-
Rahul Gandhi: ఎస్సీ, ఎస్టీ మహిళల ఖాతాలో లక్ష
సివనీ/షాదోల్: కేంద్రంలో అధికారంలోకి వస్తే ప్రతి ఎస్సీ, ఎస్టీ మహిళ బ్యాంక్ ఖాతాకు ఏటా రూ.లక్ష జమ చేస్తామని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ హామీ ఇచ్చారు. మధ్యప్రదేశ్లో ఎన్నికల ప్రచారంలో భాగంగా సివనీ జిల్లాలోని ధనోరాలో ర్యాలీలో గిరిజనులనుద్దేశిస్తూ రాహుల్ మాట్లాడారు.‘‘ కేంద్రప్రభుత్వ విభాగాల్లో కీలకమైన ప్రభుత్వ పదవుల్లో 90 మంది ఐఏఎస్ అధికారులుంటే వారిలో కేవలం ఒకే ఒక్క గిరిజనుడు ఉన్నాడు. దేశజనాభాలో గిరిజనులు ఎనిమిది శాతంకంటే ఎక్కువే ఉంటారు. అయినా దేశంలోని టాప్ 200 కంపెనీల్లో ఒక్కదానికి కూడా గిరిజనులు యజమానులుగా లేరు. కనీసం ఆ సంస్థల్లో అత్యున్నత స్థాయి అధికారులుగానూ లేరు. దేశంలో ఒక్క మీడియా సంస్థకైనా ఆదివాసీ యజమానిగా ఉన్నారా? ఒక్కరైనా న్యూస్యాంకర్ ఉన్నారా?’ అంటూ గిరిజనుల అభ్యున్నతికి మోదీ సర్కార్ కృషిచేయలేదని ఆగ్రహం వ్యక్తంచేశారు. మేం అధికారంలోకి వస్తే ఏడాదిలోపు ఆదివాసీల భూ హక్కుల సమస్యను పరిష్కరిస్తాం. కేంద్ర ఉద్యోగాల్లో కాంట్రాక్ట్ వ్యవస్థకు చరమగీతం పాడి 30 లక్షల కేంద్ర ఉద్యోగాలను భర్తీచేస్తాం’ అని అన్నారు. -
బ్యాంక్ అకౌంట్ లేకుండానే యూపీఐ పేమెంట్స్..!
బ్యాంక్ అకౌంట్తో పని లేకుండానే యూపీఐ పేమెంట్స్ చేసుకునే సదుపాయాన్ని తీసుకొచ్చింది ఫిన్ టెక్ సంస్థ మొబీక్విక్ (MobiKwik). తన ప్లాట్ఫారమ్లో 'పాకెట్ UPI' అనే కొత్త ఫీచర్ను ప్రకటించింది. ఇది వినియోగదారులకు బడ్జెట్, ఫైనాన్స్ మేనేజ్మెంట్పై మెరుగైన నియంత్రణను కలిగి ఉండేందుకు వీలు కల్పిస్తుందని ఫిన్టెక్ కంపెనీ పేర్కొంది. పాకెట్ UPI వినియోగదారులు వారి బ్యాంక్ ఖాతాను లింక్ చేయకుండానే మొబీక్విక్ వ్యాలెట్ ద్వారా యూపీఐ చెల్లింపులు చేయొచ్చు. తద్వారా వినియోగదారులు యూపీఐ చెల్లింపులు చేసేటప్పుడు అదనపు ఎంపికతో వారి చేతుల్లో మరింత శక్తిని ఇస్తుందని వన్ మొబీక్విక్ లిమిటెడ్ (మొబీక్విక్) కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. పాకెట్ యూపీఐ యూజర్లు వారి బ్యాంక్ ఖాతా కాకుండా మొబీక్విక్ వాలెట్ నుంచి డబ్బులను బదిలీ చేయడం ద్వారా తప్పు లావాదేవీలు, ఆర్థిక మోసాల నుంచి రక్షణ పొందవచ్చు. తద్వారా ఆర్థిక లావాదేవీలు చేసేటప్పుడు బహిర్గతం పరిమితం అవుతుంది. -
‘పేటీఎం’ కస్టమర్లకు సాయం చేయండి
ముంబై: యూపీఐ హ్యాండిల్ ‘పేటీఎం’ను ఉపయోగిస్తున్న పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ (పీపీబీఎల్) కస్టమర్లను 4–5 వేరే బ్యాంకులకు మార్చే అవకాశాలను పరిశీలించాలని నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ (ఎన్పీసీఐ)కి ఆర్బీఐ సూచించింది. తద్వారా చెల్లింపుల వ్యవస్థలో అంతరాయం కలగకుండా చూడాలని, కస్టమర్లకు అసౌకర్యం కలగకుండా సహాయం చేయాలని పేర్కొంది. నిబంధనల ఉల్లంఘనకు గాను మార్చి 15 నుంచి దాదాపు అన్ని కార్యకలాపాలు నిలిపివేయాలంటూ పీపీబీఎల్ను ఆర్బీఐ ఆదేశించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే సంస్థ కస్టమర్లకు అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకుంటోంది. పీపీబీఎల్ వెబ్సైట్ ప్రకారం 30 కోట్ల వాలెట్లు, 3 కోట్ల మంది బ్యాంకు కస్టమర్లు ఉన్నారు. దేశీయంగా రిటైల్ చెల్లింపులు, సెటిల్మెంట్ వ్యవస్థను ఎన్పీసీఐ నిర్వహిస్తోంది. వేరే బ్యాంకులకు ‘పేటీఎం’ హ్యాండిల్ను మైగ్రేట్ చేసే క్రమంలో పేమెంట్ సరీ్వస్ ప్రొవైడర్లుగా (పీఎస్పీ) 4–5 బ్యాంకులను ఎన్పీసీఐ ఎంపిక చేయొచ్చని సూచించింది. తద్వారా ఒకే బ్యాంకుపై ఆధారపడితే తలెత్తే రిస్కులు తగ్గుతాయని తెలిపింది. ‘పేటీఎం’ హ్యాండిల్ను ఉపయోగిస్తున్న కస్టమర్లు, వ్యాపారుల హ్యాండిల్స్కు మాత్రమే మైగ్రేషన్ వర్తిస్తుందని, వేరే యూపీఐ అడ్రస్లు ఉన్నవారికి అవసరం లేదని పేర్కొంది. పీపీబీఎల్లో ఖాతాలు ఉన్న వారు మార్చి 15లోగా వేరే బ్యాంకులకు మారేందుకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలని మరోసారి సూచించింది. -
ఓటీపీలతో రూ.6.90 లక్షలకు కుచ్చుటోపీ
పెద్దదోర్నాల: ప్రభుత్వ పథకాలకు సంబంధించిన నగదు మొత్తం మీ అకౌంట్లోకి జమ చేస్తామని నమ్మించిన సైబర్ నేరగాళ్లు బ్యాంక్ అకౌంట్లోని నగదు మొత్తాన్ని కాజేసిన ఘటన ప్రకాశం జిల్లా పెద్దదోర్నాల మండల పరిధిలోని ఐనముక్కలలో ఆదివారం వెలుగు చూసింది. ఈ ఘరానా మోసంలో గ్రామానికి చెందిన ఇద్దరు సోదరులు నగదు పోగొట్టుకున్నారు. ఎస్సై అంకమరావు తెలిపిన వివరాల ప్రకారం.. ఈ నెల 14వ తేదీన గ్రామానికి చెందిన చిట్యాల ఆంజనేయరెడ్డి అనే యువకుడికి గుర్తు తెలియని నంబర్ నుంచి ఫోన్కాల్ వచ్చింది. ప్రభుత్వ పథకాలకు సంబంధించిన నగదు మొత్తం ఒక్కసారే అకౌంట్లో పడుతుందని, ఫోన్ పే ఉన్న ఆండ్రాయిడ్ ఫోన్ నుంచి మాట్లాడాలని సూచించాడు. తొలుత అకౌంట్ నుంచి కొంత మొత్తం కట్ అయి తిరిగి పడుతుందని మోసగాళ్లు నమ్మబలికారు. తనది ఆండ్రాయిడ్ ఫోన్ కాకపోవడంతో ఆ యువకుడు గ్రామానికి చెందిన లింగాల శ్రీను నంబర్ నుంచి గుర్తు తెలియని నంబర్కు కాన్ఫరెన్స్ కాల్ మాట్లాడాడు. అయితే.. శ్రీను అకౌంట్లో అమౌంట్ తక్కువగా ఉందని చెప్పడంతో శ్రీను తమ్ముడు లింగాల రమేష్ నంబర్ నుంచి ఫోన్చేసి కాన్ఫరెన్స్ కాల్ కలిపి ముగ్గురూ సైబర్ నేరగాళ్లతో మాట్లాడారు. అతని మాటలు నమ్మిన రమేష్ తన ఫోన్కు వచ్చిన ఓటీపీ నంబర్లతో పాటు ఫోన్పేకు సంబంధించిన పాస్వర్డ్ను చెప్పటంతో లింగాల రమేష్ అకౌంట్లోని రూ.6.90 లక్షల నగదు మాయమైంది. అయితే.. మాయమైన డబ్బు నుంచి రూ.79 వేల నగదు తిరిగి బాధితుడి అకౌంట్కు జమ అయినట్లు ఎస్సై తెలిపారు. తమకు వచ్చిన ఫోన్ నంబర్కు ఎన్నిసార్లు ఫోన్ చేసినా అది స్విచ్చాఫ్ వస్తుండటంతో తాము మోసపోయినట్టు సోదరులు గ్రహించారు. హుటాహుటిన పోలీస్ స్టేషన్తో పాటు స్థానిక బ్యాంకు అధికారులకు ఫిర్యాదు చేశారు. బాధితులకు ఢిల్లీ, మధ్యప్రదేశ్ నుంచి ఫోన్లు వచ్చాయని, ఏ రాష్ట్రానికి ఫోన్ చేయాలనుకుంటే అదే భాషలతో మాట్లాడే వాళ్లతో ఫోను చేయిస్తారని, డబ్బులు వస్తాయని నమ్మకంగా ఆశ చూపి అకౌంట్లలోని డబ్బులు మాయం చేస్తారని ఎస్సై తెలిపారు. గుర్తు తెలియని నంబర్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు. -
‘ఖాతాదారుల సమస్యల్ని పట్టించుకోండి కొంచెం’, బ్యాంక్లపై ఆర్బీఐ కామెంట్
ముంబై: కస్టమర్ ఫిర్యాదుల పరిష్కారంపై బ్యాంకింగ్ మరింత దృష్టి పెట్టాలని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) డిప్యూటీ గవర్నర్ ఎం రాజేశ్వర్ రావు పిలుపునిచ్చారు. ‘‘ఖాతాదారుల సముపార్జనను బ్యాంకులకు తీసుకురావడానికి బ్యాంకులు తీవ్రంగా దృష్టి పెట్టాయి. అయితే కస్టమర్ ఫిర్యాదుల పరిష్కారంపై పెద్దగా శ్రద్ధ చూపడం లేదు’’ అని 2023 ఫిక్కీ బ్యాంకింగ్ వార్షిక సమావేశంలో (ఎఫ్ఐబీఏసీ) కార్యక్రమంలో ఆయన వ్యాఖ్యానించారు. ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్– ఐబీఏ, ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ చాంబర్స్ ఆప్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ– ఫిక్కీ ఇక్కడ బుధవారం నుంచి నిర్వహించిన రెండు రోజుల ముగింపు సమావేశంలో రాజేశ్వరావు మాట్లాడారు. ఎఫ్ఐబీఏసీ 2023లో గవర్నర్ శక్తికాంతదాస్ బుధవారం ప్రారంభోపన్యాసం చేసిన సంగతి తెలిసిందే. ‘‘అనిశ్చితి సమయాల్లో గెలుపు’’ అన్న అంశంపై ప్రధానంగా జరిగిన ఈ సమావేశాల్లో గురువారం డిప్యూటీ గవర్నర్ రాజేశ్వర రావు ఏమన్నారంటే.... దురదృష్టవశాత్తూ, కస్టమర్ ఫిర్యాదులకు సకాలంలో పరిష్కారాలను అందించడానికి బ్యాంకులు చేస్తున్న ప్రయత్నాలు పెద్దగా లేవు. ముఖ్యంగా పెరుగుతున్న సాంకేతికత, ఇన్స్ట్రమెంట్ల స్థాయిల్లో కస్టమర్ సేవలు ఉండడం లేదు. సేవా పరిశ్రమగా గర్వించే రంగంలో ఈ తరహా పరిస్థితి ఇది చాలా విచిత్రంగా అనిపిస్తుంది. బ్యాంకుల బోర్డులు ఈ విషయంపైతీవ్రగా ఆలోచన చేయాలి. కస్టమర్ల ఫిర్యాదుల పరిష్కారానికి పెద్దపీట వేయాలి. టెక్ బ్యాంకింగ్ వాతావరణంలో సైబర్ సెక్యూరిటీని పటిష్టం చేయడం, సైబర్ మోసాలను నిరోధించడంపై కూడా బ్యాంకులు మరింత దృష్టి సారించాలి. వినియోగదారుని మోసగించడానికి చేసే చర్యలను పటిష్టంగా అరికట్టగలగాలి. ఆయా సమస్యల పరిష్కారం దిశలో మనం మరింత కష్టపడి పని చేయాలి. తెలివిగా పని చేయాలి. కస్టమర్ల నమ్మకాన్ని నిలుపుకోవడానికి, బ్యాంకింగ్ను బలోపేతం చేయడానికి, డిజిటల్ సెక్యూరిటీకి సంబంధించిన బెదిరింపుల నుండి కస్టమర్ను రక్షించడానికి మనం కలిసి పని చేయాలి. -
ఖాతాల్లోకి రూ.820 కోట్లు - ఆనందపడేలోపే..
