-
లోకేష్ కామెడీ..మార్చి 13న ఓటెయ్యండి..
-
బ్లాక్ అండ్ వైట్ టూ కలర్ సినిమా.. దాని ప్రత్యేకతే వేరు!
మనసు కాస్త మందగించగానే.. ఏదైనా కామెడీ బిట్ పెట్టుకుని.. ఆస్వాదిస్తుంటాం. ఎల్లవేళలా అస్వాదాన్ని కలిగించే వినోదంలో సినిమా ప్రముఖపాత్ర పోషిస్తూ వస్తోంది. నిజానికి నటించడం ఓ ఎత్తు.. నవ్వించడం మరో ఎత్తు. ఎవరైనా నటించగలరేమో కానీ.. ఎవరు పడితే వాళ్లు నవ్వించలేరు. నవ్వనేది నాటికీ నేటికీ సినిమాల్లో ఒక భోగమే. పప్పులో ఉప్పులేకపోతే కూర ఎంత చప్పగా ఉంటుందో.. సినిమాలో కామెడీ లేకపోయినా అంతే చప్పగా సాగుతుంది. ఎన్ని యాక్షన్ సీక్వెన్సులున్నా.. గుండెల్ని బరువెక్కించే ఎమోషనల్ సీన్లున్నా.. వినసొంపైన పాటలున్నా.. కథలో కామెడీ లేకపోతే ఏదో లోటుగానే అనిపిస్తుంటుంది. ఎంత పెద్ద సినిమా అయినా వినోదం లేకపోతే పెదవి విరుపులు ఎక్కువగా కనిపిస్తుంటాయి. హాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్, టాలీవుడ్.. ఇలా ఏ వుడ్ తీసుకున్నా కామెడీ ట్రాక్ లేకుండా సినిమాలు నడవవు. తెలుగు చిత్ర సీమ నవ్వుల వనంలో వికసించిన హాస్య పద్మాలెన్నో.. ఎన్నెన్నో. బ్లాక్ అండ్ వైట్ కాలంలో రేలంగి, రాజబాబు, రమణారెడ్డి, అల్లు రామలింగయ్య, పద్మనాభం వీళ్లంతా నవ్వుకి నాట్యం నేర్పిన వారే. ఆ తరువాత కాలంలో.. బ్రహ్మానందం, బాబు మోహన్, కోటా, ధర్మవరపు సుబ్రహ్మణ్యం, ఏవిఎస్, అలీ, సుత్తివేలు, ఆహుతి ప్రసాద్, కొండవలస, గుండు హనుమంత రావు, సునీల్, వేణుమాధవ్, ఎంఎస్ నారాయణ, జయప్రకాష్ రెడ్డి, కృష్ణ భగవాన్, వెన్నెల కిషోర్, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ ఇలా చాలామంది నవ్వుల రారాజులున్నారు. మరి నవ్వుల రాణులు లేరా అంటే.. నవ్వుల సామ్రాజ్యానికి మహారాణిగా నిలిచింది సూర్యకాంతం. ఆ తరువాత.. శ్రీలక్ష్మి, రమాప్రభ, తెలంగాణ శకుంతల, కోవై∙సరళ ఇలా చాలామందే ఆ వారసత్వాన్ని కొనసాగించారు. చాలా సార్లు బాధలో ఉన్నప్పుడు కూడా మనల్ని గిలిగింతలు పెట్టించేవి ఈ సినీ నవ్వులే. ఇక నటుడు జంధ్యాల సృష్టించిన చిత్ర విచిత్రమైన పాత్రలు నవ్వుకి జీవం పోశాయంటే అతిశయోక్తి కాదేమో. ఆ తరువాత ఈవీవీ.. ఆయన పెట్టించిన ‘కితకితలు’ ప్రేక్షకుల మోవి మీద నవ్వులు పూయించాయి. ప్రస్తుతం అనిల్ రావిపూడి టాలీవుడ్ స్టార్ డైరెక్టర్లలో ఒకరిగా నిలిచారంటే.. ఆయన అస్త్రం కూడా ఈ నవ్వే. యాక్షన్, సెంటిమెంట్, లవ్, థ్రిల్లర్, హారర్, డ్రామా ఇలా ఏ జానర్ చూసుకున్నా.. అందులో కామెడీ ఉంటేనే కిక్కు. అందుకే ఎంతటి బాహుబలి సినిమా అయినా.. కామెడీ ప్రధానం కాబట్టే కట్టప్పతోనూ జోకులు వేయించాడు రాజమౌళి. అలాగే అనుష్క బావ కుమార వర్మగా సుబ్బరాజుతో హాస్యం పండించాడు. ఇలా చెప్పుకుంటూ పోతే చిత్ర సీమలో నవ్వుకు ఉన్న ప్రాధాన్యం వేరే లెవెల్ అనే చెప్పుకోవాలి. -
కోవిడ్ టైంలో కంటెంట్ క్రియేషన్, ఫేమ్తో పాటు డబ్బు కూడా
