-
‘చార్ సౌ పార్’ ఎందుకంటే... క్లారిటీ ఇచ్చిన ప్రధాని
భోపాల్: బీజేపీకి 400 సీట్లు ఎందుకు రావాలనేదానిపై ప్రధాని మోదీ క్లారిటీ ఇచ్చారు. ఆర్టికల్ 370ని కాంగ్రెస్ తిరిగి తీసుకురాకుండా ఉండాలంటే, అయోధ్య రామమందిరానికి బాబ్రీ తాళం పడకుండా ఉండటానికి బీజేపీకి ఈ ఎన్నికల్లో 400 సీట్లు రావాలని చెప్పారు. కాంగ్రెస్ ప్రచారం చేస్తున్నట్లుగా రాజ్యాంగాన్ని మార్చడానికి తమకు 400 సీట్లు కావాలని అడగడం లేదన్నారు.మధ్యప్రదేశ్లోని థార్లో మంగళవారం(మే7)జరిగిన ఎన్నికల ప్రచార సభలో మోదీ మాట్లాడారు. పార్లమెంట్లో తమకు ఇప్పటికే 400 సీట్లు ఉండటం వల్లే ఆర్టికల్ 370ని రద్దు చేయగలిగామన్నారు. మొదటి దశ లోక్సభ ఎన్నికల్లో ప్రతిపక్షాలు ఓడిపోయాయని, రెండవ దశలో అవి ఏకంగా నామరూపాలు లేకుండా పోయాయన్నారు. మూడవ దశలో మిగిలిందేమైనా ఉంటే తుడిచిపెట్టుకుపోయిందని మోదీ ఎద్దేవా చేశారు. -
పోలింగ్ బూత్లలో లూటీ.. అఖిలేష్ యాదవ్ సంచలన వ్యాఖ్యలు
బీజేపీ మద్దతు దారులు పోలింగ్ బూత్లను లూటి చేస్తున్నారంటూ ఉత్తర్ ప్రదేశ్ సమాజ్వాది (ఎస్పీ) పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.మంగళవారం ఉత్తర్ప్రదేశ్లో ఒకప్పుడు సమాజ్వాదీ పార్టీకి కంచుకోటలుగా ఉన్న 10 లోక్సభ స్థానాల్లో మూడో విడతలో పోలింగ్ కొనసాగుతుంది. ఈ తరుణంలో తన భార్య, సిట్టింగ్ ఎంపీ డింపుల్ యాదవ్ పోటీ చేస్తున్న మైన్పురి నియోజకవర్గంలో ఎటావాలో ఓటు వేశారు.రైతులు ప్రాణాలు కోల్పోయారనిఅనంతరం బీజేపీపై అఖిలేష్ యాదవ్ విమర్శలు చేశారు. బీజేపీలో అధికార పోరు నడుస్తోందని, అందుకే ఆ పార్టీ నేతలు ఆత్మ సంతృప్తి ప్రకటనలు చేస్తున్నారని వ్యాఖ్యానించారు. బీజేపీ ప్రభుత్వం రైతులకు కనీస మద్దతు ధర ఇవ్వలేకపోయిందని, మోదీ ప్రభుత్వం తెచ్చిన మూడు వ్యవసాయ చట్టాలకు వ్యతికేరంగా వెయ్యి మందికి పైగా రైతులు ప్రాణాలు కోల్పోయారని మండిపడ్డారు.లఖింపూర్ ఖేరీ హింసాకాండపైఈ సందర్భంగా 2021లో జరిగిన లఖింపూర్ ఖేరీ హింసాకాండను ఆయన పరోక్షంగా ప్రస్తావించారు. కేంద్ర మంత్రి అజయ్ కుమార్ మిశ్రా కుమారుడు ఆశిష్ మిశ్రా కారులో ఉన్న ఓ నలుగురు అగంతకులు రైతులను ఢీకొట్టారని ఆరోపించారు. ఇలా బీజేపీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి రైతుల ఆత్మహత్యలు పెరిగిపోయాయని ద్వజమెత్తారు. ఐదు లక్షల ఓట్లతో డింపుల్ యాదవ్ కాగా, సైఫాయిలో ఓటు వేసిన ఎస్పీ నేత రామ్ గోపాల్ యాదవ్ మాట్లాడుతూ.. బీజేపీ అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని మారుస్తుందని ఆరోపించారు. ఈ లోక్సభ ఎన్నికల్లో దేశాన్ని కాపాడే పోరాటమని, మైన్పురి స్థానంలో డింపుల్ యాదవ్ ఐదు లక్షల ఓట్లతో గెలుస్తారని ధీమా వ్యక్తం చేశారు. -
బీజేపీలో చేరిన రాధికా ఖేరా.. ఎవరీమె?