గతంలో అనుకోకుండా కొంతమంది సామాన్యుల బ్యాంక్ ఖాతాల్లోకి కోట్ల రూపాయలు జమయిన సంఘటనలు కోకొల్లలుగా వెలుగులోకి వచ్చాయి. ఇలాంటి మరో సంఘటన మళ్ళీ జరిగినట్లు సోషల్ కొన్ని వార్తలు వైరల్ అవుతున్నాయి. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. యూకో బ్యాంక్ కస్టమర్లకు ఇటీవల ఒక పెద్ద జాక్పాట్ తగిలి.. అంతలోనే మిస్ అయిపోయింది. యూకో బ్యాంక్ ఖాతాదారుల ఖాతాల్లోకి ఏకంగా 820 కోట్ల రూపాయలు జమ అయ్యాయి. అమౌంట్ డిపాజిట్ అయినట్లు వారి మొబైల్ నెంబర్లకు మెసేజ్లు కూడా వచ్చాయి. ఒక్కసారిగా లెక్కకు మించిన డబ్బు ఖాతలోకి రావడంతో కొందరు ఉబ్బితబ్బిబ్బయ్యారు. వెంటనే తేరుకున్న బ్యాంక్ జరిగిన పొరపాటుని గుర్తించి.. డబ్బు డిపాజిట్ అయిన బ్యాంక్ ఖాతాల లావాదేవీలను బ్లాక్ చేసింది. అంత కాకుండా ఇమ్మీడియట్ పేమెంట్ సర్వీస్ (IMPS) కూడా నిలిపివేసింది. ఇదీ చదవండి: దీపావళికి నెట్లో ఎక్కువగా ఏం సర్చ్ చేసారంటే..? రివీల్ చేసిన సుందర్ పిచాయ్ ఈ నెల 10, 13 తేదీల్లో జరిగిన కొన్ని సాంకేతిక లోపాల కారణంగా అమౌంట్ పెద్ద మొత్తంలో ట్రాన్స్ఫర్ అయినట్లు బ్యాంక్ వెల్లడించింది. అయితే ఇప్పటికే 79 శాతం (సుమారు రూ. 649 కోట్లు) రికవరీ చేసినట్లు వెల్లడించింది. ఇంకా రావాల్సిన మొత్తం రూ. 171 కోట్లు. ఈ డబ్బు మొత్తం రికవరీ అవుతుందా? లేదా అనే సందేహాలు కూడా వినిపిస్తున్నాయి. -
లైఫ్టైమ్ జీరో బ్యాలెన్స్ అకౌంట్! డెబిట్, క్రెడిట్ కార్డులు కూడా...
BoB LITE Savings Account: బ్యాంక్ అకౌంట్ లేని వారికి, జీరో బ్యాలెన్స్ అకౌంట్ కావాల్సిన వారి కోసం ప్రభుత్వ రంగ బ్యాంక్ ఆఫ్ బరోడా (Bank of Baroda) సరికొత్త అకౌంట్ను అందిస్తోంది. బీఓబీ ప్రత్యేక పండుగ క్యాంపెయిన్లో భాగంగా ‘బీఓబీ లైట్ సేవింగ్స్ అకౌంట్’ పేరిట లైఫ్టైమ్ జీరో బ్యాలెన్స్ అకౌంట్ను ప్రకటించింది. ఈ అకౌంట్తో మినిమమ్ బ్యాలెన్స్ అవసరం లేకుండానే బ్యాంకింగ్ సేవలు పొందవచ్చని బ్యాంక్ ఆఫ్ బరోడా ఓ ప్రకటనలో పేర్కొంది. ఉచితంగా డెబిట్, క్రెడిట్ కార్డులు బీఓబీ లైట్ సేవింగ్స్ అకౌంట్తో పాటు కస్టమర్లు ఉచితంగా డెబిట్, క్రెడిట్ కార్డులు కూడా పొందవచ్చు. అయితే లైఫ్టైమ్ ఫ్రీ రూపే ప్లాటినమ్ డెబిట్ కార్డు కోసం సగటు త్రైమాసిక బ్యాలెన్స్ మెయింటెయిన్ చేయాల్సి ఉంటుంది. అలాగే అర్హతను బట్టీ లైఫ్టైమ్ ఫ్రీ క్రెడిట్ కార్డు కూడా పొందవచ్చు. వీటితో పాటు మరిన్ని ఆఫర్లను కస్టమర్లకు బ్యాంక్ అందిస్తోంది. ఇప్పటికే వివిధ కన్జ్యూమర్ బ్రాండ్లతో ఒప్పందం చేసుకున్న బ్యాంక్ ఆఫ్ బరోడా.. డిసెంబర్ 31 వరకు వివిధ బ్రాండ్లపై ఆకర్షణీయమైన ఆఫర్లు అందిస్తోంది. రిలయన్స్ డిజిటల్, క్రోమా, మేక్ మై ట్రిప్, అమెజాన్, బుక్ మై షో, మింత్రా, స్విగ్గీ, జొమాటోలో కొనుగోళ్లపై స్పెషల్ ఆఫర్లు లభిస్తాయని బ్యాంక్ ఆఫ్ బరోడా ఓ ప్రకటనలో తెలిపింది. బీఓబీ లైట్ సేవింగ్స్ అకౌంట్ ప్రయోజనాలు ఇది లైఫ్టైమ్ జీరో బ్యాలెన్స్ సేవింగ్స్ అకౌంట్. 10 ఏళ్లు పైబడిన భారతీయ పౌరులెవరైనా ఈ కౌంట్ ఓపెన్ చేయొచ్చు. ఉచితంగా రూపే ప్లాటినమ్ డెబిట్ కార్డు. ఇందు కోసం మెట్రో/అర్బన్లో రూ.3000, సెమీ అర్బన్లో రూ.2000, గ్రామీణ శాఖల్లో రూ.1000 త్రైమాసిక సగటు బ్యాలెన్స్ నిర్వహించాల్సి ఉంటుంది. అర్హత ఆధారంగా లైఫ్టైమ్ ఫ్రీ క్రెడిట్ కార్డు ఒక ఆర్థిక సవత్సరంలో ఉచితంగా 30 చెక్ లీవ్స్ -
మరో ఘటన.. ఫార్మసీ ఉద్యోగి అకౌంట్లో రూ.753 కోట్లు.. ఏం చేశాడంటే..
సామాన్యుల బ్యాంక్ ఖాతాల్లో వందలాది కోట్ల రూపాయలు వచ్చి పడుతున్నాయి. కొన్ని బ్యాంకులు పొరపాటున సమాన్యుల అకౌంట్లలో కోట్లాది రూపాయలు డిపాజిట్ చేస్తున్నాయి. ఆశ్చర్యానికి లోనైన ఖాతాదారులు తేరుకునే లోపు పొరపాట్లను తెలుసుకుని అకౌంట్లను ఫ్రీజ్ చేస్తున్నాయి. తాజాగా చెన్నైలో ఓ ఫార్మసీ ఉద్యోగి బ్యాంకు ఖాతాలో రూ.753 కోట్లు జమయ్యాయి. మహమ్మద్ ఇద్రీస్ తన కోటక్ మహీంద్రా బ్యాంకు (Kotak Mahindra bank) ఖాతా నుంచి శుక్రవారం (అక్టోబర్ 6) రూ.2000 లను స్నేహితుడికి బదిలీ చేశారు. ఈ లావాదేవీ తర్వాత, తన అకౌంట్ బ్యాలెన్స్ని చెక్ చేసుకోగా రూ. 753 కోట్ల బ్యాలెన్స్ కనిపించింది. బ్యాంక్ అకౌంట్లో అంత పెద్ద మొత్తం కనిపించేసరికి ఆశ్చర్యానికి, ఆందోళనకు గురైన ఇద్రిస్ వెంటనే బ్యాంక్ అధికారులకు తెలియజేశారు. దీంతో బ్యాంకు అధికారులు వెంటనే ఆయన అకౌంట్ను స్తంభింపజేశారు. ఈ పెద్ద మొత్తం కనిపించిన దురాశకు పోకుండా బ్యాంకు అధికారులకు తెలియజేసిన ఇద్రిస్పై ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి. తమిళనాడులో ఇలాంటి ఘటన జరగడం ఇది మూడోసారి. గతంలో చెన్నైకి చెందిన రాజ్కుమార్ అనే క్యాబ్ డ్రైవర్లో ఖాతాలో తమిళనాడు మర్కంటైల్ బ్యాంక్ రూ.9,000 కోట్లు డిపాజిట్ చేసింది. పొరపాటును గుర్తించిన బ్యాంకు ఆ డబ్బును వెనక్కి తీసుకుంది. అంతకు ముందు తంజావూరుకు చెందిన గణేశన్ అనే వ్యక్తి బ్యాంకు ఖాతాలోనూ రూ. 756 కోట్లు జమయ్యాయి. -
ఓటేయకుంటే బ్యాంక్ అకౌంట్ల నుంచి రూ.350 కట్! నిజమేనా?