బాధ పడితే బాధ మాత్రమే మిగులుతుంది. అలా కాకుండా రూల్స్ బ్రేక్ చేసి నవ్వితే ఏమవుతుంది? ‘అలా ఎలా కుదురుతుంది? బాధ బాధే, నవ్వు నవ్వే’ అని గట్టిగా అనుకున్న బాధాసర్పదష్టులు కూడా వీరి హాస్యం ముందు మౌనంగా ఉండలేకపోయారు. హాయిగా నవ్వేసి ఆ కొద్ది సమయమైనా బాధ నుంచి విముక్తి పొందారు. యువతరం ఎక్కడ ఉంటుందో నవ్వు అక్కడ ఉంటుంది. ఆ నవ్వునే పెట్టుబడిగా పెట్టి యువతరంలో ఎంతోమంది కామెడీ కంటెంట్ క్రియేటర్లుగా కీర్తి, డబ్బు సంపాదిస్తున్నారు. ఒకరిని చూసి మరొకరు అన్నట్లుగా కొత్త వాళ్లు నవ్వుల రంగస్థలంపై మెరుస్తున్నారు. తమదైన హాస్యాన్ని పరిచయం చేస్తున్నారు... సోషల్ మీడియాలోని రకరకాల విభాగాల్లో కామెడీ అగ్రస్థానంలో ఉంది. మిథిక ద్వివేది, రాజ్ గ్రోవర్, సలోని గౌర్, విష్ణు కుషాల్లాంటి యంగ్ కామెడీ కంటెంట్ క్రియేటర్లు దూసుకుపోతున్నారు. వీరిలో ఎక్కువ మంది లాక్డౌన్ టైమ్లో ఫేమస్ అయిన వారు. అప్పటి రోజుల్లో నుంచే కడుపుబ్బా నవ్వించే షార్ట్–ఫామ్ వీడియో స్పూఫ్లను రూపొందించారు. బ్రాండ్ ప్రమోషన్లలో కామెడీ ఇన్ఫ్లూయెన్సర్లను ఏరి కోరి ఎంపిక చేసుకుంటున్నారు. ‘కామెడీ ఇన్ఫ్లూయెన్సర్లు సత్తా ఉన్న రచయితలు. ఆడియెన్స్ను ఎలా ఆకట్టుకోవాలో వారికి బాగా తెలుసు. ప్రమోషన్స్కు ఎంటర్టైన్మెంట్ను సృజనాత్మకంగా జోడిస్తున్నారు’ అంటున్నాడు సోషల్ సమోస సీయివో హితేష్ రజ్వానీ. ఒకప్పటి టీవీ సీరియల్ ‘కస్తూరీ జిందగీ’లోని పాపులర్ పాత్రను చిన్నప్పుడు అనుకరిస్తూ అందరినీ నవ్వించేది కరిష్మా గంగ్వాల్. తాను ఎంటర్టైన్మెంట్ అండ్ కామెడీని కెరీర్గా తీసుకుంటానని ఎప్పుడూ అనుకోలేదు. డిగ్రీ పూర్తి చేసిన తరువాత రేడియో వేదికగా తన టాలెంట్ను శ్రోతలకు పరిచయం చేసింది. అప్పటి వరకు తన గొంతునే పరిచయం చేసిన కరిష్మ ప్రేక్షకులకు ముఖ పరిచయం చేయాలనుకుంది. కోవిడ్ టైమ్లో కంటెంట్ క్రియేషన్కు శ్రీకారం చుట్టింది. అత్తా–కోడళ్ల సంభాషణతో తొలిసారిగా ఒక ఫన్నీ వీడియో చేసింది. ‘ప్రేక్షకులు ఏమనుకుంటారో ఏమో’ అని సందేహించింది. అయితే తన సోదరి సలహాతో సోషల్మీడియాలో పెట్టింది. ఆ ఫన్నీ వీడియో 1.3 మిలియన్ల వ్యూస్ను దక్కించుకొని కరిష్మలో ఆత్మవిశ్వాసాన్ని పెంచింది. కరిష్మకు ఇన్స్టాగ్రామ్లో 6.4 మిలియన్ల ఫాలోవర్స్ ఉన్నారు. జమ్మూలో పుట్టి పెరిగింది కరిష్మ. డాక్టర్లు, ఇంజనీర్ల కుటుంబం వారిది. తాను కూడా డాక్టరో, ఇంజనీరో కావాల్సిందే అన్నట్లుగా ఉండేది పరిస్థితి. అయితే తల్లిదండ్రులను ఒప్పించి కామెడీనే తన కెరీర్ చేసుకుంది.తన మిమిక్రీ స్కిల్స్తో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తోంది చాందిని భాబ్డ. ‘ఆలియాభట్ను అనుకరించాలంటే చాందిని మాత్రమే’ అన్నంతగా పేరు తెచ్చుకుంది. చిన్నప్పుడు తన ఉపాధ్యాయులు, చుట్టాలు పక్కాలను కెమెరా ముందు అనుకరిస్తూ అందరినీ తెగ నవ్వించేది చాందిని. ఇరవైనాలుగు సంవత్సరాల చాందిని 2016లో కామెడీ కంటెంట్ క్రియేషన్ ప్రారంభించింది. న్యాయశాస్త్రం చదివిన చాందిని అమెజాన్ మినీ టీవీ కామెడీ షో ‘కానిస్టేబుల్ గిర్పాడే’లో నటించింది.