-
రాయ్ లక్ష్మీ బర్త్డే సెలబ్రేషన్స్.. కళ్లలో టన్నుల కొద్దీ సంతోషం (ఫోటోలు)
-
సాయి పల్లవి బర్త్ డే.. ఆమె కోసం స్పెషల్ సర్ప్రైజ్ ఇచ్చిన టీమ్!
ఫిదా మూవీతో తెలుగువారి గుండెలు కొల్లగొట్టిన నేచురల్ బ్యూటీ సాయిపల్లవి. తెలుగులో స్టార్ హీరోయిన్గా అభిమానుల్లో చోటు సంపాదించుకుంది. ప్రస్తుతం నాగచైతన్య సరసన తండేల్ మూవీ నటిస్తోంది. చందూ మొండేటి డైరెక్షన్లో వస్తోన్న ఈ చిత్రంపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. మత్య్సకారుల బ్యాక్డ్రాప్ స్టోరీతో ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో చైతూ మత్య్సకారుని పాత్రలో కనిపించనున్నారు. గీతా ఆర్ట్స్ బ్యానర్పై అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాసు అత్యంత భారీ బడ్జెట్తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.అయితే ఇవాళ సాయిపల్లవి బర్త్ డే కావడంతో తండేల్ చిత్ర యూనిట్ స్పెషల్ వీడియోను షేర్ చేసింది. సాయి పల్లవి తెలుగు సినిమాలతో మెప్పించిన పాత్రలను వీడియోలో చూపించారు. ముఖ్యంగా తండేల్ మూవీ సెట్లో సాయిపల్లవి హావభావాలతో కూడిన స్పెషల్ వీడియో అద్భుతంగా రూపొందించారు. చివర్లో నాగచైతన్య, సాయి పల్లవి మధ్య వచ్చే సీన్తో ఆడియన్స్కు అదిరిపోయే ట్రీట్ ఇచ్చారు. కాగా.. ఈ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ సంగీతమందిస్తున్నారు. -
రౌడీ హీరో బర్త్ డే అప్డేట్.. కొత్త మూవీకి డైరెక్టర్ ఎవరంటే?
టాలీవుడ్ యంగ్ హీరో విజయ్ దేవరకొండ బర్త్ డే సందర్భంగా అభిమానులకు అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు. రవికిరణ్ కోలా దర్శకత్వంలో సినిమా చేయనున్నట్లు వెల్లడించారు. ఈ సందర్భంగా సినిమాకు సంబంధించిన పోస్టర్ను ట్విటర్లో షేర్ చేశారు. ప్రముఖ నిర్మాణసంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్పై దిల్ రాజు, శిరీష్ నిర్మించనున్నారు. ఈ బ్యానర్లో వస్తోన్న 59న చిత్రం ఇది నిలవనుంది.ఈ సినిమాను భారీస్థాయిలో పాన్ ఇండియా ప్రాజెక్ట్గా తెరకెక్కించనున్నట్లు తెలుస్తోంది. 'రాజా వారు.. రాణి గారు' సినిమాతో ప్రతిభావంతమైన దర్శకుడిగా పేరు తెచ్చుకున్న రవి కిరణ్ కోలా ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా రిలీజైన పోస్టర్ చూస్తే ఫుల్ మాస్ యాక్షన్ చిత్రంగా కనిపిస్తోంది. 'కత్తి నేనే.. నెత్తురు నాదే.. యుద్ధం నాతోనే..' అనే క్యాప్షన్ చూస్తేనే సినిమా కథంటే అర్థమవుతోంది. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన నటీనటుల వివరాలు ప్రకటించనున్నారు. “The blood on my hands is not of their death.. but of my own rebirth..“Ravi Kiran Kola X Vijay Deverakonda@SVC_official pic.twitter.com/xGXXiNbVQu— Vijay Deverakonda (@TheDeverakonda) May 9, 2024 -
విజయ్ దేవరకొండ ఎక్కడ తప్పు చేస్తున్నాడు?
యంగ్ హీరో విజయ్ దేవరకొండ పేరు చెప్పగానే మీకు గుర్తొచ్చేది ఏంటి? బహుశా 'అర్జున్ రెడ్డి' మూవీ ఏమో! ఈ సినిమా అతడికి ఎంత ప్లస్ అయిందో అంతకు మించిన మైనస్ కూడా అయ్యిండొచ్చు. ఎందుకంటే దీని తర్వాత చాలా సినిమాలు చేస్తున్నాడు. ఇందులో ఓ పాన్ ఇండియా మూవీ కూడా ఉంది. కానీ ఎందుకో హిట్ అనే మాట మాత్రం వినలేకపోతున్నాడు! ఇంతకీ విజయ్ ఎక్కడ తప్పు చేస్తున్నాడు? అసలేం జరుగుతోంది?(ఇదీ చదవండి: స్టార్ హీరోలతో యాక్టింగ్.. ఆ కమెడియన్ ఇలా అయిపోయాడేంటి!)బ్యాక్ గ్రౌండ్ లేకుండా వచ్చి నిలబడాలంటే ఏ రంగమైనా సరే కష్టమే. అలాంటిది ఎంతో పోటీ ఉండే సినిమా ఇండస్ట్రీలోకి వచ్చి విజయ్ దేవరకొండ వచ్చి నిలబడ్డాడు. సైడ్ క్యారెక్టర్స్, పెద్దగా గుర్తింపు లేని పాత్రలు చేస్తూ వచ్చాడు. 'ఎవడే సుబ్రహ్మణ్యం'లో రిషి అనే కీలక పాత్ర చేసి నటుడిగా నలుగురి కంట్లో పడ్డాడు. 'పెళ్లిచూపులు' మూవీతో ఫస్ట్ హిట్ కొట్టేశాడు. ఇక 'అర్జున్ రెడ్డి' మూవీ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎందుకంటే విజయ్ గురించి చెప్పాల్సి వస్తే.. ఈ సినిమాకు ముందు, ఈ సినిమా తర్వాత అని చెప్పొచ్చు. ఇప్పటికీ ఎవరిని అడిగినా అదే చెప్తారు.ఇందులో విజయ్ యాక్టింగ్, ఆటిట్యూడ్, మేనరిజమ్స్.. ప్రేక్షకులకు తెగ నచ్చేశాయి. దీని తర్వాత చేసిన 'గీతగోవిందం' మూవీ విజయ్లోని క్యూట్ నటుడిని ప్రేక్షకులకు పరిచయం చేసింది. అలా వరసగా హ్యాట్రిక్ సినిమాలతో సక్సెస్ అందుకున్న విజయ్.. ఓవర్ నైట్ స్టార్ అయిపోయాడు. దీంతో విజయ్ని ప్రస్తుత జనరేషన్ మెగాస్టార్ అనే రేంజులో ఆకాశానికెత్తేశారు. ఇక్కడివరకు బాగానే ఉంది. కానీ ఆ తర్వాత సినిమాల విషయంలో విజయ్ తప్పటడుగులు వేస్తూ వచ్చాడు.