ఎన్నికల్లో ఓటు వేయనివారి బ్యాంకు ఖాతాల నుంచి రూ.350 పెనాల్టీ కింద భారత ఎన్నికల సంఘం (ECI) కట్ చేస్తుందంటూ ఇంటర్నెట్లో ప్రచారం జరుగుతోంది. దీనికి సంబంధించి హిందీ వార్తపత్రికలో ప్రచురితమైన ఓ వార్త క్లిప్పింగ్ సోషల్ మీడియాలో సర్కులేట్ అవుతోంది. ఓటు వేయడాన్ని విస్మరించినవారి బ్యాంకు ఖాతాల నుంచి రూ.350 కట్ అవుతుందని, సదురు వ్యక్తికి ఒకవేళ బ్యాంక్ అకౌంట్ లేకపోతే మొబైల్ రీఛార్జ్ నుంచి ఆ మొత్తం కట్ చేస్తారని ఆ న్యూస్ క్లిప్పింగ్లో ఉంది. దీన్ని కొంత మంది విపరీతంగా షేర్ చేస్తున్నారు. ఓటు వేయకపోతే డబ్బులు కట్ అవుతాయంటూ హెచ్చరిస్తున్నారు. (అక్టోబర్ 1 నుంచి కొత్త రూల్స్.. ఇక అన్నింటికీ ఆ సర్టిఫికెటే ఆధారం!) దీనిపై ప్రభుత్వ వార్తాసంస్థ పీఐబీకి చెందిన ఫ్యాక్ట్చెక్ (pib fact check) విభాగం స్పందించింది. ఇది పూర్తిగా ఫేక్ న్యూస్ (fake news) అని తేల్చింది. గతంలోనే సర్కులేట్ అయిన ఈ ఫేక్ న్యూస్ మరోసారి ప్రచారంలోకి వచ్చిందని సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ‘ఎక్’(ట్విటర్) ద్వారా పేర్కొంది. కాగా ఈ వార్త ఓ హిందీ వార్తాపత్రికలో 2019లో ప్రచురితమైంది. హోలీ ప్రాంక్గా దీన్ని ప్రచురించారు. అయితే ఇది అప్పటి నుంచి అసలైన వార్తగా ప్రచారం జరుగుతోంది. దీనిపై కేంద్ర ఎలక్షన్ కమిషన్ 2021లోనే క్లారిటీ ఇచ్చింది. क्या लोकसभा चुनाव में मतदान नहीं किए जाने पर बैंक अकाउंट से कटेंगे 350 रुपए❓ जानें वायरल ख़बर की सच्चाई❕#PIBFactCheck: 🔶 यह ख़बर #फ़र्ज़ी है। 🔶 @ECISVEEP ने ऐसा कोई निर्णय नहीं लिया है। 🔶 जिम्मेदार नागरिक बनें, मतदान अवश्य करें!! 🔗 https://t.co/8EwXdkIPlF pic.twitter.com/ikFLUndfCh — PIB Fact Check (@PIBFactCheck) September 15, 2023 -
బ్యాంక్ అకౌంట్ బ్లాక్ అయిందా? సింపుల్గా యాక్టివేట్ చేసుకోండిలా!
రిజర్వ్ బ్యాంక్ నియమాల ప్రకారం, ఒక కస్టమర్ నిర్ణీత గడువు లోపల తప్పకుండా కేవైసీ అప్డేట్ చేసుకోవాలి. అలా చేయని పక్షంలో అకౌంట్ తాత్కాలికంగా నిలిపివేస్తారు. ఇది జరిగితే లావాదేవీలు చేయడం కుదరదు. అయితే కేవైసీ ప్రక్రియ ఒక్కొక్కరికి ఒక్కో విధంగా ఉంటుంది. ఈ కథనంలో అకౌంట్ ఎలా యాక్టివేట్ చేసుకోవాలనే విషయాలను తెలుసుకుందాం. కేవైసీ అప్డేట్ అనేది హై రిస్క్ కస్టమర్లకు రెండు సంవత్సరాలు, మీడియం అండ్ లో (తక్కువ) రిస్క్ కస్టమర్లకు వరుసగా 8, 10 సంవత్సరాల వరకు ఉంటుంది. RBI ప్రకారం, 2019 మే 29న జారీ చేసిన సర్క్యులర్ను 2023 మే 4న అప్డేట్ చేసింది. కావున దీని ప్రకారం ఖాతాదారుడు పాన్ కార్డు లేదా ఫారమ్ 16ని అందించనట్లైతే అకౌంట్ తాత్కాలికంగా నిలిపివేస్తారు. అంతకంటే ముందు బ్యాంకులు ఎస్ఎమ్ఎస్ లేదా ఈ-మెయిల్ ద్వారా కష్టమరలకు హెచ్చరికలు జారీ చేస్తాయి. అకౌంట్ యాక్టివేట్ చేయడం ఎలా? కేవైసీ పూర్తి చేయకపోతే ఖాతా తాత్కాలికంగా నిలిపివేసిన అకౌంట్ను మళ్ళీ రీయాక్టివేట్ చేసుకోవచ్చు. దీనికి సులభమైన మార్గాలు ఉన్నాయి. 1) కేవైసీ ఫారమ్తో నేరుగా బ్యాంకుని సందర్శించి యాక్టివేట్ చేసుకోవచ్చు 2) మీ బ్యాంక్ ఆన్లైన్ బ్యాంకింగ్ పోర్టల్ ద్వారా కూడా యాక్టివేట్ చేసుకోవచ్చు. ఇదీ చదవండి: మహీంద్రా ఫస్ట్ ఎలక్ట్రిక్ వెహికల్ ఇదే! మీకు తెలుసా? ఆన్లైన్ బ్యాంకింగ్ పోర్టల్.. బ్యాంక్ ఆన్లైన్ బ్యాంకింగ్ పోర్టల్ లాగిన్ చేసి, 'KYC' ట్యాబ్ మీద క్లిక్ చేయాలి. స్క్రీన్పైన సూచనలను అనుసరించి మీ పేరు, చిరునామా, పుట్టిన తేదీ వంటి వివరాలు ఫిల్ చేయాలి. ఆధార్, పాన్ ఇతర అవసరమైన పత్రాల స్కాన్ చేసిన కాపీలను అప్లోడ్ చేయాలి. ఇవన్నీ పూర్తయిన తరువాత సబ్మిట్ బటన్పై క్లిక్ చేయాలి. ఆ తరువాత సర్వీస్ నెంబర్ పొందుతారు. దీనికి సంబంధించి ఎస్ఎమ్ఎస్ లేదా ఈ-మెయిల్ వంటివి పొందుతారు. -
పాన్కార్డు పనిచేయడం లేదా? మరి జీతం అకౌంట్లో పడుతుందా?
PAN - Aadhar link: ప్రతిఒక్కరి దైనందిన జీవితంలో పాన్ కార్డ్ ఓ భాగమైపోయింది. ఆర్థిక లావాదేవీలన్నింటికీ పాన్ కార్డ్ చాలా అవసరం. ఈ పాన్ కార్డును ఆధార్ కార్డుతో లింక్ చేసుకోవడం ప్రభుత్వం తప్పనిసరి చేసింది. దీనికి గడువు 2023 జూన్ 30తో ముగిసింది. ఆ తర్వాత ఆధార్తో లింక్ చేయని పాన్ కార్డులు పనిచేయకుండా (ఇనాపరేటివ్) పోయాయి. ఇప్పటికీ పాన్-ఆధార్ లింక్ చేయనివారు కొంతమంది ఉన్నారు. దీంతో వారి పాన్ కార్డులు ఇనాపరేటివ్ అయ్యాయి. ఈ నేపథ్యంలో అలాంటి పాన్ కార్డులున్నవారికి జీతం అకౌంట్లో క్రెడిట్ అవుతుందా అనే సందేహం తలెత్తింది. (ఎస్బీఐలో అద్భుత పథకం! గడువు కొన్ని రోజులే...) ఆధార్తో లింక్ చేయకపోవడంతో పాన్ కార్డులు ఇనాపరేటివ్గా మారడం వల్ల ఆర్థిక లావాదేవీల్లో కొన్ని సమస్యలు ఎదురైనప్పటికీ జీతం బ్యాంక్ ఖాతాకు జమ కాకుండా ఆపదు. అయితే ఈ పనిచేయని పాన్ కార్డును ఎక్కడా ఉపయోగించడానికి వీలుండదు. కానీ జీతాలు జమ చేసేది యాజమాన్యాలు కాబట్టి బ్యాంకులు ఎలాంటి ఆంక్షలు పెట్టలేవు. ఇదీ చదవండి: నిమిషాల్లో లోన్.. ఆర్బీఐ ప్రాజెక్ట్ అదుర్స్! ఆనంద్ మహీంద్రా ప్రశంస మొదట ఉచితంగా పాన్-ఆధార్ లింకింగ్కి 2022 మార్చి 31 వరకు ప్రభుత్వం గడవు విధించింది. ఆ తర్వాత రూ. 500 జరిమానాతో 2022 జూన్ 30 వరకు గడువును పొడిగించింది. అనంతరం రూ. 1000 జరిమానాతో 2023 మార్చి 31 వరకు, చివరిసారిగా 2023 జూన్ 30 వరకు గడవులు పొడిగించుకుంటూ వచ్చింది. తర్వాత మరోసారి గడువును ప్రభుత్వం పొడించలేదు. దీంతో 2023 జూన్ 30 తర్వాత ఆధార్తో లింక్ చేయని పాన్ కార్డులు ఇనాపరేటివ్గా మారిపోయాయి. -
యాక్సిస్ బ్యాంక్ ఖాతాదారులకు బంపరాఫర్!