రాజస్థాన్ కాంగ్రెస్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఏఐసీసీ అధికార ప్రతినిధి రాధికా ఖేరా కాంగ్రెస్ను వీడి బీజేపీలో చేరారు.కొద్ది రోజుల క్రితం రాష్ట్ర కాంగ్రెస్ సీనియర్ నేతలు తనని వేధిస్తున్నారంటూ రాధికా ఖేరా సంచలన ఆరోపణలు చేశారు. పార్టీకి సైతం రాజీనామా చేశారు. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేకు రాసిన రాజీనామా లేఖలో అయోధ్యలోని రామమందిరాన్ని సందర్శించడం తాను విమర్శలకు గురైనట్లు తెలిపారు. ఛత్తీస్గఢ్ కాంగ్రెస్ పార్టీ నాయకులు తనను వేధించారని, గదిలో బంధించి దుర్భాషలాడారని ఆరోపించారు. ఇదే విషయంపై పార్టీ నేతలకు విన్నవించినా ఎలాంటి చర్యలు తీసుకోలేదని వాపోయారు. దీంతో పాటు అయోధ్యలోని రామమందిరాన్ని దర్శించుకున్నందుకు అనేక విమర్శలు ఎదురైనట్లు ఆవేదన వ్యక్తం చేశారు. ఛత్తీస్గఢ్ కాంగ్రెస్ యూనిట్ కమ్యూనికేషన్ వింగ్ ఛైర్పర్సన్ సుశీల్ ఆనంద్తో పాటు మరికొంత మంది తనను అసభ్య పదజాలంతో దుర్భాషలాడారని లేఖలో పేర్కొన్నారు -
వారిది చీకటి ఒప్పందం..: సీఎం రేవంత్రెడ్డి
ఉప్పల్/మల్లాపూర్/అంబర్పేట/కంటోన్మెంట్: బీఆర్ఎస్ బీజీపీలది పొద్దుటి పూట బంధం.. చీకట్లో ఒప్పందం అని సీఎం రేవంత్రెడ్డి విమర్శించారు. ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ పోటీలోనే లేదన్నారు. చీకటి ఒప్పందంలో భాగంగానే మల్కాజిగిరిలో బీఆర్ఎస్ అభ్యర్థిని దిష్టిబొమ్మలా నిలబెట్టారని ధ్వజమెత్తారు. ఇక్కడి బీజేపీ అభ్యర్ధి ఈటల రాజేందర్ గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఆర్థికమంత్రిగా ఉన్నప్పుడే లక్షల కోట్ల రూపాయలు కొల్లగొట్టారని ఆరోపించారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్రెడ్డి హయాంలోనే హైదరాబాద్ విశ్వనగరంగా రూపుదిద్దుకునేందుకు పునాది పడిందని చెప్పారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ ప్రజలు రాష్ట్రంలో ద్వితీయ శ్రేణి పౌరుల్లా జీవిస్తున్నారని, కంటోన్మెంట్ ప్రాంతాన్ని జీహెచ్ఎంసీలో కలిపేస్తామని హామీ ఇచ్చారు. జీహెచ్ఎంసీలో విలీనం చేయడం వల్ల కంటోన్మెంట్కు కూడా రాష్ట్ర ప్రభుత్వం ద్వారా అన్ని రకాల సహకారం అందుతుందని తెలిపారు. సికింద్రాబాద్ బీజేపీ అభ్యర్థి కిషన్రెడ్డి పేదల మనిషి కాదని విమర్శించారు. సోమవారం మల్కాజిగిరి, సికింద్రాబాద్ లోక్సభ అభ్యర్థులు పట్నం సునీతా మహేందర్ రెడ్డి, దానం నాగేందర్, కంటోన్మెంట్ అసెంబ్లీ అభ్యర్థి శ్రీగణేశ్లకు మద్దతుగా హైదరాబాద్లోని ఉప్పల్, మల్లాపూర్, అంబర్పేట, కంటోన్మెంట్ ప్రాంతాల్లో ముఖ్యమంత్రి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఉప్పల్ వీటీ కమాన్, ఫీవర్ ఆస్పత్రి చౌరస్తా, పికెట్ చౌరస్తాల వద్ద జరిగిన స్ట్రీట్ కార్నర్ మీటింగులు, రోడ్ షోల్లో ప్రసంగించారు. కిషన్రెడ్డి పేదల మనిషి కాదు ‘వైఎస్ సారథ్యంలో మంత్రిగా పని చేసిన