(ఇదీ చదవండి: పవన్ మూవీ రిలీజ్ డేట్కి టెండర్ వేసిన 'దేవర'?)నోటా, ట్యాక్సీవాలా, డియర్ కామ్రేడ్, వరల్డ్ ఫేమస్ లవర్, లైగర్, ఖుషి, ఫ్యామిలీ స్టార్.. ఇలా విజయ్ దేవరకొండ చేసిన సినిమాలన్నీ కూడా ఎందుకో ప్రేక్షకులకు సరిగా కనెక్ట్ కాలేకపోయాయి. అయితే 'అర్జున్ రెడ్డి', 'గీతగోవిందం' తర్వాత కంటెంట్ ఉన్న సినిమాలకు ఛాన్స్ ఇచ్చుంటే బాగుండేది. కానీ ఎందుకో కమర్షియల్ కథలతో మూవీస్ చేయడం.. విజయ్ని మిగతా హీరోలు అనిపించేలా చేసింది. ఎంత మంచి నటుడైనా సరే కాస్తోకూస్తో వైవిధ్యం ఉంటేనే జనాలు గుర్తిస్తారు. రెగ్యులర్ రొటీన్ మూవీస్ చేస్తే ఉన్న క్రేజ్ అలా తగ్గిపోయే అవకాశాలు ఎక్కువ. విజయ్ కూడా ఈ విషయంలోనే తప్పటడుగులు వేస్తున్నాడా అనే డౌట్ వస్తోంది.విజయ్ దేవరకొండ అద్భుతమైన నటుడు. దీనిలో వంక పెట్టడానికి ఏం లేదు. కానీ సరైన సినిమాలే ఎందుకో పడట్లేదు. విజయ్ ఈ విషయం కాస్త కాన్సట్రేట్ చేసి.. రెగ్యులర్ రొటీన్ మూవీస్ కాకుండా కాస్త వైవిధ్యంగా చేస్తే మాత్రం విజయ్.. మళ్లీ ఎక్కడికో వెళ్లిపోవడం గ్యారంటీ. కొత్త పుట్టినరోజు సందర్భంగా ఈ విషయంపై కాస్త ఆలోచించాలని కోరుతూ విజయ్ దేవరకొండకు పుట్టినరోజు శుభాకాంక్షలు.(ఇదీ చదవండి: హీరోయిన్ జాన్వీ కపూర్.. తిరుపతిలో పెళ్లి చేసుకోనుందా?) -
మిస్టర్ బీస్ట్ బర్త్డే గిఫ్ట్ : ఖరీదైన టెస్లా కారు కావాలా నాయనా?
అమెరికన్ యూట్యూబర్, ప్రముఖ సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్ తన ఫాలోయర్లకు బంపర్ ఆఫర్ ప్రకటించాడు. మిస్టర్ బీస్ట్గా పాపులర్ అయిన జిమ్మీ డొనాల్డ్సన్ తన 26వ పుట్టినరోజు (మే 7) సందర్భంగా 26 టెస్లా కార్లను బహుమతిగా ఇవ్వబోతున్నట్టు ప్రకటించాడు. ఇందులో ఒక సైబర్ ట్రక్ కూడా ఉందని ప్రకటించడం విశేషం. కండిషన్స్ అప్లయ్ అంటూ కొన్ని నిబంధనలు కూడా పెట్టాడు. దీంతో ఈ వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది. వైరల్ కంటెంట్ విచిత్రమైన సవాళ్లతో తనకు తానే సాటి అని నిరూపించుకనే మిస్టర్ బీస్ట్ తాజాగా దీనికి సంబంధించిన వీడియోను తన ఇన్స్టాగ్రామ్ అధికారిక ఖాతాలో పోస్ట్ చేశాడు. అయితే ఇందులో ఒక మతలబు ఉంది. తన పోస్ట్ కింద కామెంట్ చేసి, ఇద్దరు ఫ్రెండ్స్ను ట్యాగ్ చేసిన 26 మందిని ఎంపిక చేసి, 26 కార్లను బహుమతిగా ఇస్తానని ప్రకటించాడు. డ్రా తీసిన అనంతరం విజేతలకు డైరెక్ట్గా మెసేజ్ చేస్తానని, వారం రోజుల్లో (మే 11న) ఎంపికైన వారి వివరాలను ప్రకటిస్తానని తెలిపాడు. అంతేకాదు రకరకాల పేర్లు, లేదా రీపోస్ట్లు లాంటి జిమ్మిక్కులు పనిచేయవని కూడా వెల్లడించాడు. View this post on Instagram A post shared by MrBeast (@mrbeast) 254 మిలియన్లకు పైగా సబ్స్క్రైబర్లతో యూట్యూబ్లో అత్యధిక ఫాలోవర్లున్న వ్యక్తిగా కొనసాగుతున్న మిస్టర్ బీస్ట్ నికర విలువ రూ.4,175 కోట్లు (500 మిలియన్ల డాలర్లు)గా తెలుస్తోంది. 2012 ప్రారంభంలో 13 ఏళ్ల వయస్సులో 6000 పేరిట తొలుత ఓ యూట్యూబ్ ఛానెల్ ప్రారంభించాడు. ఆ తర్వాత బీస్ట్ రియాక్ట్స్, మిస్టర్ బీస్ట్ గేమింగ్, మిస్టర్ బీస్ట్ 2, అలాగే ఒక దాతృత్వ ఛానెల్ బీస్ట్ ఫిలాంత్రరోపీని నడుపుతున్నాడు. దీని ద్వారా అనేక సామాజిక కార్యక్రమాలను విరాళాలిస్తుంటాడు. -
టీమిండియా కెప్టెన్కు టాలీవుడ్ స్టార్ హీరో విషెస్..!
టాలీవుడ్ హీరో వెంకటేశ్ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ బర్త్ డే సందర్భంగా స్పెషల్ విషెస్ తెలిపారు. ఆయనతో దిగిన ఫోటోను ట్విటర్లో పంచుకున్నారు. ఇది చూసిన అభిమానులు క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. ముఖ్యంగా హీరో వెంకటేశ్కు క్రికెట్ అంటే విపరీతమైన అభిమానం. టీమిండియా మ్యాచ్ ఉందంటే చాలు స్టేడియంలో అలా వాలిపోతారు. ఐపీఎల్లోనూ సన్రైజర్స్ హైదరాబాద్ టీమ్కు మద్దతుగా ఉంటారు. కాగా.. వెంకటేశ్ కొత్త ఏడాదిలో సైంధవ్ మూవీతో ప్రేక్షకులను పలకరించారు. సంక్రాంతికి రిలీజైన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద అంతగా మెప్పించలేకపోయింది. గుంటూరు కారం, హనుమాన్, నా సామిరంగ చిత్రాలతో బాక్సాఫీస్ వద్ద పోటీ పడింది. Happy Birthday Hitman @ImRo45! Have an amazing one 🤗 pic.twitter.com/TF7Kv2qfwR— Venkatesh Daggubati (@VenkyMama) April 30, 2024 -
HBD Rohit Sharma: హిట్మ్యాన్ కుటుంబం గురించి తెలుసా? బ్యాగ్రౌండ్ ఇదే!
