-
సీవీడ్తో ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో తెలుసా..!
సీవీడ్ అనేది ఒకరకమైన సముద్రపు నాచు. దీని సుషీ లేదా నోరి అని పిలుస్తారు. దీని వల్లో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. కూరగాయాలు, గుడ్లు, చేపలు వంటి వాటితో కలిపి దీన్ని రకరకాల రెసీపీలు చేస్తారు. ఇది జపాన్కి చెందింది. ప్రస్తుతం భారత్లో కూడా అత్యంత ప్రజాధరణ పొందిన వంటకంగా మారింది. దీన్ని ప్రాసీస్ చేసిన తర్వాత ఆకుపచ్చ షీట్లా కనిపిస్తుంది. ఇది ప్రత్యేకమైన రుచికి ప్రసిద్ధి. అలాంటి సుపీని ఆహారంలో చేర్చుకోవడంలో కలిగే ప్రయోజనాలేంటో సవివరంగా చూద్దాం.పోషకాల గని..సీవీడ్లో కేలరీలు తక్కువగా ఉన్నప్పటికీ అనేక ముఖ్యమైన పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. ఇది థైరాయిడ్ పనితీరుకు అవసరమైన అయోడిన్కి మంచి మూలం. అలాగే, ఇందులో ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు, ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్లతో పాటు విటమిన్లు ఎ, సి, ఇ, కె ఉన్నాయి. బయోయాక్టివ్ కాంపౌండ్స్ ఉనికి..సీవీడ్లో అనేక బయోయాక్టివ్ సమ్మేళనాలు ఉన్నాయి. ఇవి భూమిలోని కూరగాయలలో కనిపించవు. ఈ సమ్మేళనాలు యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీఆక్సిడెంట్, యాంటీ ట్యూమర్ లక్షణాలను కలిగి ఉంటాయి. అంతేగాదు ఇది క్యాన్సర్, హృదయ సంబంధ వ్యాధులు, మధుమేహం వంటి దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుందని అధ్యయనంలో తేలింది. జీర్ణవ్యవస్థ మెరుగ్గా ఉంచడంలో..నోరి లేదా సీవీడ్లో ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇది మన గట్ ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడుతుంది. ఇందులో ఉండే ఫైబర్ ప్రేగు కదలికలను సక్రమంగా ఉంచి మలబద్ధకాన్ని నివారిస్తుంది. తద్వారా జీర్ణక్రియ మెరుగ్గా ఉంటుంది. అలాగే కొన్ని రకాల సీవీడ్లలో ప్రీబయోటిక్స్ ఉంటాయి. ఇవి గట్ మైక్రోబయోమ్ను మెరుగుపరచడంలో సహాయపడతాయి. తద్వారా గట్ ఆరోగ్యాన్ని మెరుగ్గా ఉంచుతాయి.గుండె ఆరోగ్యంసీవీడ్లో పొటాషియం, మెగ్నీషియం హృదయ ఆరోగ్యాన్ని మెరుగ్గా ఉంచుతాయి. పొటాషియం శరీరంలో సోడియం ప్రభావాన్ని ఎదుర్కొనడమే గాక రక్తపోటు స్థాయిలను తగ్గిస్తుంది. అలాగే, ఫైబర్ కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో సహాయపడుతుంది. తద్వారా గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది.అయోడిన్ మూలంథైరాయిడ్ పనితీరుకు అవసరమైన అయోడిన్ సమృద్దిగా లభించే వాటిలో సీవీడ్ ఒకటి. ఇది థైరాయిడ్ జీవక్రియ, పెరుగుదల, అభివృద్ధికి ముఖ్యమైన హార్మోన్ల పనితీరును నియంత్రిస్తుంది. బరువు నిర్వహణలో..సీవీడ్లో ఫైబర్లు, ప్రొటీన్లు ఎక్కువగా ఉంటాయి. దీన్ని డైట్లో చేర్చుకోవడం వల్ల బరువు నిర్వహణలో సమర్థవంతంగా ఉపయోగపడుతుంది. ఎందుకంటే..?ఇది సంతృప్తిని మెరుగుపరచడంలో సహాయపడుతుంది. ఇది మొత్తం క్యాలరీలను తీసుకోవడం తగ్గించి ఎక్కువసేపు నిండుగా ఉన్న అనుభూతిని కలిగిస్తుంది.ఆరోగ్యకరమైన చర్మంసీవీడ్లో యాంటీఆక్సిడెంట్లు, విటమిన్లు పుష్కలంగా ఉంటాయి.ఇవి చర్మాన్ని ఫ్రీ రాడికల్స్ డ్యామేజ్ నుంచి రక్షించడానికి, చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలోనూ సమర్థవంతంగా పనిచేస్తుంది.అలాగే దీనిలో ఉండే విటమిన్ సి, విటమిన్ ఇ వంటివి కొల్లాజెన్ ఉత్పత్తి తోడ్పతాయి. ఇది చర్మ మరమ్మత్తులో ప్రభావవంతంగా పనిచేస్తుంది.యాంటీవైరల్, యాంటీ బాక్టీరియల్ లక్షణాలుసీవీడ్ యాంటీవైరల్, యాంటీ బాక్టీరియల్ లక్షణాలను కలిగి ఉందని అధ్యయనాల్లో వెల్లడయ్యింది. ఇవి వైరస్లు, ఇన్ఫెక్షన్లతో పోరాడటానికి సహాయపడతాయి. తద్వారా రోగనిరోధక వ్యవస్థ బలోపేతమవుతుంది. (చదవండి: వెస్ట్ నైలు వైరస్ని తొలిసారిగా అక్కడ గుర్తించారు! ఎవరికి ప్రమాదమంటే..) -
ప్రాన్స్తో బోలెడన్ని ఆరోగ్య ప్రయోజనాలు! అలా తింటే మాత్రం..
ప్రాన్స్ అంటే ఇష్టపడని వారుండారు. సీ ఫుడ్స్ బలవర్థకమైనవి రొయ్యలే. అలాంటి రొయ్యలు ఏ కూరగాయలతో వేసి వండినా..వాటి రుచే వేరు. తలుచుకుంటేనే నోట్లో నీళ్లూరిపోతాయి. అంత టేస్టీ..టేస్టీ రొయ్యలను వండకునేటప్పుడు జాగ్రత్త! అంటున్నారు నిపుణులు. ఆరోగ్యానికి ఎంత మేలు చేసే ఈ రొయ్యలను గనుక అలా తింటే ప్రాణాలు ప్రమాదంలో పడ్డట్టే అంటున్నారు వైద్యులు. రోయ్యలు రుచి పరంగానే కాదు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. అలాటి రొయ్యలు సరిగా క్లీన్ చేసి తినకపోతే అలెర్జీలు ఎదుర్కొనాల్సి వస్తుంది. అంతేగాదు ఒక్కోసారి ప్రాణాంతకంగా కూడా మారుతుంది. అదేలా అంటే.. ఆ పార్ట్ని తొలగించకుంటే.. రొయ్యల వీపుపై ఉండే నల్లని రక్తనాళాలు తొలగించకపోతే తీవ్రమైన సమస్యలు రావచ్చు. వాటిని ఉన్నప్పుడు తినడం వల్ల మరణం కూడా సంభవించొచ్చు. అందుకే వాటిని వండుకునే ముందు చాలా జాగ్రత్తగా శుభ్రం చేసుకోవాలి.రొయ్యల మీద ఉండే నల్లటి రక్తనాళాలు తప్పనిసరిగా తొలగించాలి. ఇది వ్యర్థాలు, విషపదార్థాలను మోసే ఈ సముద్ర ఆహారాల పేగు మార్గం. ఈ సిరలను తొలగించకపోవడం లేదా పాక్షికంగా వాటిని తొలగించడం వలన తీవ్రమైన ఫుడ్ అలెర్జీ రావడమే కాదు, అదే సమయంలో ప్రాణాంతకం కూడా కావచ్చు. అందుకే అలాంటి అలర్జీలు రాకుండా ఉండాలంటే ఈ రక్తనాళాలని తప్పకుండా తొలగించాలని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. నల్లని రక్తనాళాలు తొలగించకుండా తినడం వల్ల ఆహార అలర్జీకి దారి తీస్తుంది. అయితే అది తిన్న వెంటనే ఒక్కోసారి మీకు కనిపించకపోవచ్చు. అది పేగుల్లో వ్యర్థాలు, టాక్సిన్స్, రసాయనాలు రూపంలో ఉంటుంది. ఇవి మన జీర్ణవ్యవస్థ, పేగుల ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తాయి. వాటిని తొలగించకుండా వండుకుని తినడం వల్ల సడెన్గా చర్మంపై దద్దుర్లు రావాడం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, గురక, గొంతులో ఇబ్బంది తలెత్తవచ్చు. ఒక్కోసారి మరణం కూడా సంభవించే అవకాశం ఉంది. అయితే ఇవి తినడం వల్ల ప్రాణాలకి హాని జరుగుతుందనే విషయం తేల్చడానికి మరిన్ని పరిశోధనలు చేయాల్సి ఉందని అన్నారు నిపుణులు. అందువల్ల రొయ్యలు తినేటప్పుడు ఈ నల్లటి రక్తనాళాన్ని తొలగించటం వంటి జాగ్రత్తలు తీసుకుని తినడం మంచిదని చెబుతున్నారు. రొయ్యల వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు.. బరువు నియంత్రణలో.. బరువు తగ్గాలనుకునే వారు తప్పకుండా తమ డైట్లో రొయ్యలను చేర్చుకోవాలి. ఎందుకంటే రొయ్యలు సులువుగా జీర్ణమవడంతో పాటు. శరీరంలో అదనపు కొవ్వును కరిగించి బరువు తగ్గేలా చేస్తాయి. ఇక గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరిచే ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్స్ కూడా రొయ్యలతో లభిస్తాయి. అందువల్ల వారానికి ఒకసారైన రొయ్యల్ని తీసుకోవడం మంచిది. కేన్సర్కి చెక్.. వీటిలో సెలీనియం కంటెంట్ పుష్కలంగా ఉండటం వల్ల క్యాన్సర్ కణాలను శరీరంలోకి చొరబడకుండా నివారిస్తుంది. ప్రాణాంతక వ్యాధులతో పోరాడుతుంది. ప్రపంచ వ్యాప్తంగా పెరుగుతున్న క్యాన్సర్ నియంత్రణకు రొయ్యలు మంచి ఆహారం. పుష్కలంగా పోషకాలు అలాగే దంతాలు, ఎముకలు బలంగా ఉండాలంటే కాల్షియం అవసరం అన్న సంగతి అందరికీ తెలిసిందే. రొయ్యలలో కాల్షియం పుష్కలంగా ఉంటుంది. ఇది ఎముకల ఆరోగ్యానికి సహాయపడుతుంది. దీన్ని తీసుకోవడం వల్ల శరీరానికి కావాల్సిన పోషకాలు అందడంతో పాటు ఎముకలు, కండరాలు బలపడతాయి. చర్మ సౌందర్యానికి.. చర్మకాంతికి తోడ్పడే విటమిన్ ఇ రొయ్యల్లో ఉంటుంది. ఇది చర్మానికి కావలసిన పోషకాలను అందించి చర్మ కాంతిని మెరుగుపరుస్తుంది. రొయ్యల్లో విటమిన్ బి12 అధికంగా ఉంటుంది. తద్వారా మతిమరుపుని త్వరగా రానివ్వదు. అంతేకాకుండా శరీర నిర్మాణ కణాల అభివృద్ధికి ఉపకరించే శక్తి రొయ్యల్లో ఉంటుంది. (చదవండి: ప్రపంచంలోనే అత్యంత వృద్ధుడు ఇతడే..ఆరోగ్య రహస్యమిదే..!) -
సెలబ్రిటీలు తాగే బ్లాక్ వాటర్ ఏంటీ? నార్మల్ వాటర్ కంటే మంచిదా..!
చాలా మంది సెలబ్రిటీలు.. బ్లాక్ వాటర్ తాగుతూ ఉన్న ఫొటోలు తెగ సందడి చేస్తున్నాయి. క్రికెటర్ విరాట్ కోహ్లీ నుంచి కరణ్ జోహార్, శృతి హాసన్ ఇలా ఎంతో మంది సెలబ్రిటీల వరకు చాలామంది ఈ నీటినే తాగుతున్నారు. ఎందుకు వాళ్లు ఈ నీటిని తాగుతున్నారు. దీని ప్రత్యేకత ఏంటి?. మాములు వాటర్కి దీనికి తేడా ఏంటీ అంటే.. బ్లాక్ వాటర్.. ఈ మధ్యకాలంలో చాలా ట్రెండ్ అవుతోంది. ముక్యంగా సెలబ్రెటీలు బ్లాక్ వాటర్ తాగుతున్న లేదా క్యారీ చేస్తున్న ఫోటోలే ఇందుకు కారణం. ఇక ఈ బ్లాక్ వాటర్ దగ్గర కొస్తే ఇది చూడటానికి బ్లాక్గా ఉంటుంది. అయితే ఈ వాటర్ తాగితే అప్పటి వరకు శరీరం కోల్పోయిన నీరు తక్షణమే భర్తీ అవుతుందట. ముఖ్యంగా వ్యాయామం వంటివి చేసినప్పుడు కోల్పోయిన నీరు తక్షణమే పొందడంలో తోడ్పడుతుంట. పైగా వీటిలో పోషకాల శాతం అధికంగా ఉంటాయి. దీని వల్ల ఒనగురే ఆరోగ్య ప్రయోజనాలేంటంటే.. డిటాక్స్ డ్రింక్గా.. ఈ బ్లాక్ వాటర్ శరీరం నుంచి విష పదార్థాలను బయటకు పంపించే డిటాక్స్ డ్రింక్గా పని చేస్తుంది. బ్లాక్ వాటర్లో పుష్కలంగా ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, ఖనిజాలు.. శరీరంలో వ్యాధులకు కారణమయ్యే ఫ్రీ రాడికల్స్ను బయటికి పంపించడంలో శక్తిమంతంగా పని చేస్తుంది. దీంతో వృద్ధాప్య ఛాయలు త్వరగా రావు. జీర్ణవ్యవస్థ పనితీరు మెరుగుపడుతుంది.. బ్రాక్ వాటర్ శరీరంలో యాసిడ్ లెవెల్స్ని అదుపులో ఉంచుతుంది. ముఖ్యంగా జీర్ణవ్యవస్థ పనితీరు మెరుగుపడుతుంది. తీసుకున్న ఆహారం నుంచి సూక్ష్మ పోషకాలను శరీరం త్వరగా గ్రహించగలుగుతుంది. పైగా ఇమ్యూనిటీ పెరుగుతుంది. బరువు అదుపులో ఉంటుంది.. జీర్ణ వ్యవస్థ ఆరోగ్యంగా ఉంటే జీవక్రియల పనితీరూ మెరుగుపడుతుంది. ఫలితంగా శరీరంలో కొలస్ట్రాల్ పెరగదు. అదీగాక బరువును కూడా సులభంగా అదుపులో ఉంచుకోవచ్చు. రోజంతా ఉత్సాహాంగా, హెల్తీగా ఉంటారు. నార్మల్ వాటర్తో ఈ ప్రయోజనాలు పొందగలమా..? నిపుణులు నార్మల్ వాటర్ తోకూడా ఇలాంటి ప్రయోజనాలనే పొందొచ్చని చెబుతున్నారు.ప్రతిరోజు కనీసం 8 నుంచి 10 గ్లాసుల నీరు తాగాలని చెబుతున్నారు. అలాగే రోజంతా శరీరాన్ని హైడ్రేట్గా ఉంచేలా 12-15 గ్లాసుల నీరు త్రాగాలని చెప్పారు. ఇక్కడ శరీరానికి తగినంత నీరు అందితే.. బ్లాక్ వాటర్ వల్ల పొందే ప్రయోజనాలనే మాములు వాటర్తో కూడా సొంతం చేసుకుంటామని అన్నారు. అలా అని డైరెక్ట్గా ట్యాప్ వాటర్ తాగొద్దని చెప్పారు. నార్మల్ వాటర్ని గోరువెచ్చగా లేదా కాచ చల్లార్చి తాగితే ప్రయోజనాలు పొందగలరిన తెలిపారు. ఇలా చేస్తే.. శరీరంలో టాక్సిన్స్ తొలుగుతాయిన చెప్పారు. ముఖ్యంగా మలబద్ధకం సమస్య దూరం అవుతుంది. దీంతోపాటు శశరీరంలో రక్త ప్రసరణ మెరుగుపడుతుందని అన్నారు. అంతేగాక మంచి జీర్ణక్రియ కోసం.. ఉదయాన్ని గోరువెచ్చని నీటిలో నిమ్మరసం, చియా గింజలు వేసి తీసుకోంటే మరిన్ని ఆరోగ్య ప్రయోజనాలను పొందగలరని అన్నారు. బ్యాక్ వాటర్తో కలిగే దుష్ప్రయోజనాలు.. ఈ బ్లాక్ వాటర్ తాగితే ప్రయోజనాలు ఉన్నప్పటికీ.. ఎక్కువగా తీసుకుంటే అంతే స్థాయిలో సైడ్ఎఫెక్ట్స్ కూడా ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. ఇందులో అధికి పీహెచ్ స్థాయిలు ఉంటాయి. దీని కారణంగా శరీరంలో ఆల్కలైన్ స్థాయులు పెరిగిపోయి.. గ్యాస్-ఉదర సంబంధిత సమస్యలు, వికారం, వాంతులు, చర్మ సమస్యలు, ఏకాగ్రత కోల్పోవడం వంటివి వచ్చే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. దీనిలో ఉండే అధిక pH మీ చర్మాన్ని పొడిగా మార్చే అవకాశం ఉందని చెబుతున్నారు నిపుణులు. (చదవండి: లిప్ ఫిల్లింగ్ ట్రీట్మెంట్ మంచిదేనా? ఫెయిలైతే అంతేనా..!) -
వేసవిలో కుండలోని నీళ్లే ఎందుకు బెటర్?