తీరిక సమయంలో సలోని గౌర్ ఫన్నీ వీడియోలు బాగా చూసేది. ‘నీలో నవ్వించే టాలెంట్ ఉంది’ అని ఫ్రెండ్స్ తరచుగా అనడంతో ‘ఒకసారి ట్రై చేసి చూద్దాం’ అంటూ రంగంలోకి దిగింది. తక్కువ టైమ్లోనే కామెడీ కంటెంట్ క్రియేటర్గా సక్సెస్ సాధించింది. సలోనికి 1.3 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు. మధ్యతరగతి కుటుంబ నేపథ్యం నుంచి వచ్చిన సలోని అబ్జర్వేషనల్ కామెడీని తన బలంగా చేసుకుంది. ఇరవై సంవత్సరాల వయసులో సోనీ లివ్లో ‘అన్కామన్ సెన్స్ విత్ సలోని’ పేరుతో సొంత షో స్టార్ట్ చేసింది. ‘ఒక్కరోజు నవ్వకపోయినా ఆ రోజు వృథా అయినట్లే’ అంటాడు చార్లీ చాప్లిన్.అయితే నవ్వడం ఎంత వీజియో, నవ్వించడం అంత కష్టం. ఆ కష్టాన్ని ఇష్టంగా భుజాల కెత్తుకుంటున్నారు కామెడీ కంటెంట్ క్రియేటర్లు. ఒకవైపు సీనియర్ల వీడియోలు చూస్తూ ఎంజాయ్ చేస్తూనే మరోవైపు సృజనాత్మక ఆలోచనలతో తమదైన కామెడీ కంటెంట్ను క్రియేట్ చేస్తున్నారు.‘ప్రేక్షకుల అర క్షణం నవ్వు చాలు వెయ్యి ఏనుగుల బలం తెచ్చుకోవడానికి’ అంటుంది లక్నోకు చెందిన 19 సంవత్సరాల మిథిక ద్వివేది. ఈ కామెడీ కంటెంట్ క్రియేటర్కు వేలాదిమంది ఫాలోవర్లు ఉన్నారు. నవ్వడం అదృష్టం... నవ్వించడం అంతకంటే అదృష్టం ‘లా’లో మాస్టర్స్ డిగ్రీ చేసినప్పటికీ నా ఆలోచనలన్నీ కంటెంట్ క్రియేషన్ చుట్టే తిరుగుతుంటాయి. ఎవరో చెప్పింది వినడం కంటే మనసు చెప్పింది వినడమే మంచిదని నా నమ్మకం. ఐడియాల కోసం కొన్నిసార్లు ‘ఇలా అయితే ఎలా ఉంటుంది’ అంటూ కసరత్తులు చేయాల్సి ఉంటుంది. కొన్నిసార్లు మాత్రం స్పాంటేనియస్గా వస్తుంటాయి. నా బెస్ట్ కంటెంట్లో ఎక్కువ శాతం స్పాంటేనియస్గా వచ్చిందే. నవ్వడం అదృష్టం. నవ్వించగలగడం అంతకంటే అదృష్టం. – చాందిని, కామెడీ కంటెంట్ క్రియేటర్ కంటెంట్ కోసం... కామెడీ అయినా సరే కంటెంట్ అనేది నేల విడిచి సాము చేయకూడదు. సహజంగా ఉండాలి. ప్రేక్షకులు దానితో రిలేట్ కావాలి. కంటెంట్ కోసం ఎక్కడికో వెళ్లనక్కర్లేదు. మన ఇంట్లో కావచ్చు, పక్కింట్లో కావచ్చు. వెళ్లిన ఫంక్షన్ కావచ్చు....మనకు కావాల్సిన కంటెంట్ దొరుకుతుంది. దాన్ని మన స్టైల్లో ఎలా ప్రెజెంట్ చేస్తున్నామనేదే ముఖ్యం. – సలోని గౌర్, కామెడీ కంటెంట్ క్రియేటర్ కొత్తదనం కావాలి కామెడీ పుస్తకాలు చదివీ, సీరియల్స్ చూసి కామెడీని సృష్టించలేం. జనాల్లోకి వెళ్లి పరిసరాలను గమనించాల్సిందే. ఆసక్తికరమైన సంభాషణలు, పదాలు విన్నప్పుడు పెన్ను పేపర్ తీసుకొని స్క్రిప్ట్ రాస్తుంటాను. ఆ తరువాత షూట్స్, ఎడిట్స్, అప్లోడ్స్కు వెళతాను. ఎప్పటికీ ఒకే విధంగా కాకుండా కొత్తదనం ఉండేలా జాగ్రత్త పడాను. – కరిష్మ గంగ్వాల్, కామెడీ కంటెంట్ క్రియేటర్ -
అప్పుకోసం రాజేశ్ హడావుడి
-
ఇద్దరు కలిసిపాయిండ్రు
-
వినోదాల ప్రేమ
కార్తీక్ రత్నం, సుప్యర్ద సింగ్ జంటగా ఆనంద్ బడా దర్శకత్వంలో రూపొందిన రొమాంటిక్ కామెడీ ఫిల్మ్ ‘లింగొచ్చా..’. ‘గేమ్ ఆఫ్ లవ్’ అనేది ఉపశీర్షిక. జె.నీలిమ సమర్పణలో యాదగిరి రాజు నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 27న విడుదల కానుంది. ఈ సందర్భంగా దర్శకుడు ఆనంద్ బడా మాట్లాడుతూ– ‘‘హైదరాబాద్ నేపథ్యంలో సాగే లవ్ అండ్ రొమాంటిక్ కామెడీ డ్రామా ‘లింగొచ్చా..’’ అన్నారు. ఈ సినిమాకు సంగీతం: బికాజ్ రాజ్, సహ నిర్మాత: మల్లేష్ కంజర్ల. -
పెద్ద కష్టమే..!
-
రూ.5 వేల నుంచి రూ.100 కోట్లు వరకు - సామాన్యుడి సక్సెస్ స్టోరీ!