-
స్టార్ హీరోయిన్ నుంచి కాంట్రవర్సీల వరకు.. సమంత గురించి ఇవి తెలుసా?
సమంత రుతు ప్రభు.. ఈ పేరు చెప్పగానే సినిమాలు, కాంట్రవర్సీలు, విమర్శలు, ట్రోల్స్ ఇలా చాలా గుర్తొస్తాయి. ఎందుకంటే ఈమె జీవితం సినిమాని మించిపోయేలా ఉంటుంది. హ్యాపీ మూమెంట్స్తో పాటు ట్రాజెడీ అనిపించే సంగతులు చాలానే వినిపిస్తాయి. వీటి గురించి కొందరికి తెలిస్తే మరికొందరికి తెలియదు. ఇప్పుడు సమంత 37వ పుట్టినరోజు సందర్భంగా మరోసారి వాటిని అలా గుర్తుచేసుకుందాం.తమిళనాడులోని చెన్నైలో పుట్టి పెరిగిన సమంత.. అక్కడే చదువుకుంది. డిగ్రీ చివర్లో ఉండగానే మోడలింగ్లోకి అడుగుపెట్టింది. అయితే సినిమాల్లోకి రాకముందు పాకెట్ మనీ కోసం పార్టీలు, ఈవెంట్స్లో వెల్కమ్ గర్ల్గా పనిచేసింది. అలానే 'ఏ మాయ చేశావె'.. ఈమె తొలి సినిమా అని చాలామంది అనుకుంటారు. కానీ అంతకంటే ముందే తమిళంలో 'మాస్కోవిన్ కావేరి' అనే మూవీ చేసింది.(ఇదీ చదవండి: ప్రముఖ దేవాలయంలో స్టార్ హీరోయిన్ సంయుక్త.. కారణం అదేనా?)తెలుగులో రామ్ చరణ్, అల్లు అర్జున్, మహేశ్ బాబు, పవన్ కల్యాణ్.. ఇలా స్టార్ హీరోలు అందరితోనూ సినిమాలు చేసింది. హిట్స్ కొట్టి స్టార్ హీరోయిన్ హోదా అనుభవించింది. 2010-19 వరకు దాదాపు పదేళ్ల పాటు ఇండస్ట్రీలో వరస చిత్రాలు చేసిన సమంత.. ఆ తర్వాత మాత్రం వరస ఫ్లాపుల దెబ్బకు డౌన్ అయిపోయింది. మధ్యలో ఈమెకు మయోసైటిస్ అనే అరుదైన వ్యాధి ఉన్నట్టు తెలియడంతో కొన్నాళ్లు సినిమాలకు బ్రేక్ కూడా ఇచ్చింది.సినిమాలతో పాటు ఓటీటీల్లోకి ఎంట్రీ ఇచ్చిన సమంత.. 'ఫ్యామిలీ మ్యాన్ 2' వెబ్ సిరీస్లో నెగిటివ్ షేడ్స్ ఉన్న ఉగ్రవాది తరహా పాత్రలో నటించి షాకిచ్చింది. అప్పటివరకు గ్లామరస్ రోల్స్లో సామ్ని చూసిన ఫ్యాన్స్.. ఈ సిరీస్లో సమంత డీ గ్లామర్ గెటప్, ఫైట్స్ చేయడం చూసి అవాక్కయ్యారు.(ఇదీ చదవండి: సీతగా సాయిపల్లవి.. ఎంత ముద్దుగా ఉందో? ఫొటోలు వైరల్)సమంతకు యశోద అనే మరోపేరు కూడా ఉంది. ఈ విషయం దాదాపు ఎవరికీ తెలియదు, ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ మాత్రమే ఆమెని ఈ పేరుతో పిలుస్తారు. 'యశోద' పేరుతో సమంత ఓ సినిమా కూడా చేయడం విశేషం. అలానే 2012లో తెలుగు, తమిళంలో ఉత్తమ నటిగా ఫిల్మ్ ఫేర్ అవార్డు అందుకుంది. రేవతి తర్వాత ఈ ఘనత సాధించిన రెండో హీరోయిన్గా ఘనత సాధించింది.2013లో తనకు డయాబెటిస్ ఉన్నట్లు బయటపెట్టిన సమంత.. జిమ్, హెల్తీ ఫుడ్ తీసుకుని ఆ వ్యాధి నుంచి బయటపడింది. కానీ ఆ తర్వాత మయోసైటిస్ అనే అరుదైన వ్యాధి బారిన పడింది. 2022 అక్టోబరులో ఈ విషయాన్ని బయటపెట్టింది. దీని వల్ల దీర్ఘకాలిక కండరాల వాపు వస్తుంది. ప్రస్తుతం కొంతమేర దీన్నుంచి కోలుకుంది. పూర్తిగా నార్మల్ అవ్వాలంటే మాత్రం కొన్నేళ్లు పట్టొచ్చు!(ఇదీ చదవండి: 'ఫ్యామిలీ స్టార్' పరువు తీస్తున్న దోశ.. ఆ వార్నింగ్ సీన్ కూడా!)సినిమాల సంగతి పక్కనబెడితే సమంత వ్యక్తిగత జీవితం అంతకు మించి అనేలా ఉంటుంది. అక్కినేని హీరో నాగచైతన్యని ప్రేమించింది. 2017లో అంగరంగ వైభవంగా పెళ్లి చేసుకుంది. కానీ ఏమైందో ఏమో గానీ 2021లో విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించింది. దీంతో అటు అభిమానులు, ఇటు ఇండస్ట్రీలో అందరూ షాకయ్యారు. కారణం ఏంటో తెలియకుండానే సమంతపై చాలా విమర్శలు చేశారు. పర్సనల్ స్టైలిష్ట్తో ఎఫైరే దీనికి కారణమని అన్నారు. అసలు ఏం జరిగిందనేది ఇప్పుటికీ సస్పెన్సే.సాధారణంగా హీరోయిన్లు పెద్దగా వివాదాలు జోలికి వెళ్లరు. కానీ సమంత మాత్రం ఈ విషయంలో కాస్త డిఫరెంట్. కోరి తెచ్చుకునేలా కొన్నింటిని నెత్తిన పెట్టుకునేది. ట్రోలింగ్కి గురయ్యేది. అయితే ఎన్ని కాంట్రవర్సీలు ఉన్నా సరే సమంతలో ఓ మంచి మనిషి కూడా ఉంది. పేద పిల్లలు, మహిళల సంక్షేమం కోసం 'ప్రత్యూష సపోర్ట్' అనే ఎన్జీవో స్థాపించి చాలామందికి సహాయపడుతోంది. ఇలా సమంత జీవితం చూసుకుంటే ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేని స్థాయి నుంచి మొదలై.. స్టార్ హీరోయిన్ హోదా అనుభవించి.. పెళ్లి జీవితంతో విమర్శలు ఎదుర్కొని.. పరిస్థితులు ఎదురు తిరిగిన నిలబడి గెలిచిన బ్యూటీ సామ్.(ఇదీ చదవండి: ఎక్కడెక్కడో టచ్ చేశారు.. వస్తావా అంటే తెలియక సరే అన్నాను: కీర్తి భట్) -