ముంబై: ప్రైవేటు రంగంలోని యాక్సిస్ బ్యాంక్ కొత్త మార్గాన్ని ఎంచుకుంది. పరిశ్రమలో వినూత్నంగా సబ్స్క్రిప్షన్ (చందా) ఆధారిత సేవింగ్స్ అకౌంట్ను తీసుకొచ్చింది. ఈ ఖాతాలో కనీస బ్యాలన్స్ ఉంచాల్సిన అవసరం లేదు. చాలా రకాల సేవలకు విడిగా ఎలాంటి చార్జీలు పడవు. కాకపోతే ప్రతి నెలా చందా కింద రూ.150 చెల్లించుకోవాలి. లేదంటే ఏడాదికోసారి అయితే రూ.1,650 చెల్లిస్తే సరిపోతుంది. దీనికి ‘ఇన్ఫినిటీ సేవింగ్స్ అకౌంట్’ అని పేరు పెట్టింది. మెజారిటీ బ్యాంక్లు సేవింగ్స్ ఖాతాలను కనీస బ్యాలన్స్తో అందిస్తున్నాయి. ఇది ప్రాంతాన్ని బట్టి రూ.2,000 నుంచి రూ.15,000 మధ్య ఉంది. ఈ కనీస బ్యాలన్స్ తగ్గిపోతే పెనాల్టీ రూపంలో బ్యాంక్లు చార్జీలు బాదుతుంటాయి. చందా విధానంలో ఖాతాలో కనీస బ్యాలన్స్ అవసరం లేదని, దేశీయ లావాదేవీలపై ఎలాంటి చార్జీలు లేవని, ఉచిత డెబిట్ కార్డులను అందిస్తున్నట్టు, ఎన్ని సార్లు అయినా ఉచితంగా వినియోగించుకోవచ్చని యాక్సిస్ బ్యాంక్ ప్రకటించింది. -
ఏబీపీఎస్కు మారితేనే ఉపాధి కూలి జమ
సాక్షి, హైదరాబాద్: జాతీయ ఉపాధిహామీ చట్టం కింద ఉపాధి పొందాలంటే తప్పనిసరిగా ఆధార్ ఆధారిత చెల్లింపు బ్రిడ్జి సిస్ట మ్ (ఏబీపీఎస్)కు మారాల్సిందే. గతంలో మూడునాలుగు పర్యాయాలు ఈ డెడ్లైన్ మారినా, ఇకపై ఎలాంటి పొడిగింపులు ఉండవని కేంద్ర ప్రభుత్వవర్గాలు స్పష్టం చేస్తు న్నట్టు తెలుస్తోంది. ఆగస్టు 31వ తేదీ వరకే బ్యాంక్ ఖాతా ఆధారిత, ఆధార్ ఆధారిత పద్ధతుల్లో పేమెంట్స్ చేస్తారు. ఇకపై ఆధార్–ఎనెబుల్డ్ పేమెంట్ సిస్టమ్ (ఏఈపీఎస్) కాకుండా, సెపె్టంబర్ 1వ తేదీ నుంచి ఏబీపీఎస్ అనుసరిస్తున్నారనే విషయాన్ని గమనించాల్సి ఉందని అధికారులు చెబుతున్నారు. ♦ ఈ కొత్త విధానంలో భాగంగా ఉపాధి హామీ జాబ్కార్డ్ హోల్డర్, తన జాబ్కార్డ్ను బ్యాంక్ ఖాతా, ఆధార్తో అనుసంధానం చేయడంతో పాటు దీనిని నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్పీసీఐ) మ్యాపర్తో తప్పనిసరిగా కనెక్ట్ చేయాలి. ♦ ఆధార్తో బ్యాంక్ అకౌంట్ సీడింగ్, ఎన్పీసీఐ మ్యాపర్లో మ్యాపింగ్ చేయడానికి ఖాతాదారు కేవైసీ వివరాలు, బయోమెట్రిక్, స్థానికత, ఆధార్ డేటా బేస్–బ్యాంక్ ఖాతాల్లోని వివరాల్లో తేడాలు లేకుండా చూసుకోవడం వంటివి చేయాల్సి ఉంటుంది. ♦ ఉపాధిహామీ జాబ్కార్డు సమాచారంలో తేడాలున్నా వేజ్ పేమెంట్ అనేది స్తంభిస్తుంది. ♦ ఉపాధి కూలీలు బ్యాంక్ ఖాతాలను తరచుగా మార్చడం, దానిని ప్రోగ్రామ్ ఆఫీసర్లు అప్డేట్ చేయకపోవడం, తదితర కారణాల నేపథ్యంలో లబ్దిదారులకు నష్టం జరగకుండా ఏబీపీఎస్ అత్యుత్తమ ప్రత్యామ్నాయమని కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ స్పష్టం చేసింది. ♦క్షేత్రస్థాయిలో వివిధ జిల్లాల్లో జాబ్కార్డును బ్యాంక్ ఖాతా, ఆధార్తో అనుసంధానం చేయడంలో సిబ్బందికి అనేక ఇబ్బందులు ఎదురవుతున్నాయని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి అధికారులు చెబుతున్నారు. ఈ డెడ్లైన్ మరికొంతకాలం పొడిగిస్తే అందరికీ ఉపయోగకరంగా ఉంటుందని సూచిస్తున్నారు. లిబ్టెక్ నివేదికలో ఏముందంటే... ♦కేంద్ర ప్రభుత్వం సాంకేతిక అంశాలకు ప్రాధాన్యం ఇచ్చి ఉపాధిహామీ చట్టం ఆశయాలు, లక్ష్యాలను నీరుగారుస్తుందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ♦ రాష్ట్రంలోని మొత్తం కోటీ ఐదు లక్షల మంది (ఇన్ యాక్టివ్ వర్కర్లతో సహా) ఉపాధి కూలీల్లో 42 లక్షల మంది ఏబీపీఎస్కి అనర్హులుగా ఉండిపోయారు. ♦ పనిచేస్తున్న 61 లక్షల కూలీల్లో (యాక్టివ్ వర్కర్స్) 5.33 లక్షల మంది ఏబీపీఎస్కి అర్హత సాధించలేకపోయారు. ♦ నరేగా పోర్టల్ నుంచి సమాచారాన్ని విశ్లే షించిన లిబ్టెక్ ఇండియా సంస్థ తన ని వేదికలో ఈ విషయాలను వెల్లడించింది. పేమెంట్ మిస్ కాకుండా ప్రభుత్వాలే బాధ్యత వహించాలి యాక్టివ్ వర్కర్స్ కేటగిరీలో ఏబీపీఎస్ అర్హత విషయంలో మొత్తం కార్మికుల సంఖ్యను పరిగణనలోకి తీసుకున్నపుడు గణనీయమైన సంఖ్యలో కార్మికులు దీనికి అర్హత సాధించలేదని అర్థమవుతుంది. దీంతో వారు ఉపాధి హామీ కింద పని పొందడానికి అనర్హులుగా చేస్తుంది. ఇది ఉపాధి చట్టం సూత్రాలకు స్పష్టమైన ఉల్లంఘనే. అంతేకాకుండా, గత 18 నెలల్లో రాష్ట్రవ్యాప్తంగా నికరంగా తొలగించిన దాదాపు 4 లక్షల మంది కార్మికులను ఏబీపీఎస్ అర్హత గణాంకాలు పరిగణనలోకి తీసుకోలేదు. తెలంగాణలో ఏ ఒక్క కార్మికుడు కూడా ఏబీపీఎస్ కారణంగా ఉపాధి హామీ చట్టం కింద పని, పేమెంట్ మిస్ కాకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వాలదే. – చక్రధర్ బుద్దా,డైరెక్టర్, లిబ్టెక్ ఇండియా సంస్థ -
1 నుంచి ‘ఉపాధి’కి ఆధార్ చెల్లింపులు
సాక్షి, అమరావతి: దేశవ్యాప్తంగా ఉపాధి హామీ కూలీలకు సెప్టెంబరు 1వతేదీ నుంచి పూర్తి స్థాయిలో ఆధార్తో అనుసంధానం చేసిన బ్యాంకు అకౌంట్లకు మాత్రమే వేతనాలు చెల్లింపులు చేస్తారు. ఉపాధి హామీ జాబ్ కార్డు నెంబరుతో పాటు ఆధార్, బ్యాంకు ఖాతాలను ఉమ్మడిగా అనుసంధానం చేసుకుంటేనే ఆయా ఖాతాలకు వేతనాలు జమ అవుతాయి. ఈ మూడింటినీ అనుసంధానం చేసుకోని వారికి సెప్టెంబరు ఒకటో తేదీ తర్వాత ఉపాధి పథకం పనులకు హాజరైనా వేతనాలు జమ చేసే పరిస్థితి ఉండదని గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు పేర్కొన్నారు. ఉపాధి హామీ పథకం అమలులో అక్రమాలకు తావులేకుండా ఉండేందుకు కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ ఈ మేరకు కీలక మార్పులు తెచ్చింది. దీన్ని ఈ ఏడాది ఫిబ్రవరి 1వతేదీ నుంచే అమలు చేయాలని తొలుత భావించినా చాలా రాష్ట్రాల్లో (మన రాష్ట్రం కాదు) పెద్ద సంఖ్యలో కూలీల జాబ్కార్డులను ఆధార్, బ్యాంకు అకౌంట్లతో అనుసంధానించే ప్రక్రియ పూర్తి కాకపోవడంతో పలు దఫాలు వాయిదా పడుతూ వస్తోంది. తాజాగా సెప్టెంబరు ఒకటి నుంచి ఖచ్చితంగా నూతన విధానంలోనే కూలీలకు వేతనాల చెల్లింపులు ఉంటాయని కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ రాష్ట్రాలకు స్పష్టం చేసినట్టు అధికారులు వెల్లడించారు. కేంద్రం