వేసవిలో దాహార్తి మాములుగా ఉండదు. ఎంతలా అంటే ఏం తిన్నా ముందుగా దాహం అనిపించేస్తుంది. దీనిక తోడు బయట ఎండ ధాటికి తట్టుకోలేక చలచల్లగా నీళ్లు ఉంటే చాలనిపిస్తుంది. అందుకని ఫ్రిజ్లోని బాటిళ్లను ఖాళీ చేసేస్తుంటాం. అయితే చాలామంది కుండలోని నీళ్లే మంచిది అంటారు. ఫ్రిజ్లోని నీరు అస్సలు తాగొద్దని హెచ్చరిస్తుంటారు నిపుణులు. అసలు కుండలోని నీళ్లే ఎందుకు బెటర్ అంటే.. వేసవి రాగానే చల్లదనాన్ని అందించే కూలర్లు, ఏసీల అమ్మకాలు ఊపందుకుంటాయి. ఇదే సమయంలో ఫ్రిజ్ అమ్మకాలు కూడా పెరుగుతాయి. నేడు ప్రతి ఇంట్లో ప్రిజ్ తప్పనిసరిగా ఉంటుంది. కూరగాయలు ఇతర పదార్థాలను స్టోర్ చేసుకోవడంతో పాటు ఇందులో నీటిని కూడా ఉంచి చల్లగా చేసుకుంటాం. అయితే ఫ్రిజ్ నీరు తాగడం అంత మంచిది కాదని కొందరు ఆరోగ్య నిపుణులు గట్టిగా హెచ్చరిస్తున్నారు. పూర్వకాలంలో వేసవిలో ఎక్కువగా మట్టితో చేసిన కుండ నీరు తాగేవారు. ఇప్పుడు కూడా కొన్ని ప్రాంతాల్లో కుండ నీరే తాగుతున్నారు. వేసవిలో కుండ నీరు మాత్రమే చల్లగా ఉంటాయి. ఓపెన్ ప్లేసులో పెట్టడం వల్ల ఇవి మరింత చల్లగా మారుతాయి. ముఖ్యంగా మట్టిలో ఎక్కువగా మినరల్స్ ఉంటాయి. అందువల్ల కుండనీరు తాగగానే అవన్నీ నేరుగా శరీరంలోకి వెళ్లి మేలు చేస్తాయి. అందువల్ల ఫ్రిజ్ నీరు కంటే కుండలోని నీళ్లే ఆరోగ్యానికి మంచిది. రిఫ్రిజిరేటర్ నీరు మోతాదుకు మించి చల్లదనం ఉంటుంది. దీంతో శరీరంలోని కొన్ని కణాలు దెబ్బతింటాయి. కుండలో నీరు అయితే సమపాళ్లలో చల్లగా ఉంటాయి. దీంతో ఇవి తాగడం వల్ల ఎలాంటి హాని జరగదు. రెగ్యులర్గా కుండలో నీరు తాగడం వల్ల ఎలాంటి జీర్ణ సమస్యలు ఉండవు. ఫ్రిజ్ లో నీరు ఎక్కువగా తాగితే శరీరంలో వేడి అనూహ్యంగా పెరుగుతుంది. చలవ చేయడం మాటే అటుంచి అందులోనూ ఈ వేసిలో వేడిచేస్తే పరిస్థితి ఎలా ఉంటుందో తెలియంది కాదు. అందువల్ల కుండలోని నీటికే ప్రాధాన్యత ఇవ్వడం మంచిది నిపుణులు సూచిస్తున్నారు. అదీగాక మట్టి కుండలో నీరు తాగడం వల్ల జీవ క్రియలు పెరుగుతాయి. పైగా ఆరోగ్యంగా కూడా ఉంటారు. (చదవండి: Fennel Seeds: సొంపుతో ఇన్ని లాభాలా? ఐతే దీన్ని..!) -
ఇంగువతో ఇన్ని లాభాలా? బరువును తగ్గించే మ్యాజిక్ డ్రింక్
అసాఫెటిడా, హింగ్ లేదా ఇంగువగా ప్రసిద్ధి చెందింది. రుచి , ఘాటైన వాసనతో ఉండే భారతీయ వంటకాల్లో వాడే కీలకమైన సుగంధ ద్రవ్యం. పూర్వకాలం నుంచే భారతీయులు సుగంధ ద్రవ్యాలను ఎక్కువగా ఉపయోగించేవారు. ఇంగువను ప్రతిరోజు వంటకాలలో ఉపయోగిస్తే శరీరానికి మంచిదని ఆయుర్వేద గుణాలు పుష్కలంగా ఉన్నాయని ఆయుర్వేదం చెబుతోంది. దీని వల్ల ఆరోగ్య ప్రయోజనాలు, దుష్ప్రభావాలు గురించి తెలుసుకుందాం. సాంబారు, పప్పు, పులుసుకూరలు, పచ్చడి తాలింపులలో మాత్రమే వాడుతారు అనుకుంటే పొరపాటే. మంచి వాసన, రుచితోపాటు, ఇంగువ అనేక రకాల ఆరోగ్య సమస్యలను నయం చేస్తుంది. ఇంగువ ఆరోగ్య ప్రయోజనాలు బరువు తగ్గడానికిమ్యాజిక్ డ్రింక్: ఇంగువ నీరు తాగడం వల్ల బరువు త్వరగా తగ్గుతారు. ఇంగువలో ఫైబర్, కార్బోహైడ్రేట్, ప్రొటీన్, ఐరన్, కాల్షియం మొదలైనవి పుష్కలంగా ఉన్నాయి. అందుకే ఇంగువ నీరు మ్యాజిక్లా పనిచేస్తుందని చెబుతారు. ♦జీర్ణక్రియనుమెరుగుపరుస్తుంది గ్యాస్, ఉబ్బరం, అపానవాయువు వంటి కడుపు రుగ్మతల నివారణలో ఉపయోగపడుతుంది. కడుపు పూత,కడుపులో నులి పురుగుల సమస్యతో బాధపడేవారు ఇంగువ వాడి, దీన్ని అధిగమించవచ్చు. ఛాతీపై పూయడం వల్ల ఆస్తమా, కోరింత దగ్గు, ఊపిరితిత్తుల వాపు నుంచి ఉపశమనం లభిస్తుంది. ♦ యాంటీవైరల్ , యాంటీ బాక్టీరియల్ లక్షణాలను కలిగి ఉన్న కారణంగా ఇది ఉబ్బసం, బ్రోన్కైటిస్, దగ్గు వంటి శ్వాసకోశ సమస్యల నుంచి ఉపశమనం అందిస్తుంది. ♦ ఇంగువ సహజ యాంటిడిప్రెసెంట్.ఒత్తిడి ,ఆందోళన, డిప్రెషన్తో బాధపడేవారికి ఇంగువ మంచి మందు. ♦లైంగిక సమస్యలకు: నపుంసకత్వ సమస్యలలో బాధపడుతున్న పురుషులకు ఇది బాగా సహాయపడుతుంది. అకాల స్కలన సమస్యకు కూడా బాగా పనిచేస్తుందని అని నిపుణులు చెబుతున్నారు. స్త్రీ,పురుషుల్లో లైంగిక వాంఛను గణనీయంగా పెంచుతుందట కేన్సర్ ప్రమాదం: కేన్సర్ కణితి, పరిమాణాన్ని తగ్గించడంలో ఇంగువ బాగా ప్రయోజనకరంగా ఉంటుంది. కేన్సర్ వ్యాప్తిని అరికడుతుంది. ఇందులోని యాంటీఆక్సిడెంట్ లక్షణాలు కేన్సర్ కణాలతో పోరాడుతాయి. ♦ఊపిరితిత్తులు, కాలేయం ,మూత్రపిండాలలో మెటాస్టాసిస్ నివారణలో పనిచేస్తుంది. మెదడులోని రక్త నాళాలలో ఇన్ఫ్లమేషన్ను తగ్గించడంలో సహాయ పడుతుంది. తలనొప్పిని తగ్గిస్తుంది. ♦ యాంటీ ఏజింగ్: చర్మం ముడతలు, కళ్ల క్రింద నల్లటి వలయాలు ముఖంపై ముడతలను కూడా తొలగిస్తుంది. ఇందులోని టైరోసిన్ నిస్తేజమైన చర్మానికి మెరుపునిస్తుంది. ♦ రుమటాయిడ్ ఆర్థరైటిస్ లక్షణాలను తగ్గిస్తుంది కీళ్ల నొప్పి, వాపు తగ్గించే అనాల్జేసిక్, యాంటీ ఇన్ఫ్లమేటరీ ,రిలాక్సింగ్ లక్షణాలను కలిగి ఇంగులో ఉన్నాయి. ♦ పీరియడ్స్ సమయంలో తీవ్రమైన నొప్పి లేదా తిమ్మిరితో బాధపడుతుంటే ఇంగువ దివ్యవౌషధంలా పనిచేస్తుంది. ఇందులో ఉండే మూలకాలు బహిష్టు సమయంలో నొప్పిని తగ్గించడంతో పాటు ఇతర సమస్యలను తగ్గించడంలో ఉపయోగపడతాయి. ♦ పంటి నొప్పికి కూడా ఇంగువ మంచి ఫలితాలనిస్తుంది.ఇంగువలో నొప్పి నివారణ గుణాలు అలాగే యాంటీ బాక్టీరియల్ గుణాలు ఉంటాయి. ఇవి నొప్పి తగ్గించి ఉపశమనాన్ని అందిస్తాయి. -
మధుమేహం : ఈ సూపర్ ఫుడ్తో చెక్ చెప్పొచ్చు!
ప్రస్తుత కాలంలో డయాబెటిస్ సమస్య అందరిలోనూ కనిపిస్తోంది. చిన్నా, పెద్దా అనే తేడా లేకుండా అందరూ ఈ వ్యాధి బారిన పడుతున్నారు. ముఖ్యంగా జీవనశైలి, అనారోగ్యకరమైన ఆహారం తీసుకోవడం వల్ల మధుమేహం సమస్య నానాటికి పెరిగి పోతుందని వైద్యనిపుణులు చెబుతున్నారు. మధుమేహం విషయంలో, రక్తంలో చక్కెర స్థాయులను సాధారణంగా ఉండేలా చూసుకోవడం మొదటి ప్రాధాన్యతగా తీసుకోవాలి. రక్తంలో చక్కెర స్థాయి తగ్గించుకోవడానికి కొన్ని సూపర్ఫుడ్ల సహాయం తీసుకోవచ్చు. అవేంటో చూద్దామా... దాల్చిన చెక్క: రక్త ప్రవాహంలో చక్కెర కదలికను పెంచడం ద్వారా మధుమేహాన్ని నియంత్రించడంలో సహాయపడుతుంది. సొరకాయ: సొరకాయలో 92శాతం నీరు, 8శాతం ఫైబర్ ఉంటుంది. దీనిలో గ్లూకోజ్, చక్కెర సంబంధిత సమ్మేళనాల పరిమాణం చాలా తక్కువగా ఉంటుంది. ఇది డయాబెటిక్ రోగులకు అద్భుతమైన కూరగాయగా పరిగణిస్తారు. కాకరకాయ: రుచికి చేదుగా ఉండే కాకరకాయలో పాలీపెప్టైడ్–పి ఉంటుంది. ఇది ఇన్సులిన్ లాంటి హైపోగ్లైసిమిక్ ప్రొటీన్. ఇది కణాలలోకి గ్లూకోజ్ని తీసుకురావడంలో సహాయపడుతుంది. మెంతులు: ఇవి ఫైబర్, ఇతర రసాయనాలను కలిగి ఉంటాయి. ఇవి జీర్ణక్రియను నెమ్మదిస్తాయి. శరీరంలోని కార్బోహైడ్రేట్లు, చక్కెరను గ్రహించడంలో సహాయపడతాయి. దీని కారణంగా రక్తంలో చక్కెర సాధారణంగా ఉంటుంది. ఆకు కూరలు: ఈ కూరగాయలలో ఫైబర్, మెగ్నీషియం, విటమిన్ ఎ వంటి పోషకాలు అధికంగా ఉంటాయి. ఇవి రక్తంలో చక్కెరను తగ్గించడంలో సహాయపడతాయి. జొన్నలు, రాగులు: జొన్నలు, రాగులు వంటి చిరుధాన్యాలలో డయాబెటిస్ను నియంత్రించే కారకాలు ఉంటాయి. రాగి జావ, జొన్న రవ్వతో చేసిన ఉప్మా, జొన్న రొట్టెలు, రాగి జావ, రాగి రొట్టెలు తీసుకోవడం డయాబెటిక్స్కు చాలా మంచిది. -
కలబంద మొక్కలు ఇన్ని రకాలు ఉన్నాయా!