బర్త్డే స్పెషల్.. చిన్నారులతో ఫుట్ బాల్ ఆడిన సచిన్! వీడియో వైరల్
భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ బుధవారం (ఏప్రిల్ 24) తన 51వ వసంతంలోకి అడుగుపెట్టాడు. ఈ సందర్భంగా సచిన్కు పుట్టినరోజు శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. అభిమానులు, యువరాజ్ సింగ్, గౌతం గంభీర్, సురేష్ రైనా, ఓజా వంటి మాజీ క్రికెటర్లు సచిన్కు సోషల్ మీడియా ద్వారా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు.ఐసీసీ, బీసీసీఐ కూడా సచిన్కు ఎక్స్ వేదిగా స్పెషల్ విషెస్ తెలియజేసింది. కాగా సచిన్ తన బర్త్డే సెలబ్రేషన్స్ను సతీమణి అంజలితో కలిసి ‘సచిన్ టెండ్కూల్కర్ ఫౌండేషన్’లో జరపునకున్నాడు. చాలా సమయం పాటు అక్కడ ఉన్న చిన్నారులతో సచిన్ ముచ్చటించాడు. ఈ సందర్భంగా తన బర్త్డే సెలబ్రేషన్స్కు సంబంధించిన విషయాలను సచిన్ అభిమానులతో పంచుకున్నాడు."ఈసారి నా బర్త్డే సెలబ్రేషన్స్ భిన్నంగా చేసుకోవడం చాల సంతోషంగా ఉంది. సచిన్ టెండూల్కర్ ఫౌండేషన్ సాయంతో ఎదుగుతున్న చిన్నారుల మధ్య కేక్ కట్ చేయడం నా అదృష్టంగా భావిస్తున్నా. వారితో ఫుట్బాల్ ఆడటం, నా స్టోరీలను పంచుకోవడం ఎంతో అనుభూతిని ఇచ్చింది. నాకు శుభాకాంక్షలు తెలిపిన వారిలో వీరే ఫస్ట్ అనుకుంటాను. ఈ మూమెంట్ నా జీవితంలో ఎప్పటికీ గుర్తుండిపోతుందని" తన బర్త్డే వేడుకల సంబంధించిన వీడియో క్లిప్ను సచిన్ ఎక్స్లో షేర్ చేశాడు. Happy birthday paaji! 🎉 From smashing bowlers on the field to smashing life goals, you're the reason I learned to aim higher in life (and sometimes on the field too 🤪) Here's wishing you loads of love, good health and happiness always 🤗❤️@sachin_rt #HappyBirthdaySachin pic.twitter.com/t6qFKgKJmZ— Yuvraj Singh (@YUVSTRONG12) April 24, 2024 -
క్రికెట్ గాడ్ సచిన్కు అత్యంత అపురూపమైన 13 నాణేల గురించి తెలుసా?
క్రికెట్ గాడ్, మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ క్రికెట్ను 24 ఏండ్ల పాటు ఏకఛత్రాధిపత్యంగా ఏలి క్రికెట్లో తన పేరును సువర్ణాక్షరాలతో లిఖించుకున్నాడు. చిన్నతనంలోనే క్రికెట్లోకి ఎంట్రీ ఇచ్చి లెజెండ్గా ఎదిగిన సచిన్ రమేశ్ టెండూల్కర్ పుట్టినరోజు ( ఏప్రిల్, 24) ఈ రోజు. ఈ సందర్భంగా ఒక విషయం ఫ్యాన్స్ మధ్య ఆసక్తికరంగా మారింది.ఒక ఇంటర్వ్యూలో మీరు సొంతంచేసుకున్న దాంట్లో దేన్ని మీరు ఉన్నతంగా భావిస్తారు అని అడిగినపుడు సచిన్ సమాధానం తెలుస్తే క్రికెట్ అభిమానులు ఆశ్చర్యపోవాల్సిందే. మహ్మద్ అలీ సంతకం చేసిన బాక్సింగ్ గ్లోవ్స్, డైర్ స్ట్రెయిట్స్ మార్క్ నాప్ఫ్లెర్ సంతకం చేసిన గిటార్, సర్ డాన్ బ్రాడ్మాన్ ఆటోగ్రాఫ్ చేసిన బ్యాట్ వీటిల్లో ఏది అపురూపంగా అనిపిస్తుంది అని అడిగినపుడు "నా కోచ్ అచ్రేకర్ సార్ నుండి పొందిన 13 నాణేలు నాకు చాలా ముఖ్యమైన జ్ఞాపకాలు’’ అని సమాధాన మిచ్చాడట సచిన్. ఇంతకీ ఆ నాణేల కథ ఏంటి అంటే.‘క్రికెట్ దేవుడు'గా అవతరించిన సచిన్ టెండూల్కర్ ప్రయాణంలో ఎత్తుపల్లాలుకూడా ఉన్నాయి. ఈ క్రమంలో సచిన్ టెండూల్కర్ రాటుదేలేలా కీలక పాత్ర పోషించిన గురువు రమాకాంత్ అచ్రేకర్. శివాజీ పార్క్ జింఖానా మైదానంలోట్రైనింగ్ సెషన్లో కోచ్ అచ్రేకర్ అద్భుతమైన శిక్షణలో సచిన్ రాటు దేలాడు. ఆయన శిక్షణలో ఉన్నప్పుడు సచిన్ అలసిపోయినట్లు అనిపించినప్పుడల్లా అచ్రేకర్ ఒక ట్రిక్ వాడేవారట. క్రికెట్ స్టంప్ పైన ఒక రూపాయి నాణెం ఉంచేవారట. ఆ నాణెం గెలవాలంటే సచిన్ టెండూల్కర్ను అవుట్ చేయమని బౌలర్లను సవాలు చేశాడు. బౌలర్లు అతనిని అవుట్ చేయడంలో విఫలమైతే, అచ్రేకర్ సచిన్కు నాణెం ఇచ్చేవాడు. అలాగే ఆ నాణెం దక్కించు కోవాలంటే.. అవుట్ కాకుండా ఆడాలని సచిన్కు సవాల్ విసిరే వారట. అలా అటు బౌలర్లకూ ఇటు తనకూ ఇద్దరికీ ప్రేరణగా నిలిచేదనీ, ఇది భవిష్యత్తులో తన ఆటకు చాలా ఉపయోగపడిందని ఇంటర్వ్యూలో గుర్తు చేసుకున్నాడు సచిన్.'