-
కమిన్స్పై బ్రెట్ లీ విమర్శలు.. మరీ లేట్గా వచ్చి
సన్రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ను ఉద్దేశించి ఆస్ట్రేలియా దిగ్గజ ఫాస్ట్ బౌలర్ బ్రెట్ లీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. చెన్నై సూపర్ కింగ్స్తో ఆదివారం నాటి మ్యాచ్లో ఆలస్యంగా బౌలింగ్కు రావటాన్ని విమర్శించాడు.ప్రపంచంలోనే అత్యుత్తమ బౌలర్ అయిన కమిన్స్.. సహచరులకు ప్రాధాన్యం ఇచ్చే క్రమంలో ఇలాంటి పనులు చేయడం బాగానే ఉన్నప్పటికీ.. జట్టు ప్రయోజనాల దృష్ట్యా సరికాదని బ్రెట్ లీ అభిప్రాయపడ్డాడు.ఐపీఎల్-2024లో సన్రైజర్స్ సారథిగా అడుగుపెట్టిన కమిన్స్ మంచి ఫలితాలు రాబడుతున్నాడు. అయితే, గత రెండు మ్యాచ్లలో వరుస ఓటముల కారణంగా అతడిపై విమర్శలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో చెన్నైతో చెపాక్ మ్యాచ్లో కమిన్స్ కొత్త బంతితో బౌలింగ్ చేయకపోవడాన్ని బ్రెట్ లీ తప్పుబట్టాడు.కాగా సన్రైజర్స్ సీనియర్ పేసర్ భువనేశ్వర్ కుమార్తో బౌలింగ్ అటాక్ ఆరంభించిన కమిన్స్.. తదుపరి ఓవర్లో బంతిని ఆల్రౌండర్ నితీశ్రెడ్డికి చేతికిచ్చాడు. అనంతరం షాబాజ్ అహ్మద్, నటారాజన్, జయదేవ్ ఉనాద్కట్తో బౌలింగ్ చేయించాడు. తాను మాత్రం తొమ్మిదో ఓవర్లో బౌలింగ్కు దిగాడు.మొత్తంగా నాలుగు ఓవర్ల కోటా పూర్తి చేసి 49 పరుగులు ఇచ్చి ఒక్క వికెట్ కూడా తీయలేకపోయాడు. ఇక ఈ మ్యాచ్లో 212 పరుగులు చేసిన చెన్నై.. లక్ష్య ఛేదనలో చేతులెత్తేసిన సన్రైజర్స్ను 78 పరుగుల తేడాతో చిత్తు చేసింది.ఈ నేపథ్యంలో బ్రెట్ లీ మాట్లాడుతూ.. ‘‘ప్యాట్ కమిన్స్ చాలా ఆలస్యంగా బరిలోకి వచ్చాడు. నాలుగు ఓవర్లు బౌల్ చేసి 49 పరుగులు ఇచ్చాడు. తను ధారాళంగా పరుగులు ఇచ్చిన మాట వాస్తవమే.నిజానికి తను కొత్త బంతితో అద్భుతంగా రాణించగలడు. కానీ వేరే వాళ్లకు అవకాశం ఇచ్చాడు. కొన్నిసార్లు మరీ మంచి కెప్టెన్గా మారిపోతాడు. బౌలింగ్ కెప్టెన్గా.. ఇతర బౌలర్లకు ప్రాధాన్యం ఇవ్వడం మంచిదే.కానీ వరల్డ్ బెస్ట్ బౌలర్ బౌలింగ్ అటాక్ ఆరంభించకపోవడం సరికాదు. స్వార్థంగా ఉండమని నేను చెప్పటం లేదు. ప్యాట్ కమిన్స్.. ప్యాట్ కమిన్సే. కనీసం రెండో ఓవర్లోనైనా అతడు బౌలింగ్లోకి దిగాల్సింది’’ అని జియో సినిమా షోలో వ్యాఖ్యానించాడు. -
లెజండరీ ఓపెనర్ దిల్షాన్.. డీకే మాదిరే! ఉపుల్ తరంగతో భార్య ‘బంధం’.. అతడినే పెళ్లాడి!