అలోవెరా అనేది దాదాపు ప్రతి భారతీయ ఇంటిలో కనిపించే మొక్క.. ఇది అందం నుండి ఆరోగ్యం వరకు అన్ని విధాలుగా ఉపయోగపడే అనేక ప్రయోజనాలను కలిగి ఉంది. ఈ మొక్కను నరదిష్టి కోసం కూడా వాడతారు. చాలా సులభంగా పెంచుకునే మొక్కిది. మనకు తెలిసినంతవరకు కలబంద పెద్ద కాడలుగా ఉంటుంది. అయితే ఈ కలబందలో ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 200 రకాలు వరకు ఉన్నాయట. కానీ వాటిలో నాలుగు మాత్రమే ఆరోగ్యానికి, అందానికి ఉపయోగపడతాయట. మిగతా కలబంద మొక్కలను అలంకరణగా ఉపయోగిస్తారట. అయితే వాటిలో మనకు ఉపయోగపడే కలబంద రకాల మొక్కలు ఏంటీ? వాటిలో ఏవి మన చర్మ సంరక్షణలో ఉపయోగపడతాయో సవివరంగా తెలుసుకుందాం. ఎరుపు కలబంద ఇది చూడటానికి చాలా అందంగా ఉంటుంది. సూర్యకాంతిలో ఉంచినప్పుడు, దాని ఎరుపు రంగు కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది. దీని ఆకులకు చాలా ముళ్ళు ఉంటాయి. కానీ దాని అందం కారణంగా ప్రతి ఒక్కరూ తమ ఇంటిలో రెడ్ కలబందను నాటాలని కోరుకుంటారు. ఇది ప్రధానంగా దక్షిణాఫ్రికా మొక్క. దీనిని పెంచేందుకు ఎక్కువ నీరు అవసరం లేదు. చిన్న ఆకుల కలబంద లేతరంగు ఆకుల కారణంగా, అవి చాలా అందంగా కనిపిస్తాయి. ముళ్లతో నిండినప్పటికీ, చర్మ సంరక్షణలో దీనిని ఉపయోగిస్తారు. చిన్న లేతరంగు ఆకులతో పాటు, ఇది అందమైన ఎరుపు, పసుపు పువ్వులను కూడా ఉత్పత్తి చేస్తుంది. స్పైరల్ అలోవెరా ఇలాంటి కలబంద మొక్కలు మార్కెట్లో ఎక్కువగా కనిపిస్తాయి. అయితే ఇది చాలా అందమైన రకాల్లో ఒకటి. ఇది గుండ్రని ఆకారంలో మరియు ఎరుపు నారింజ రంగు పుష్పాలను కలిగి ఉంటుంది. ఈ మొక్క ఇంటి అలంకరణకు ఉత్తమంగా పరిగణించబడుతుంది. కార్మైన్ అలోవెరా.. ఈ కలబంద కూడా గృహ అలంకరణను మరింత ఇనుమడింప చేస్తుంది. ఇంటి అంకరణలో ఈ కార్మైన్ కలబంద ది బెస్ట్ అని చెప్పొచ్చు. ఇది ఒకరకమైన హైబ్రిడ్ మొక్క. అయితే ఇది నీరు లేకుండా కూడా జీవించగలదు. ఈ నాలుగు కలబంద రకాలు ఆరోగ్యానికి, అందానికి బాగా ఉపయోగడతాయి. ఇక మన ఇళ్లలో పెరిగే కలబంద కూడా చర్మ ఆరోగ్యానికి చాలా మంచిది. (చదవండి: వేసవిలో ఈ ఫుడ్స్కి దూరంగా ఉంటే మేలు!) -
శాస్త్రీయ నృత్యంతో బోలెడన్ని ఆరోగ్య ప్రయోజనాలు!
భరత నాట్యం నుంచి కూచిపూడి వరకు భారతీయ శాస్త్రీయ నృత్యాలలో వ్యాయామానికి సమానమైన అంశాలు ఎన్నో ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఈ తరం శాస్త్రీయ నృత్యాలపై ఆసక్తి ప్రదర్శిస్తోంది. నృత్య సాధనతో ఫిట్నెస్ను సొంతం చేసుకుంటుంది. ముంబైలో ఎంబీఏ చేస్తున్న శివానీ దీక్షిత్కు ఏ చిన్న పనిచేయాలన్న బద్దకంగా అనిపించేది. దీని వల్ల చదువు కూడా దెబ్బ తినే ప్రమాదం ఏర్పడింది. తన కజిన్ సలహా ప్రకారం అయిష్టంగానే భరతనాట్యం నేర్చుకోవడం మొదలు పెట్టింది. మొదట్లో ఎలా ఉన్నా ఆ తరువాత మాత్రం భరతనాట్యంపై దీక్షిత్లో అంతకంతకూ ఇష్టం పెరుగుతూపోయింది. ‘నేను ఎప్పుడూ వ్యాయామాలు చేయలేదు. అయితే భరతనాట్యం వల్ల ఎన్నో వ్యాయామాలు ఒక్కసారే చేస్తున్నట్లుగా అనిపించింది. బద్దకాన్ని వదిలించుకున్నాను. మనసు తేలిక అయినట్లుగా ఉంది’ అంటుంది శివానీ దీక్షిత్. ‘అధిక బరువుతో బాధ పడుతున్న నాకు కథక్ నృత్యం కాంతి కిరణంలా కనిపించింది. కథక్ నృత్య సాధనతో బరువు తగ్గడం సంతోషంగా ఉంది. కథక్ డ్యాన్స్ అనేది మచ్ మోర్ దెన్ ఏ వెయిట్ లాస్ ఎక్సర్సైజ్ అనేది నా అభిప్రాయం. బరువు తగ్గడానికే కాదు బ్రీతింగ్ ఎక్సర్సైజ్ల విషయంలోనూ కథక్ ఉపయోగపడుతుంది’ అంటుంది కోల్కతాకు చెందిన ఇరవై రెండు సంవత్సరాల నయనిక. బరువు తగ్గడానికి ఉపయోగపడే ఒడిస్సీ, జాజ్, కాంటెంపరీ వెస్ట్రన్ డ్యాన్స్లను కలిపి ఒక డ్యాన్స్ ఫామ్ రూపొందించినట్లు తెలుసుకున్న నయనిక ప్రస్తుతం ఆ సమ్మేళన నృత్యరూపం గురించి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నంలో ఉంది. ‘కేవలం బరువు తగ్గడానికే కాదు ఏకాగ్రతను పెంచడంలో, జ్ఞాపకశక్తిని మెరుగుపరచడంలో శాస్త్రీయ నృత్యాలు ఉపయోగపడతాయనే విషయాన్ని నృత్యసాధన ద్వారా స్వయంగా తెలుసుకున్నాను. శాస్త్రీయ నృత్యకదలిలకు చేతులు, కళ్ల మధ్య సమన్వయం అవసరం. ఇది ఆటోమెటిగ్గా ఏకాగ్రతను మెరుగుపరచడంలో ఉపయోగపడుతుంది’ అంటున్నాడు బెంగళూరు చెందిన ఇంజనీరింగ్ స్టూడెంట్ సందేష్ సృజన్. శివానిక్ దీక్షిత్, నయనిక, సందేశ్ సృజన్ల మాటలు శాస్త్రీయ నృత్యాల పట్ల యువతరం చూపుతున్న ఆసక్తికి అద్దం పడతాయి. ‘మన దేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన శాస్త్రీయ నృత్యాల జాబితా పెద్దది. ప్రతి నృత్యానికి తనదైన వేషధారణ, అలంకరణ, సంగీతం ఉంటాయి. శాస్త్రీయ నృత్యాన్ని నేర్చుకునే విధానం చాలా కఠినమైనది. దీనికి తగిన సమయం, శక్తి అవసరం. శాస్త్రీయ నృత్యం నేర్చుకోవడానికి ఆసక్తి మాత్రమే కాదు అంకితభావం చాలా ముఖ్యం, నృత్యం అనేది శారీరక, మానసిక ప్రయోజనాలకు ఉపయోగపడుతుంది. శాస్త్రీయ నృత్య రూప శైలి ఒకదానికొకటి భిన్నంగా ఉన్నప్పటికీ అభ్యాస ప్రక్రియ కండరాలను బలోపేతం చేస్తుంది. భరతనాట్యం, కూచిపూడి, మోహినియాట్టంలాంటి శాస్త్రీయ నృత్యరూపాలను సాధన చేయడం ద్వారా మజిల్ ఇంప్రూమెంట్ ఉంటుంది. రెగ్యులర్ ప్రాక్టీస్ శరీరంలోని ఆక్సిజన్ స్థాయులను పెంచడంలో సహాయపడుతుంది’ అంటుంది ప్రోఫెషనల్ క్లాసికల్ డ్యాన్సర్, ట్రైనర్ కీర్తి దివాకరన్. కేరళ కొచ్చీలోని వైనవి నృత్యకళాక్షేత్రం వ్యవస్థాపకురాలు కీర్తి.‘డ్యాన్సింగ్ అనేది న్యూరో–మస్క్యులార్ బ్యాలెన్స్ను వృద్ధి చేయడంలో సహాయపడుతుంది’ అంటుంది క్లాసికల్ డ్యాన్సర్, ట్రైనర్, కోజికోడ్లోని గౌరీశంకరం క్లాసికల్ డ్యాన్స్ థెరపీ ఇన్స్టిట్యూట్ మేనేజింగ్ డైరెక్టర్ డా. ప్రియా మేనన్. శాస్త్రీయ నృత్యరూపకాల వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి ఎన్నో అధ్యయనాలు చెప్పాయి. ఇంటర్నేషనల్ జర్నల్ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ అప్లైడ్ రిసెర్చ్ పేపర్ ప్రకారం... ఏదైనా వర్కవుట్ పదినిమిషాల ఒడిస్సీ డ్యాన్స్తో సమానం. డ్యాన్స్లో భాగంగా కాళ్ల నుంచి మెడ వరకు అన్నీ కదులుతాయి. గంట ఒడిస్సీ నృత్యం 250 కేలరీలు ఖర్చు కావడానికి కారణం అవుతుంది. ‘సైన్స్ అండ్ జర్నల్’లో ప్రచురితమైన రిసెర్చ్ పేపర్ ప్రకారం నాన్–డ్యాన్సర్లతో పోల్చితే కథక్ డ్యాన్సర్ల శరీర బరువు, బాడీ మాస్ ఇండెక్స్... మొదలైన వాటికి సంబంధించి బాడీ కంపోజిషన్ మెరుగ్గా ఉంటుంది. కథక్ డ్యాన్స్లోని క్విక్ ఫుట్ వర్క్ వల్ల ఒత్తిడి మాయం అవుతుంది. వ్యాయమాలతో కూడిన డ్యాన్స్ అనగానే ఒకప్పుడు జాజ్, లైన్ డ్యాన్స్, హిప్ హప్, సల్సా... మొదలైన వెస్ట్రన్ డ్యాన్స్లు మాత్రమే గుర్తొచ్చేవి. ‘ఎక్కడి దాకో ఎందుకు మన దగ్గరే బోలెడు శక్తిసంపద ఉంది’ అని గ్రహించిన యువతరం మన శాస్త్రీయ నృత్యాలకు దగ్గరవుతోంది. సాధన చేస్తోంది. ఆరోగ్య భాగ్యానికి చేరువ అవుతోంది. బాడీ బయో మెకానిక్స్ బాడీ బయోమెకానిక్స్ను బాగా అర్థం చేసుకోవడం డ్యాన్సర్ కమ్యూనిటీకి ముఖ్యం అంటుంది మధుమతి బెనర్జీ. భరతనాట్య కళాకారిణీ అయిన బెనర్జీ ఎన్నో దేశాలలో ప్రదర్శనలు ఇచ్చింది. ఇండియన్ క్లాసికల్ అండ్ ఫోక్ మ్యూజిక్లో కూడా ప్రావీణ్యం సాధించింది. శాస్త్రీయ నృత్యాలు నేర్చుకోవడానికి అవసరమైన స్ఫూర్తిని యువతరానికి ఇస్తోంది. నృత్యం ధ్యాన సాధనం.. ‘రోల్ ఆఫ్ ఇండియన్ క్లాసికల్ డ్యాన్స్ ఇన్ ఎడ్యుకేషన్’ పేరుతో రిమ్లీ భట్టాచార్య ఒక ఆర్టికల్ రాసింది. ‘భారతీయ శాస్త్రీయ నృత్యం మన విద్యా విధానంలో భాగంలో కావాలి. ఇది మన సంస్కృతికి సంబంధించిన శక్తిరూపమే కాదు అద్భుతమైన ధ్యాన సాధనం కూడా. విద్యార్థులు ఒత్తిడికి గురి కాకుండా ఉండడానికి ఏకాగ్రత, సృజనాత్మకతను పెంపొందించడానికి శాస్త్రీయ నృత్యం ఉపయోగపడుతుంది. డ్యాన్స్ మూమెంట్స్తో శారీరక దృఢత్వం కలుగుతుంది. శరీరంపై నియంత్రణ పెరుగుతుంది. అంతర్గత భావాలను వ్యక్తీకరించే పద్ధతి, ఆత్మవిశ్వాసం పెరుగుతాయి’ అంటుంది రిమ్లీ భట్టాచార్య. మెకానికల్ ఇంజినీరింగ్లో గోల్డ్ మెడలిస్ట్ అయిన రిమ్లీ ఎంబీఏ చేసింది. కార్పోరేట్ సెక్టార్లో పనిచేసింది. మానసిక ఆరోగ్యంపై ఎన్నో వ్యాసాలు రాసింది. ‘ఏ బుక్ ఆఫ్ లైట్’ పేరుతో పుస్తకం ప్రచురించింది. (చదవండి: నర్సు వెయిట్ లాస్ స్టోరీ..ఆ ఒక్క ఎక్స్ర్సైజ్తో జస్ట్ ఒక్క ఏడాదిలోనే..) -
రోజుకు ఒక్క అరగంట చాలు, ఫలితాలు మాత్రం!