ద్రోణాచార్య' లేకపోతే నేను లేను2023, జనవరిలో సచిన్ టెండూల్కర్ ఎక్స్ ద్వారా కోచ్ అచ్రేకర్కి కృతజ్ఞతలు తెలిపాడు. ఆయన్ని 'ద్రోణాచార్య' అభివర్ణించాడు. తనను ప్రపంచ స్థాయి ఆటగాడిగా ఎలా మార్చాడో కూడా పంచుకున్నాడు. ‘‘టెక్నిక్, క్రమశిక్షణ, ముఖ్యంగా ఆటను గౌరవించడం నేర్పించారాయన. నేను ప్రతిరోజూ ఆయన గురించే ఆలోచిస్తాను. ఈ రోజు, ఆయన వర్ధంతి సందర్భంగా, నా జీవితంలోని ద్రోణాచార్యుడికి వందనం చేస్తున్నాను. ఆయన లేకపోతే. క్రికెటర్గా నేను లేను’’ అంటూ ఎమోషనల్ అయ్యాడు సచిన్.He taught me technique, discipline and most importantly, to respect the game.I think of him every day. Today, on his death anniversary, I salute the Dronacharya of my life. Without him, I wouldn’t have been the same cricketer. pic.twitter.com/JQ8uijHD9Y— Sachin Tendulkar (@sachin_rt) January 2, 2023కాగా సచిన్ టెండూల్కర్కు తొలుత టెన్నిస్పై ఆసక్తి ఉండేది. లెజెండరీ టెన్నిస్ ఆటగాడు జాన్ మెకెన్రోకి పెద్ద ఫ్యాన్ కూడా అయితే, తరువాతి కాలంలో సచిన్ సోదరుడు, అజిత్ టెండూల్కర్ అతనిని క్రికెట్కు పరిచయం చేయడంతో క్రికెట్పై మక్కువ పెంచుకున్నాడు. దీంతో అజిత్ ప్రఖ్యాత కోచ్ రమాకాంత్ అచ్రేకర్ వద్దకు సచిన్ను తీసుకెళ్లాడు. సచిన్ ఆటతీరు చేసిన అచ్రేకర్ అకాడమీకి ఎంపిక చేశాడు. లేదంటే క్రికెట్ ప్రపంచం, ఒక లెజెండ్ను మిస్ అయ్యేదేమో! -
ముఖేష్ అంబానీ: ఏ వర్కౌట్స్ లేకుండానే 15 కిలోలు తగ్గాడట, ఎలా?
రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ అధినేత ముఖేష్ అంబానీ ఈ రోజు 67వ ఏట అడుగుపెట్టాడు. బిజినెస్ మాగ్నెట్, ఆసియాకుబేరుడు ముఖేష్ అంబానీ, ధీరూభాయ్ అంబానీ, కోకిలా బెన్ దంపతులకు 1957 ఏప్రిల్ 19న యెమెన్లో పుట్టాడు. వ్యాపార కుటుంబ నేపథ్యం ఉన్నప్పటికీ, కెమికల్ ఇంజనీరింగ్ చదివిన అంబానీ తన సామర్థ్యం, కృషితో రిలయన్స్ను ప్రపంచంలోనే ప్రముఖ వ్యాపార సామ్రాజ్యంగా విస్తరించాడు. భారతదేశంలోనే కాదు ఆసియాలోనే అత్యంత ధనవంతుడిగా, ప్రపంచంలోని టాప్ బిలియనీర్ల జాబితాలో 11వ స్థానంలో నిలవడం విశేషం. రిలయన్స్ వ్యాపార సామ్రాజ్య బాధ్యతలను తన వారసులు, ఇషా అంబానీ పిరమల్, ఆకాష్ అంబానీ, అనంత్ అంబానీలకు పంచి ఇచ్చినప్పటికీ 67 ఏళ్ల వయసులో కూడా వ్యాపార దక్షతలో చురుగ్గా ఉంటాడు. అటు రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్లో కీలకమైన వ్యాపార నిర్ణయాలతోపాటు ఇటు కుటుంబ బాధ్యతలను కూడా దిగ్విజయంగా నిర్వరిస్తున్నాడు. అంతేకాదు తన ఆరోగ్యాన్ని, ఫిట్నెస్ను కాపాడుకోవడంలో కూడా దిట్ట. ఆయన పాటించే ఆహారం నియమాల గురించి ఎవరికీ పెద్దగా తెలియనప్పటికీ, ఎలాంటి వర్కవుట్ లేకుండానే ముఖేష్ అంబానీ 15 కిలోలు తగ్గారట. ఈ సందర్బంగా ఆయన డైట్ , జీవన శైలి ఏంటి అనేది చర్చలో నిలిచింది. (యూట్యూబర్ ఓవర్ యాక్షన్.. దిమ్మతిరిగే షాక్!) కఠినమైన ఆహార నియమాలతోనే ముఖేష్ అంబానీ ఈ అద్భుత ఫలితాన్ని సాధించారని పలు నివేదికల ద్వారా తెలుస్తోంది. ప్రపంచంలోని ఇతర సక్సెస్ఫుల్ వ్యక్తుల మాదిరిగానే ముఖేష్ అంబానీ యోగా, ధ్యానంతో రోజు ప్రారంభిస్తాడు. ఉదయం 5:30 గంటలకు మేల్కొంటాడు. యోగా, ధ్యానం సూర్య నమస్కారాలు, వాకింగ్ కోసం బయటికి కూడా వెళ్తాడు. ఎంత బిజీషెడ్యూల్ ఉన్నా ఈ ఉదయపు దినచర్యను మాత్రం ఎప్పుడూ దాటవేయడు. (మోడ్రనే కానీ, నాకు అలా బిడ్డను కనే ధైర్యం లేదు : మసాబా వ్యాఖ్యలు వైరల్) బ్రేక్ఫాస్ట్, లంచ్ డిన్నర్ ఇలా.. అంబానీ స్ట్రిక్ట్ వెజిటేరియన్ డైట్ని ఫాలో అవుతారు. ఆల్కహాల్, జంక్ ఫుడ్కు దూరంగా ఉంటాడు. ఇక రోజులోని అంబానీ తొలి భోజనం విషయానికి వస్తే అల్పాహారంలో తాజా పండ్లు, జ్యూస్, ఇడ్లీ-సాంబార్ తీసుకుంటాడు. లంచ్, డిన్నర్ కూడా సాంప్రదాయ భారతీయ ఆహారాలతో చాలా సింపుల్గా కానిచ్చేస్తారట. గుజరాతీ తరహాలో దాల్, సబ్జీ, అన్నం, సూప్లు , సలాడ్లను ఇష్టపడతాడు. అది కూడా ఇంట్లో వండిన భోజనం మాత్రమే. కాగా ముఖేష్ అంబానీ భార్య నీతా అంబానీ రిలయన్స్ ఫౌండేషన్, ధీరూభాయ్ అంబానీ ఇంటర్నేషనల్ స్కూల్ చైర్పర్సన్, వ్యవస్థాపకురాలిగా ఐపీఎల్ జట్టుకు ఓనర్గా ఉన్నారు. నీతా, అంబానీ దంపతులు ఇప్పటికేపెద్ద కుమారుడు ఆకాష్ అంబానీకి, కుమార్తె ఇషా అంబానీకి వివాహాలు జరపించారు. నలుగురు మనవలు కూడా ఉన్నారు. ఇక చిన్న కొడుకు అనంత్ అంబానీ పెళ్లి ఈ ఏడాది జూన్లో జరగనుంది. -
విక్రమ్ తంగలాన్.. ఈ స్పెషల్ వీడియో చూశారా?