ఈ ప్రతిపాదనలను తేకముందు నుంచే మన రాష్ట్రంలో ఉపాధి కూలీలకు పాక్షికంగా ఆధార్ అనుసంధానంతో కూడిన వేతనాల చెల్లింపులు కొనసాగుతున్నట్లు వివరించారు. రాష్ట్రంలో పథకం అమలులో పారదర్శకత కోసం వీలైనంత మేర కూలీల జాబ్కార్డులను బ్యాంకు అకౌంట్లతో అనుసంధానించగా మిగతావారికి కూడా ఇప్పటివరకు వేతనాలను చెల్లిస్తున్నారు. అయితే సెప్టెంబరు ఒకటి నుంచి మాత్రం వందకు వంద శాతం తప్పనిసరిగా ఆధార్ అనుసంధానం విధానంలో వేతనాల చెల్లింపుల ప్రక్రియ ఉంటుందని అధికారులు స్పష్టం చేశారు. రాష్ట్రంలో 99.53 శాతం అనుసంధానం ఆంధ్రప్రదేశ్లో 69 లక్షల కుటుంబాలకు చెందిన 1.24 కోట్ల మంది కూలీలు ఉపాధి హామీ పథకంలో పేర్లు నమోదు చేసుకున్నారు. వీరిలో ఏటా గరిష్టంగా 47.74 లక్షల కుటుంబాలకు సంబంధించి దాదాపు 79.81 లక్షల మంది కూలీలు ఉపాధి పనులతో లబ్ధి పొందుతున్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకు కలిపి గత ఐదేళ్లుగా ఏటా రూ.ఐదారు వేల కోట్లకు తక్కువ కాకుండా ప్రయోజనం చేకూరుతోంది. వేతనాల చెల్లింపుల్లో కేంద్రం తెచ్చిన నూతన విధానంతో ఉపాధి హామీ కూలీలెవరూ ఇబ్బంది పడకుండా రాష్ట్ర ప్రభుత్వం ముందస్తుగానే అన్ని జాగ్రత్తలు తీసుకుంది. మొత్తం 1.24 కోట్ల మంది కూలీలలో 99.53 శాతం మంది జాబ్ కార్డులు ఆధార్, బ్యాంకు అకౌంట్లతో అనుసంధానం ప్రక్రియను అధికారులు ఇప్పటికే పూర్తి చేశారు. గత మూడేళ్లలో ఒక్క రోజైనా ఉపాధి పనులకు హాజరైన క్రియాశీలక కూలీలలో 97.2 శాతం మందిని కూడా ఇప్పటికే అనుసంధానించారు. ఉపాధి పథకం కూలీల జాబ్కార్డులను ఆధార్, బ్యాంకు అకౌంట్లతో అనుసంధానించే ప్రక్రియలో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే మొదటి స్థానంలో ఉన్నట్లు కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. త్రిపుర, కేరళ, లడఖ్, పుదుచ్చేరి, చత్తీస్గఢ్, సిక్కిం, తమిళనాడు తరువాత స్థానాల్లో ఉన్నాయి. మన రాష్ట్రంలో ఉపాధి హామీ పథకంలో పేర్లు నమోదు చేసుకున్న కూలీలలో ఇంకా కేవలం 60 వేల మందికి సంబంధించి మాత్రమే ఆధార్ అనుసంధానం ప్రక్రియ పూర్తి కావాల్సి ఉందని అధికారులు వెల్లడించారు. వారు గతంలో పేర్లు నమోదు చేసుకున్నప్పటికీ ఉపాధి పనులపై పెద్దగా ఆసక్తి చూపని వారే కావచ్చని పేర్కొంటున్నారు. -
2014కు ముందు సర్వం అవినీత, కుంభకోణాలమయం
భోపాల్: దేశంలో 2014కు ముందు మొత్తం అవినీతి, కుంభకోణాలే రాజ్యమేలాయని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అన్నారు. పేద ప్రజల హక్కులను, సంపదను విచ్చలవిడిగా దోచుకున్నారని మండిపడ్డారు. పేదల కోసం ప్రభుత్వం కేటాయించిన సొమ్ము వారికి చేరకుండా మధ్యలోనే లూటీ చేశారని ధ్వజమెత్తారు. తాము అధికారంలోకి వచ్చాక ఆ అరాచకానికి తెరపడిందని, ఇప్పుడు ప్రతి పైసా నేరుగా పేదల బ్యాంకు ఖాతాల్లోకే పంపిస్తున్నామని ఉద్ఘాటించారు. నీతి ఆయోగ్ నివేదికను ఆయన ప్రస్తావించారు. గత ఐదేళ్లలో ఏకంగా 13.50 కోట్ల మంది భారతీయులు దారిద్య్ర రేఖ దిగువ(పీబీఎల్) కేటగిరీ నుంచి బయటపడ్డారంటూ నీతి ఆయోగ్ ప్రకటించిందని గుర్తుచేశారు. దేశంలో పన్నులు చెల్లించేవారి సంఖ్య భారీగా పెరిగిందని అన్నారు. పన్నుల సొమ్మును మంచి పనుల కోసం, దేశ అభివృద్ధి కోసం ప్రభుత్వం ఖర్చు చేస్తుందన్న నమ్మకం వారిలో కనిపిస్తోందని చెప్పారు. సోమవారం మధ్యప్రదేశ్లో కొత్తగా నియమితులైన ప్రభుత్వ ఉపాధ్యాయుల శిక్షణా కార్యక్రమంలో ప్రధాని వర్చువల్గా ప్రసంగించారు. భోపాల్లో ఈ కార్యక్రమం జరిగింది. ‘అమృతకాలంలో’ తొలి సంవత్సరం నుంచే సానుకూల వార్తలు రావడం ఆరంభమైందని, దేశంలో సంపద వృద్ధి చెందుతోందని, పేదరికం తగ్గిపోతోందని ఆయన హర్షం వ్యక్తం చేశారు. ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్(ఐటీఆర్)లు దాఖలు చేసే వారి సగటు వార్షికాదాయం ఆదాయం 2014లో రూ.4 లక్షలు ఉండేదని, ఇప్పుడు అది రూ.13 లక్షలకు చేరిందని వెల్లడించారు. ప్రజలు దిగువ ఆదాయ వర్గం నుంచి ఎగువ ఆదాయ వర్గంలోకి చేరుకుంటున్నారని మోదీ తెలిపారు. దేశమంతటా సానుకూల వాతావరణం దేశంలో దాదాపు అన్ని రంగాలు బలోపేతం అవుతున్నాయని, అదే స్థాయిలో ఉపాధి అవకాశాలు పెరుగుతున్నాయని, నూతన ఉద్యోగాల సృష్టి జరుగుతోందని ప్రధాని చెప్పారు. 2014లో మన దేశం ప్రపంచంలో పదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉండేదని, ఇప్పుడు ఐదో ఆర్థిక వ్యవస్థగా మారిందని చెప్పారు. కొత్తగా నియమితులైన 5,580 మంది ఉపాధ్యాయులకు రాష్ట్ర ప్రభుత్వం శిక్షణ ఇచి్చంది. -
50 కోట్ల దాటిన జన్ ధన్ యోజన ఖాతాలు.. ఉపయోగాలు ఇవే
దేశంలో ప్రధాన్ మంత్రి జన్ ధన్ యోజన ( పీఎంజేడీవై ) ఖాతాల సంఖ్య 50 కోట్ల మార్క్ను దాటాయని, వాటిల్లో 56 శాతం మహిళలవేనని కేంద్ర ఆర్ధిక శాఖ అధికారికంగా ప్రకటించింది. మొత్తం 50 కోట్ల అకౌంట్లలో 67 శాతం రూరల్, సెమీ- అర్బన్ ప్రాంతాల ప్రజలు ఓపెన్ చేసినట్లు పేర్కొంది. ఇక ఈ అకౌంట్లలో మొత్తం రూ.2.03లక్షల కోట్లు డిపాజిట్ చేసినట్లు తెలిపిన ఆర్ధిక శాఖ.. 34 కోట్ల మందికి రూపే కార్డ్లను ఉచితంగా అందించినట్లు వెల్లడించింది. జన్ ధన్ యోజన ఖాతాల్లో సగటు బ్యాలెన్స్ రూ. 4,076 కాగా, వీరిలో 5.5 కోట్లకు పైగా డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ (డీబీటీ) పొందుతున్నారని చెప్పింది. ఉపయోగాలు ఇవే కేంద్ర ప్రభుత్వం నిరుపేదలు సైతం బ్యాంకింగ్ సేవల్ని వినియోగించేందుకు 2014 లో ప్రధాన మంత్రి జన్ ధన్ యోజన (PMJDY) పథకాన్ని ప్రవేశ పెట్టింది. ఈ పథకంలో భాగంగా ఎలాంటి మినిమం బ్యాలెన్స్ లేకుండా జన్ ధన్ బ్యాంక్ ఖాతాల్ని వినియోగించుకోవచ్చు. రూపే డెబిట్ కార్డ్ తీసుకున్నవారికి రూ.2 లక్షల వరకు యాక్సిడెంటల్ ఇన్స్యూరెన్స్ కవరేజీ లభిస్తుంది. ఇక జన్ ధన్ అకౌంట్లో రూ.10,000 వరకు ఓవర్ డ్రాఫ్ట్ సదుపాయం ఉంది. -
అకౌంట్ లో డబ్బులు లేకున్నా 80,000 విత్ డ్రా చేసుకోవచ్చు...
-
డేంజర్: ఇది జరిగితే మీ బ్యాంక్ అకౌంట్ ప్రమాదంలో ఉన్నట్టే..