రెండు మనుసుల కలయికతో.. ఇద్దరు మనుషులు పరస్పర నమ్మకంతో దాంపత్య జీవితంలో ముందుకు సాగితేనే ఆ బంధం నాలుగుకాలాల పాటు వర్ధిల్లుతుంది. భాగస్వాములలో ఏ ఒక్కరు పెళ్లినాటి ప్రమాణాలు తప్పినా ఆ బంధం విచ్ఛిన్నమవుతుంది. ముఖ్యంగా ‘మూడో వ్యక్తి’ని తమ జీవితంలోకి ఆహ్వానించి ప్రాణంగా ప్రేమించిన పార్ట్నర్ను మోసం చేస్తే అంతకంటే ద్రోహం మరొకటి ఉండదు. టీమిండియా క్రికెటర్ దినేశ్ కార్తిక్తో పాటు శ్రీలంక మాజీ బ్యాటర్ తిలకరత్నె దిల్షాన్, ఆస్ట్రేలియా బౌలింగ్ దిగ్గజం బ్రెట్ లీ తమ వైవాహిక జీవితంలో ఇలాంటి దారుణ పరిస్థితులు ఎదుర్కొన్నారు. ముఖ్యంగా డీకే, దిల్షాన్ తమ భార్యలు.. తమతో బంధంలో కొనసాగుతూనే.. తమ స్నేహితులతోనే అనుబంధం పెనవేసుకోవడం భరించలేకపోయారు. వారితో బంధానికి వీడ్కోలు పలికి కొత్త జీవితం మొదలుపెట్టి ప్రస్తుతం వైవాహిక బంధంలో సంతోషంగా గడుపుతున్నారు. వారి జీవితాల్లో ఏం జరిగిందంటే.. స్నేహం ముసుగులో వెన్నుపోటు చిన్ననాటి స్నేహితురాలైన నికిత వంజారాను ప్రేమించి పెళ్లాడాడు దినేశ్ కార్తిక్. డీకే సహచర క్రికెటర్, ఫ్రెండ్ అయిన మురళీ విజయ్తో బంధం కొనసాగించింది. వారిద్దరి రహస్య రిలేషన్షిప్ తెలుసుకున్న దినేశ్ గుండె ముక్కలైంది. దీంతో 2012లో ఆమెకు విడాకులు ఇచ్చాడు. ఈ క్రమంలో నికిత ఎంచక్కా మురళీ విజయ్ను పెళ్లి చేసుకుని సెటిల్ అయింది. మరోవైపు.. స్వ్యాష్ ప్లేయర్ దీపికా పళ్లికల్ రూపంలో రెండోసారి ప్రేమను పొందిన డీకే ఆమెను వివాహమాడాడు. ఈ జంటకు ప్రస్తుతం కవలలు(ఇద్దరు కుమారులు) సంతానం. దిల్షాన్ది ఇంచుమించు ఇదే పరిస్థితి లంక లెజండరీ ఓపెనర్ తిలకరత్నె దిల్షాన్ నిలంక వితంగే మహిళను పెళ్లి చేసుకున్నాడు. కానీ ఆమె దిల్షాన్ ఓపెనింగ్ పార్ట్నర్ ఉపుల్ తరంగతో అనుబంధం పెంచుకుందట. ఈ క్రమంలో దిల్షాన్తో విడాకులు తీసుకున్న నిలంక.. ఆ తర్వాత ఉపుల్ను పెళ్లాడింది. నిజానికి నిలంక, ఉపుల్ మధ్య అతి చనువే దిల్షాన్తో ఆమె విడిపోవడానికి కారణమని గతంలో వార్తలు వచ్చాయి. భార్య మంజులతో దిల్షాన్ ఇక నిలంక- దిల్షాన్లకు ఒక కుమారుడు సంతానం కాగా.. భరణం, కుమారుడి సంరక్షణ కోసం నిలంక.. దిల్షాన్ను కోర్టుకు లాగింది. ఈ క్రమంలో ఆమెకు అనుకూలంగా తీర్పురాగా అతడు కొడుకుకు దూరమయ్యాడు. ఆ తర్వాత నటి మంజుల థిలినిని పెళ్లాడిన దిల్షాన్కు మరో ఇద్దరు కుమార్తెలు, ఇద్దరు కుమారులు జన్మించారు. బ్రెట్ లీ మాజీ భార్య సైతం ఆసీస్ ఫాస్ట్ బౌలర్ బ్రెట్ లీ కూడా భార్యా బాధితుడే అంటారు. ఆటతో బిజీగా ఉండే లీతో తన జీవితం సంతోషంగా లేదని భావించిన అతడి భార్య.. రగ్బీ ప్లేయర్ను పెళ్లాడినట్లు సిడ్నీ హెరాల్డ్ గతంలో వెల్లడించింది. చదవండి: ధోని నమ్మకం నిలబెట్టిన ప్రపంచకప్ విజేత, 2 సార్లు ఐపీఎల్ ‘విన్నర్’.. ఇప్పుడు పోలీస్ ఆడపడుచు అడ్డుపడినా! జడ్డూ భార్య రివాబా బ్యాగ్రౌండ్ తెలుసా? వందల కోట్లు! -
వరల్డ్ క్రికెట్లో రోహిత్ టైగర్.. అతడిని మించినవారు లేరు: ఆసీస్ లెజెండ్
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ప్రస్తుతం గడ్డు పరిస్ధితులను ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. ఈ ఏడాది జరిగిన ఐపీఎల్తో పాటు ఇటీవలే ముగిసిన వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ లో కూడా పేలవ ప్రదర్శన కనబరిచిన సంగతి తెలిసిందే. అదే విధంగా అతడు జట్టు పగ్గాలు చేపట్టిన తర్వాత టీమిండియా మేజర్ టోర్నీల్లో ఘోర ఓటములను చవిచూసింది. ఆసియా కప్, టీ20 వరల్డ్ కప్ (2022), డబ్ల్యూటీసీ ఫైనల్లో అతడి సారధ్యంలోని భారత జట్టు దారుణ పరాజయాలు మూటుగట్టుకుంది. ఈ క్రమంలో అతడి వ్యక్తిగత ప్రదర్శనపైనే కాకుండా కెప్టెన్సీ పరంగా కూడా రోహిత్పై చాలా మంది మాజీ క్రికెటర్లు విమర్శల వర్షం కురిపిస్తున్నారు. రోహిత్ను కెప్టెన్సీ నుంచి తప్పించాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియా క్రికెట్ దిగ్గజం బ్రెట్ లీ మాత్రం రోహిత్ శర్మకు మద్దతుగా నిలిచాడు. రోహిత్పై బ్రెట్ లీ ప్రశంసల వర్షం కురిపించాడు. రోహిత్పై ఎవరెన్ని విమర్శలు చేసినా అతడు వరల్డ్ క్రికెట్ లో టైగర్ అని బ్రెట్లీ కొనియాడాడు. "ప్రపంచ క్రికెట్లో రోహిత్ శర్మ టైగర్. షార్ట్ బాల్స్ను ఆడటంలో అతడిని మించినవారు లేరు. క్లిష్ట పరిస్థితుల్లో కూడా బౌలర్లపై ఎటాక్ చేసే సత్తా ఉన్న ఏకైక క్రికెటర్ రోహిత్. ప్రపంచంలో పుల్ షాట్లు ఆడే అత్యుత్తమ ఆటగాళ్లలో రోహిత్ ఒకడు. మైదానంలో గాని ఆఫ్ధి ఫీల్డ్లో గాని రోహిత్ ఒక జెంటిల్మేన్. అతడు చాలా కూల్గా ఉంటాడు అని ఓ స్పోర్ట్స్ ఛానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో బ్రెట్లీ చెప్పుకొచ్చాడు. చదవండి: MS Dhoni: రోహిత్ వద్దే వద్దు!.. నాడు బీసీసీఐ ధోనిని ఎందుకు కెప్టెన్ను చేసిందంటే.. -
ఆస్ట్రేలియా క్రికెట్లో కలవరం.. తర్వాత ఎవరు?