కోలీవుడ్ స్టార్ హీరో విక్రమ్ నటించిన తాజా చిత్రం తంగలాన్. ఈ చిత్రంలో మాళవిక మోహన్, పార్వతి హీరోయిన్లుగా నటించారు. పా.రంజిత్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని జియో స్టూడియోస్ సంస్థతో కలిసి స్టూడియో గ్రీన్ సంస్థ అధినేత కె ఈ జ్ఞానవేల్ రాజా నిర్మించారు. నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం చాలా రోజుల ముందే తెరపైకి రావాల్సింది. అయి తే గ్రాఫిక్స్ పూర్తి కాకపోవడంతో విడుదల తేదీ రెండుసార్లు వాయిదా పడుతూ వచ్చింది. కాగా ఇప్పటికీ దర్శక, నిర్మాతలు తంగలాన్ చిత్రం విడుదల తేదీని ప్రకటించలేదు. తాజాగా ఈనెల 17న విక్రమ్ బర్త్ డే కావడంతో మేకర్స్ క్రేజీ అప్డేట్ ఇచ్చారు. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ తంగలాన్ గ్లింప్స్ను విడుదల చేశారు. ఆదివాసి ప్రాంతాలలో నటుడు విక్రమ్ గుర్రమెక్కి వెళుతున్న పోస్టర్ను విడుదల చేశారు. అందులో విక్రమ్ కొండవాసీ గెటప్లో కనిపించిన దృశ్యం తంగలాన చిత్రంపై ఆసక్తిని పెంచేస్తోంది. ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు పా.రంజిత్ మాట్లాడుతూ తంగలాన్ చిత్రాన్ని జీ స్టూడియోస్ సంస్థతో కలిసి స్టూడియో గ్రీన్ సంస్థ కె ఈ జ్ఞానవేల్ రాజా నిర్మించడం సంతోషంగా ఉందన్నారు. నటుడు విక్రమ్ పుట్టినరోజు సందర్భంగా ఈ చిత్రం గ్లింప్స్ విడుదల చేయడం ఇంకా ఆనందంగా ఉందన్నారు. తంగలాన్ చిత్రం కోసం విక్రమ్ పూర్తిగా మేకోవర్ అయ్యాయన్నారు. ఆయన ఎంతో అంకిత భావంతో పని చేశారన్నారు. ఇతర నటీనటులు ఎంతగానో శ్రమించినట్లు చెప్పారు. ఇది గోల్డ్ మైన్స్ నేపథ్యంలో రూపొందించిన కథా చిత్రం అని చెప్పారు. చిత్ర విడుదల తేదీని త్వరలో వెల్లడించనున్నట్లు పా.రంజిత్ చెప్పారు. -
ఎంగేజ్మెంట్ తర్వాత సిద్దార్థ్ ఫస్ట్ బర్త్డే.. ప్రియురాలి విషెస్ (ఫోటోలు)
-
తన లవర్బోయ్కి అదితి లవ్లీ విషెస్
టాలెంటెడ్ హీరో సిద్ధార్థ పుట్టిన రోజు ఈ రోజు (ఏప్రిల్17) . ఈ సందర్భంగా సిద్ధార్థ్ ప్రేయసి, అందాల తార అదితి రావు హైదరీ స్పెషల్ విషెస్ తెలిపింది. ఈ సందర్బంగా తన కాబోయే భర్తతో లవ్లీ ఫోటోలను షేర్ చేసింది. "హ్యాపీయెస్ట్ బర్త్డే నా మేనికార్న్’’ కాబోయే భర్త కోసం పుట్టినరోజుకి విషెస అందించింది. ఎంగేజ్మెంట్ తరువాత ఇది ఫస్ట్ బర్త్డే కావడంతో అదితి ఆనందంలో మునిగితేలుతోంది. మురిపెంగా ప్రియుడిని లాటర్, చీర్ లీడర్ అంటూ పొగిడేసింది. కాగా టాలీవుడ్ ఇండస్ట్రీలో లవర్ బాయ్ ఇమేజ్ సంపాదించుకున్న సిద్ధార్థ్ ప్రస్తుతం హీరోయిన్ అదితితో పీకల్లోతు ప్రేమలో ఉన్నాడు. 2021లో 'మహా సముద్రం' తర్వాత నుంచి వీరిద్దరూ డేటింగ్ ప్రారంభించారు.అయితే తెలంగాణలోని వనపర్తిలోని శ్రీరంగనాయక ఆలయంలో రహస్యంగా పెళ్లి చేసుకున్నారనే వార్తలు హల్చల్ చేశాయి.అయితే పెళ్లి వార్తలను ఖండించిన సిద్ధార్థ్ తాము రహస్యంగా పెళ్లి చేసుకోలేదనీ, కుటుంబంతో ప్రైవేట్గా నిర్వహించిన ఒక పార్టీలో ఇద్దరికీ నిశ్చితార్థం జరిగిందని వెల్లడించిన సంగతి తెలిసిందే. View this post on Instagram A post shared by Aditi Rao Hydari (@aditiraohydari) -
Poorna Son Hamdan Birthday: పూర్ణ కుమారుడి ఫస్ట్ బర్త్డే.. పిల్లాడు భలే క్యూట్.. (ఫోటోలు)
-
అక్కినేని హీరోకు సమంత విషెస్.. పోస్ట్ వైరల్!