ప్రపంచవ్యాప్తంగా సైబర్ మోసాలు ఎక్కువయ్యాయి. అమాయక ప్రజల డబ్బును దోచుకునేందుకు సైబర్ మోసగాళ్లు రోజుకో ఎత్తు వేస్తూనే ఉన్నారు. ఈ నేపథ్యంలో ఓ షాకింగ్ విషయం వెలుగులోకి వచ్చింది. మీ డెబిట్, క్రెడిట్ కార్డ్ వివరాలు అత్యంత తేలికగా స్కామర్ల చేతికి చేరుతున్నాయి. టైమ్స్ ఆఫ్ ఇండియా కథనం ప్రకారం.. పలు అక్రమ వైబ్సైట్లు, టెలిగ్రామ్ చానెళ్లు డెబిట్, క్రెడిట్ కార్డ్ నంబర్లు, కార్డ్ హోల్డర్ పేర్లు, సీవీవీతో సహా వివరాలను స్కామర్లకు విక్రయిస్తున్నాయి. అదీ కూడా ఒక్కో కార్డు వివరాలు కేవలం 5 యూఎస్ డాలర్లు. అంటే రూ.410లకు మాత్రమే. పశ్చిమ దేశాలలో చెల్లింపులు ప్రాసెస్ చేయడానికి కార్డు వివరాలు ఉంటే సరిపోతుంది. ఓటీపీ అవసరం ఉండదు. అందుకే ఆయా దేశాల్లో పరిస్థితి చాలా భయంకరంగా ఉంది. కానీ భారత్లో వన్ టైమ్ పాస్వర్డ్ (OTP) ద్వారా రెండు-కారకాల ప్రామాణీకరణ తప్పనిసరి. అయినప్పటికీ దీన్ని కూడా అధిగమించడానికి స్కామర్లు కొత్త మార్గాన్ని కనుగొన్నారు. ఉన్నట్టుండి సిమ్ డీయాక్టివేట్ అయితే.. బాధితుల ఒరిజినల్ సిమ్ను డీయాక్టివేట్ చేయడం ద్వారా స్కామర్లు ఓటీపీని ఎలా యాక్సెస్ చేస్తున్నారో భారతీయ పోలీసు అధికారులను టైమ్స్ ఆఫ్ ఇండియా ఉటంకిస్తూ పేర్కొంది. హ్యాకర్లు డెబిట్, క్రెడిట్ కార్డ్ వివరాలను బాధితుడి పేరు, ఫోన్ నంబర్తో సహా షాడో వెబ్సైట్లు, టెలిగ్రామ్ చానెళ్ల ద్వారా అమ్మకానికి పెడుతున్నారు. సైబర్ మోసగాళ్లు ఈ వివరాలను కొనుగోలు చేసి టెలికాం సర్వీస్ ప్రొవైడర్లను సంప్రదించి బాధితుల సిమ్ కార్డ్ డీయాక్టివేట్ చేయిస్తున్నారు. తర్వాత డూప్లికేట్ సిమ్ పొంది ఓటీపీలను సునాయాసంగా యాక్సెస్ చేయగలుగుతున్నారు. నష్టం జరిగేంత వరకు బాధితుడి ఈ మోసం గురించి తెలియదు. కాబట్టి మీ సిమ్ కార్డ్ ఉన్నట్టుడి డీయాక్టివేట్ అయినట్లు గుర్తిస్తే వెంటనే అప్రమత్తం కావాలి. కొన్ని నిమిషాల్లోనే మీ బ్యాంక్ ఖాతా ఖాళీ అయ్యే ప్రమాదం ఉంది. ఈ వెబ్సైట్లను నిర్వహిస్తున్నదెవరు? నివేదిక ప్రకారం.. అక్రమ వెబ్సైట్లు, టెలిగ్రామ్ చానెళ్లను రష్యా, ఉక్రెయిన్ దేశాలకు చెందిన హ్యాకర్లు నిర్వహిస్తున్నట్లుగా తేలింది. వీళ్లు వెబ్సైట్లు, టెలిగ్రామ్ చానెళ్ల ద్వారా కార్డ్ వివరాలను హ్యాక్ చేసి విక్రయిస్తున్నారు. సంపన్న పాశ్చాత్య దేశాలకు చెందిన వారి కార్డు వివరాలకు ఒక్కో కార్డుకు 10 డాలర్లు (రూ.820) చొప్పున తీసుకుంటుండగా భారత్ సహా ఆసియా దేశాలకు చెందిన బాధితుల కార్డుల వివరాలకు చవగ్గా కేవలం 5 డాలర్లు (రూ.410)కే అమ్మేస్తున్నట్లుగా అధికారులు చెబుతున్నారు. 2022 జనవరిలో అటువంటి అక్రమ వెబ్సైట్ ఒకదానిని అధికారులు గుర్తించి చర్యలు తీసుకున్నారు. కానీ అలాంటి అక్రమ వెబ్సైట్లు, టెలీగ్రామ్ చానెళ్లు లెక్కకు మించి పుట్టుకొస్తున్నాయి. ఇదీ చదవండి: ఇంటర్నెట్ షట్డౌన్: ఆరు నెలల్లో ఇన్ని వేల కోట్ల నష్టమా? -
స్విస్ బ్యాంకుల్లోని భారతీయుల డబ్బు అన్ని వేల కోట్లా?
భారతదేశంలో చాలా మంది ప్రముఖులకు స్విస్ బ్యాంకుల్లో అకౌంట్స్ ఉంటాయని కొన్ని సందర్భాల్లో వినే ఉంటారు. స్విస్ బ్యాంకుల ఖాతాలను గురించి నిజ జీవితంలో కంటే సినిమాల్లో బ్లాక్ మనీ గురించి వచ్చే చాలా సందర్భాల్లో వినే ఉంటారు. కానీ ఈ బ్యాంకులో అకౌంట్స్ కలిగిన ఇండియన్స్ చాలా మందే ఉన్నట్లు నివేదికలు చెబుతున్నాయి. ఇంతకీ స్విస్ బ్యాంకులో ఉన్న భారతీయులకు సంబంధించిన డబ్బు ఎంత ఉండొచ్చు? స్విస్ బ్యాంకు రూల్స్ ఏంటి అనే మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. కేవలం భారతీయులు మాత్రమే కాకుండా ప్రపంచములోని చాలా దేశాల ధనవంతులు తమ డబ్బుని స్విస్ బ్యాంకులో దాచుకుంటారు. ఇతర బ్యాంకులతో పోలిస్తే స్విస్ బ్యాంకు రూల్స్ చాలా ఫ్రెండ్లీగా ఉంటాయని చెబుతారు. కావున అక్కడ అకౌంట్ ఉంటే చాలు లాకర్ ఇచ్చేస్తుంటారు. ఎవరు ఖాతా ఓపెన్ చేసారనే విషయాలు పెద్దగా పట్టించుకోరు. అంతే కాకుండా ఖాతాదారులకు సంబంధించిన వివరాలను ఎవరికీ వెల్లడించే అవకాశం లేదు. (ఇదీ చదవండి: విడుదలకు ముందే వన్ప్లస్ బడ్స్ వివరాలు లీక్ - ధర ఎంతంటే?) స్విట్జర్లాండ్ కేంద్ర బ్యాంక్ విడుదల చేసిన వార్షిక నివేదిక ప్రకారం, 2022 చివరి నాటికి భారతీయులకు, మన దేశంలోని కంపెనీలకు సంబంధించిన డబ్బు 3.42 బిలియన్ స్విస్ ఫ్రాంక్స్ అని తెలుస్తోంది. ఇది భారతీయ కరెన్సీ ప్రకారం సుమారు రూ. 30 వేల కోట్లు. 2021 కంటే 2022లో 11 శాతం డిపాజిట్లు తగ్గినట్లు గణాంకాలు చెబుతున్నాయి. (ఇదీ చదవండి: అట్లుంటది ముఖేష్ అంబానీ అంటే! ఆ కారు పెయింట్ ఖర్చు రూ. కోటి..) స్విస్ బ్యాంకుల్లో భారతీయుడు దాచుకున్న డబ్బుని బ్లాక్ మనీ అనలేమని సంబంధిత అధికారులు చెబుతున్నారు. ఎందుకంటే పన్ను ఎగవేత వంటి వాటికీ అడ్డుకట్ట వేయడానికి ఇండియాకి నిరంతరం సహకరిస్తున్నామని వెల్లడించారు. దీని కోసం స్విట్జర్లాండ్ 2018లో భారత్లో టాక్స్ విషయాలకు సంబంధించిన సమాచార మార్పిడి కోసం ఒక ఒప్పందం కుదుర్చుకుంది. ఇందులో భాగంగానే 2018 నుంచి స్విస్ బ్యాంకుల్లో ఖాతాలు కలిగి ఉన్న వారి వివరాలను భారత ట్యాక్స్ అథారిటీ చేతికి అందించినట్లు సమాచారం. -
ఇంటి దొంగ.. తమ్ముడి ఖాతా నుంచి మూడు కోట్లు హాంఫట్
హైదరాబాద్: అనారోగ్యంతో మృతి చెందిన తమ్ముడి బ్యాంక్ అకౌంట్లోంచి అన్న భారీ మొత్తంలో డబ్బు స్వాహా చేశాడు. మృతుడి భార్యకు రావాల్సిన ఇన్సూరెన్స్ డబ్బులు, ఇతర సేవింగ్స్ను సైతం కాజేసి జల్సాలు చేయడంతో బంధువులకు అనుమానం వచ్చి.. నిలదీయగా పొంతన లేని సమాధానాలు చెప్పాడు. మృతుడి భార్య, బంధువులు బ్యాంకుకు వెళ్లి ఆరా తీయగా రూ. 3 కోట్లు అతడు తన అకౌంట్కు బదిలీ చేసుకున్నట్లు వారు స్పష్టం చేశారు. దీంతో కొద్దిరోజుల క్రితం మృతుడి భార్య ఆసిఫ్నగర్ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేయగా కేసు నమోదైంది. అనంతరం ఈ కేసు ప్రాధాన్యత దృష్ట్యా సీసీఎస్కు బదిలీ చేయడంతో ఇక్కడ కేసును రీ రిజిష్టర్ చేసి పోలీసులు దర్యాప్తు చేపట్టారు. వివరాలు ఇలా ఉన్నాయి.. మెహిదీపట్నానికి చెందిన పటాన్ తబసుమ్ బాజీ భర్త సయ్యద్ నజీర్ అహ్మద్ కోవిడ్తో 2020లో మరణించాడు. అతను బతికున్నప్పుడు భార్య, పిల్లలపై ఇన్సూరెన్స్ చేశాడు. దీంతో పాటు తన బ్యాంక్ అకౌంట్లో కూడా కొంత డబ్బు ఉంచాడు. ఇవన్నీ తన మరణం అనంతరం భార్య పటాన్ తబసుమ్కు చెందేలా నామినీగా తనని చేర్చాడు. సయ్యద్ నజీర్ అహ్మద్ మృతి చెందిన తర్వాత ఇతని అన్న షేక్ జాన్ షాహీదా బాగోగులు చూసుకుంటానంటూ మృతుడి భార్య, పిల్లలకు దగ్గరయ్యాడు. తమ్ముడి పేరుపై ఉన్న బ్యాంకు లావాదేవీలన్నీ నీ పేరిట ట్రాన్స్ఫర్ చేస్తానంటూ పటాన్ తబసుమ్ను నమ్మించి ఆమె సంతకాలు తీసుకున్నాడు. ఆ తర్వాత రెండు ఖాతాల నుంచి దాదాపు రూ. 3 కోట్ల నగదును షేక్ జాన్ షాహీదా తన అకౌంట్కు బదిలీ చేసుకున్నాడు. ఆ డబ్బుతో కొత్త ఇన్నోవా కారు, బంగారు, వజ్రాల ఆభరణాలను కొనుగోలు చేశాడు. ఇదే సమయంలో యూఎస్ వెళ్లేందుకు ప్రయత్నాలు కూడా ముమ్మరం చేశాడు. ఈ క్రమంలో పటాన్ తబసుమ్ను చూసేందుకు బంధువులు ఇంటికి వచ్చినప్పుడు బ్యాంకు వివరాలు, పిల్లల బాగోగులు అడిగి తెలుసుకున్నారు. ఆర్థికపరమైన లావాదేవీలు, మా భారం అంతా కూడా బావ షేక్ జాన్ షాహీదా చూసుకుంటున్నాడని వారికి తెలిపింది. ఈ విషయంపై అనుమానం వ్యక్తం చేసిన బంధువులు పటాన్ తబసుమ్ను బ్యాంకుకు తీసుకెళ్లి ఖాతాలను చూపించగా.. మృతుడి భార్య సంతకాలు చేయడంతో ఆ డబ్బు మృతుడి అన్న షేక్ జాన్ షాహీదా ఖాతాలకు క్రెడిట్ అయినట్లు నిర్ధారించారు. ఆసిఫ్నగర్ పోలీసులకు బాధితురాలు ఫిర్యాదు చేయగా కేసు నమోదయ్యింది. తాజాగా ఈ కేసుకు ఉన్న ప్రాధాన్యత దృష్ట్యా సీసీఎస్కు బదిలీ చేశారు, ఇక్కడ రీ–రిజిష్టర్ చేసి దర్యాప్తును వేగవంతం చేశారు. -