నడక అన్ని వయసుల వారికి సరిపడే చక్కటి వ్యాయామం. క్రమ తప్పకుండా వాకింగ్ చేస్తే ఫిట్గా ఉండటమేకాదు ఆరోగ్య ప్రయోజనాలు కూడా మెండుగా ఉన్నాయి. రోగ నిరోధకశక్తి బలపడి, మంచి ఆయుర్దాయానికి సాయపడుతుంది. నడక వల్ల ప్రయోజనాలు ♦ నడకతో శరీరంలోని కొవ్వు నిల్వలు కలుగుతాయి. క్రమం తప్పకుండా వాకింగ్ చేస్తే ఊబకాయం కూడా నెమ్మదిగా కరుగుతుంది. ♦ రోజంతా మనసు హాయిగా, తేలిగ్గా ఉంటుంది. కొత్త ఉత్సాహం వస్తుంది. రోగనిరోధక శక్తి పెరిగి జలుబు లేదా ఫ్లూ ప్రమాదం తగ్గుతుంది. ♦ రోజుకు కనీసం 30 నిమిషాలు, వారానికి ఐదు రోజులు నడవడం వల్ల గుండెకు రక్త ప్రసరణ బాగా జరుగుతుంది. కొరోనరీ హార్ట్ డిసీజ్ ప్రమాదాన్ని దాదాపు 19 శాతం తగ్గించవచ్చు. రోజూ వాకింగ్ దూరాన్ని పెంచుకుంటే ఫలితాలు ఇంకా బావుంటాయి. ♦ రక్తంలో చక్కెరను తగ్గించడంలో సహాయపడుతుంది ♦ తిన్న తర్వాత కొద్దిసేపు నడవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి. ♦ అల్పాహారం, భోజనం , రాత్రి భోజనం తర్వాత ఇలా రోజుకు మూడుసార్లు వాకింగ్ చేస్తే మంచిది. ♦ కీళ్ల నొప్పులు తగ్గుతాయి. నడక కాళ్ళ కండరాలను బలోపేతం చేస్తుంది ♦ ఆర్థరైటిస్తో బాధపడేవారికి కూడా చిన్నపాటి నడక ప్రయోజనాలను అందిస్తుంది. ♦ ముఖ్యంగా ఆరుబయట నడిచినపుడు సృజనాత్మక ఆలోచనలు పెరుగుతాయని పరిశోధకులు గుర్తించారు. నోట్: వాకింగ్కోసం ఉపయోగించే స్థలాలు, లేదా పార్క్లు ఎంచుకోవాలి. వాకింగ్కు అనువుగా దృఢమైన బూట్లు ధరించాలి. వదులుగా, సౌకర్యవంతమైన దుస్తులు ధరిస్తే మంచిది. నడకకు ముందు పుష్కలంగా నీరు తాగితే బెటర్. ఇది మన బాడీని హైడ్రేటెడ్గా ఉంచుతుంది. మరీ ఎండలో కాకుండా, ఎండ తక్కువగా ఉన్నపుడు, నీడ ప్రదేశంలో వాకింగ్ చేయాలి. -
ఈ సూపర్ స్వీట్ డ్రింక్ తాగితే..అందం,యవ్వనం మీ సొంతం
వేసవి వచ్చిందంటే మన అందరికీ గుర్తు వచ్చే డ్రింక్ చెరుకు రసం. పిల్లా పెద్దా అంతా ఎంతో ఇష్టంగా తాగుతారు. మండు వేసవిలో దాహాన్ని తీర్చడమే కాదు, చెరుకు రసంలో అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలూ ఉన్నాయి. మండు టెండలో, దాహంతో అల్లాడిపోతున్నపుడు చెరుకు రసం బండి కనిపిస్తే ప్రాణం లేచి వస్తుంది. చల్ల చల్లగా గ్లాసు రసం తాగితే తాగితే హాయిగా ఉంటుంది. అయితే చెరుకు రసం వల్ల కలిగే ప్రయోజనాల గురించి తెలిస్తే ఇక అస్సలు వదలరు. శుభ్రమైన చెరుకు రసం ఇన్ఫెక్షన్లను నివారించడంలోనూ, రోగనిరోధక శక్తిని పెంచడంలోనూ బాగా పనిచేస్తుంది. చెరకు రసంలో యాంటీఆక్సిడెంట్లు ,ఆల్ఫా హైడ్రాక్సీ ఆమ్లాలు పుష్కలంగా ఉన్నాయి. ఇవి యాంటి ఏజింగ్ ఏజెంట్లుగా పనిచేస్తాయి. సౌందర్య పోషణలోనూ, జుట్టు సంరక్షణలోనూ దీని ప్రయోజనాలు అద్భుతం అని చెప్ప వచ్చు. చెరుకులో ఐరన్, మెగ్నీషియం, కాల్షియం, ఎలక్ట్రోలైట్స్ పుష్కలంగా ఉన్నాయి. విటమిన్ B12, ఐరన్తో సహా అవసరమైన పోషకాలతో నిండి ఉంది. సహజ కండీషనర్గా పని చేసి జుట్టును మృదువుగా, సిల్కీగా తయారు చేస్తుంది. హెయిర్ ఫోలికల్స్ ను బలపరిచే మినరల్స్ చెరకు రసంలో పుష్కలంగా ఉన్నాయి చెరకు రసంలో తేనె కలిపి పావుగంట పాటు చర్మానికి మర్దన చేయాలి. తర్వాత ఇరవై నిమిషాల పాటు ఉంచి కడిగేయాలి. వారానికి రెండు సార్లు ఇలా చేయడం వల్ల చర్మం మృదువుగా మారుతుంది. స్కిన్ గ్లోయింగ్, యంగ్గా కనిపించాలంటే ఇంకో చిట్కా ఏంటంటే చెరకు రసంతో తయారు చేసిన ఐస్ క్యూబ్లతో ముఖం, మెడ, చేతులపై మసాజ్ చేసుకోవాలి. అలాగే చెరకురసానికి కాస్తంత కాఫీపొడి చేర్చి స్క్రబ్లా ఉపయోగిస్తే మొటిమలు, మచ్చలు తొలగి పోయి కొత్త మెరుపు వస్తుంది. బొప్పాయి గుజ్జులో చెరకు రసాన్ని కలిపి పట్టించి, ఆరిన తరువాత చల్లని నీళ్లతో కడిగేసు కోవాలి స్కిన్ టైట్ అయిన ఫీలింగ్ తెలుస్తుంది. చెరకు రసం నెయ్యి కలిపి, చర్మానికి మర్దనా చేస్తే ఎండ వల్ల కమిలిన చర్మం తిరిగి కొత్త నిగారింపును సంతరించుకుంటుంది. శుభ్రమైన చెరుకు రసాన్ని ప్రతిరోజూ రాత్రి పడుకునే ముందు చర్మానికి పట్టిస్తే చర్మం ఆరోగ్యంగా, మృదువుగా మారుతుంది. చెరుకు రసంలో కొద్దిగా అల్లం, నిమ్మరసం కలుపుకొని తాగితే అలసట, నీరసం మాయమై కొత్త శక్తి వస్తుంది. -
రోజ్ హిప్స్తో ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో తెలుసా!
ఏంటీ రోజ్ హిప్స్.. ఎప్పుడూ వినలేదే? ఏంటవి? అని ఆశ్చర్యపోకండి. గులాబీ పూలు వికసించి, రాలిపోయిన తర్వాత.. గులాబీ మొక్కలకు ఇవి అభివృద్ధి చెందుతాయి. ఇవి గుండ్రని, బెర్రీ పండ్లలా ఉంటాయి. రోజ్ హిప్స్ సాధారణంగా ఎరుపు, నారింజ రంగులో ఉంటాయి. వీటిలో విత్తనాలు కూడా ఉంటాయి. అయితే వీటిలో పోషకాల అధికంగా ఉంటాయని నిపుణులు అంటున్నారు. వీటిని ఆయుర్వేద వైద్యంలో శతాబ్దాలుగా వినియోగిస్తున్నారు కూడా. అలాంటి ఈ రోజ్ హిప్స్ని మన ఆహారంలో భాగం చేసుకుంటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలేంటంటే.. ఈ రోజ్ హిప్స్లో విటమిన్ సి, ఏ, బి5, సి యాంటీఆక్సిడెంట్లు ఇతర ప్రయోజనకరమైన సమ్మేళనాలు పుష్కలంగా ఉంటాయి. రోజ్ హిప్స్లో యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీవైరల్, యాంటికాన్సర్ లక్షణాలు ఉంటాయి. అంతేగాదు దీనిలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇది రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేస్తుంది, ఇన్ఫెక్షన్లు రాకుండా అడ్డుకుంటుంది. బలుబు, ఫ్లూ, ఇన్ఫెక్షన్లు, దగ్గు వంటి అనారోగ్యాలను నుంచి రక్షణ కల్పిస్తుంది. రోజ్ హిప్స్లో ఉండే యాంటీఆక్సిడెంట్లు శరీరంలోని మంటను తగ్గించడానికి సహాయపడతాయి. హృదయనాళ వ్యవస్థను రక్షిస్తాయి, గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తాయి.రోజ్ హిప్స్లో ఫైబర్ కంటెంట్ అధికంగా ఉంటుంది. ఇది ఆరోగ్యకరమైన జీర్ణక్రియను ప్రోత్సహిస్తుంది, మలబద్ధకాన్ని నివారిస్తుంది, ఆరోగ్యకరమైన గట్ మైక్రోబయోమ్కు మద్దతు కల్పిస్తుంది. రోజ్ హిప్స్లో విటమిన్ ఏ, ఇ సమృద్ధిగా ఉంటాయి. ఇవి చర్మ స్థితిస్థాపకతను మెరుగుపరచడానికి, ముడతలను తగ్గించడానికి తోడ్పడతాయి. తద్వారా యవ్వన ఛాయను ప్రోత్సహిస్తాయి.రోజ్ హిప్స్లో లూటీన్, జియాక్సంతిన్ వంటి యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి కంటి ఆరోగ్యాన్ని కూడా రక్షిస్తాయి. వయస్సు సంబంధిత మచ్చల క్షీణత ప్రమాదాన్ని తగ్గించడానికి సహాయపడతాయి.రోజ్ హిప్స్లోని యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఆర్థరైటిస్ నొప్పులు, కీళ్ల నొప్పులను తగ్గించడానికి తోడ్పడతాయి. ఇవి శరీరంలోని వాపును తగ్గించి.. నొప్పుల నుంచి ఉపశమనం ఇస్తాయి.రోజ్ హిప్స్లో ఉండే ఫైబర్ కంటెంట్ మిమ్మల్ని ఎక్కువ సేపు నిండుగా ఉంచుతుంది. బరువు కంట్రోల్లో ఉంచడానికి సహాయపడుతుంది. అతిగా తినకుండా నివారిస్తుంది. రోజ్ హిప్స్లో ఉండే.. యాంటీఆక్సిడెట్లు మెదడులోని ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గించడానికి సహాయపడతాయి. ఇది మానసికి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. నిరాశ, ఆందోళన, ఒత్తిడి, డిప్రెషన్ వంటి వాటిని దరిదాపుల్లోకి రానివ్వవు. ఎలా తీసుకోవాలి..? ఎండిన రోజ్ హిప్స్ను వేడి నీళ్లలో వేసి సుమారు 10 నిమిషాల పాటు నానబెట్టండి. ఆ తర్వాత దానిలో కొంచెం తేనె యాడ్ చేసుకుని తాగొచ్చు. స్మూతీస్లో ఎండిన రోజ్ హిప్స్ యాడ్ చేసుకుని ఎంజాయ్ చేయవచ్చు. వాటిలోని పోషకాలు పెరుగుతాయి. చక్కెరతో కలిపి జామ్గా తయారు చేసుకోవచ్చు. మీరు మఫిన్లు, కేక్లు, కుకీలు లేదా బ్రెడ్ల కోసం ప్రత్యేకమైన, ఆరోగ్యకరమైన ట్విస్ట్ని అందించడానికి ఎండిన రోజ్ హిప్స్ యాడ్ చేస్తే టేస్ట్కి టేస్ట్, ఆరోగ్యానికి ఆరోగ్యం పొందొచ్చు. (చదవండి: అత్యుత్తమమైన కాఫీల జాబితాలో భారత్ ఎన్నో స్థానంలో ఉందో తెలుసా!) -
ఫాస్టింగ్తో బరువు తగ్గడానికి మించిన ఆరోగ్య ప్రయోజనాలు!
బరువు తగ్గాలి అనగానే ముందుగా గుర్తొచ్చేది ఉపవాసం. తర తరాలుగా భారతీయుల్లో ఉపవాసం కొత్తేమీకాదు. బరువు తగ్గాల నుకునే వారు, శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవాలనుకునే వారు ఫాస్టింగ్ చేయడం కూడా చాలా కామన్. అయితే ఎక్కువ కాలం మన దేహాన్ని పస్తు పెట్టడం వల్ల వెయిట్లాస్ కంటే ఎక్కువ ఆరోగ్య ప్రయోజనాలున్నాయంటోంది తాజా అధ్యయనం. ఆ వివరాలు మీకోసం. ఉపవాసంతో శరీరంలో ఏమి జరుగుతుంది? ఉపవాస సమయంలో, మన శరీరం దాని ఇంధన మూలాన్ని స్వీకరిస్తుంది. సులభంగా యాక్సెస్ చేసే చక్కెరల నుండి బాడీలోని నిల్వ ఉన్న కొవ్వులను వాడుకుంటుంది. అయితే ఆహారం లేకుండా ఎక్కువ కాలం పాటు ఉంటే శరీరం ఎలా స్పందిస్తుంది? ఇదే ఈ స్టడిలోని కీలక అంశం. నేచర్ మెటబాలిజం జర్నల్లో ప్రచురితమైన ఒక కొత్త అధ్యయనంలో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. లండన్లోని క్వీన్ మేరీ విశ్వవిద్యాలయం, నార్వేజియన్ స్కూల్ ఆఫ్ స్పోర్ట్ సైన్సెస్ పరిశోధకులు 12 మంది ఆరోగ్యకరమైన వాలంటీర్లపై పరశోధన చేశాడు. వారు ఏడు రోజుల పాటు కేవలం నీరు మాత్రమే తీసుకునేలా చేశారు. అలా వారి రక్తంలో వివిధ ప్రోటీన్ మార్కర్ల స్థాయిలలో మార్పులను నిశితంగా పరిశీలించారు. మూడు రోజుల తర్వాతే మంచి ప్రయోజనం ఊహించినట్లుగానే తొలి రెండు, మూడు రోజుల్లో గ్లూకోజ్ నుండి కొవ్వు ప్రధాన ఇంధన వనరుగా మారడాన్ని పరిశోధకులు గమనించారు. దీంతో నిల్వ ఉన్న కొవ్వు కరుగుతూ వస్తుంది. మొత్తంగా, వాలంటీర్లు సగటున 5.7 కిలోగ్రాముల కొవ్వు ,లీన్ మాస్ రెండూ తగ్గాయి. అయితే మూడు రోజుల ఉపవాసం తర్వాత వాలంటీర్ల రక్త బయోమార్కర్లలో విభిన్న మార్పులను పరిశోధకులు గమనించారు. మొత్తం బాడీలో కూడా మార్పులొచ్చాయి. ముఖ్యంగా మెదడు కణాల నిర్మాణ ప్రోటీన్లలో మార్పులు ఆసక్తికరంగా నిలిచాయి. దీంతో మూడు రోజుల తరువాత చేసే ఉపవాసంలో మాత్రమే బరువు తగ్గడాన్ని మించి, మంచి ఆరోగ్య ప్రయోజనాలున్నాయని ఈ అధ్యయనంలో తేల్చారు. క్వీన్ మేరీస్ ప్రెసిషన్ హెల్త్ యూనివర్శిటీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (PHURI) డైరెక్టర్ క్లాడియా లాంగెన్బర్గ్ మాట్లాడుతూ, ‘తొలిసారి ఉపవాసం ద్వారా శరీరం అంతా కూడా అతి చిన్న స్థాయిలో కూడా ఏమి జరుగుతుందో చూడగలుగుతున్నామన్నామని ప్రకటించారు. సురక్షితమైన పద్ధతులో ఫాస్టింగ్ చేసినప్పుడు, బరువు తగ్గడం అనేది ప్రభావవంతంగా ఉంటుంది. అలాగే ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ విధానం కూడా బరువు తగ్గడ కంటే అంతకు మించిన ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయన్నారు. అయితే చాలాకొద్దిమందిపై చేసిన తమ ప్రయోగంలో అందరిలోనూ ఫలితాలు ఒకేలా ఉన్నాయని, మరి ఎక్కువమందిపై ఈ ప్రయోగం చేసినపుడు ఫలితాలు ఎంటా ఉంటాయనేది పరిశీలించాల్సి ఉందన్నారు. -
వేసవిలో బార్లీ నీళ్లు : ప్రయోజనాలెన్నో..!