దానం నాగేందర్, అప్పటి ఎంపీ అంజన్కుమార్ల ఆధ్వర్యంలో నగరంలో చేసిన అభివృద్ధే నేటికీ ప్రజలకు అందుబాటులో ఉంది. మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచినా కిషన్రెడ్డి అంబర్పేటకు చేసిందేమీ లేదు. ఆయన పేద ప్రజల మనిషి కాదు. ఆయనకు ఓటు వేస్తే ఎలాంటి ఉపయోగం ఉండదు. గత జీహెచ్ఎంసీ ఎన్నికలకు ముందు నగరంలో వరదలు వచ్చి పేదలు ఇబ్బందులు పడితే కిషన్రెడ్డి అణా పైసా ఇవ్వలేదు. ఆరేళ్లు గడిచినా అంబర్పేట ఫ్లైఓవర్ ఎందుకు పూర్తి కాలేదు?..’ అని రేవంత్ నిలదీశారు. ఈటల వేషాలు ప్రజలు గుర్తుపట్టేస్తారు ‘ఈటల రాజేందర్ మల్కాజిగిరి ప్రాంతానికి చేసిన మేలు ఏంటో చెప్పాలి. గత పదేళ్లలో ఒక్కరోజు కూడా ఈటల పేద ప్రజల గురించి పట్టించుకున్న పాపాన పోలేదు. 2001 నుంచి 2021 వరకు కేసీఆర్, నువ్వు ఒకే కంచంలో తిని, ఒకే మంచంలో పడుకోలేదా? ఆర్థిక మంత్రిగా ఉన్నప్పుడు ప్రతి ఫైల్ మీద సంతకం పెట్టింది నీవు కాదా? ధరణి ముసుగులో హైదరాబాద్ చుట్టూ వేలాది ఎకరాలు కొల్లగొట్టలేదా? కేసీఆర్ దోపిడీలో నీవు కూడా భాగస్వామివే. పంపకాల్లో తేడా వచ్చి విడి పోయారంతే తప్ప మరొకటి కాదు. బీజేపీలోకి వచ్చి మూడేళ్లు అయినా ఉప్పల్ ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణంలో జరుగుతున్న జాప్యంపై నరేంద్ర మోదీ, అమిత్షాలతో ఎందుకు చర్చించలేదు? పదేళ్లలో ఏనాడైనా ఉప్పల్కు వచ్చావా? ఈటల ఎన్ని బైరూపుల వేషాలు వేసినా ఇక్కడి ప్రజలు ఇట్టే గుర్తు పట్టేస్తారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు అందాల్సిన ఫలితాలు అందకుండా ప్రధాని మోదీ రాజ్యంగాన్ని మార్చాలని చూస్తున్నారు. కేంద్రంలో మళ్లీ బీజేపీ సర్కారు ఏర్పడితే రిజర్వేషన్లు తొలగిస్తుంది. తెలంగాణకు ఆయన గాడిద గుడ్డు ఇచ్చారు..’ అని ముఖ్యమంత్రి ధ్వజమెత్తారు. కేటీఆర్ చీర కట్టుకుని బస్సెక్కు ‘రేవంత్ ప్రభుత్వం ఏమీ చేయలేదని అంటున్న వారందరికీ చెబుతున్నా. ఆడపడుచులకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాం. 40 లక్షల మందికి గ్యాస్ సబ్సిడీ, 50 లక్షల కుటుంబాలకు ఉచిత కరెంటు ఇస్తున్నాం. మూడు నెలల్లో 30 వేల మంది నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చాం. 4.5 లక్షల ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేసిన ఘనత మాది. కేటీఆర్ ఎర్రగా ఉన్నావు...చీర కట్టుకుని తెలంగాణలో ఎక్కడైనా ఆర్టీసీ బస్సు ఎక్కు.. టికెట్ అడిగితే మా పథకం అమలు కావడం లేదన్నట్టు.. అడగగకపోతే అమలవుతున్నట్లు తెలుసుకో..’ అని రేవంత్ సవాల్ చేశారు. దానం నాగేందర్ను కేంద్ర మంత్రిని చేస్తా ఆరుసార్లు ఎమ్మెల్యేగా, వైఎస్ హయాంలో మంత్రిగా పనిచేసిన అనుభవజు్ఞడు దానం నాగేందర్ను గెలిపిస్తే కేంద్ర మంత్రిని చేస్తానని సీఎం అన్నారు. సునీతా మహేందర్రెడ్డి రంగారెడ్డి జిల్లాలో ఎన్నో సేవలు, అభివృద్ధి పనులు చేశారని, తాను ప్రాతినిధ్యం వహించిన మల్కాజిగిరిలో సునీతమ్మను గెలిపిస్తే అభివృద్ధిలో అండగా ఉంటానని హామీ ఇచ్చారు. కంటోన్మెంట్ కాంగ్రెస్ అభ్యర్థిగా శ్రీగణేశ్ను గెలిపిస్తే ఈ ప్రాంతంలో సమస్యలన్నీ పరిష్కరిస్తామని చెప్పారు. ఈ కార్యక్రమాల్లో ఎంపీ అనిల్కుమార్ యాదవ్, ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్, మాజీ ఎంపీ వి.హన్మంతరావు, ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి, డీసీసీ అధ్యక్షులు హరివర్ధన్ రెడ్డి, రోహిణ్రెడ్డి, మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు తదితరులు పాల్గొన్నారు. -
ఏబీసీ పార్టీలది ముస్లిం లీగ్ ఎజెండా: జేపీ నడ్డా
సాక్షి, పెద్దపల్లి/సాక్షి, యాదాద్రి, నల్లగొండ టూటౌన్: ‘ఏ అంటే ఏఐఎంఐఎం.. బీ అంటే బీఆర్ఎస్.. సీ అంటే కాంగ్రెస్. ఈ మూడు ఏబీసీ పార్టీలు ముస్లిం లీగ్ ఎజెండాతో పనిచేస్తున్నాయి. ఇవి తబ్లిగీ జమాతేను అనుసరిస్తున్నాయి’అని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఆరోపించారు. రజాకార్ పాలనను సమర్ధించే పార్టీలుగా వాటిని అభివర్ణించారు. సెప్టెంబర్ 17న తెలంగాణ విమోచన దినోత్సవం ఆ పార్టీలు నిర్వహించవని.. బీజేపీ అధికారంలోకి వస్తే విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహిస్తుందని చెప్పారు. సోమవారం పెద్దపల్లి ఎంపీ స్థానం పరిధిలోని పెద్దపల్లి జిల్లా కేంద్రంతోపాటు భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని చౌటుప్పల్, నల్లగొండ ఎంపీ స్థానం పరిధిలోని నల్లగొండ పట్టణంలో నిర్వహించిన జన సభల్లో ఆయన ప్రసంగించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు న్యాయం చేస్తాం ప్రధాని మోదీ దేశంలో రిజర్వేషన్లు ఎత్తేస్తారని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఆరోపిస్తున్నారని నడ్డా దుయ్యబట్టారు. రిజర్వేషన్ల గురించి మాట్లాడే అర్హత ఆయనకు లేదని మండిపడ్డారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోని కాంగ్రెస్ ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ రిజర్వేషన్లలోంచి 4% కోత పెట్టి ముస్లింలకు రిజర్వేషన్లు తెచ్చిందని విమర్శించారు. బీజేపీ అధికారంలోకి వస్తే ముస్లింలకు 4 శాతం రిజర్వేషన్లు రద్దు చేసి ఎస్సీ, ఎస్టీ, బీసీలకు అవి దక్కేలా చూస్తామన్నారు. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ రిజర్వేషన్లు తొలగించబోమనే విషయాన్ని లిఖితరూపంలో ఇచ్చే దమ్ముందా..? అని ప్రధాని మోదీ నాలుగు రోజుల క్రితం కాంగ్రెస్ను ప్రశ్నిస్తే.. ఇప్పటివరకు రాహుల్ స్పందించలేదని ఎద్దేవా చేశారు. బీజేపీ రాజ్యాంగానికి వ్యతిరేకం కాదని, మతం పేరిట ముస్లిం రిజర్వేషన్లకు మాత్రమే వ్యతిరేకమన్నారు. శ్రీరాముని వ్యతిరేకి కాంగ్రెస్.. శ్రీరాముడు, సనాతన ధర్మం, దేశాన్ని వ్యతిరేకించేది కాంగ్రెస్ పార్టీ అని నడ్డా ఆరోపించారు. సనా తన ధర్మం గురించి