PM Kisan: త్వరలో 14వ విడత నగదు జమ.. ఇలా చేయకపోతే రూ.2వేలు రావు
కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ యోజన పథకం ద్వారా దేశమంతటా అర్హులైన రైతులకు ఆర్థిక సహాయాన్ని అందిస్తున్న సంగతి తెలిసిందే. మోదీ సర్కార్ ఈ పథకం ప్రారంభించిన తరువాత ఇప్పటికే 13 విడతల్లో రైతుల ఖాతాల్లో నేరుగా నగదు జమ కాగా.. తాజాగా 14వ విడత ఎప్పుడు విడుదల కానుందా అనేదానిపైనే అందరి దృష్టి నెలకొని ఉంది. 2019లో ప్రధానమంత్రి ప్రతిష్టాత్మకంగా ప్రధాన మంత్రి సమ్మాన్ నిధి యోజన ప్రారంభించారు. దీని ద్వారా భారతదేశంలోని లక్షల మంది రైతులకు ఆర్థిక మద్దతు లభిస్తోంది. రూ. 6వేల వార్షిక వాయిదా ద్వారా రైతుల ఖాతాలోకి నగదు చేస్తోంది మోదీ సర్కార్. అయితే ఇప్పటికే 13వ విడత రుణమాఫీ పూర్తి కావడంతో 14వ విడత నగదు ఎప్పుడు తమ ఖాతాలో జమ అవుతుందని రైతులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం, పీఎం కిసాన్ తదుపరి విడతను రైతుల బ్యాంకు ఖాతాలకు పంపిణీ చేయడానికి ప్రభుత్వం అవసరమైన అన్ని ఏర్పాట్లు చేసింది. ఇప్పటి వరకు, ఈ కార్యక్రమంలో భాగంగా అర్హులైన రైతులు ఒక్కొక్కరికి ₹2000 చొప్పున 13 చెల్లింపులు పూర్తి అయ్యాయి. అయితే, 14వ విడత నగదు విడుదలపై ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం నుంచి మాత్రం ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఇదిలా ఉండగా రైతులు వారి ఖాతాలో నగదు జమ కావాలంటే ఈకేవైసీని తప్పనిసరి పూర్తి చేసుకోవాల్సి ఉంటుంది. ప్రధాన మంత్రి కిసాన్ యోజన పథకం స్టేటస్ ఇలా చెక్ చేసుకోండి.. మొదటగా పీఎం కిసాన్ అధికారిక వెబ్సైట్ https://pmkisan.gov.in లోకి లాగిన్ అవ్వాలి. అధికారిక వెబ్సైట్ హోమ్పేజీలో ఫార్మర్స్ కార్నర్ అనే బటన్పై క్లిక్ చేయాలి. తరువాత పీఎం కిసాన్ బెనిఫిషియరీ స్టేటస్ అనే ఆప్షన్ పై క్లిక్ చేయాల్సి ఉంటుంది. వెబ్సైట్లో అడిగిన వివరాలు నమోదు చేయండి వన్-టైమ్ పాస్వర్డ్ కోసం గెట్ ఓటిపి అనే బటన్ పై క్లిక్ చేయండి. మీ మొబైల్కి వచ్చిన ఓటీపీని సబ్మిట్ చేయగలరు. అనంతరం మీరు పీఎం కిసాన్ లబ్ధిదారుని స్టేటస్ తెలుసుకోవచ్చు. చదవండి: ‘బయటకు వెళ్లి సిగరెట్ కాల్చుకో’ అన్నాడని.. -
రూ 456 కడితే రూ 2 లక్షల బెనిఫ్ట్..!
-
వెలవెలబోతున్న బ్యాంక్లు
సాక్షి, చైన్నె : రూ. 2 వేల నోట్ల మార్పిడి కోసం బ్యాంక్లలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. అయితే, బ్యాంక్లన్నీ వెలవెల బోయాయి. రిజర్వు బ్యాంక్ వద్ద మాత్రం జనం బారులు తీరి కనిపించారు. వివరాలు.. రూ. 2 వేల నోటును రద్దు చేస్తూ రిజర్వు బ్యాంక్ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. దీంతో ఈ నోట్లను తీసుకునేందుకు వ్యాపారులు ముందుకు రావడం లేదు. దీంతో తమ వద్ద ఉన్న నోట్లను బ్యాంక్ల ద్వారా మార్చుకోవచ్చని రిజర్వు బ్యాంక్ ప్రజలకు ఊరట కలిగింది. ఇందు కోసం బ్యాంక్లలో ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేశారు. మంగళవారం నుంచి అన్ని బ్యాంక్లలో రూ. 2 వేల నోట్ల మార్పిడి కోసం చర్యలు తీసుకున్నారు. అయితే, బ్యాంక్లన్నీ వెల వెలబోయాయి. పెద్ద సంఖ్యలో జనం బారులు తీరుతారని భావించి ఏర్పాట్లు చేసినా, ఆ మేరకు ఖాతాదారులు రాకపోవడం గమనార్హం. ఇక, రాష్ట్రంలో అనేక ప్రైవేటు బ్యాంక్లు నోట్ల మార్పిడి కోసం వచ్చిన వారికి దరఖాస్తుల ఫాంలు ఇచ్చి పూర్తి చేయాలని సూచరించడం గమనార్హం. అయితే, ఎలాంటి వివరాలను తెలియజేయాల్సిన అవసరం లేదని రిజర్వు బ్యాంక్ పేర్కొన్నా, ప్రైవేటు బ్యాంక్లు వివరాలను సేకరించడం వివాదానికి దారి తీసింది. ఇక, చైన్నెలోని రిజర్వు బ్యాంక్ వద్ద ఉదయాన్నే జనం బారులు తీరి, తమ వద్ద ఉన్న నోట్లను మార్చుకున్నారు. ఒకొక్కరు రూ. 20 వేల వరకు తమ వద్ద ఉన్న రూ 2 వేల నోట్లను అందజేసి రూ. 500 నోట్లను తీసుకెళ్లారు. -
బ్యాంక్ అకౌంట్ క్లోజ్ చేయాలా? ఒక్క నిమిషం.. ఇవి తెలుసుకోండి!
ఆధునిక కాలంలో ఉద్యోగాలు చేసే వారికి మాత్రమే కాకుండా, సాధారణ ప్రజలకు కూడా ఒకటి కంటే ఎక్కువ బ్యాంక్ అకౌంట్స్ ఉంటాయి. అయితే తరచుగా ఉపయోగించే బ్యాంక్ అకౌంట్ కాకుండా.. నిరుపయోగంగా ఉన్న బ్యాంక్ ఖాతాలను వీలైనంత వరకు క్లోజ్ చేసుకోవడం ఉత్తమం అని నిపుణులు చెబుతున్నారు. అయితే అలాంటి బ్యాంక్ అకౌంట్స్ క్లోస్ చేసుకోవడానికంటే ముందు తప్పకుండా కొన్ని పూర్తి చేయాల్సిన పనులు ఉన్నాయి. వాటిని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. ►బ్యాంక్ అకౌంట్ క్లోజ్ చేయాలనుకునే వ్యక్తి ముందుగా ఖాతాలో ఉన్న బ్యాలెన్స్ తెలుసుకోవాల్సి ఉంటుంది. ఒక వేళా అందులో ఏదైనా అమౌంట్ ఉన్నట్లయితే దానిని విత్డ్రా చేసుకోవడం ఉత్తమం. అంతే కాకుండా ఆ బ్యాంక్ ఖాతాకు సంబంధించిన రెండు నుంచి మూడు నెలల స్టేట్మెంట్ తీసుకోవాలి. ఇది భవిష్యత్తులో మీకు తప్పకుండా ఉపయోగపడే అవకాశం ఉంటుంది. ►ఒక వేళా మీరు మీ బ్యాంక్ అకౌంట్ క్లోజ్ చేయాలనుకున్నప్పుడు ఆ ఖాతాలో తగినంత బ్యాలెన్స్ లేకపోతే అకౌంట్ క్లోజ్ చేయడం వీలు కాదు. కావున నెగిటీవ్ బ్యాలెన్స్ లేకుండా ముందుగానే చూసుకోవాలి. బ్యాంకులో అకౌంట్ ఉన్నప్పుడు కొన్ని చార్జీలు చెల్లించాల్సి ఉంటుంది. ఆ చార్జీలు సరైన సమయంలో చెల్లించని ఎడల బ్యాంక్ బ్యాలన్స్ మైనస్లోకి వెళుతుంది. కావున అకౌంట్లో మినిమమ్ బ్యాలన్స్ ఉన్నప్పుడే బ్యాంక్ అకౌంట్ క్లోస్ చేయడానికి వీలుపడుతుంది. (ఇదీ చదవండి: ఎన్ఆర్ఐ ఖరీదైన కారుకి చిన్నప్పుడు ప్రయాణించిన బస్ నెంబర్ - నెట్టింట్లో ప్రశంసలు) ►గతంలో మీరు ఏదైనా బ్యాంకులో అకౌంట్ ఓపెన్ చేసుకున్నప్పుడు నెలవారీగా మీరు చెల్లించాల్సిన ఈఎమ్ఐ, ఇతర సబ్స్క్రిప్షన్లు చెల్లించడానికి ఆటోమాటిక్ క్లియరెన్స్ ఇచ్చి ఉంటే అలాంటివి క్యాన్సిల్ చేసుకోవాలి. ఆలా చేయకపోతే మీరు సమయానికి చెల్లించాల్సిన డబ్బు చెల్లించలేరు, ఆ తరువాత అదనపు అమౌంట్ వంటివి చెల్లించాల్సి ఉంటుంది. ►ప్రస్తుతం చాలా బ్యాంకులు అకౌంట్ ఓపెన్ చేసిన ఏడాదిలోపే క్లోజ్ చేస్తే క్లోజర్ చార్జీలు విధిస్తుంది. కావున అకౌంట్ ఓపెన్ చేసిన తరువాత కనీస సంవత్సరం పూర్తయితే అప్పుడు బ్యాంకు అకౌంట్ క్యాన్సిల్ చేసుకోవచ్చు. (ఇదీ చదవండి: వారెవ్వా.. 21 నెలలు, రూ. 9000 కోట్లు - జీవితాన్ని మార్చేసిన ఒక్క యాప్!) ►ఈపీఎఫ్, ఇన్సూరెన్స్ పాలసీలు, ఇన్కమ్టాక్స్ డీటైల్స్ మీ సేవింగ్స్ అకౌంట్కి లింక్ అయి ఉంటే పిఎఫ్ అమౌంట్ విత్డ్రా చేసుకునేటప్పుడు, ఇన్కమ్టాక్స్ నుంచి రీఫండ్ వంటివి వస్తే కొంత సమస్యను ఎదుర్కోవాల్సి వస్తుంది. అలాంటి సమయంలో మీరు వేరే అకౌంట్ లింక్ చేసిన తరువాత పాత అకౌంట్ క్లోజ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇది ఎట్టిపరిస్థితుల్లో మరచిపోకూడదు. -