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ పరిచయం అక్కర్లేని పేరు. టాలీవుడ్లో అగ్ర హీరోలందరితో సినిమాలు చేసింది. గతేడాది శాకుంతలం, ఖుషి సినిమాలతో అలరించింది. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ ఇండియన్ వర్షన్ సిటాడెల్ వెబ్ సిరీస్లో నటిస్తోంది. వరుణ్ ధావన్తో కలిసి ఇందులో కనిపించనుంది. తాజాగా సమంత చేసిన పోస్ట్ నెట్టింట వైరలవుతోంది. టాలీవుడ్ యంగ్ హీరో అక్కినేని అఖిల్ బర్త్ డే విషెస్ తెలిపింది సామ్. ఈ మేరకు తన ఇన్స్టా స్టోరీస్లో పోస్ట్ చేసింది. క్యూట్ పప్పీతో అఖిల్ ఉన్న ఫోటోను పంచుకుంది. హ్యాపీ బర్త్ డే అఖిల్ అంటూ క్యాప్షన్ రాసుకొచ్చింది. అయితే అక్కినేని హీరో నాగచైతన్యను పెళ్లాడిన సమంత.. విభేదాలు రావడంతో విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే. కాగా.. గతేడాది అఖిల్ ఏజెంట్ సినిమాతో ప్రేక్షకులను పలకరించాడు. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద తీవ్రంగా నిరాశపర్చింది. ఈ చిత్రంలో మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి కీలక పాత్ర పోషించారు. -
అల్లు అర్జున్ బర్త్ డే.. రామ్ చరణ్ మర్చిపోయాడా?
హీరో అల్లు అర్జున్ పుట్టినరోజు.. ఫ్యాన్స్ ఫుల్ హంగామా చేస్తున్నారు. అర్థరాత్రి ఇంటి దగ్గర హడావుడి చేశారు. ఉదయం 'పుష్ప 2' టీజర్ వచ్చిన తర్వాత సోషల్ మీడియాలో రచ్చ లేపుతున్నారు. ఇకపోతే బన్నీకి పలువురు సెలబ్రిటీలు విషెస్ చెప్పారు. మెగాహీరో రామ్ చరణ్ మాత్రం మర్చిపోయాడా అనిపిస్తోంది. (ఇదీ చదవండి: ప్రభాస్తో సినిమా.. తొలిరోజే రూ.150 కోట్లు వస్తాయ్!) అల్లు అర్జున్- రామ్ చరణ్.. మెగా కాంపౌండ్ హీరోలు. కానీ వీళ్లిద్దరూ మధ్య బాండింగ్ సరిగా లేదని గతంలో ఫ్యాన్స్ మాట్లాడుకున్నారు. బన్నీకి నేషనల్ అవార్డు వచ్చినప్పుడు, పుట్టినరోజు టైంలోనూ చరణ్ పోస్టుల్లాంటివి ఏం చేయకపోవడంతో ఏమైందా అని అందరూ అనుకున్నారు. కానీ గతేడాది అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా చరణ్ ట్వీట్ చేశాడు. ఈసారి మాత్రం మర్చిపోయాడా? అనిపిస్తోంది. ఎందుకంటే అక్కినేని హీరో అఖిల్ కి విషెస్ చెప్పిన చరణ్.. బన్నీకి సోషల్ మీడియాలో ఎక్కడ శుభాకాంక్షలు చెప్పలేదు. దీంతో బన్నీ-చరణ్ ఫ్యాన్స్ గుసగుసలాడుకుంటున్నారు. మరి ఈ రోజు ముగిసిలోపు చెబుతాడా లేదా అనేది చూడాలి? (ఇదీ చదవండి: ఎన్నికల్లో తొలిసారి పోటీ.. కోట్లు విలువైన కారు కొన్న హీరోయిన్) My dearest brother @AkhilAkkineni8 happy birthday!! Wishing lots of happiness and success!! — Ram Charan (@AlwaysRamCharan) April 8, 2024 -
ప్రియుడితో కలిసి పెట్స్ బర్త్డే సెలబ్రేట్ చేసిన వరలక్ష్మి (ఫోటోలు)
-
Happy Birthday Ram Gopal Varma: రామ్ గోపాల్ వర్మ బర్త్ డే స్పెషల్ ఫొటోలు చూశారా?
-
రష్మిక మందన్న గురించి ఈ విషయాలు తెలుసా..?
-
అందం + అభినయం +అల్లరి.. హ్యాపీ బర్త్డే రష్మిక మందన (ఫొటోలు)
-
అప్పుడే రెండేళ్లు.. ‘బాపూ బొమ్మ’ కూతురు ఎంత ముద్దుగుందో..! (ఫోటోలు)
-
ఇటు మెకానిక్ రాకీ.. అటు లైలా!
బర్త్ డే (మార్చి 29) రోజున హీరో విశ్వక్ సేన్ డబుల్ ధమాకా అందుకున్నారు. విశ్వక్ సేన్ హీరోగా నటించనున్న రెండు కొత్త సినిమాల వివరాలను అధికారికంగా ప్రకటించారు మేకర్స్. విశ్వక్ టైటిల్ రోల్లో నటించనున్న చిత్రం ‘మెకానిక్ రాకీ’. మీనాక్షీ చౌదరి హీరోయిన్గా నటించనున్న ఈ సినిమాలో నరేశ్, ‘వైవా’ హర్ష, హర్షవర్ధన్ కీలక పాత్రల్లో నటిస్తారు. రవితేజ ముళ్లపూడిని దర్శకుడిగా పరిచయం చేస్తూ, రామ్ తాళ్లూరి నిర్మించనున్నారు. శుక్రవారం ఈ సినిమా ఫస్ట్ లుక్, టైటిల్ లుక్స్ను విడుదల చేశారు. ఈ సినిమాకు జేక్స్ బిజోయ్ స్వరకర్త. అలాగే విశ్వక్ సేన్ హీరోగా నటించనున్న మరో సినిమా ‘లైలా’. రామ్ నారాయణ్ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని సాహు గారపాటి నిర్మించనున్నారు. ఈ సినిమాలో సెకండాఫ్లో లైలా అనే అమ్మాయిగా విశ్వక్ కనిపిస్తారని తెలిసింది. ఈ సినిమాకు తనిష్క్ బాగ్చి మ్యూజిక్ డైరెక్టర్. ఈ సినిమాలే కాకుండా విశ్వక్సేన్ ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ అనే సినిమా చేస్తున్నారు. కృష్ణచైతన్య దర్శకత్వంలో సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్న ఈ చిత్రం మే 17న విడుదల కానుంది. -
టీజర్ రెడీ
‘పుష్ప : ది రూల్’ సినిమా టీజర్కు రంగం సిద్ధమౌతున్నట్లుగా తెలుస్తోంది. హీరో అల్లు అర్జున్ బర్త్ డే సందర్భంగా ఏప్రిల్ 8న ‘పుష్ప: ది రూల్’ సినిమా టీజర్ను రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లుగా తెలిసింది. సుకుమార్ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ నిర్మిస్తున్న ఈ సినిమాలో రష్మికా మందన్నా హీరోయిన్గా నటిస్తున్నారు. ఫాహద్ ఫాజిల్, అనసూయ, సునీల్, జగపతిబాబు కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ స్వరకర్త. ‘పుష్ప: ది రూల్’ సినిమా ఈ ఏడాది ఆగస్టు 15న విడుదల కానుంది. ఇక ‘పుష్ప’ సినిమా ఫ్రాంచైజీలోని తొలి భాగం ‘పుష్ప: ది రైజ్’ సినిమా సక్సెస్ కావడంతో మలి భాగం ‘పుష్ప: ది రూల్’పై భారీ అంచనాలు ఉన్నాయి. మరోవైపు దర్శకుడు త్రివిక్రమ్, మరో దర్శకుడు సందీప్ రెడ్డి వంగాలతో అల్లు అర్జున్ సినిమాలు కమిటైన సంగతి తెలిసిందే. ఈ చిత్రాల అప్డేట్స్ కూడా అల్లు అర్జున్ బర్త్ డే సందర్భంగా ఏప్రిల్ 8న వచ్చే అవకాశం ఉంది. ఇంకా అల్లు అర్జున్–దర్శకుడు అట్లీ కాంబినేషన్లోని కొత్త సినిమా ప్రకటన కూడా రావొచ్చనే ప్రచారం జరుగుతోంది. -
'హ్యాపీ బర్త్ డే మై బ్రదర్'.. దేవర స్పెషల్ విషెస్!