ఆస్ట్రేలియా క్రికెట్లో ఒక విషయంలో కలవరం మొదలైంది. ప్రస్తుతం జట్టులో నాథన్ లియోన్ మాత్రమే ప్రధాన స్పిన్నర్గా కనిపిస్తున్నాడు. లియోన్ వయస్సు 35 సంవత్సరాలు. రిటైర్మెంట్కు దగ్గరికి వచ్చిన అతను మహా అయితే మరో రెండు సంవత్సరాలు ఆడే అవకాశం ఉంది. దిగ్గజం షేన్ వార్న్ తర్వాత టాప్క్లాస్ స్పిన్నర్గా పేరు తెచ్చుకున్న లియోన్ తన కెరీర్లో 117 టెస్టులాడి 468 వికెట్ల పడగొట్టాడు. దశాబ్దం కాలంగా లియోన్ ఆసీస్ టెస్టు జట్టులో ఏకైక ప్రధాన స్పిన్నర్గా కొనసాగుతూ వస్తున్నాడు. మరి అతను రిటైర్ అయ్యాకా ఆసీస్ క్రికెట్లో స్పిన్ భాద్యతలు తీసుకునేది ఎవరనేదానిపై చర్చ మొదలైంది. ఆసీస్ లాంటి ఫాస్ట్ పిచ్ మైదానాలపై పేస్ బౌలర్లకు కొదువ లేదు. ఆ దేశం నుంచి వచ్చే బౌలర్లలోనే ఎక్కువగా మీడియం, ఫాస్ట్ బౌలర్లే కనిపిస్తారు తప్ప స్పిన్నర్లు చాలా తక్కువ. స్వదేశంలో ఆడినంత వరకు పేస్ దళంతోనే మ్యాచ్లు గెలిచే ఆస్ట్రేలియా భారత్ లాంటి ఉపఖండపు పిచ్లకు వచ్చేసరికి స్పిన్నర్లను వెతుక్కోవాల్సి వస్తోంది. అయితే టాడ్ మర్ఫీ రూపంలో ఆస్ట్రేలియా జట్టుకు ఆశాకిరణంలా కనిపిస్తున్నాడు. 22 ఏళ్ల ఈ కుర్రాడు టీమిండియాతో జరుగుతున్న టెస్టు సిరీస్లో మంచి ప్రదర్శనే కనబరుస్తున్నాడు. ఇప్పటివరకు రెండు టెస్టులు కలిపి 10 వికెట్లు పడగొట్టాడు. ఇదే విషయమై ఆసీస్ మాజీ ఫాస్ట్ బౌలర్ బ్రెట్ లీ స్పందించాడు. ''ప్రస్తుతం ఆస్ట్రేలియాకు పెద్ద దిక్కులా మారాడు. వార్న్ లాంటి దిగ్గజ ఆటగాడిని భర్తి చేయలేకపోయిన ఉన్నంతలో అతను టాప్ క్లాస్ స్పిన్నర్. మరి లియోన్ రిటైర్మెంట్ తర్వాత ఆసీస్ క్రికెట్లో స్పిన్ బాధ్యతలు తీసుకునేది ఎవరు అని ప్రశ్నించుకోవాలి. అందుకు నా సమాధానం 22 ఏళ్ల టాడ్ మర్ఫీ. టీమిండియాతో తొలి టెస్టులోనే ఆస్ట్రేలియా తరపున టాడ్ మర్ఫీ అదిరిపోయే ప్రదర్శన చేశాడు. ఏడు వికెట్లతో ఆకట్టుకొని తానేంటో నిరూపించుకున్నాడు. ఈ ఏడు వికెట్లలోనూ ఐదు టాప్క్లాస్ బ్యాటర్లవే ఉన్నాయి. ఉపఖండం పిచ్లపై ప్రభావం చూపుతున్న ఒక డెబ్యూ బౌలర్ తర్వాతి కాలంలో జట్టుకు ప్రధాన స్పిన్నర్ అయ్యే అవకాశం ఉంటుంది. నాథన్ లియోన్ అలా వచ్చినవాడే. అతని వారసత్వాన్ని టాడ్ మర్ఫీ కంటిన్యూ చేస్తాడని అనుకుంటున్నా. అయితే ఆస్ట్రేలియాకు టాడ్ మర్ఫీ రూపంలో ఒక మంచి స్పిన్నర్ దొరికినట్లే. వైవిధ్యమైన బౌలింగ్తో ఆకట్టుకుంటున్న మర్ఫీ వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటే అద్బుతాలు చేయగలడన్న నమ్మకం ఉంది.'' అంటూ చెప్పుకొచ్చాడు. ఇక ఇరుజట్ల మధ్య ఇప్పటికే రెండు టెస్టులు ముగిశాయి. రెండు టెస్టుల్లోనూ విజయాలు అందుకున్న టీమిండియా నాలుగు టెస్టుల సిరీస్లో 2-0తో ఆధిక్యంలో నిలిచింది. ఈ రెండు టెస్టులు కూడా రెండున్నర రోజుల్లోనే ముగిశాయి. ఇక మూడో టెస్టు మార్చి ఒకటి నుంచి ఇండోర్ వేదికగా జరగనుంది. చదవండి: 'నా కెరీర్లోనే అత్యంత కఠినమైన ఇన్నింగ్స్' 'కనబడుట లేదు'.. ఐపీఎల్లో ఆడించేందుకే ఈ డ్రామాలు -
WC 2023: వరల్డ్కప్ టోర్నీలో టీమిండియా ఓపెనర్ అతడే! కానీ..