ఒకే ఒక్క చిన్న పొరపాటు.. మొత్తం బ్యాంకు ఖాతా ఖాళీ
సాక్షి, నాగర్కర్నూల్: ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లావ్యాప్తంగా ఇటీవల సైబర్ నేరాల కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. రెప్పపాటు కాలంలో మోసానికి గురిచేసే సైబర్ నేరాలపట్ల అవగాహన కొరవడటంతోనే బాధితులు ఎక్కువ సంఖ్యలో మోసపోతున్నారు. సైబర్ మోసానికి గురై రూ.లక్షల్లో డబ్బులు కోల్పోతున్న వారిలో ఉద్యోగులు, అక్షరాస్యులు సైతం ఉంటున్నారు. సైబర్ నేరాలకు గురైన వారిలో చాలామంది బాధితులు తమ పరువు పోతుందనే ఉద్దేశంతో పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు సైతం ముందుకు రావడం లేదని తెలుస్తోంది. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా రెండేళ్లలో చోటుచేసుకున్న సైబర్ నేరాల్లో అధికంగా సెల్ఫోన్కు వచ్చిన మెసేజ్లకు స్పందించడం, ఆన్లైన్ యాప్లకు సంబంధించినవే అధికంగా ఉంటున్నాయి. సైబర్ నేరస్తుల బారిన పడి మోసపోతున్న బాధితుల సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. 2022లో ఉమ్మడి జిల్లావ్యాప్తంగా సైబర్ నేరాలకు సంబంధించి మొత్తం 250 కేసులు నమోదు కాగా, ఈ ఏడాది గడిచిన నాలుగు నెలల్లోనే మొత్తం 43 కేసులు నమోదయ్యాయి. అలాగే పోలీస్స్టేషన్ల మెట్లు ఎక్కని బాధితుల సంఖ్య ఇంకా ఎక్కువే ఉంటుందని తెలుస్తోంది. నాగర్కర్నూల్ జిల్లాలోనే అత్యధిక సంఖ్యలో సైబర్ కేసులు నమోదవుతున్నాయి. ఈ జిల్లాలో 2022లో మొత్తం 69 కేసులు నమోదయ్యాయి. వీరిలో అధికంగా నాగర్కర్నూల్ మండలంలో 21 మంది, కల్వకుర్తిలో 11 మంది సైబర్ నేరగాళ్ల ఉచ్చులో పడి పెద్దమొత్తంలో డబ్బులు కోల్పోయారు. ఈ ఏడాదిలో మొత్తం 12 మంది బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ తర్వాత జోగుళాంబ గద్వాల జిల్లాలో అధికంగా 57 మంది సైబర్ నేరాలకు గురయ్యారు. అవగాహన లేకపోవడం వల్లే.. సైబర్ నేరాల్లో అధికంగా అపరిచిత వ్యక్తుల నుంచి వస్తున్న మెసేజ్లే ఎక్కువగా ఉంటున్నాయి. మెసేజ్లో వచ్చిన లింకుపై క్లిక్ చేయగానే క్షణాల్లో అకౌంట్లో డబ్బులు మాయమవుతున్నాయి. తర్వాత ఆన్లైన్ యాప్ల్లో పెట్టుబడి పెట్టాలంటూ, ఉద్యోగాలు ఇస్తామంటూ అమాయకులకు ఎరవేస్తూ మోసాలకు పాల్పడుతున్నారు. దీనిపై సంబంఽధిత క్షేత్రస్థాయిలో అవగాహన కల్పించకపోవడంతోనే బాధితుల సంఖ్య పెరుగుతుందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ‘నాగర్కర్నూల్ జిల్లా అచ్చంపేట లోని మహేంద్రనగర్ కాలనీకి చెందిన శ్రీకాంత్ ఫోన్కు గతనెల 20న అపరిచిత వ్యక్తుల నుంచి మెసేజ్ వచ్చింది. ఇంట్లో నుంచే పార్ట్టైం జాబ్ చేస్తూ డబ్బులు సంపాదించొచ్చు అంటూ వచ్చిన లింక్పై నొక్కడంతో శ్రీకాంత్ అకౌంట్లో ఉన్న రూ.1.40 లక్షలు మాయమయ్యాయి. మోసపోయినట్టు గుర్తించిన బాధితుడు పోలీసులకుఫిర్యాదు చేశాడు.’ ‘వనపర్తి జిల్లా కేంద్రానికి చెందిన శ్రీనివాసులు వాట్సప్కు గత నెల 22న వచ్చిన మెసేజ్కు స్పందించాడు. అపరిచితుల నుంచి వచ్చిన వాట్సప్ లింకుపై క్లిక్ చేయగానే, అకౌంట్లో ఉన్న రూ.94 వేలు డ్రా అయినట్టు వచ్చిన మెసేజ్ చూసి కంగుతిన్నాడు. జరిగిన మోసాన్ని గుర్తించి వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఇలాంటి ఘటనలు పెరిగిపోతున్నాయి.’ వెంటనే ఫిర్యాదు చేయాలి.. ఇటీవల కాలంలో సైబర్ నేరాలకు సంబంధించిన కేసులు పెరుగుతున్నా యి. అపరిచితుల నుంచి వచ్చే అనవసర మెసేజ్లకు స్పందించొద్దు. తక్కు వ మొత్తాలకు ఎక్కువ వడ్డీ ఇస్తామని చెప్పే ఆన్లైన్ యాప్ జోలికి వెళ్లొద్దు. మోసపోయినట్టు గుర్తించినా వెంటనే బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేయాలి. వెంటనే ఫిర్యాదు చేస్తే సొమ్ము రికవరీ చేసే అవకాశం ఉంటుంది. – రామేశ్వర్, ఏఎస్పీ, నాగర్కర్నూల్ నారాయణపేట జిల్లా మాగనూర్లో ఇటీవల భారీ ఆన్లైన్ మోసం వెలుగుచూసింది. తక్కువ మొత్తంలో పెట్టుబడితోనే ఎక్కువ లాభం వస్తుందంటూ చెప్పిన కేటుగాళ్ల మాయాలోపడి సుమారు 40 మంది వరకు బాధితులు మోసపోయినట్టు తెలిసింది. ‘సోలో పవర్ వరల్డ్’ అనే ఆన్లైన్ యాప్లో ఒకసారి రూ.20 వేలు పెట్టుబడి పెడితే రోజుకు రూ.960 చొప్పున, మొత్తం 185 రోజుల వరకు రూ.1,78,800 వస్తాయంటూ యాప్ నిర్వాహకులు నమ్మబలికారు. కొన్నిరోజుల పాటు అకౌంట్లలో డబ్బులు పడ్డ తర్వాత గత వారం రోజులుగా యాప్ ఓపెన్ కావడం లేదు. ఒకరికి తెలిసిన వారు ఒకరు ఇలా ఒకే గ్రామానికి చెందిన బాధితులు మొత్తం సుమారు రూ.8లక్షల వరకు కోల్పోయినట్టు తెలిసింది. అయితే ఇంత జరిగినా దీనిపై ఫిర్యాదు చేసేందుకు బాధితులు ముందుకు రాకపోవడం గమనార్హం. ఇలాంటి సమయాల్లో బాధితులు వెంటనే స్పందించి ఫిర్యాదు చేస్తేనే ప్రయోజనం ఉంటుందని పోలీసులు చెబుతున్నారు.
Pagination
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
సంతోషంలో కావ్యా మారన్.. కేన్ విలియమ్సన్ను పలకరించి మరీ! (ఫొటోలు)
‘విద్య వాసుల అహం’ మూవీ రివ్యూ
'నా కొడుకు రాహుల్ని మీకు అప్పగిస్తున్నాను': సోనియా గాంధీ
అమెరికాలో ప్రమాదంలో ప్రాణాలు విడిచిన తెలంగాణ యువకుడు
చంద్రబాబుకి బయపడి గుళ్లలో తలా దాచుకుంటున్నారు..
అంతకంతకూ పెరిగిపోతున్న ఆస్తులు.. రిచ్లిస్ట్లో రిషి సునాక్ దంపతులు
మంచు విష్ణు ప్రాజెక్ట్లో టాలీవుడ్ స్టార్ హీరోయిన్.. ఎవరో తెలుసా?
అలా ప్రవర్తించినందుకు పిల్లలు తిట్టారు, ఏడ్చారు.. నాకూ దుఃఖమాగలేదు!
ఆ నాలుగు ఎంపీ స్థానాల్లో విజయంపై బీఆర్ఎస్ ధీమా..
తాడిపత్రి హింసాత్మక ఘటనల వెనుక అసలు హస్తం
తప్పక చదవండి
- ఓటీటీలోకి సుహాస్ లేటెస్ట్ హిట్ మూవీ.. మూడు వారాల్లోనే స్ట్రీమింగ్
- అధికారులను మార్చిన చోటే అల్లర్లు: మంత్రి బొత్స
- ఫుడ్ ప్రాసెసింగ్ సెక్టార్లో కృత్రిమ మేధ!
- లాలూ యాదవ్ కూతుళ్ళ పేర్ల వెనుక ఇంత హిస్టరీ ఉందా?
- ఏలియన్స్ ఉన్నట్లా? లేనట్లా?.. ఇంతకీ మస్క్ ఏమన్నారంటే?
- జెరోధా ట్రేడర్లకు అలెర్ట్.. అదిరిపోయే ఫీచర్తో
- ఛాతిలో కొట్టాడు, కడుపులో తన్నాడు: స్వాతి మలీవాల్ సంచలన ఆరోపణలు
- APL వేలంలో నితీశ్ కుమార్ రెడ్డికి అత్యధిక ధర.. సరికొత్త రికార్డు
- ట్విటర్ నుంచి నాగబాబు ఔట్.. వారిద్దరూ వార్నింగ్ ఇచ్చారా..?
- ఎట్టకేలకు గుడ్ న్యూస్ చెప్పిన ప్రభాస్
Advertisement