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ బర్త్ డే కావడంతో అభిమానులు, సినీ ప్రముఖులు విషెస్తో ముంచెత్తుతున్నారు. తమ అభిమాన హీరో పుట్టిన రోజు సందర్భంగా సోషల్ మీడియాలో పోస్టులతో హోరెత్తిస్తున్నారు. యంగ్ టైగర్ ఎన్టీఆర్ సైతం హ్యాపీ బర్త్ డే మై డియరెస్ట్ బ్రదర్ అంటూ ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఎన్టీఆర్ చేసిన ట్వీట్ నెట్టింట వైరలవుతోంది. మరోవైపు ఎన్టీఆర్ ప్రస్తుతం దేవర సినిమాతో బిజీగా ఉన్నారు. తాజాగా ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ఫ్లిక్స్ సైతం చెర్రీకి బర్త్ డే విషెస్ తెలిపింది. ఆర్ఆర్ఆర్ సినిమాలోని సీన్స్ను కలిసి స్పెషల్ వీడియోను రిలీజ్ చేసింది. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్గా మారింది. యంగ్ టైగర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ నటించిన ఆర్ఆర్ఆర్ సినిమా ప్రపంచవ్యాప్తంగా బ్లాక్బస్టర్గా నిలిచింది. రాజమౌళి తెరకెక్కించిన ఈ చిత్రంలో ఆలియా భట్ హీరోయిన్గా నటించింది. అంతే కాకుండా ఈ చిత్రంలోని నాటు నాటు సాంగ్కు ఆస్కార్ అవార్డు దక్కింది. కాగా.. రామ్ చరణ్ ప్రస్తుతం శంకర్ డైరెక్షన్లో వస్తోన్న గేమ్ ఛేంజర్లో నటిస్తున్నారు. ఈ చిత్రంలో బాలీవుడ్ భామ కియారా అద్వానీ హీరోయిన్గా కనిపించనుంది. Happy birthday my brother @AlwaysRamCharan. Wishing you a year ahead filled with joy and success. — Jr NTR (@tarak9999) March 27, 2024 Putting on our Naatu Naatu shoes cuz it's @AlwaysRamCharan's birthday!! 🕺🕺🥳🎉 pic.twitter.com/F1TwA3SA9t — Netflix India (@NetflixIndia) March 27, 2024
Pagination
ఆ బీప్ సౌండ్ వస్తేనే.. మీ ఓటు వేసినట్టు
ఇది కదా క్రేజ్ అంటే.. సీఎం జగన్ ఇంటర్వ్యూకి మిలియన్ల వ్యూస్
Sakshi.com ఇప్పుడు సరికొత్తగా మీ ముందుకు
కాపులు, ముస్లింలకు రిజర్వేషన్లు అక్కర్లేదు: పవన్కళ్యాణ్
రైతు కుమార్తె విజయం.. రిషబ్ శెట్టి అభినందనలు
పులివెందుల ప్రజలకు ఇద్దరిపైనా ప్రేమే: వైఎస్ భారతి
RCB Vs PBKS: కోహ్లి అరుదైన రికార్డు.. ఐపీఎల్ చరిత్రలోనే తొలి క్రికెటర్గా
Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో బిగ్ ట్విస్ట్..
బిజీగా ఉండటం ఇంత డేంజరా! హెచ్చరిస్తున్న సైకాలజిస్ట్లు
కారులో వాసన బాగుందని తెగ పీల్చుకుంటున్నారా.?
దేశాభివృద్ధిలో వ్యవసాయ రంగం పాత్ర ఎనలేనిది
క్రిటికల్ పోలింగ్ కేంద్రాలపై ప్రత్యేక దృష్టి
కాంగ్రెస్ను నమ్మితే నట్టేట ముంచింది
చివరి శ్వాస వరకు ప్రజల కోసమే..
జిల్లాకు తేలికపాటి వర్ష సూచన
ఓటు వేసేందుకు ఈ కార్డుల్లో ఒకటి తప్పనిసరి
మోదీ పాలనే దేశానికి శ్రీరామరక్ష
నర్సింగ్హోంపై విచారణకు కలెక్టర్ ఆదేశం
ఈవీఎంల భద్రత పోలీసుల బాధ్యత
Lok Sabha Election 2024: నాలుగో విడతలోనూ... మహా వార్!
తప్పక చదవండి
- Lok Sabha Election 2024: ఓటింగ్ శాతం తగ్గినా.. ఓట్లు పెరిగాయ్!
- Lok Sabha Election 2024: నాలుగో విడతలోనూ... మహా వార్!
- Lok Sabha Election 2024: మాజీ దంపతుల దంగల్!
- ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్కు వ్యతిరేకంగా యాడ్ .. బీజేపీ నేత సీరియస్
- ఐపీఎల్ మధ్యలోనే దుబాయ్ వెళ్లిన సన్రైజర్స్ కెప్టెన్..
- మేనిఫెస్టోకు, విశ్వసనీయతకు అర్థం చెప్పింది మీ బిడ్డే: సీఎం జగన్
- ‘ కృష్ణమ్మ’ మూవీ రివ్యూ
- టీడీపీ అడ్డంగా బుక్కైంది: సజ్జల కీలక వ్యాఖ్యలు
- వివేకా కేసు: సునీత దంపతులకు ఎదురుదెబ్బ
- ఆ బీప్ సౌండ్ వస్తేనే.. మీ ఓటు వేసినట్టు
Advertisement