బార్లీ నీరు వల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. ఇది కొలెస్ట్రాల్ తగ్గించడంలో సాయపడుతుంది. గట్ బాక్టీరియాను సమతుల్యం చేయడంలో సహాయపడుతుంది. మన ఆరోగ్యంలో గట్ బ్యాక్టీరియా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. బార్లీ ఆధారిత ఆహారాన్ని తీసుకోవడం వల్ల బాక్టీరాయిడ్స్ అనే గట్ బ్యాక్టీరియా తగ్గుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి. ⇒ రక్తపోటును అదుపులో ఉంచుతాయి రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచి. టైప్ 2 డయాబెటిస్ ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది. మధుమేహం ఉన్నవారు తమ రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను నియంత్రించేందుకు బార్లీ వాటర్ తాగవచ్చు. ⇒ ఎండల ప్రభావం పడకుండా ఉండాలన్న, వడదెబ్బ తగలకుండా ఉండాలన్న ఈ నీళ్లు తాగాల్సిందే ⇒ బార్లీ నీళ్లు తాగితే జీర్ణాశయం కూడా చాలా శుభ్రపడుతుంది. అజీర్తి దూరమవుతుంది. ⇒ పిల్లలకు బార్లీ నీళ్లు తాగిస్తే మంచి ఫలితం ఉంటుంది. మలబద్దకం వంటి సమస్యలు దరి చేరవు. ⇒ గర్భిణులు రోజూ బార్లీనీళ్లు తాగితే మరీ మంచిది. కాళ్ల వాపు సమస్య వారి దరిచేరదు. రోజులో ఉదయం, సాయంత్రం బార్లీ నీళ్లు తాగితే బిడ్డ ఆరోగ్యం కూడా బాగుంటుంది. అలసట కూడా త్వరగా రాదు ⇒ బరువు తగ్గాలనుకునే వారికి కూడా బార్లీ నీళ్లు బాగా ఉపయోగపడతాయి. రక్తంలో కొలెస్ట్రాల్ శాతాన్ని తగ్గిస్తాయి. దీని ద్వారా గుండె సంబంధిత వ్యాధులు దూరంగా ఉంటాయి. ⇒ మహిళలను తరచూ బాధించే ప్రధాన సమస్య మూత్రనాళ ఇన్ఫెక్షన్. ఈ సమస్యను దూరం చేసుకోవాలంటే ఉదయాన రోజూ గ్లాసుడు బార్లీ నీళ్లు తాగితే మంచి ఫలితం ఉంటుంది. మూత్రంలో ఇన్ఫెక్షన్లు కలిగే కారకాలు, వ్యర్థాలు బయటికి పోతాయి. సూక్ష్మమైన రాళ్లు కూడా కరిగిపోతాయి. -
సుష్టిగా తిన్నాక ‘కునుకు’ మంచిదే, కానీ ఈ డేంజర్ కూడా ..!
పగటిపూట అన్నం తిన్నవెంటనే కాసేపు కునుకు తీయడం చాలామందికి అలవాటు. అందులోనూ వేసవి వచ్చిందంటే కాసేపైనా నిద్రపోవాల్సిందే. అయితే ఇది మన ఆరోగ్యానికి అసలు మంచిదా? కాదా? ఎంతసేపు కునుకు తీస్తే మంచిది? పగటిపూట నిద్రపోవడం కొంతవరకూ మంచిదే. పని నుంచి కొంచెం విశ్రాంతి తీసుకోవడంతో అలసట దూర మవుతుంది. ప్రశాంతంగా, కొత్త ఉత్సాహంగా వచ్చినట్టుగా అనిపిస్తుంది.అందుకనే దీన్ని పవర్ న్యాప్ అని అంటారు. మధ్యాహ్నం నిద్ర అనేది మితిమీరితే మాత్రం హానికరమైన ప్రభావం తప్పదంటున్నారు నిపుణులు. పగటి నిద్ర పనికి చేటు అన్నట్టు ఆరోగ్యానికి కూడా ముప్పే. మధ్యాహ్నం ఎక్కువసేపు నిద్రపోవడం ఆరోగ్యానికి హానికరం. ఇదిరాత్రిపూట నిద్రను ప్రభావితం చేస్తుంది. మధ్యాహ్నం నిద్రపోవడం వల్ల స్ట్రోక్ వచ్చే ప్రమాదం 20 శాతం కంటే ఎక్కువ పెరుగుతుందని మెడికల్ జర్నల్ ఆఫ్ అమెరికన్ అకాడెమీ ఆఫ్ న్యూరాలజీ గతంలో చేసిన అధ్యయనం చెబుతోంది. అంతేకాదు మధ్యాహ్నం 90 నిమిషాల కంటే ఎక్కువసేపు నిద్రపోయే వారికి పక్షవాతం వచ్చే ప్రమాదం 25 శాతం ఉంటుందట. కొలెస్ట్రాల్ స్థాయిలలో ఆటంకాలు ఎక్కువ నిద్రను కోల్పోయే రూపంలో కూడా గుర్తించవచ్చని అధ్యయనంలో వెల్లడైంది. వీరికి మినహాయింపు ముఖ్యంగా చిన్న పిల్లలు, వృద్ధులు, అనారోగ్యంగా ఉన్న వారు గరిష్ఠంగా 90 నిమిషాల పాటు నిద్రపోవచ్చట. మిగిలినవారు గరిష్ఠంగా 10 నిమిషాల నుంచి అరగంట లోపు మాత్రమే పడుకోవాలి. పగటి నిద్ర నష్టాలు ♦ ఊబకాయం ♦ రాత్రి నిద్రకు భంగం, బాడీ బయలాజికల్ సైకిల్ దెబ్బతింటుంది ♦ రాత్రి నిత్ర లేకపోతే అధిక రక్తపోటు, డయాబెటిస్, గుండె జబ్బులు, ఆందోళన లాంటి ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం. ♦ డిప్రెషన్ -
అధికబరువు : చియా సీడ్స్, లెమన్ వాటర్ మ్యాజిక్ తెలుసా?
బరువు తగ్గే ఆలోచనలో ఉన్నారా? యోగా, ఇతర వ్యాయామంతోపాటు, ఈజీగా బరువు తగ్గడానికి కొన్ని ఆహార జాగ్రత్తలు, చిట్కాలతో సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా బరువు తగ్గొచ్చు. వాటిల్లో ముఖ్యమైన ఒక చిట్కా గురించి తెలుసుకుందాం రండి..! అధిక బరువును తగ్గించడంలో చియా సీడ్స్ ఎంతో కీలక పాత్ర పోషిస్తాయి. వీటిని నీళ్లలో నాన బెట్టి తినడం వల్ల వీటిలో అధిక మోతాదులో ఉండే ఫైబర్, రిచ్ ప్రోటీన్ శరీరానికి బలాన్నిస్తాయి. అంతేకాదు పొట్ట నిండిన ఫీలింగూ కలుగుతుంది. దీనికి నిమ్మరసం కలిపి మరింత ఉపయోగంగా ఉంటుంది. బరువుని నియంత్రణలోఉంచడంతోపాటు శరీరంలోని మలినాల్ని బైటికి పంపడంలో నిమ్మరసం ముఖ్యమైన హోం రెమెడీ. విటమిన్ సీ సిట్రిక్ యాసిడ్, కాల్షియం , యాంటీ ఆక్సిడెంట్లతో సహా కొన్ని పోషకాల పవర్హౌస్ నిమ్మకాయ. జర్నల్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ అండ్ బయోమెడికల్ అనాలిసిస్లో ప్రచురించిన ఒక అధ్యయనం ప్రకారం, నిమ్మ కాయల్లోని యాంటీవైరల్, యాంటీ బాక్టీరియల్ లక్షణాలు ఇన్ఫెక్షన్ల ప్రమాదాన్ని నివారించేలా రోగనిరోధక వ్యవస్థను పటిష్టం చేస్తాయి. చియా విత్తనాలలో ఫైబర్ ఉంటుంది ఫైబర్, విటమిన్ బీ కాల్షియం, ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్, ప్రోటీన్ , మెగ్నీషియం పుష్కలంగా ఉన్నాయి. ఈ రెండూ కలిపి తాగం వల్ల వెయిట్ లాస్ జర్నీ మరింత సులభం అవుతుంది. ఎలా తయారు చేసుకోవాలి ముందుగా ఒక గిన్నెలో ఒక టీస్పూన్ చియా సీడ్స్ నానబెట్టాలి. చియా సీడ్స్ చక్కగా ఉబ్బుతాయి.ఇందులో కొద్దిగా నిమ్మకాయ రసం, తేనె వేసి బాగా కలపాలి. కావాలంటే రుచికి పుదీనా ఆకులు కూడా వేసుకోవచ్చు. ఈ వాటర్ను 20 30 నిమిషాల తర్వాత మరోసారి హాయిగా తాగేయడమే. భారీ భోజనం తర్వాత లేదా ఉదయాన్నే కూడా త్రాగవచ్చు. సులభంగా జీర్ణం కావడానికి , వ్యర్థాలను తొలగించేందుకు దీన్ని మించిన డ్రింక్ లేదు. -
ఇవి తింటే! బీపీ, కొలెస్ట్రాల్, షుగర్కు చెక్! అందానికి అందం!
మనలో చాలా మందికి కూరలు ఎక్కువగా తినే అలవాటు ఉండదు. అలాగే కూరగాయలు తినడం ఆరోగ్యకరమైన అలవాటు అని తెలిసినా, పెద్దగా పట్టించుకోరు. కార్బోహైడ్రేట్లు లేకుండా, పోషకాలు ఎక్కువగా ఉండే కూరగాయలు రోగనిరోధక వ్యవస్థపై ప్రభావం చూపుతాయి. కూరగాయలు-ప్రయోజనాల గురించి తెలుసుకుందాం. కూరగాయల్లో జీర్ణశక్తికి ఉపయోగపడే పీచులు అధికంగా ఉంటాయి. కూరగాయల్లో విటమిన్లు, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువ. కాబట్టి చాలా జబ్బుల నుంచి మనల్ని కాపాడతాయి. విటమిన్-ఎ, ఇ, మెగ్నీషియం, ఫాస్పరస్, జింక్, ఫోలిక్ యాసిడ్ కూరల్లో ఎక్కువగా దొరుకు తాయి. ఇది బరువు తగ్గేందుకు, కొలెస్ట్రాల్ నియంత్రకు దోహదపడుతుంది. బీపీ, డయాబెటిస్ను అదుపులో ఉంచుకోవచ్చు. ఆకుకూరలు, కూరగాయలు, దుంపకూరల్లాంటివన్నంటిని మన ఆహారంలో ఎక్కువగా చేర్చుకోవాలి. ముఖ్యంగా ఆకుకూరల్ని వారానికి మూడు సార్లయినా తినడం ఉత్తమం. ఈమధ్య కాలంలో మైక్రో గ్రీన్స్ వాడకం బాగా పెరిగింది. బీర,సొర, దొండ, బెండ, లేత చిక్కుళ్లు, గుమ్మడి కాయ కూరను కూడా తినాలి. క్యాలీఫ్లవర్, బ్రకోలీ లాంటివి మైక్రోవేవ్ ఓవెన్లో బేక్ చేసి ఉప్పు, మిరియాల పొడి చల్లుకొని, కాస్త ఎక్కువ పరిమాణంలోనైనా తినొచ్చు. ఇష్టమైన వాళ్లు కూరల్లో ఉల్లి, వెల్లుల్లి కలిపితే గుండెకు మంచిది. కడుపు నిండిన ఫీలింగ్ కూడా కలుగుతుంది. ఇన్ఫ్లమేషన్ : ఇన్ఫ్లమేషన్ను తగ్గించుకోవాలంటే కూరగాయలు ఉత్తమమైన ఆహారం. వీటిల్లో పుష్కలంగా ఉండే యాంటీఆక్సిడెంట్లు, ఫైటోకెమికల్స్ ఇన్ఫ్లమేషన్ను తగ్గించడంలో సహాయపడతాయి. రక్తపోటు అధిక బీపీతో బాధపడేవారు పోషకాలులభించే కూరగాలకు ప్రాధాన్యత ఇవ్వాలి. ఎక్కువ పొటాషియం-రిచ్ ఫుడ్స్ తినడం వల్ల అధిక సోడియం బాడీలోకి చేరుతుంది. ఈ నష్టాన్ని తగ్గించుకోవాలంటే బచ్చలికూర వంటి కూరగాయలు పొటాషియం, ఇతర పోషకాలు లభించే కూరగాలు తీసుకోవాలి. వీటిల్లోని ఫైబర్ కూడా గుండెకుచాలామంది. ఫైబర్: 2020-2025 ఆహార మార్గదర్శకాల ప్రకారం, 2,000 క్యాలరీల ఆహారంలో రోజుకు 28 గ్రాముల ఫైబర్ కూడ అందదు. అందుకే తృణధాన్యాలు, పండ్లు, చిక్కుళ్ళు, గింజలు ఎక్కువగా తీసుకోవాలి. చిలగడదుంపలు , బఠానీల్లో ఆపిల్ కంటే ఎక్కువ ఫైబర్ ఉంటుంది. కళ్ళు: రోజంతా కంప్యూటర్స్ ఫోన్ వైపు చూస్తూ ఉంటే కంటి ఆరోగ్యంమీదప్రభావం పడు తుంది. కళ్ళను రక్షించు కోవాలనుకుంటే, ఎక్కువ కూరగాయలు తినడంతోపాటు మధ్య మధ్యలో స్క్రీన్ బ్రేక్లు తీసుకోవడం మంచింది. తులసి, క్యారెట్లు, మొక్కజొన్న, ఎర్ర మిరియాలు, బచ్చలికూర ,బ్రోకలీలో కంటినిరక్షించే కెరోటినాయిడ్లు దొరుకుతాయి. అలాగే లుటీన్ , జియాక్సంతిన్ అనేవి రెండు కెరోటినాయిడ్లు, వయస్సు-సంబంధిత మచ్చల క్షీణత (AMD) ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడతాయి. చర్మం: చర్మ తేమగా ఉండాలంటే కూరగాయలు ఎక్కువగా తినాలి. టొమాటోల్లోని లైకోపీన్ చర్మాన్ని వడదెబ్బ నుండి రక్షించడంలో సహాయపడుతుంది అవకాడోలు ,నీటి కంటెంట్ ఎక్కువగా ఉండే దోసకాయలు ఆకుకూరలు లాంటివి చర్మంలోని తేమను, మృదుత్వాన్ని కాపాడతాయి. బ్లడ్ షుగర్ కూరగాయలలో కేలరీలు తక్కువ, ఫైబర్ , పోషకాలు ఎక్కువగా ఉంటాయి. పిండి పదార్థం ఎక్కువ గా ఉండే దుంప కూరలుమినహా మిగిలినవి రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుతాయి. అందుకే సహజసిద్ధంగా పండించిన కూరగాలు కేన్సర్ నివారణలో పనికొస్తాయి. బ్రస్సెల్స్ మొలకలు , కాలీఫ్లవర్ వంటి క్రూసిఫెరస్ కూరగాయల్లోని యాంటీఆక్సిడెంట్టు కొన్ని రకాల క్యాన్సర్ల ప్రమాదాన్ని తగ్గిస్తాయి. పొటాషియం, ఫోలేట్, విటమిన్ సి , ఫైటోకెమికల్స్, అలాగే సల్ఫోరాఫేన్ (బ్రోకలీలో అత్యధికం)లో ఎక్కువగా ఉంటాయి. మెదడు మెదడును పదునుగా ఉంచుకోవాలనుకుంటే, ఆహారంలో కూరగాయలను చేర్చుకోవడం సరైన మార్గం. కూరగాయలు, ముఖ్యంగా ఆకుకూరలు, మైండ్ డైట్లో కీలకం, అల్జీమర్స్ వ్యాధి, మతిభ్రమణం ప్రమాదాన్ని తగ్గించడంలో ఇవి సాయపడతాయని పరిశోధకులు తేల్చారు. యాంటీఆక్సిడెంట్లు,ఫోలేట్ మీ మెదడుకు కీలకమైన పోషకాలు. -
Potato Peel ‘తొక్క’ లే అనుకుంటే పప్పులో కాలేసినట్టే!