ఆధునిక కాలంలో డబ్బు సంపాదించడానికి అనేక మార్గాలున్నాయి. ఇందులో ఒకటి యూట్యూబ్. ప్రస్తుతం యూట్యూబ్ రాజ్యమేలుతోందని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. దీని ద్వారా సంపాదిస్తున్న వారి సంఖ్య రోజురోజుకి విపరీతంగా పెరుగుతోంది. ఇండియాలో యూట్యూబ్ ద్వారా కోట్లు సంపాదిస్తున్న వారిలో 'భువన్ బామ్' (Bhuvan Bam) ఒకరు. ఈయన గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. భువన్ బామ్ యూట్యూబ్లో కామెడీ వీడియోలు చేస్తూ ఎక్కువ డబ్బు సంపాదిస్తున్న వారి జాబితాలో ఒకరుగా ఉన్నారు. మ్యుజిషియన్గా కెరీర్ ప్రారభించిన భువన్ ఆ తరువాత యూట్యూబ్ ప్రారభించారు. దీని కోసం సింగింగ్ కెరీర్ వదులుకున్నట్లు సమాచారం. ఇతడు చేసిన మొదటి కామెడీ వీడియో బాగా పాపులర్ అయింది. దీంతో 'బీబీ కి వైన్స్' (BB Ki Vines) అనే సొంత సిరీస్ ప్రారభించాడు. స్పూప్ వీడియోలు.. బీబీ కి వైన్స్ సిరీస్లో భాగంగా వివిధ రకాల పాత్రలతో స్పూప్ వీడియోలు క్రియేట్ చేసి ఎక్కువ వ్యూవ్స్ పొందగలిగాడు. దెబ్బకు ఈ సిరీస్ పెద్ద హిట్ కొట్టింది. తన సొంత కుటుంబాన్ని మాత్రమే కాకుండా, ఫ్రెండ్స్ పాత్రలు కూడా పోషించి ఎంతోమందిని ఆకట్టుకున్నాడు. ఇప్పటికి తన యూట్యూబ్ ఛానెల్కి 2.6 కోట్ల కంటే ఎక్కువమంది సబ్స్క్రైబర్స్ ఉన్నట్లు సమాచారం. వీడియోలు చాలా కామెడీగా ఉండటం వల్ల ఎక్కువ మంది వ్యూవ్స్ రావడంతో, ఇండియాలో టాప్ యూట్యూబర్లలో ఒకడుగా నిలిచాడు. కేవలం యూట్యూబ్ ఛానల్ వీడియోలు మాత్రమే కాకుండా.. అనేక వెబ్ సిరీస్లు కూడా ప్రారభించి సక్సెస్ సాధించాడు. దీంతో చాలా కంపెనీలకు బ్రాండ్ అంబాసిడర్గా కూడా వ్యవహరించాడు. ఇదీ చదవండి: వాడిన పూలతో కోట్ల బిజినెస్ - ఎలాగో తెలిస్తే షాకవుతారు! ప్రారంభంలో కేవలం రూ. 5000 పొందిన భువన్ క్రమంగా లక్షలు సంపాదించడం ప్రారంభించాడు. ప్రస్తుతం రూ. 100 కోట్ల కంటే ఎక్కువ ఆస్తులని కలిగి ఉన్నట్లు సమాచారం. ప్రస్తుతం ఎంతోమంది యూట్యూబర్లకు రోల్ మోడల్గా నిలిచాడు. మొత్తానికి కష్టపడి ఎంతోమంది ప్రేక్షకులను ఆకర్శించి ఈ రోజు గొప్ప సక్సెస్ సాధించిన వారి జాబితాలో ఒకడిగా నిలిచాడు. కష్టపడి అంకిత భావంతో పనిచేయడమే సక్సెస్ మంత్రం అని ఇతని ద్వారా తెలుస్తుంది. -
నేను తప్ప ఈ దేశాన్ని ఎవరూ కాపాడలేరు..
-
అలీకి పద్మశ్రీ రావాలి
‘‘బాలనటుడిగా కెరీర్ని ప్రారంభించి నలభై ఐదేళ్లుగా అగ్ర హాస్య నటుడుగా కొనసాగుతున్న అలీ కారణజన్ముడు. అతనికి పద్మశ్రీ అవార్డు వస్తే చూడాలని ఉంది’’ అని సీనియర్ నటి రాజశ్రీ అన్నారు. సంగమం ఫౌండేషన్, వివేకానంద హాస్పిటల్స్ ఆధ్వర్యంలో హైదరాబాద్లో ‘కామెడీ ఫెస్టివల్’ నిర్వహించారు. ఇందులో భాగంగా నటుడు అలీని ‘సంగమం– వివేకానంద జీవిత సాఫల్య పురస్కారం’ అవార్డుతో సత్కరించారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన రాజశ్రీ మాట్లాడుతూ–‘‘అలీ ఎంత మంచి నటుడో అంత మంచి వ్యక్తి కూడా. తనలోని సేవాగుణం స్ఫూర్తినిస్తుంది’’ అన్నారు. కాగా అలనాటి హీరో కాంతారావు కుమారుడు రాజా, వ్యాపారవేత్త రాజశేఖర్లు హాస్యనటి పాకీజా, కళాకారిణి హేమకుమారిలకు ఒకొక్కరికి రూ. 25000 ఆర్థిక సాయం అందించారు. వివేకానంద హాస్పిటల్స్ అధినేత డా. గీత, నటుడు తనికెళ్ల భరణి, ‘సంగమం’ సంజయ్ కిషోర్ పాల్గొన్నారు. -
ఒక్కసారి నవ్వండి.. ఇక నవ్విస్తూనే ఉంటారు!
