ప్రశాంతంగా నీట్‌ | Sakshi
Sakshi News home page

ప్రశాంతంగా నీట్‌

Published Tue, May 7 2024 5:15 PM

ప్రశాంతంగా నీట్‌

● పరీక్షకు 1354 మంది హాజరు.. ● 30 మంది గైర్హాజరు

మంచిర్యాలఅర్బన్‌:వైద్య కళాశాల్లో ప్రవేశాలకు ఆదివారం నిర్వహించిన నీట్‌ ప్రశాంతంగా ముగిసింది. మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5:20 గంటల వరకు జరిగిన పరీక్ష కోసం జిల్లాలో ఐదు కేంద్రాలు ఏర్పాటు చేశారు. మొత్తం 1,384 మంది విద్యార్థులకు 1,354 మంది హాజరయ్యారు. 30 మంది గైర్హాజరయ్యారు. ప్రతీ సెంటర్‌ వద్ద పటిష్ట పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. సీసీ కెమెరాల నిఘాలో పరీక్ష నిర్వహించారు. ఉదయం 11 గంటల నుంచే విద్యార్థులను క్షుణ్ణంగా తనిఖీ చేసి పరీక్ష కేంద్రాల్లోకి అనుమతించారు. 1: 30 తర్వాత పరీక్ష కేంద్రాల గేట్లు మూసివేశారు. పిల్లల వెంట వచ్చిన తల్లిదండ్రులు కేంద్రాల వద్ద ఎండవేడిమి తట్టుకోలేక కనపడిన చెట్టునీడన సేదతీరారు. నీట్‌ ప్రశాంతంగా ముగిసిందని సిటీ కో–ఆర్డినేటర్‌ రేషమ్మ.ఏఎస్‌ తెలిపారు.

Advertisement
Advertisement