#Potato Peel : చిన్నపుడు అమ్మమ్మ బీర కాయ పొట్టు పచ్చడి చేసి. ఇది ఏం పచ్చడో చెప్పండర్రా.. అంటూ పెద్ద పజిల్ వేయడం గుర్తుందా? నిజంగా అమోఘమైన ఆ రుచికి, అసలు అది ఏం పచ్చడో అర్థం కాక.. తీరా గుట్టు విప్పాక, ‘బీర్’ కాయా అంటూ నోరు వెళ్లబెట్టడం కూడా తెలుసు. అలాగే సొరకాయ తొక్కులు, పచ్చి అరటికాయ తొక్కల పచ్చడి, ఆఖరికి పుచ్చకాయల తొక్క లోపల ఉండే తెల్లటి పదార్థంతో కూడా దోసెలు చేసి పెట్టడం కూడా తెలుసు. ఇపుడు అలాంటి తొక్కలు మరొక దాని గురించే తెలిస్తే.. నిజంగా ఔరా అంటారు.. అదిఏమిటంటే.. చిన్న పిల్లలకు ఆలూ ఫ్రై చేసి పెడితే చాలు..మారు మాట్లాడకుండా లాగించేస్తారు. పెద్దలకి కూడీ ఆలూ లేదా బంగాళా దుంప అంత ఫ్యావరేట్. కానీ ఆలూ తొక్కల వాడకం, ప్రయోజనాల గురించి మాత్రం చాలామంది తెలియదు. బంగాళాదుంపల తొక్కల్లో పోషకాలు, ఖనిజాలు, ఫైబర్ ఎక్కువగా ఉంటాయి. ఈ తొక్కలను చర్మ, సౌందర్య సాధానాల్లో వినియోగిస్తారు. కాలిన గాయాలకు చికిత్స ఆలుగడ్డ తొక్కల్లో యాంటీ బాక్టీరియల్ ఏజెంట్ ఉంటుంది. ఇది చిన్నపాటి కాలిన గాయాలకు చికిత్సగా ఉపయోపడుతుంది. అంతేకాదు వేసవిలో ఎండలకు కమిలిని చర్మానికి సహజమైన చిట్కాగా పని చేస్తుంది. సిల్కీ స్కిన్ మొటిమలతో ఎక్కువగా బాధపడుతున్నవారు ఆలూ తొక్కలను అప్లై చేసుకోవచ్చు.మొటిమల్ని గిల్లకుండా, ఎక్కువ రుద్దకుండా వాటిపై తొక్కలతో మెల్లిగా రాయాలి. అలాగే కళ్లకిందే ఉండే డార్క్ సర్కిల్స్ నివారణలో కూడా ఫలితాలు అందిస్తుంది. కెమికల్స్ లేని సహజమైన ఈ తొక్కల రసాన్ని చర్మానికి అప్పై చేయవచ్చు. ఈ జ్యూస్తో సిల్కీగా, ఆరోగ్యకరమైన, మెరిసే చర్మాన్ని పొందవచ్చు. అందుకే వీటిని ఎప్పటినుంచో సౌందర్య సాధనాల్లో ఉపయోగిస్తున్నారు. ఐరన్ పాత్రల తుప్పు పట్టకుండా, స్టార్చ్ సహజమైన గ్రీజుగా పనిచేస్తుంది. అలా వంట ఇంటి చిట్కాగా పనిచేస్తుంది. ఆలూ తొక్కలు మొక్కలకు ఎంతో బలం మొక్కలకు కూడా ఇవి మంచి బాలన్నిస్తాయి. భాస్వరం, పొటాషియం, నత్రజని వంటి ముఖ్యమైన పోషకాలతో నిండిన ఈ తొక్కలు నేల నాణ్యతను మెరుగుపరుస్తాయి. మొక్కల ఎదుగుదల బాగా ఉంటుంది. ఆలూ తొక్కల పీల్ కంపోస్ట్ వేసిన వెంటనే గులాబీ, మల్లె లాంటి పూల మొక్కలు వెంటనే మొగ్గ తొడుగుతాయి. -
పైనాపిల్ మంచిదని తినేస్తున్నారా?
పైనాపిల్ అంటే అందరూ ఇష్టంగా తినరు. ఎందుకంటే అది తినంగానే నోటిలో ఏదో దురదగా అనిపిస్తుంది. కాస్త పులుపు, తీపి కలయికతో కూడిన ఒక విధమైన రుచితో ఉంటుంది. ప్రపంచవ్యాప్తంగా ఇండోనేషియా, ఫిలిప్పీన్స్ వంటి మూడు దేశాలు ప్రముఖంగా ఈ పండుని ఉత్పత్తి చేస్తాయి. దీన్ని సలాడ్లు, కాక్ టెయిల్ లేదా డిజార్ట్ల రూపంలో చాలామంది తీసుకంటుంటారు. అయితే ఈ పండుని తీసుకోవడం వల్ల చాలా రకాల వ్యాధులకు చెక్పెట్టడమే కాకుండా వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. దీన్ని తీసుకోవడం ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో అలానే అతిగా తింటే అంతే స్థాయిలో సమస్యలు ఉన్నాయని చెబుతున్నారు నిపుణులు. పైనాపిల్ తీసుకుంటే ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయో న్యూట్రిషన్ అండ్ మెటబాలిజం జర్నల్లో ప్రచురితమయ్యింది. ఇది అందించే ప్రయోజనాలను చూసి నిపుణులే ఆశ్చర్యపోయారు. పైగా బరువువ తగ్గాలనే వారికి ఈ పండు గొప్ప వరమని చెబుతున్నారు. అదేసయంలో దీన్ని అధికంగా తీసుకుంటే జరిగే పరిణామాలను కూడా సవివరంగా వెల్లడించారు. అవేంటంటే..? కలిగే ప్రయోజనాలు.. రక్తంలోని కొలెస్ట్రాల్ను ప్రభావితం చేసే ప్రత్యేక పోషకం బ్రోమెలైన్ ఉంది. ఇది కొలెస్ట్రాల్ ఫలకాలను విచ్ఛిన్నం చేయడంలో కీలకపాత్ర పోషిస్తుంది. దీని కాండంలో ఉండే ప్రోటీన్ జీర్ణ ఎంజైమ్ని ప్రోత్సహించి చక్కగా జీర్ణమయ్యేలా చేస్తుంది. ప్రతిరోజూ పైనాపిల్ తింటే హైపర్ కొలెస్టెరోలేమియా స్థాయిలు, లిపోప్రోటీన్(ఎల్డీఎల్) వంటి చెడుకొలస్ట్రాల్లకు చెక్ పెడుతుంది. రోజు దీని ఆహారంగా తీసుకునేవారికి బరువు అదుపులో ఉన్నట్లు పరిశోధనల్లో వెల్లడయ్యింది. ఇందులో ఉండే ఫైబర్, పోటాషియం, విటమిన్ సీ కంటెంట్లు గుండె ఆరోగ్యానికి మంచివి రక్తపోటును అదుపులో ఉంచుతుంది. విటమిన్ సీ వంటి యాంటీఆక్సిడెంట్లు శరీరంలో వ్యాధి నిరోధక శక్తిని పెంపొందిస్తాయి. కేన్సర్, ఆర్థరైటిస్, గుండె జబ్బుల వంటి వ్యాధుల బారిన పడకుండా నియంత్రిస్తుంది. అతిగా తీసుకుంటే తలెత్తే పరిణామాలు.. వికారం, విరేచలు లేదా గుండెల్లో మంట వంటి వాటికి దారితీస్తుంది ఇందులో ఉండే బ్రోమెలైన్ అధిక రక్తస్రావం లేదా చర్మంపై దద్దుర్లు వచ్చే అవకావం ఉంది. అలాగే రక్తం గడ్డకట్టాన్ని ప్రభావితం చేస్తుంది. పైనాపిల్ జ్యూస్గా తీసుకునేవారు పోటాషియం స్థాయిల విషయంలో జాగురకతతో ఉండాలి. ఎందుకంటే ఇది మూత్ర పిండాల సమస్య ఉన్నవారికి మరింత సమస్యత్మకంగా మారిపోతుంది. అదనంగా ఉండే పోటాషియంను బయటకు పంపడంలో మూత్రపిండాలు విఫలమై లేనిపోని సమస్యలకు దారితీసే ప్రమాదం ఉంది. అలెర్జీ దద్దర్లు, కడుపు నొప్పి, వాంతులు, అతిసారం, ముఖం, నాలుకు, గొంతు నొప్పి, పెదవుల వాపు, శ్వాస తీసుకోవడంతో ఇబ్బంది తదితర సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఇది శరీరంలో కొలస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో ఎంత మంచిది మితంగా తీసుకోకపోతే అంత ప్రమాదం. అందువల్ల వాటిని మీ రోజూవారి ఆహారంలో ఎంతమేర తినడం బెటర్ అనేది న్యూట్రిషియన్లు లేదా వైద్యులను సంప్రదించి తీసుకోవడం ఉత్తమం. గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే ఈ కథనం ఇవ్వడం జరిగింది. మీ ఆహారంలో భాగం చేసుకోవాలనుకుంటే మాత్రం నిపుణులు లేదా ప్రముఖ డైటీషియన్లను సంప్రదించి తీసుకోవడం మంచిది. (చదవండి: అట్లాంటిక్ డైట్తో బోలెడన్ని ఆరోగ్య ప్రయోజనాలు!) -
Oyster Mushrooms: బెనిఫిట్స్ తెలిస్తే.. అస్సలు వదలరు!
పుట్టగొడుగులు చాలా రకాలున్నాయి. ఒక్కో పుట్టగొడుగు ఒక్కో రుచి, ఆకృతిలో ఉంటాయి. అయతే బటన్ మష్రూమ్స్తో ఓస్టెర్ మష్రూమ్ ఎక్కువ రుచిగా ఉంటాయివీటిల్లోని గ్లుటామిక్ యాసిడ్ భిన్నమైన రుచిని అందిస్తుంది. సాధారణ బటన్ పుట్టగొడుగుల కంటే ఓస్టెర్ పుట్ట గొడుగుల్లో దాదాపు రెండు రెట్లు ఎక్కువ గ్లుటామిక్ యాసిడ్ ఉంటుంది. పుట్ట గొడుగులు శాకాహారమే అయినప్పటికీ ఖనిజాలు,ఫైబర్, విటమిన్లు ఇతర ముఖ్యమైన పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. అందుకే నాన్వేజ్ తినని వారికి విటమిన్లు పూర్తిగా అందడంతోపాటు, సెలీనియంతో పాటు ఎముకలు దృఢంగా ఉండేందుకు అవసరమైన అన్ని ఎలిమెంట్స్ , ఉన్నాయంటున్నారు పోషకాహార నిపుణులు. ముఖ్యంగా ఓస్టెర్ పుట్టగొడుగులు గ్లూటెన్-ఫ్రీ డైట్కు అద్భుతం పని చేస్తాయని, తక్కువ కేలరీలు, ఎక్కువ పోషకాలతో బలమైన రోగనిరోధక వ్యవస్థకు తోడ్పడతాయి. యాంటీవైరల్, ఇమ్యునోమోడ్యులేటింగ్, యాంటీఆక్సిడెంట్,యాంటీ హైపర్ కొలెస్టెరోలేమియా, యాంటీ-డయాబెటిక్ గుణాలున్నాయని చాలా మంది నిపుణులు నమ్ముతారు. రుచితో పాటు పోషకాలు మెండుగా ఉన్న ఓస్టెర్ పుట్టగొడుగుల వల్ల ప్రయోజనాలు మరికొన్నింటిని చూద్దాం. ఓస్టెర్ పుట్టగొడుగులు: లాభాలు ♦ ఆస్టియోపోరోసిస్ , ఆర్థరైటిస్ను నివారిస్తుంది ♦ విటమిన్ డి లెవల్స్ పెరగాలంటేపుట్టగొడుగులు తినాలి. ♦ సుగర్, బీపీ,చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తుంది ♦ రక్తహీనతనుంచి కాపాడుతుంది. ♦ యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి ♦ పుట్టగొడుగులను తింటే ఎముకలు దృఢంగా మారతాయి. ♦ కేన్సర్ఉంచి రక్షిస్తుంది. ♦ తక్కువ కేలరీలు పుట్టగొడుగులు బరువు తగ్గడానికి కూడా సహాయపడతాయి ♦ నరాల ఆరోగ్యానికి మంచిది: ♦ మానసిక ఆరోగ్యాన్ని కాపాడే డోపమైన్ , సెరోటోనిన్ను పుట్టగొడుగులలోని కాపర్ కంటెంట్ మనకు అందిస్తుంది. ♦ ఈ పుట్టగొడుగుల్లో ఫోలిక్ యాసిడ్ ఉంటుంది. ఇంకా ఇందులోని B గ్రూప్ విటమిన్, నిద్ర, జ్ఞాపకశక్తికి చాలా మంచిది. నోట్: పుట్టగొడుగులను తినేముందు అవి మంచివా? కాదా? అని పరిశీలించుకోవాలి. అలాగే పుట్టగొడుగు నాణ్యతను కూడా తప్పకుండా తెలుసుకోవాలి. లేదంటే ప్రమాదం. -
మెంతులు..ఇంతులు అంటూ తెగ తినేస్తున్నారా? ఈ విషయాలు తెలుసుకోండి!