ప్రపంచంలో ఉచితంగా దొరికే విలువైన ఔషధం ఏమిటో తెలుసా? నవ్వు! నవ్వా?! అని హాశ్చర్యపడకండి. ఇది నిజం. ఒక్కసారి నవ్వి చూడండి. మీలో ఉన్న ‘టెన్షన్’ ‘ఒత్తిడి’ ‘బాధ’ అనే మహా సముద్రాలు చుక్క నీరు లేకుండా ఎండిపోతాయి. మనసు హాయిగా ఆకాశంలో తేలిపోతుంటుంది. వెయ్యి ఏనుగుల బలం ఉచితంగా మన ఒంట్లోకి వచ్చి చేరుతుంది. నవ్వే వాళ్లు–నవ్వించే వాళ్లు అనేది ఒకప్పటి మాట. అయితే చెన్నైలోని ‘ది హిస్టీరికల్’లాంటి క్లబ్లు ఇద్దరి మధ్య ఉన్న రేఖను తొలగించాయి. ఇక్కడ అందరూ నవ్వించేవాళ్లే. నవ్వులను హాయిగా ఆస్వాదించేవాళ్లే! చెన్నైలోని ఫస్ట్ ఆల్–ఉమెన్ ఇంప్రొవైజేషన్ థియేటర్ ‘ది హిస్టీరికల్’ ప్రత్యేకత ఏమిటంటే ప్రేక్షకులు నవ్వడంతోపాటు నవ్వించేలా చేయడం. ప్రేక్షకులు ఒక ఐడియా చెబితే దాని నుంచి ఆశువుగా హాస్యాన్ని పుట్టిస్తారు. ఇది మాత్రమే కాదు ఫన్–యాక్టివిటీస్ కూడా ఉంటాయి. ఉదా: స్పిన్ ఏ యాన్–ఒక పదం చెబితే దాన్ని నుంచి సన్నివేశాలను, హాస్యాన్ని సృష్టించడం. జిప్ జాప్ జోప్–ప్లేయర్స్ తమలో అపారమైన శక్తి ఉందని నమ్ముతుంటారు. దాన్ని ఇతరులకు పంచి, ఇలా చెయ్యి... అని చెబుతుంటారు. డబుల్ ఎండోమెంట్–మూడో ప్లేయర్కు ఏం చెప్పాలనేది ఇద్దరు ప్లేయర్స్ రహస్యంగా మాట్లాడుకుంటారు. ‘ది హిస్టీరికల్ క్లబ్’ అనేది షాలిని విజయకుమార్ మానసపుత్రిక. ఒకప్పుడు చెన్నైలోని ‘హాఫ్–బాయిల్డ్ ఇంక్’ ఇంప్రూవ్ కామెడీ గ్రూప్లో పనిచేసింది. ఆ గ్రూపులో తానొక్కరే మహిళ. ‘కామెడీ ఫీల్డ్లోకి ఎంతోమంది మహిళలు రావాలనే కోరికతో ది హిస్టీరికల్ క్లబ్ను ప్రారంభించాను. స్త్రీలలో సహజంగా నవ్వించే గుణం ఉంటుంది. అయితే ఆ ప్రతిభను తమ సన్నిహితుల దగ్గర మాత్రమే ప్రదర్శిస్తారు. అంతర్జాతీయ, దేశీయ క్లబ్ల నుంచి స్ఫూర్తి పొంది ప్రారంభించిన ‘ది హిస్టీరికల్’ మా నమ్మకాన్ని నిలబెట్టింది’ అంటుంది శాలిని. శాలిని మొదట తన ఐడియాను నటుడు కార్తీక్తో పంచుకున్నప్పుడు ‘బాగుంటుంది’ అని ప్రోత్సహించాడు. ఆ తరువాత అమృత శ్రీనివాసన్తో కలిసి, మన దేశంలోనే పెద్దదైన ‘ఇవమ్’ స్టాండప్–కామెడీ మూమెంట్ సహకారంతో ‘ఫీల్ ఫ్రీ టూ బీ ఫన్నీ’ కామెడీ క్యాంపెయిన్ ప్రారంభించింది. దీని ద్వారా ‘ది హిస్టీరికల్ క్లబ్’కు అవసరమైన పదమూడుమంది మహిళలను ఎంపిక చేసుకున్నారు. ‘ఇంప్రొవైజేషనల్ థియేటర్ లేదా ఇంప్రూవ్ అనేది కామెడీలోని సబ్ జానర్. చిన్న స్టోరీ లైన్ చెబితే అప్పటికప్పుడు హాస్యాన్ని పుట్టించే కళ. మనలోని సృజనాత్మకశక్తులను ప్రదర్శించడానికి వేదిక’ అంటుంది ‘ది హిస్టీరికల్’ సభ్యులలో ఒకరైన జిక్కీ నాయర్. ‘నవ్విపోదాం’ అని ప్రేక్షకులుగా వచ్చినవాళ్లు ఇతరులను నవ్వించడం అనేది అంత తేలిగ్గా ఏమీ జరగదు. మొదట బిడియ పడతారు. వాతావరణానికి అలవాటుపడతారు. ఆ తరువాత ఆత్మవిశ్వాసంతో తమలోని సృజనకు రెక్కలు ఇస్తారు. హాయిగా నవ్విస్తారు. ‘ఇప్పుడు ఉన్న సభ్యులతో మాత్రమే సంతృప్తి పడడం లేదు. ఇంకా ఎక్కువమంది సభ్యులు భాగమయ్యేలా కృషి చేస్తాం’ అంటుంది శాలిని. ‘ది హిస్టీరికల్ లక్ష్యం ఒకటే... ఇందులో చేరిన సభ్యులు తమలోని బిడియాలు, భయాలను పక్కనపెట్టి సౌకర్యంగా ఉండాలి. నవ్వడంతో పాటు నవ్వించాలి కూడా’ అంటుంది జిక్కి నాయర్. ‘మనసుకు ఉల్లాసాన్ని ఇచ్చిన కార్యక్రమం ఇది. ఎలాంటి ఒత్తిడి లేకుండా మన ఐడియాలు పంచుకోవచ్చు. అవి నవ్వుల పువ్వులవ్వడం చూడవచ్చు’ అంటుంది ‘ది హిస్టీరికల్’ కార్యక్రమంలో పాల్గొన్న సుచిత్ర శంకరన్. (క్లిక్ చేయండి: మహిళల భద్రతకు.. అక్షరాలా రక్షణ ఇస్తాయి) -
లవ్.. హారర్.. కామెడీ