కాంగ్రెస్ మిత్రపక్షమైన డీఎంకే ఎన్ని విమర్శలు చేసినా సోనియా, రాహుల్, ప్రియాంకా గాంధీ స్పందించలేదన్నారు. దేశాన్ని ముక్కలు చేస్తామన్న వారికి రాహుల్ మద్దతిస్తున్నారని ఆరోపించారు. పాక్లోని ఉగ్రవాద స్థావరాలపై వైమానిక దాడులు జరిపితే అందుకు ఆధారాలు అడిన పార్టీ కాంగ్రెస్ అని దుయ్యబట్టారు. అలాంటి వారికి అధికారమిస్తే దేశం పరిస్థితి ఎలా ఉంటుందో ప్రజలు అర్థం చేసుకోవాలన్నారు. మరోవైపు డబుల్ బెడ్రూం ఇళ్ల పేరిట కేసీఆర్ పేదలను మోసగించారని నడ్డా ఆరోపించారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజనను కేసీఆర్ ఉపయోగించలేదని, ప్రస్తుత సీఎం రేవంత్రెడ్డి కూడా దానిపై దృష్టి సారించడం లేదని విమర్శించారు. తాము అధికారంలోకి వస్తే డబుల్ బెడ్రూం ఇళ్లు పూర్తిచేస్తామని హామీ ఇచ్చారు. 5వ ఆర్థిక శక్తిగా భారత్.. గత పదేళ్లలో ప్రధాని మోదీ దేశం విలువను పదింతలు పెంచారని నడ్డా తెలిపారు. సబ్కా సాత్, సబ్కా వికాస్, ఆత్మనిర్భర్ భారత్ కార్యక్రమాలతో విదేశీ ఎగుమతులు పెరిగాయని చెప్పారు. ప్రపంచంలో 11వ ఆర్థిక శక్తిగా ఉన్న భారత్ మోదీ విధానాలతో 5వ ఆర్థిక శక్తిగా ఎదిగిందన్నారు. మోదీ పాలనలో 25 కోట్ల మంది ప్రజలు పేదరికం నుంచి బయటపడ్డారని చెప్పారు. అందుకే దేశాభివృద్ధికి పాటుపడుతున్న బీజేపీకి ఓటు వేసి గెలిపించాలని నడ్డా కోరారు. ఆయా సభల్లో పార్టీ ఎంపీ అభ్యర్థులు గోమాస శ్రీనివాస్ (పెద్దపల్లి), బూర నర్సయ్యగౌడ్ (భువనగిరి), శానంపూడి సైదిరెడ్డి (నల్లగొండ)తోపాటు సిట్టింగ్ ఎంపీ వెంకటేశ్ నేత, పార్టీ రాష్ట్ర, జిల్లాస్థాయి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తెలంగాణ: రైతుబంధుకు ‘ఈసీ’ బ్రేక్
ఏపీలోని పలు జిల్లాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షం
T20 WC: బుమ్రాకు విశ్రాంతి?.. పొలార్డ్ కీలక వ్యాఖ్యలు
బ్లూ ఎకానమీలో ఆంధ్రప్రదేశ్ హవా.. ఎగుమతుల్లో సరికొత్త రికార్డ్
ఖరీదైన కారులో వడా పావ్ : ఢిల్లీ ‘కుమారాంటీ’ మరో సంచలనం
‘చార్ సౌ పార్’ ఎందుకంటే... క్లారిటీ ఇచ్చిన ప్రధాని
ప్రశాంతంగా నీట్
కొత్త గనుల ఏర్పాటుకు కృషి చేయాలి
ప్రమాదంలో ప్రజాస్వామ్యం
అ‘పూర్వ’ం.. ఆత్మీయం
తప్పక చదవండి
- తెలంగాణ: రైతుబంధుకు ‘ఈసీ’ బ్రేక్
- ‘చార్ సౌ పార్’ ఎందుకంటే... క్లారిటీ ఇచ్చిన ప్రధాని
- దేశంలో పెరిగిన బంగారం ధరలు.. ఎంతంటే?
- 'పుష్ప' వల్ల నాకు ఎలాంటి లాభం లేదు: ఫహాద్
- జాంబియా ప్రీ వెడ్డింగ్ వేడుక : అమ్మాయి ఇలా చేయాల్సిందే!
- ‘ఒకవేళ బెయిల్ ఇస్తే’.. కేజ్రీవాల్కు కండీషన్ పెట్టిన సుప్రీంకోర్టు
- PK: అన్నయ్య ప్రచారం చేస్తే తప్ప గెలవలేడా?
- తుప్పు పట్టిన సైకిల్లో మిగిలింది బెల్ మాత్రమే: సీఎం జగన్
- మెట్ గాలా 2024: అలియా టూ అంబికా మోదీ మెరిసిన బ్యూటీస్ (పోటోలు)
- LS Elections: కొనసాగుతున్న మూడో విడత పోలింగ్.. ఓటింగ్ శాతం ఎంతంటే..
Advertisement