మన వంటింట్లో దొరికే మెంతులతో చాలా ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. కేవలం సుగంధ ద్రవ్యంగా మాత్రమే కాదు. అతివలకు మెంతుల వల్ల జరిగే మేలు అంతా ఇంతా కాదు. మధుమేహం సహా అనేక అనారోగ్య సమస్యలకు అవి ఔషధంలా పనిచేస్తాయి. తినడానికి చిరు చేదుగా అనిపించినా మెంతులు వల్ల కలిగే కలిగే ఆరోగ్య ప్రయోజనాల రీత్యా మన ఆహారంలో ఒక భాగంగా చేసుకుంటారు. అందుకే పోపు గింజల్లో మెంతులును ప్రధానంగా చేర్చారు మన పెద్ద వాళ్లు. పౌడర్లు, క్యాప్సూల్స్ , నూనెలతో సహా వివిధ రూపాల్లో లభిస్తున్న ఈ మెంతులు పురుషులు,స్త్రీలలో ఇతర వైద్య పరిస్థితులకు కూడా సహాయపడతాయని నమ్ముతారు. మెంతులను వివిధ రూపాల్లో తీసుకోవడం ద్వారా వివిధ రకాల అనారోగ్య సమస్యలకు చెక్ పెట్టవచ్చు. మరి మెంతులలో దాగి ఉన్న ఆ ఆరోగ్య ప్రయోజనాలేమిటో తెలుసుకుందామా..? ప్రయోజనాలు ⇒ మెంతులు (ట్రైగోనెల్లా ఫోనమ్-గ్రేకమ్) అనేది బఠానీ కుటుంబానికి (ఫాబేసి) చెందిన సుగంధ ద్రవ్యం. ⇒ గుండె ఆరోగ్యాన్ని ప్రోత్సహిస్తుంది ⇒ జుట్టు పెరుగుదలకు మంచిది ⇒ బ్లడ్ కొలెస్ట్రాల్ను, అధిక రక్తపోటును అదుపులో ఉంచుకుంది. ⇒ జ్వరం, అలెర్జీల , గాయాల చికిత్సలో మెంతులు మన రక్తంలో చక్కెర స్థాయిలను క్రమబద్దీకరించడంలో బాగా పనిచేస్తాయి. అదేవిధంగా అజీర్తి, కడుపుబ్బరాన్ని కూడా తగ్గిస్తాయి. కాబట్టి మధుమేహం ఉన్నవాళ్లు నిత్యం మెంతులు తీసుకోవడం అలవాటుగా చేసుకోవాలంటారు నిపుణులు. మెంతుల్లో ఉండే ఫైబర్ కడుపు నిండిన భావన కలిగిస్తుంది.అంటే ఒంట్లో కొవ్వు కరుగుతుంది. రాత్రిపూట ఒక చెంచా మెంతి గింజలను నీళ్లలో నానబెట్టి ఉదయం లేవగానే పరగడుపున ఆ నీళ్లను తాగాలి. ఇలా చేయడంవల్ల అజీర్తి సమస్య తగ్గుతుంది. జీర్ణ శక్తి మెరుగు పడుతుంది. అదేవిధంగా విరేచనాలు తగ్గడానికి కూడా మెంతులు ఉపయోగపడుతాయి. మెంతి టీ ద్వారా బ్లడ్ లో షుగర్ అదుపులో ఉంటుంది. చిటపట శబ్దం వచ్చేదాకా మెంతులను వేయించి మెత్తగా పౌడర్లా చేసుకుని , రోజూ ఉదయాన్నే ఆ పొడిని వేడి నీటిలో కలుపుకుని తాగితే ఎన్నో సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. మెంతులు-ఇంతులు మహిళలు సౌందర్య పోషణలో కూడా మెంతులకు విరివిగా వాడవచ్చు బాగా మెత్తగా దంచిన మెంతిపౌడర్లో కొద్దిగా తేనె కలిపిన మిశ్రమంతో ముఖాన్ని సున్నితంగా స్క్రబ్ చేసుకోవాలి. ఎండిన తరువాత నీటితో చక్కగా కడిగేసుకుంటే.. చర్మం భలే స్మూత్గా ఉంటుంది. మెంతులలో ఉండే లెసిథిన్ కనుబొమ్మలే ఒత్తుగా పెరిగేలా చేస్తుంది. నాన పెట్టిన గుప్పెడు మెంతులను మెత్తని ముద్దగా నూరుకోవాలి. దీన్ని కనుబొమ్మలకు రాసుకుని 20-25 నిమిషాల తరువాత తడి గుడ్డతో చాలా సున్నితంగా క్లీన్ చేసుకోవాలి. ఇలా వారానికి మూడు- నాలుగు సార్లు చేస్తే మంచి ఫలితం ఉంటుంది. పీరియడ్స్ సమయంలో వచ్చే కండరాల నొప్పులకు మెంతులు దివ్యౌషధం అని చెప్పవచ్చు.ఐరన్ లోపాన్ని కూడా ఈ మెంతులు తగ్గిస్తాయి. కఫం,దగ్గు, ఆస్తమా లాంటి సమస్యలకు మెంతు మంచి ఉపశమనం కలిగిస్తాయి. సైడ్ ఎఫెక్ట్స్ పాలిచ్చే తల్లులకు పాలు పడటం కోసం మెండి పౌడర్ను ఎక్కువగా వాడతారు. దీని వల్ల పిల్లలకు ఎటువంటి హాని జరగనప్పటికీ, మెంతి సప్లిమెంట్లను తీసుకునే ముందు వైర్భిణీలేదా పాలిచ్చే స్త్రీలు వైద్యులు సలహా మేరకు తీసుకోవాలి. గర్భిణీ స్త్రీలు తప్పనిసరిగా మెంతి సప్లిమెంట్లు లేదా మందులకు దూరంగా ఉండాలంటున్నారు కొంతమంది నిపుణులు. ఎందుకంటే గర్భాశయ సంకోచాలు పెరిగి అవి శిశువుపై ప్రతికూల ప్రభావాలను కలిగి ఉంటాయి, ఒక్కోసారి గర్భస్రావం జరిగే ప్రమాదం ఉందని చెబుతున్నారు. డెలివరీకి కొద్దిసేపటికి ముందు మెంతులు తీసుకోవడం వల్ల శిశువుల మూత్రం, శరీరంనుండి అసాధారణమైన వాసన వస్తుంది. ఈ వాసన ప్రమాదకరం కానప్పటికీ, మాపుల్ సిరప్ యూరిన్ డిసీజ్ అని పిలిచే జన్యుపరమైన పరిస్థితి వస్తుందంటారు. మెంతులు శరీరంపై ఈస్ట్రోజెన్ లాంటి ప్రభావాన్ని కలిగి ఉంటాయి. ఈ నేపథ్యంలో కొన్ని రకాల రొమ్ము క్యాన్సర్లలో ఈస్ట్రోజెన్-ఆధారిత కణితులను ఇది మరింత ప్రేరేపిస్తుందట. కనుక మెంతి సప్లిమెంట్లను ఉపయోగించాలనుకుంటే వైద్యులను సంప్రదించాలి. మరికొన్ని ⇒ అతిసారం ⇒ అజీర్ణం ⇒ కడుపు ఉబ్బరం ⇒ వికారం ⇒ తలనొప్పి ⇒ తలతిరగడం -
అల్లంతో ఇలా చేస్తే పొడవైన జుట్టు మీ సొంతం!
ఆయుర్వేద పరంగా అల్లం ఆరోగ్యానికి ఎంత మంచిదో తెలిసిందే. ముఖ్యంగా జలుబు, దగ్గు, కఫం వంటి సమస్యలకు ఈ అల్లం సులభంగా చెక్పెడుతుంది. అలాంటి అల్లం జుట్టు సంరక్షణకు ఉపయోగపడుతుందా? అని ఆశ్చర్యంగా అనిపిస్తోంది కదా!. అందులోనూ అల్లం ఘాటు ఓ రేంజ్లో ఉంటుంది. దాన్ని జుట్టుకి అప్లై చేస్తే వేడి చేస్తుంది కదా!. మరీ అలాంటి అల్లం ఎలా జట్టు పోషణకు ఉపపయోగపడుతుంది అని ఆశ్చర్యపోకండి. ఎందుకంటే నిపుణులు మాత్రం అల్లం కురులను స్ట్రాంగ్గా చేసి జుట్టు రాలే సమస్యను తగ్గిస్తుందని చెబుతున్నారు. ఇదేలా శిరోజాలకు పనిచేస్తుంది ఎలా జుట్టుకి అప్లై చేయాలి తదితరాల గురించి తెలుసుకుందాం! అల్లంలో జింక్, మెగ్నీషియం ఉంటాయి. అందువల్ల ఈ అల్లం రసాన్ని జుట్టు అప్లై చేస్తే జుట్టు రాలడం తగ్గుతుంది. జుట్టు బలంగా మారుతుంది. ఇందులోని యాంటీ ఫంగల్ గుణాల వల్ల జుట్టు బలంగా మారుతుంది. ఎలా తలకు అప్లై చేయాలంటే.. ఇందుకోసం ముందుగా ఆలివ్ నూనె తీసుకుని అందులో అల్లం రసం కలపండి. దీనిని జుట్టుకి అప్లై చేసి రాత్రంతా అలానే ఉంచి ఉదయాన్నే జుట్టుని క్లీన్ చేయాలి. ఇలా రెగ్యులర్గా చేస్తుంటే జుట్టు మెరుస్తుంది. పొడి జుట్టుకి అల్లం రసాన్ని అప్లై చేసి గంటపాటు అలానే ఉంచి, ఆ తర్వాత షాంపూ, కండీషనర్తో క్లీన్ చేసుకోవాలి. అల్లం రసాన్ని జుట్టుకి వాడడం వల్ల హెల్దీగా ఉండే పొడవైన జుట్టు మీ సొంతం అవుతుంది. అంతేగాదు దీని వల్ల జుట్టుకి మరిన్ని లాభాలు ఉన్నాయి. ముఖ్యంగా జుట్టు ఒత్తుగా పెరుగుతుంది. పైగా ఇందులో ఉండే యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు చుండ్రు సమస్యను తగ్గస్తుంది. కాబట్టి, జుట్టుకి అల్లాన్ని రెగ్యులర్గా అప్లై చేయండి. అలాగే తలపై దురద , చిన్న చిన్న పొక్కులు వంటి సమస్యలకు చెక్ పెడుతుంది కూడా. ముఖ్యంగా ఇందులోని యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు పొక్కులని దూరం చేస్తాయి. గమనిక: నిపుణులు, అధ్యయనాల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. అందం, ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించడమే ఉత్తమ మార్గం. గమనించగలరు. (చదవండి: మసాలా దినుసుల ఘాటు పోకూడదంటే..ఇలా స్టోర్ చేయండి!) -
ఈ పప్పు ప్రయోజనాలు తెలిస్తే.. అస్సలు మిస్ కారు!
దక్షిణ భారతంలో మినపప్పు (బ్లాక్ గ్రామ్) లేదా ఉరద్ దాల్ గురించి తెలియని వారుండరు. ప్రముఖ అల్పాహారాలు, ఇడ్లీలు, దోసెలు, వడలు లాంటి తయారీలో ఈ గింజ ధాన్యం కీలక మైంది. అంతేకాదు వంటగదిలో ఇదిలేకుండా పోపుల పెట్టె సంపూర్ణమే కాదు. అలాగే జబ్బు పడిన వారు త్వరగా కోలుకోవాలంటే మినపగారెలు, సున్నుండలు పెట్టడం బాగా అలవాటు. ఇందులోని ఐరన్ కంటెంట్ శరీరానికి త్వరగా శక్తిని ఇస్తుందని ఆహార నిపుణులు చెబుతారు. ఇందులో రుచితోపాటు బోలెడన్ని ఆరోగ్య ప్రయజనాలు కూడా ఉంటాయి. ప్రోటీన్లు మెండుగా ఈ పప్పులో విటమిన్ బీ కూడా పుష్కలంగా ఉంటుంది. ఆయుర్వేదలో మాషా అని పిలుస్తారు. ఆయుర్వేదంలో ఆర్థరైటిస్, ఆస్తమా, పక్షవాతం లాంటి జబ్బుల నివారణలో వాడతారట. అలాగే మినపప్పు తీసుకోవడం వల్ల తల నొప్పి, జ్వరం, ఇంఫ్లమేషన్ వంటి సమస్యలనుంచి దూరం కావచ్చట. సౌందర్య పోషణలో మహిళల సౌందర్యపోషణలో కూడా దీని ప్రయోజనాలు తక్కువేమీ కాదు. మినరల్స్ , విటమిన్లు పుష్కలంగా ఉన్న మినపప్పు సన్ టాన్స్ ను వదలగొడుతుంది. ఆరోగ్యవంతమైన, సూపర్ మెరిసే జుట్టును పెరుగుదలకు తోడ్పడుతుంది. మొటిమల సమస్యతో బాధపడేవారు మినపప్పుని కొద్దిగా పాలల్లో వేసి మెత్తగా నూరి, ఈ మిశ్రమానికి కొద్దిగా నిమ్మరసం, తేనె కలిపి ముఖానికి అప్లై చేసుకుని, ఆ తర్వాత చల్లని నీళ్లతో కడిగేసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. అంతేకాదు పురుషుల లైంగిక సమస్యలను తొలగించడంలో బాగా సహాయపడుతుందట. మినపప్పు - లాభాలు ►ఫైబర్, మెగ్నీషియం, ఐరన్, పొటాషియం, ఫాస్పరస్ , కాల్షియం అధికంగా ఉన్నాయి. దీనిని తరచుగా తీసుకుంటే ఎముకలకు సంబంధించిన సమస్యలను దూరం చేసుకోవచ్చు. ►పేగు ఆరోగ్యాన్ని (గట్ హెల్త్) మెరుగుపరుస్తుంది: ►బాడీలోని ఐరన్ లెవల్స్పెరిగేందుకు తోడ్పడుతుంది ►గుండెను హెల్దీగా, దృడంగా ఉంచేలా చేస్తుంది. ►నాడీ వ్యవస్థను బలపరుస్తుంది, నాడీ బలహీనత, పాక్షక పక్షవాతం, ముఖ పక్షవాతం ,ఇతర రుగ్మతల నివారణకు వివిధ ఆయుర్వేద ఔషధాలలో ఉపయోగిస్తారు. ►మినపప్పు గ్లూకోజ్ స్థాయిలను నియంత్రిస్తుంది.. సో మధుమేహం ఉన్నవారికి కూడా మంచిదే ►వెయిట్ లాస్లో మినప పప్పు ఉపయోగపడుతుంది, ఎముకలను దృఢంగా ఉంచుతుంది. ►కిడ్నీలను కాపాడటంలో కూడా మినపప్పు ఉపయోగపడుతుంది. -
సోనియా గాంధీ మెచ్చిన 'పప్పు అన్నం'! ఎన్ని ప్రయోజనాలో తెలుసా!
ఇటీవల కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ మార్మలాడే(ప్రిజర్వ్డ్ ఫ్రూట్ జామ్) అనే రెసిపీ ప్రీపరేషన్కి సంబంధించిన వీడియోని షేర్ చేసిన సంగతి తెలిసిందే. ఆ వీడియోలో రాహుల్, ఆయన తల్లి సోనియగాంధీ ఆ రెసిపీని ప్రిపేర్ చేస్తూ ఇక్కడ భారతీయ వంటకాల గురించి మాట్లాడారు. ముఖ్యంగా ఇక్కడ వంటకాల్లో కారానికి అలవాటు పడటానికి తాను ఎలా ఇబ్బంది పడ్డానో వివరించారు. భారతీయ వంటకాల్లో తనకు నచ్చేది 'పప్పు అన్నం' అని ముఖ్యంగా విదేశాలకు వెళ్లి భారత్కి రాగనే వెంటనే ఈ వంటకాన్నే తింటానని, అదంటే తనకెంతో ఇష్టమని చెప్పుకొచ్చారు. మన భారతీయులకు పండగలకు, లేదా ఏ సెలబ్రెషన్లో అయినా తప్పనిసరిగా ఉండాల్సింది ఈ దాల్ రైసే. దీని వల్ల ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో తెలుసా!.. అవేంటంటే.. ఇది చాలా సింపుల్ వంటకం. బియ్యం, కాయధాన్యాల కలియక తో కూడిన పప్పు అన్నం ఆరోగ్యాన్ని ఎంతో మంచిది. శాకాహారులు ఎక్కువగా చేసే వంటకం కూడా ఇదే. ఆరోగ్య ప్రయోజనాలు.. ప్రోటీన్ మూలం.. ఈ ఆహారంలో ప్రోటీన్లు పుష్కలంగా ఉంటాయి. పప్పులో ఉండే అమైనో ఆమ్లాలు, బియ్యంలోని కార్బోహైడ్రేట్లతో కూడిన ఆహారం.. కండరాల నిర్వహణకు, పెరుగుదలకు అవసరమైన అన్ని ప్రోటీన్లు సమకూరుస్తుంది. ఫైబర్.. అలాగే కాయాధాన్యాల్లో ఫైబర్ జీర్ణక్రియను ప్రోత్సహిస్తుంది. మలబద్ధకాన్ని నివారిస్తుంది. సమతుల్య గట్ మైక్రోబయోమ్ను నిర్వహిస్తుంది. ఈ ఫైబర్ కంటెంట్ నిండుగా ఉన్న అనుభూతిని కలిగించి బరువుని అదుపులో ఉంచేలా చేస్తుంది. తక్షణ శక్తి.. బియ్యంలో ఉండే కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్లు స్థిరమైన శక్తిని విడుదల చేస్తాయి. రోజంత శరీరంలో శక్తి స్థాయిలను నిలబెట్టుకోవడానికి పప్పు అన్నం ఒక ఎంపిక. చురుకైన జీవన శైలి లేదా శారీరక కార్యకలాపాలలో నిమగ్నమైన వ్యక్తులకు ఇది మంచి పౌష్టిక ఆహారం. సామాన్యుడికి సైతం .. సామాన్య మానవుడికి సైతం అందుబాటులో ఉండే మంచి ప్రోటీన్లు, ఫైబర్తో కూడిన ఆహారం. ఇంట్లో కనీసం కాయగూరలు లేనప్పుడూ దానితో చేసే వివిధ వంటకాలతో కావాల్సినన్ని పోషకాలు పొందగలుగుతారు. పోషకాల నిలయం.. పప్పులో ఐరన్, ఫోలేట్, పొటాషియం తదితర పోషకాలు అందించగా, బియ్యంలో ఉండే 'బీ' విటమిన్లు మాంగనీస్ను అందిస్తుంది. ఈ పోషకాలు రక్తం ఏర్పడటానికి, రోగనిరోధక వ్యవస్థకు, ఎముకల ఆరోగ్యం తోపాటు వివిధ శారీరక విధులకు మద్దతు ఇస్తుంది. కంఫర్ట్ ఫుడ్ అందరూ సులభంగా వండుకునే వంటకం, పైగా భారతీయుల ఇంటిలో తప్పనసరిగా ఉండే వంటకం కూడా ఇదే. ఒకరకంగా ఈ వంటకాన్ని తమ వారసత్వ వంటకంగా చెబుతారు. సామాన్యుడికి విలువైన పోషకాలతో కూడిన ఆహార అవసరాన్ని తీర్చే వంటకం ఇదే. ఆరోగ్యకరమైనది, అందరికీ అందుబాటులో ఉండే సౌకర్యవంతమైన రెసిపీగా పేర్కొనవచ్చు. (చదవండి: ప్రపంచంలోనే అత్యంత వరస్ట్ కర్రీగా చోటు దక్కించుకున్న భారతీయ వంటకం ఏంటంటే..?) -
గుడిలో తీర్థం, ప్రసాదాలు ఎందుకు ఇస్తారో తెలుసా? కారణమిదే!