ఇటీవల హిట్ చిత్రం కన్నడ ‘కాంతార’ని తెలుగులో విడుదల చేసిన అల్లు అరవింద్ గీతా ఫిలిం డిస్ట్రిబ్యూషన్ త్వరలో హిందీ చిత్రం ‘భేదియా’ని విడుదల చేయనుంది. ఈ లవ్–హారర్–కామెడీ మూవీ తెలుగు విడుదల హక్కులను దక్కించుకున్న విషయాన్ని బుధవారం ప్రకటించింది. అమర్ కౌశిక్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం హిందీ, తమిళ, తెలుగులో ఈ నెల 25న విడుదల కానుంది. వరుణ్ ధావన్, కృతీ సనన్ జంటగా నటించారు. కాగా ఈ చిత్రంలో తోడేలు కాటుకు గురైన యువకుడు భాస్కర్ పాత్రలో వరుణ్, డాక్టర్ అనిక పాత్రలో కృతి కనిపిస్తారు. ‘‘మంచి కంటెంట్ ఉన్న చిత్రాలను విడుదల చేయాలనే ఆలోచనతో తెలుగు రాష్ట్రాల్లో ‘కాంతార’ తెలుగు వెర్ష¯Œ ను విడుదల చేశాం. ‘భేదియా’ కంటెంట్ కూడా బాగుంటుంది’’ అని నిర్మాత బన్నీ వాసు పేర్కొన్నారు. -
ప్లీజ్.. అలాంటివేవైనా ఉంటే చెప్పండి: వరలక్ష్మి శరత్కుమార్
ఎలాంటి పాత్రనైనా నటించి మెప్పించే సత్తా ఉన్న నటి వరలక్ష్మి శరత్కుమార్. ప్రముఖ నటుడు శరత్కుమార్ వారసురాలైన ఆమె శరత్కుమార్ బ్రాండ్ను పెద్దగా ఉపయోగించుకోకుండానే నటిగా సినీ రంగ ప్రవేశం చేశారు. 2012లో శింబుకు జంటగా పోడాపోడి చిత్రంతో కథానాయికగా ఎంట్రీ ఇచ్చిన ఈమె నటిగా దశాబ్దాన్ని పూర్తి చేసుకున్నారు. తొలి చిత్రంతోనే మంచి గుర్తింపు తెచ్చుకున్న వరలక్ష్మి శరత్కుమార్ ఆ తరువాత బాలా దర్శకత్వంలో తారై తప్పట్టై, పుష్కర్, గాయత్రిల దర్శకత్వంలో విక్రమ్ వేదా హిట్ చిత్రాలలో కథానాయికగా నటించారు. ఆ తరువాత లింగుస్వామి దర్శకత్వంలో విశాల్ హీరోగా నటించిన సండైక్కోళి–2 చిత్రంతో ప్రతినాయకిగా అవతారమెత్తారు. అదే విధంగా విజయ్ కథానాయకుడుగా నటించిన సర్కార్ చిత్రంలో మరోసారి విలనిజాన్ని ప్రదర్శించారు. చదవండి: (Krishnam Raju: రాజకీయాల్లోనూ కీలక పాత్ర పోషించిన రెబల్స్టార్) ఆపై నాయకి, ప్రతినాయకి అన్న భేదం లేకుండా వైవిధ్యం అనిపించిన పాత్రలకు ఓకే చెప్పేసుకుని నటిస్తూ ఆల్రౌండర్గా మారిపోయారు. అదే విధంగా ఒక్క తమిళ భాషలోనే కాకుండా తెలుగు, కన్నడం అంటూ దక్షిణాది భాషల్లోనూ నటిస్తూ బహుభాషా నటిగా పేరు తెచ్చుకున్నారు. అన్నట్టు వరలక్ష్మి శరత్కుమార్ మంచి డాన్సర్ కూడా. బెల్లీ డాన్స్ సూపర్గా చేస్తారు. ప్రస్తుతం పాంబన్, గ్రంథాలు పిరందాళ్ పరాశక్తి, కలర్స్, యశోద, శబరితో పాటు తెలుగులో బాలకృష్ణ చిత్రంలోనూ నటిస్తున్నారు. కాగా ఈమె ఇటీవల ఒక భేటీలో పేర్కొంటూ తనకు హాస్యభరిత కథా చిత్రంలో నటించాలన్నది చిరకాల కోరిక అన్నారు. అయితే తనకు అలాంటి పాత్రలో నటించే అవకాశాలు రావడం లేదని, అన్ని ప్రతినాయకి పాత్రలే వస్తున్నాయన్నారు. కాబట్టి ఎవరైనా కామెడీ కథా చిత్రాల్లో నటించే అవకాశం చెప్పండి ప్లీజ్ అని నటి వరలక్ష్మి శరత్కుమార్ అంటున్నారు. చదవండి: (దర్శకుడు భారతీరాజా ఇంటికి సీఎం స్టాలిన్) -
కామెడీయే కామెడీ
-
గరం సత్తితో డీజే టిల్లు ఫేమ్ సిద్ధూ హిలేరియస్ ఇంటర్వ్యూ
-
గరం గరం వార్తలు 26 December 2021
-
శీతలమైన క్లౌన్స్లింగ్
నవ్వు ఆరోగ్యానికి అన్ని విధాలా మంచి చేస్తుంది. ఒక్కసారి నవ్వగానే మనసులో ఉన్న బాధ అంతా పోయి మానసిక ప్రశాంతత కలుగుతుంది. ఈ విషయం అందరికీ తెలిసినప్పటికీ.. వివిధ భావోద్వేగాల మధ్య నలిగిపోతూ నవ్వునే మర్చిపోతాం. అలా నవ్వులని మర్చిపోయిన వారికి.. వారి బాధలని నవ్వుతో దూరం చేద్దాం అని భుజం తట్టి చెబుతోంది శీతల్ అగర్వాల్. ‘‘మనమంతా ఎప్పుడూ శారీరకంగా ఫిట్గా ఉండడంపైనే దృష్టిపెడతాం. కానీ మానసిక ఆరోగ్యాన్ని పెద్దగా పట్టించుకోము. అందుకే వివిధ రకాల సమస్యలు చుట్టుముట్టి మెదడును తొలిచేస్తుంటాయి. అందుకే నవ్వుతూ ఉండండి’’ అని చెప్పడమేగాక, ఢిల్లీలోని వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న పేషంట్ల వద్దకు వెళ్లి వాళ్లను నవ్విస్తూ, మానసిక ఆరోగ్యం ప్రాముఖ్యతను వివరిస్తోంది శీతల్. ఢిల్లీకి చెందిన శీతల్ అగర్వాల్...