత్రం చేయనున్నారు. దీంతో బాలా దర్శకత్వంలో ప్రస్తుతం నటించలేనని చెప్పడంతో ఆయన మరో కథను తయారు చేసుకున్నారు. ఇందులో యువ నటులు ఆర్య, అధర్వ హీరోలుగా నటించడానికి సై అన్నారు. ఇందులో బిందుమాధవికి నటించే అవకాశం వచ్చిందని సమాచారం. దీనికి జీవీ.ప్రకాశ్కుమార్ సంగీతం అందించడం మరో విశేషం. పూర్తి వివరాలు త్వరలోనే వెల్లడయ్యే అవకాశం ఉంది. -
మరో సౌత్ రీమేక్
విక్రమ్ కెరీర్లో పెద్ద హిట్గా నిలిచిన చిత్రం ‘పితామగన్’. తెలుగులో ‘శివపుత్రుడు’గా అనువదించారు. విక్రమ్ నటనకు నేషనల్ అవార్డ్ కూడా వచ్చింది. ఇందులో సూర్య నటన కూడా అద్భుతం. బాలా దర్శకత్వంలో రూపొందిన ఈ సూపర్ హిట్ చిత్రం బాలీవుడ్లో రీమేక్ కానుంది. ‘పితామగన్’ రైట్స్ను బాలీవుడ్ దర్శకుడు సతీష్ కౌశిక్ తీసుకున్నారు. కానీ సతీష్ యాక్టర్గా బిజీగా ఉండటంతో ఈ సినిమాను డైరెక్ట్ చేసేందుకు దర్శకుడ్ని ఎంపిక చేసే పనిలో ఉన్నారు. ఆల్రెడీ బాలా–విక్రమ్ కాంబినేషన్లో వచ్చిన ‘సేతు’ సినిమాను ‘తేరే నామ్’ టైటిల్తో రీమేక్ చేశారు సతీష్. ఈ చిత్రానికి ఆయనే దర్శకుడు. మరి.. ‘పితామగన్’ రీమేక్కి ఏ దర్శకుడిని ఎంపిక చేస్తారో, విక్రమ్–సూర్య పాత్రలకు ఏ హీరోలను ఎంపిక చేస్తారో చూడాలి.
Pagination
మళ్లీ చరిత్ర సృష్టిస్తున్నాం
చేతులు కాలాక ఆకులు పట్టుకున్న ఈసీ
ఓటీటీలోకి వచ్చేసిన మిడిల్ క్లాస్ మూవీ.. స్ట్రీమింగ్ అందులోనే?
వరల్డ్కప్ జట్టులో నో ఛాన్స్: రోహిత్పై కేఎల్ రాహుల్ కామెంట్స్ వైరల్
ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు అలెర్ట్.. మారిన విత్ డ్రా నిబంధనలు
ఎన్ఆర్ఐతో విధి ఆడిన వింత నాటకం.. విషాదం
స్వాతి మలివాల్ డ్రామా.. బీజేపీ కుట్రే ఇదంతా: సంచలన వీడియో బయట పెట్టిన ఆప్
Heeramandi Jewellery ఎవరీ సినిమా నగల స్పెషలిస్ట్ జంట
బ్రిటన్లో అత్యంత సంపన్నుడు భారతీయుడే..!
మల్లె మొగ్గ మూవీ సక్సెస్ మీట్.. పోస్టర్ లాంఛ్!
నా పై వచ్చిన అతి పెద్ద ఆరోపణ అదే: ప్రధాని మోదీ
పాయల్ రాజ్పుత్ వివాదం.. షాకిచ్చిన టాలీవుడ్ నిర్మాతల మండలి!
ఐఫోన్పై రూ.26వేలు డిస్కౌంట్.. ఎక్కడంటే..
బస్ సర్వీస్ ప్రారభించనున్న ఉబర్.. మొదట ఆ నగరంలోనే..
ఓటేసిన వ్యాపార ప్రముఖులు
కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో సందడి చేసిన కన్నప్ప టీం!
జూన్ 4 తర్వాత 'గూగుల్ పే' బంద్.. ఎక్కడంటే?
TS Cabinet Meet: తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు ఇవే..
తప్పక చదవండి
- కుమ్మక్కుతో విధ్వంసకాండ
- ఎన్నికలు vs ఏఐ
- ఇరాన్ అధ్యక్షుడి దుర్మరణం.. భారత్లో రేపు సంతాపదినం
- చరిత్రాత్మకం! సౌదీలో తొలిసారిగా స్విమ్వేర్ ఫ్యాషన్ షో!
- కారుతో ఢీ కొట్టడంతో ఇద్దరు మృతి.. గంటల్లోనే బెయిల్
- అప్పటికి భారతీయులు ధనవంతులవుతారా.. అసలు సమస్య ఏంటంటే?
- కేజ్రీవాల్కు బెదిరింపులు బీజేపీ పనే: ఆప్
- రూ. 5 కోట్లు దండుగ అన్నారు.. చెత్తలో పడేసిందంటూ: యశ్ తండ్రి
- నాగబాబు ట్వీట్ వివాదం.. అల్లు అర్జున్ షాకింగ్ నిర్ణయం!
- ‘AI’తో ప్రమాదమే.. గాడ్ ఫాదర్ ఆఫ్ ఏఐ వార్నింగ్
Advertisement