ICC ODI World Cup 2023- Team India Opening Slot: టీమిండియా యువ బ్యాటర్ ఇషాన్ కిషన్పై ఆస్ట్రేలియా క్రికెట్ దిగ్గజం బ్రెట్ లీ ప్రశంసలు కురిపించాడు. వన్డేల్లో అత్యంత వేగంగా ద్విశతకం బాదిన ఈ వికెట్ కీపర్ వన్డే వరల్డ్కప్-2023లో భారత జట్టులో కీలకం కానున్నాడని అభిప్రాయపడ్డాడు. అద్భుత ఇన్నింగ్స్తో సత్తా చాటి టీమిండియా ఓపెనింగ్ స్థానానికి గురిపెట్టాడని పేర్కొన్నాడు. అయితే, డబుల్ సెంచరీ సాధించిన సంతోషంలోనే ఉండిపోకూడదని.. ఎప్పుటికప్పుడు ఆట తీరును మరింత మెరుగుపరచుకోవాలని బ్రెట్ లీ.. ఇషాన్కు సూచించాడు. కాగా బంగ్లాదేశ్ పర్యటనలో భాగంగా మూడో వన్డేలో ద్విశతకం బాదిన ఇషాన్ కిషన్.. పలు రికార్డులు సృష్టించిన విషయం తెలిసిందే. తద్వారా తనకు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నాడు ఈ యువ బ్యాటర్. ఇక భారత్ వేదికగా వచ్చే ఏడాది వన్డే ప్రపంచకప్ జరుగనున్న నేపథ్యంలో ఇషాన్ ఈ మేరకు రాణించడం టీమిండియా ఓపెనింగ్ ఆప్షన్లను పెంచింది. ఈ నేపథ్యంలో ఆసీస్ మాజీ స్పీడ్స్టర్ బ్రెట్ లీ కీలక వ్యాఖ్యలు చేశాడు. ఇషాన్ కిషన్ విధ్వంసకర ఓపెనర్ తన యూట్యూబ్ చానెల్ వేదికగా మాట్లాడుతూ.. ‘‘విధ్వంసకరమైన డబుల్ సెంచరీతో.. సొంతగడ్డపై 2023లో జరుగనున్న వన్డే వరల్డ్కప్ టోర్నీలో టీమిండియా ఓపెనింగ్ స్థానానికి తాను గట్టిపోటీదారునని ఇషాన్ చెప్పకనే చెప్పాడు. ఒకవేళ తనే ఓపెనర్గా బరిలోకి దిగుతాడా? ఏమో నాకైతే తెలియదు కాదు. మరి ఇలా జరగాలా అంటే మాత్రం కచ్చితంగా జరగ్సాలిందే! వన్డే చరిత్రలో అత్యంత వేగంగా డబుల్ సెంచరీ చేసిన ఈ యువ ఆటగాడి గురించి ఇంకేం చెప్పగలం. గర్వం వద్దు తను ఫిట్నెస్ కాపాడుకుంటూ, నిలకడైన ఆట తీరు కనబరిస్తే.. కచ్చితంగా ప్రపంచకప్ జట్టులో టీమిండియా ఓపెనర్గా తన పేరు ఉండటం ఖాయం’’ అని బ్రెట్ లీ చెప్పుకొచ్చాడు. అయితే, తన అరుదైన రికార్డుల కారణంగా సర్వత్రా ప్రశంసలు అందుకుంటున్న ఇషాన్.. గర్వాన్ని నెత్తికెక్కించుకోకూడదని సలహా ఇచ్చాడు. ‘‘తన మైలురాళ్ల గురించి ఇషాన్ మర్చిపోవాలి. ద్విశతకం తాలుకు ప్రశంసలను కూడా ఎంత త్వరగా మరిచిపోతే అంత