ఆంత్రోపాలజిస్ట్గా, ప్రొఫెసర్గా పనిచేస్తోంది. 2016లో ఒకసారి శీతల్ అహ్మదాబాద్ వెళ్లినప్పుడు అక్కడ ధారను కలిసింది. ధార తనని తాను శీతల్కు పరిచయం చేసుకుంటూ.. ‘‘నేను ఒక మెడికల్ క్లౌను’’ను అని చెప్పింది. చిన్నప్పటి నుంచి రకరకాల సర్కస్ విదూషకులు (క్లౌన్స్) చేసే కామెడీని బాగా ఎంజాయ్ చేస్తూ పెరిగిన శీతల్కు మెడికల్ క్లౌన్ అనగానే విచిత్రంగా అనిపించింది. వెంటనే ‘‘అవునా! మెడికల్క్లౌన్ అంటే ఏంటీ?’’ అని అడిగింది..ఆసుపత్రులకు వెళ్లి రోగులను నవ్వించడమే’’ తన పని అని ధార చెప్పిన విషయం శీతలకు బాగా నచ్చింది. మెడికల్ క్లౌన్ గురించి మరింతగా అన్వేషించి అనేక విషయాలు తెలుసుకుంది. ఇందులో భాగంగానే ‘ప్యాచ్ అడమ్స్’ అనే అమెరికా కామెడీ సినిమా చూసింది. దీనిలో డాక్టర్ హాస్యం పండిస్తూ రోగులకు చికిత్స చేస్తుంటాడు. ఈ సినిమా ద్వారా మెడికల్ క్లౌన్ వల్ల ఎంతోమంది జీవితాల్లో ఆనందం నింపవచ్చని అర్థం చేసుకుని శీతల్ తను కూడా మెడికల్ క్లౌన్ కావాలనుకుంది. క్లౌన్స్లర్స్.. మెడికల్ క్లౌన్స్ కావాలనుకుని తన ఫేస్బుక్లో కొంతమంది మెడికల్ క్లౌన్స్ కావాలని పోస్టు చేసింది. శీతల్ పోస్టుకు 33 మంది స్పందించారు. దీంతో ఢిల్లీ ఆరోగ్య మంత్రిత్వ శాఖకు మెడికల్ క్లౌన్స్గా పనిచేసేందుకు అనుమతి కోసం దరఖాస్తు చేసింది. అనుమతి రాగానే కొన్ని హాస్పిటళ్లకు వెళ్లి అక్కడ రోగులకు తన వేషభాషల ద్వారా ఉల్లాసం కలిగించడం ప్రారంభించింది. జోకర్లా డ్రెస్, నెత్తిమీద టోపీ, ముక్కుకు, చెంపలకు రంగులు వేసుకుని చూడగానే నవ్వు వచ్చేలా మేకప్ వేసుకుని పిల్లల వార్డుకు వెళ్లి అక్కడ ఉన్న పిల్లలను నవ్వించడానికి ప్రయత్నించారు. వార్డులో ఉన్న పిల్లలంతా తమ బాధను మర్చిపోయి చక్కగా నవ్వారు. ఆ చిన్నారుల ముఖాల్లో విరిసిన నవ్వులు శీతల్కు చాలా తృప్తినిచ్చాయి. అంతేగాక వీళ్ల టీమ్ రోజూ ఆ వార్డుకు వెళ్లి రావడం వల్ల అక్కడున్న పిల్లలంతా చక్కగా తింటూ హాయిగా ఆడుకునేవారు. ఈ ప్రేరణతో ఢిల్లీలోని ఇతర ఆసుపత్రుల్లో కూడా అనుమతి తీసుకుని, ఆయా ఆసుపత్రులను సందర్శించి అక్కడి రోగులను నవి్వంచి, మానసికంగా దృఢంగా ఎలా ఉండాలో చెబుతూ వారిలో ధైర్యాన్ని నింపేవారు. వీరివల్ల రోగుల్లో వస్తున్న సానుకూల మార్పులను చూసి సంతృప్తి పడ్డ ఆయా హాస్పిటల్స్ యాజమాన్యాలు వీరి టీమ్ను మళ్లీ మళ్లీ రావలసిందిగా కోరేవి. ఆ నోటా ఈ నోటా శీతల్ క్లౌన్స్లర్స్ గురించి తెలిసిన వారంతా తమ ఆసుపత్రులకు పిలిస్తే, కొంతమంది ఈ టీమ్లో స్వచ్ఛందంగా మెడికల్ క్లౌన్స్లర్గా చేరి సేవలందిస్తున్నారు. ఉద్యోగం వదిలేసి.. శీతల్ క్లౌన్స్లర్స్ టీమ్కు మంచి గుర్తింపు రావడంతో..ఐదేళ్ల తరువాత తన ఉద్యోగాన్ని వదిలేసి పూర్తి సమయాన్ని మెడికల్ క్లౌన్స్కే కేటాయించింది. కోవిడ్ సమయంలోనూ..క్లౌన్స్ సేవలందించింది. మొదటి లాక్డౌన్ సమయంలో మైక్రో షెల్టర్స్ను సందర్శించడం, కొన్ని షెల్టర్లలో ఫేస్బుక్ ద్వారా లైవ్ ఈవెంట్స్ను అందిచారు. ఆన్లైన్ సెషన్స్కు స్పందన బావుండడంతో ఏడాదిన్నరపాటు అనేక ఆన్లైన్ సెషన్లను నిర్వహించారు. న్యూఢిల్లీతోపాటు మహారాష్ట్ర, హర్యాణ, మేఘాలయ, మణిపూర్, కర్ణాటక వంటి రాష్ట్రాల్లో కూడా శీతల్ తన సేవలను విస్తరించింది. ప్రస్తుతం ఆసుపత్రులతోపాటు, అనాథ, వృద్ధాశ్రమాలు, మురికి వాడల్లో మెడికల్ క్లౌన్ సేవలు అందిస్తోంది. ఈ విషయం ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్లలో వైరల్ అవ్వడంతో నెటిజన్లంతా శీతల్ను అభినందనలతో ముంచెత్తుతున్నారు. -
పతన హాస్యం