ధనుర్మాసంలో చేసే పూజలకు తగ్గట్టుగానే తులసీతీర్థం, చక్కెర పొంగళి, కట్టె పొంగలి, దద్దోజనం, పులిహోర తదితర పోషక విలువలుండే ప్రసాదాలను ఆరగిస్తారు. అలంకార ప్రియుడైన శ్రీమహావిష్ణువును ఆరాధించడంలో స్వామివారికి ఇష్టమైన ప్రసాదాలను అర్పించడం ఎంతటి పుణ్యఫలమో, అంతటి ఆరోగ్యబలం కూడా. వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని నిర్దేశించి ఈ ధనుర్మాసంలో అందిస్తున్న ప్రసాదాలు ఎన్నెన్నో పోషక విలువలతో ముడిపడి ఉండటం విశేషం. తీర్థం.. ప్రసాదంగా మనం స్వామివారికి సమర్పించి స్వీకరించే వీటిలో ప్రతి పదార్థానికి చక్కటి ఔషధగుణాలున్నాయి. తులసి తీర్థంతో మానసిక బలం ఆలయాల్లో దేవుడ్ని దర్శించుకున్న తర్వాత అర్చకుడు ఇచ్చే తీర్థమే తులసీతీర్థం. దీనినే భక్తులు తొలి ప్రసాదంగా భావిస్తారు. తులసి పత్రాలు, కర్పూరం.. యాలిక బీజాలను కలిపి తీర్థంగా ఇస్తుంటారు. ఇది మానసిక ఉద్వేగాలను అదుపులో ఉంచుతుంది. దగ్గు, ఆస్థమా, చర్మవ్యాధులు తీర్థ సేవనంతో నయమవుతాయయి. కడుపులో క్రిముల నివారణవుతాయి. కడుపు ఉబ్బరం తగ్గుతుంది. ముక్కు దిబ్బడ నుంచి ఉపశమనం కలుగుతుంది. మానసిక వేదన నుంచి ఉపశమనం లభిస్తుంది. పరమాన్నం.. పరమ ఔషధం.. పాలు, బియ్యంలో బెల్లం లేదా పంచదార వేసి చేసేదే పరమాన్నం. ఇందులో బాదంపప్పు, యాలకులు, పచ్చికొబ్బరి వేస్తారు. దేహానికి బలం, చక్కని కాంతిని ఇస్తుంది. ఆలోచన శక్తిని పెంచుతుంది. వాత, పైత్యాలను తగ్గిస్తుంది. ప్రతి 100 గ్రాముల బియ్యంలో 78 గ్రాముల కార్బోహైడ్రేట్లు, 8.5 గ్రాముల ప్రోటీన్లు ఉంటాయి. 100 గ్రాముల బెల్లంలో 11.4 మిల్లీ గ్రాముల కేలరీలు, ఇనుము ఉన్నాయి దీనికి పుష్టిని ఇచ్చే గుణం ఉంది. వాత రోగాలు నివారణవుతాయి. బాదంలో బలాన్ని చేకూర్చే గుణం ఉంది. ఉత్సాహం పెరగడంతో పాటు నరాల బలహీనత, రక్తపోటును తగ్గుతుంది. జ్వరాలు రాకుండా దద్దోజనం తాళింపు పెట్టిన పెరుగన్నమే దద్దోజనం, ఆవు పాలను మరగకాచి చల్లార్చి తోడుపెట్టిన పెరుగులో మిరియాలు, ఇంగువ, శొంఠి మొదలైన వాటిని అన్నంలో కలుపుతారు. దానిని ఆవునెయ్యితో పోపుపెడతారు. ధనుర్మాసంలోని రెండోపక్షంలో దీనిని ప్రసాదంగా నివేదిస్తారు మంచు, చలి ఎక్కువగా ఉండే ఈ సమయంలో దద్దోజనం తీసుకోవటం వల్ల జలుబు, విష జ్వరాలు, శీతల జ్వరం రాకుండా నిరోధిస్తుంది. అరుగుదలకు పులిహోర.. బియ్యంతో అన్నం వండిన తర్వాత దానికి పసుపు, నూనె, ఆవాలు, ఉప్పు, కరివేపాకు, శెనగపప్పు తదితరాలని కలిపి చేస్తారు. దీనివల్ల ఆహారం త్వరగా జీర్ణమవుతుంది. ఆకలి పెరుగుతుంది. కాలేయానికి మంచిది. జలుబు, తుమ్ములు, ఉబ్బసం, దగ్గు నుంచి ఉపశమనం కలుగుతుంది. కట్టె పొంగలితో కీళ్లజబ్బులు నయం ధనుర్మాసంలో చలి, మంచు ఎక్కువగా ఉంటాయి. కట్టె పొంగలిని తినడం వల్ల జీర్ణశక్తి మెరుగ్గా ఉంటుంది. కీళ్ల జబ్బులు తగ్గుతాయి. దగ్గు, జలుబు రాకుండా చేస్తుంది. చక్కటి ఔషధం చక్కెర పొంగలి బియ్యం, పెసరపప్పు సమానంగా పోసి ఆవునేతితో ఉడికించి అందులో పంచదార, ద్రాక్ష, పచ్చకర్పూరం, కుంకుమపువ్వు, యాలకులు వంటి సుగంధ ద్రవ్యాలు వేసి చేసే చక్కెర పొంగలిని సేవించడం వల్ల దేహపుష్టి కలుగుతుంది. ఇది జ్ఞాపకశక్తిని పెంచుతుంది. శూల (నొప్పి)ని, జ్వరాన్ని హరిస్తుంది. పచ్చకర్పూరం వల్ల ఆహారం తేలిగ్గా జీర్ణమవుతుంది. కఫాన్ని, శరీరంలోని మంటల్ని నిరోధిస్తుంది. -
రకుల్ ప్రీత్ సింగ్ ఫిట్నెస్ సీక్రెట్, పొద్దున్నే ఇది తాగుతుందట
కాఫీ అంటే తెలియని వారు ఉండరేమో. చాలామందికి పొద్దున్నే కాఫీ తాగనిదే రోజు గడవదు. బెడ్ మీద నుంచి లేవడంతోనే కాఫీతో డే స్టార్ట్ చేస్తారు. కాఫీ తాగడం మంచిదే కానీ, కొందరు అదే పనిగా రోజుకు 4-5సార్లు కాఫీని ఎనర్జీ డ్రింక్లా తాగేస్తుంటారు. అయితే ఇదంత మంచిది కాదని వైద్యులు సూచిస్తుంటారు. కాఫీలో కోల్డ్ కాఫీ, ఫిల్టర్ కాఫీ, బ్లాక్ కాఫీ.. ఇలా చాలా రకాలున్నా నెయ్యి కాఫీ అన్నింటికంటే ది బెస్ట్ అంటున్నారు. అందుకే ఎంతోమంది సెలబ్రిటీల రొటీన్లో నెయ్యి కాఫీ ముందుంటుంది. నెయ్యి కాఫీ(Ghee Coffee)వినడానికి కాంత కొత్తగా అనిపించినా ఇప్పుడు సెలబ్రిటీలు ఫాలో అవుతున్న ట్రెండ్ ఇదే. నెయ్యి కాఫీ తాగడానికి రుచిగా ఉండటమే కాకుండా ఆరోగ్యానికి, చర్మ సౌందర్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది. అందుకే ఈ మధ్యకాలంలో బాగా పాపులర్ అయ్యింది. ప్రముఖ సెలబ్రిటీలు రకుల్ ప్రీత్ సింగ్, భూమి ఫడ్నేకర్ ఇప్పటికే చాలాసార్లు సోషల్ మీడియాలో తమ డే రొటీన్లో నెయ్యి కాఫీ గురించి నెటిజన్లతో పంచుకున్నారు. ఇంతకీ నెయ్యి కాఫీ అంటే ఏంటి? దీనివల్ల కలిగే ప్రయోజనాలు ఏంటన్నది చూద్దాం. నెయ్యి కాఫీ జీవక్రియను పెంచడంలో సహాయపడుతుంది. అసిడిటీని దూరం చేయడంలో తోడ్పడుతుంది. నెయ్యిలో విటమిన్-ఇ, ఎ,కె లు పుష్కలంగా ఉంటాయి. ఇది ఆకలిని తగ్గిస్తుంది. దీనివల్ల బరువు తగ్గేందుకు ఉపయోగపడుతుంది. మొండి కొవ్వులను కరిగించడంలో నెయ్యి కాఫీ సహాయపడుతుంది. నెయ్యిలో ఒమేగా 3, 6, 9 వంటి ఆరోగ్యకరమైన కొవ్వులు ఉంటాయి. పరిగడుపున టీ స్పూన్ నెయ్యిని కాఫీలో కలుపుకుని తాగితే గట్ ఆరోగ్యం మెరుగుపడుతుంది. నెయ్యిలోని యాంటీ ఆక్సిడెంట్లు ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడుతుంది. మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. చర్మ సమస్యలను తగ్గిస్తుంది. రకుల్ ప్రీత్ సింగ్ ఫేవరెట్ రెసిపి నెయ్యి కాఫీతోనే తన రోజు మొదలవుతుందని ప్రముఖ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ పలు సందర్భాల్లో చెప్పుకొచ్చింది. మంచి కొవ్వుతో పాటు చర్మ ఆరోగ్యానికి ఇది ఎంతో మేలు చేస్తుందని పేర్కొంది. మరి రకుల్ ప్రీత్ సింగ్ ఈ కాఫీని ఎలా తయారు చేసుకుంటుంది? ఏమేం వాడుతుందంటే... ►ముందుగా గ్లాస్లో ఒక స్పూన్ దేశీ నెయ్యి వేసుకోవాలి. తర్వాత ఒక స్పూన్కి పైగా కాఫీ పౌడర్, కొలాజిన్ను జత చేసుకోవాలి. ఇందులో వేడి నీళ్లు పోసి బాగా కలపాలి. అంతే చిటికెలో నెయ్యి కాఫీ రెడీ అయినట్లే ► ఒకవేళ మీరు చక్కెర వేసుకోవాలనుకుంటే మీకు నచ్చిన ఏదైనా స్వీటెనర్ వేసుకోవచ్చు. లేదా 2-3 యాలకులు వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమానికి కాసిన్ని పాలు కూడా జత చేసుకోవచ్చు. బరువు త్వరగా తగ్గాలనుకునేవారు పాలకు బదులుగా కేవలం వేడినీళ్లు వేసుకోవాలి. అంతే ఇలా ప్రతిరోజూ పరగడుపున నెయ్యి కాఫీ తాగడం వల్ల నెలరోజుల్లోనే రిజల్ట్ కనిపిస్తుంది. View this post on Instagram A post shared by jhaji kitchen (@jhajikitchen13) View this post on Instagram A post shared by Rakul Singh (@rakulpreet)
Pagination
మళ్లీ చరిత్ర సృష్టిస్తున్నాం
చేతులు కాలాక ఆకులు పట్టుకున్న ఈసీ
ఓటీటీలోకి వచ్చేసిన మిడిల్ క్లాస్ మూవీ.. స్ట్రీమింగ్ అందులోనే?
వరల్డ్కప్ జట్టులో నో ఛాన్స్: రోహిత్పై కేఎల్ రాహుల్ కామెంట్స్ వైరల్
ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు అలెర్ట్.. మారిన విత్ డ్రా నిబంధనలు
ఎన్ఆర్ఐతో విధి ఆడిన వింత నాటకం.. విషాదం
స్వాతి మలివాల్ డ్రామా.. బీజేపీ కుట్రే ఇదంతా: సంచలన వీడియో బయట పెట్టిన ఆప్
Heeramandi Jewellery ఎవరీ సినిమా నగల స్పెషలిస్ట్ జంట
పెళ్లి చేసి పల్లకిలో పంపాలనుకున్నాం.. కానీ : పుణే బాధితులు కన్నీరుమున్నీరు
కన్నప్ప మూవీలో ఛాన్స్? మంచు లక్ష్మి రియాక్షన్ ఇదే!
ఆనందమే జీవిత మకరందం
భారత టాలెంట్ సరిహద్దులు దాటుతోంది: రాజమౌళి
‘అగ్నిపథ్’ స్కీమ్పై వ్యాఖ్యలు... క్లారిటీ ఇచ్చిన కాంగ్రెస్
సీఎం నిర్ణయాలే ఫైనల్.. ప్రభుత్వానికి, కాంగ్రెస్ పార్టీకి మధ్య గ్యాప్?
ఫ్యామిలీతో ట్రిప్.. పొట్టి డ్రెస్లో అనసూయ జలకాలాటలు (ఫోటోలు)
Pumpkin Halwa: టేస్టీ టేస్టీగా గుమ్మడికాయ హల్వా రెసిపీ, అలా.. వెన్నలా..
వంగా గీత బలం.. ప్యాకేజ్ స్టార్ బలహీనతలు ఇవే!
టీ20 వరల్డ్కప్-2024 అంబాసిడర్గా ఆఫ్రిది.. దిమ్మతిరిగేలా రైనా కౌంటర్
టచ్ కూడ చెయ్యలేరు ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు చైతన్య కృష్ణ మాస్ వార్నింగ్
తప్పక చదవండి
- ‘అగ్నిపథ్’ స్కీమ్పై వ్యాఖ్యలు... క్లారిటీ ఇచ్చిన కాంగ్రెస్
- స్వాతి మలివాల్పై దాడి కేసు.. కేజ్రీవాల్ సహాయకుడికి రిమాండ్
- విరిగిపడ్డ కొండచరియలు.. భారీగా ప్రాణనష్టం
- 'బాహుబలి' నిర్మాతల హారర్ వెబ్ సిరీస్.. స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్
- మలాన్ని డోనేట్ చేస్తే ఏడాదికి కోటి రూపాయలు : ఓ కంపెనీ ఆఫర్
- కేటీఆర్, ఆర్ఎస్ ప్రవీణ్లపై పరువు నష్టం దావా: మంత్రి జూపల్లి
- BCCI: అవన్నీ అబద్ధాలే: ఆసీస్ మాజీలకు జై షా కౌంటర్
- మిర్యాలగూడ: కునుకు తీస్తూ కమిషనర్ ఇలా..
- కేన్స్లో ఇండియన్ సినిమాకు మొదటి బహుమతి
- ఆస్ట్రేలియాలో తెలుగు వ్యక్తి అనుమానాస్పద మృతి
Advertisement