మంచిది. నీ కోసం మరిన్ని మైల్స్టోన్స్ ఎదురుచూస్తున్నాయి. కాబట్టి.. నీకిచ్చే సలహా ఒకటే ఇషాన్.. నువ్వు అత్యున్నత శిఖరాలకు చేరుకోవాలంటే గర్వం దరిచేయనీయకూడదు’’ అని మాజీ ఫాస్ట్బౌలర్ బ్రెట్ లీ.. ఇషాన్కు సూచనలు చేశాడు. కాగా బంగ్లాదేశ్లో ప్రదర్శనతో శ్రీలంకతో స్వదేశంలో టీ20, వన్డే సిరీస్లకు ఇషాన్ కిషన్ ఎంపికైన విషయం తెలిసిందే. ఇక ఇషాన్తో పాటు శుబ్మన్ గిల్ సైతం ఓపెనింగ్ స్థానానికి పోటీలో ఉన్నాడు. చదవండి: Shikhar Dhawan: ధావన్పై వేటు.. వాళ్ల నుంచి తీవ్రమైన పోటీ! వరల్డ్కప్ ఆశలు ఆవిరి! Rishabh Pant: ఇదే కదా జరగాల్సింది! ఇకపై పంత్ కంటే ముందు వరుసలో వాళ్లిద్దరు!
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
గవర్నర్పై ఆరోపణలు.. మమత సర్కారు దూకుడు
ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్: టీడీపీ దుష్ప్రచారంపై ఈసీ సీరియస్
'లగ్గం' షూటింగ్ పూర్తి.. త్వరలో థియేటర్లలో రిలీజ్
త్వరలో కాంగ్రెస్ చీలిపోతుంది: ఆచార్య ప్రమోద్ కృష్ణం
బోయింగ్ ‘స్టార్ లైనర్’.. సునీత ‘స్టార్ ట్రెక్’!
నా ఐపీఎల్ టీమ్కు మాటిచ్చా.. అందుకే సినిమాలకు బ్రేక్
పలమనేరు: ఉప్పొంగిన అభిమాన సంద్రం (ఫొటోలు)
అషూ రెడ్డి అందాల జాతర.. పాయల్ క్యూట్ మూమెంట్స్
రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్
ముంబై కథ ముగిసింది.. జట్టులో యూనిటీ లేదు: పఠాన్
తప్పక చదవండి
- లైంగిక ఆరోపణల కేసు.. రేవణ్ణ అరెస్టు
- రాకాసి నర్సుకు 760 ఏళ్ల జైలు శిక్ష : అసలు ఏమైందంటే..!
- బీజేపీలో చేరిన ఢిల్లీ మాజీ కాంగ్రెస్ చీఫ్ అరవిందర్ సింగ్
- నాలుగుసార్లు అబార్షన్ అయిందా? క్లారిటీ ఇచ్చిన స్టార్ హీరోయిన్
- రాయ్బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
- మా భూమి మాది కాకపోతే మరెవరిది రామోజీ..?: మంత్రి బొత్స
- చంద్రబాబు మేనిఫెస్టో మాయలు గుర్తున్నాయా?: సీఎం జగన్
- 2024 లోక్సభ ఎలక్షన్స్.. 9 లక్షల మందికి ఉపాధి!
- షుగర్ వచ్చిందని బెదిరిపోకండి.. ఇవి ఖచ్చితంగా పాటిస్తే షుగర్ పరార్!
- చంద్రబాబు, కోట్లకు కౌంటరిచ్చిన మంత్రి బుగ్గన
Advertisement