‘ఫుల్లుమూను నైటటా.. జాసుమిన్ను వైటటా.. మూను కన్న మొల్ల కన్న నీదు మోము బ్రైటటా.. టా! టా! టా!’ అంటాడు గిరీశం ‘కన్యాశుల్కం’లో. ‘నేను వట్టి తెలివితక్కువ వాడిననా నీ అనుమానం’ అని కాంతం కథల్లో భర్త అంటే అందుకు కాంతం ‘అహహ అనుమానమేమీ లేదు.. గట్టి నమ్మకమే’ అంటుంది. ‘నేను సైతం ప్రపంచాగ్నికి సమిధనొక్కటి ధారబోశాను’ అని శ్రీశ్రీ రాస్తే జరుక్శాస్త్రి పేరడీగా ‘నేను సైతం కిళ్లీ కొట్లో పాతబాకీలెగరగొట్టాను’ అని రాశాడు. ‘నవ్వవు జంతువుల్.. నరుడు నవ్వును’ అంటాడో కవి. నవ్వు మానవ ప్రవృత్తి. సకల జీవజాలం నుంచి మనిషిని వేరు చేయగల ఒకే ఒక స్పందనాగుణం– నవ్వు. ‘నాకు గనక సెన్సాఫ్ హ్యూమర్ లేకపోతే నేనెప్పుడో ఆత్మహత్య చేసుకుని ఉందును’ అన్నారు గాంధీజీ. ఓ పెద్దాయన ‘ఏ మేన్ ఈజ్ నాట్ పూర్ ఇఫ్ హి కెన్ స్టిల్ హీ లాఫ్’ అన్నాడు. ‘నవ్వుకు చోటు దొరకనంత సేపు అది ఎంత పెద్ద గది అయినా ఇరుకే’ అని ఇంగ్లిష్ వ్యాఖ్య. బతకడానికి నవ్వు అవసరం అని సామాన్యుడేమిటి చక్రవర్తి కూడా అనుకున్నాడు. అందుకే విదూషకుణ్ణి ఆస్థానంలో పెట్టుకున్నాడు. తెనాలి రామలింగడు, బీర్బల్ తమ చక్రవర్తులను ఏమో కాని నేటికీ ఆబాలగోపాలాన్ని నవ్విస్తున్నారు. మనుషులు నిత్య జీవితంలో పరాచికాలతో నవ్వుతారు. వెక్కిరించి నవ్వుతారు. తప్పులకు, అబద్ధాలకు నవ్వుతారు. అవివేకులను, మందబుద్ధులను, అతి తెలివిగల వారిని చూసి నవ్వుతారు. అధికారంలో ఉన్నవారిని ఏమీ అనలేక గేలి చేసి నవ్వుతారు. చాలక పుస్తకాలు చదివి, నాటకాలు చూసి, సినిమాలకు వెళ్లి కూడా నవ్వుతారు. అయినా కూడా గౌరవం పొందే విషయంలో హాస్యానిది ద్వితీయ స్థానమే. గంభీరంగా ఉండే అధికారినీ, గంభీరమైన ఉపన్యాసకుణ్ణీ గౌరవించినట్టుగా హాస్యం మిళితం చేసేవారిని గౌరవించరు. సాహిత్యంలో గొప్ప రచనలన్నీ గంభీరమైన విషయాలవే. హాస్యం రాస్తే ‘హాస్య రచయిత’. గంభీరమైన విషయాలు రాస్తే ‘రచయిత’. అతి తక్కువ మందే హాస్యంతో గంభీరమైన విషయాలు రాసి గౌరవం పొందారు. తెలుగులో తొలి వచన సాధకులలో ఒకౖరైన వీరేశలింగం నవ్విస్తూ తొడపాశం పెట్టే శిల్పంలో తెలుగువారిని స్మిత వచనా సముద్రంలోకి ప్రవేశ పెట్టారు. మొక్కపాటి నరసింహశాస్త్రి, మునిమాణిక్యం నరసింహారావు, భమిడిపాటి కామేశ్వరరావు ‘హాస్యత్రయం’ అనిపించుకున్నారు. చిలకమర్తి ప్రహసనాలు, పానుగంటి ‘సాక్షి’ వ్యాసాలు క్లాసిక్స్. ఆ తర్వాతి రోజుల్లో ముళ్లపూడి వెంకటరమణ ‘బుడుగు’, పురాణం ‘ఇల్లాలి ముచ్చట్లు’, నండూరి పార్థసారథి ‘రాంబాబు డైరీ’... ఈ హాస్యధారను బలంగా ముందుకు తీసుకెళ్లాయి. నామిని సుబ్రహ్మణ్యం నాయుడు, తెలిదేవర భానుమూర్తి తదితరులు మాండలిక రచనతో హాస్యం ఎంత నేటివ్ రుచిగా ఉంటుందో చూపించగలిగారు. అయితే ఆది నుంచి స్త్రీకి హాస్యం ‘అదుపు చేయబడినది’. నవ్వుకు ప్రధాన వాటాదారు పురుషుడే. స్త్రీ కాదు. ద్రౌపది కాలం నుంచి స్త్రీ నవ్వుకు అపఖ్యాతి, అపసవ్య వర్తనను ఆపాదిస్తూ వచ్చారు. నవ్వే, నవ్వించే స్త్రీలు నేటికీ తక్కువ. ఇలాంటి సంఘ అంకుశాలను కూడా ధిక్కరించి స్త్రీలు రాశారు. భానుమతి ‘అత్తగారి కథలు’, రంగనాయకమ్మ ‘స్వీట్హోమ్’ నవ్వించాయి. పొత్తూరి విజయలక్ష్మి, మృణాళిని, సోమరాజు సుశీల... పాఠకులను తమ ఫిక్స్డ్ ఖాతాల్లో వేసుకోగలిగారు. కాని నవ్వించడం ఏమాత్రం జోక్ కాదు. ఆరోగ్యకరమైన హాస్యంతో నవ్వించడం కొద్దిమందికే చేతనవుతుంది. సమాజంలో కానీ, రచనల్లో కానీ చాలామటుకు హాస్యం స్త్రీలను, బలహీనులను, వెనుకబడినవారిని దూషించడం వల్ల గేలి చేయడం వల్ల పుడుతూ ఉంటుంది. ఆస్తిత్వ రాజకీయ ఉద్యమాల వల్ల కలిగిన చైతన్యం ఇప్పుడు ఇవేవీ చేయడానికి వీల్లేని సంస్కారాన్ని ఇస్తున్నాయి. ఈ సంస్కార పరిధిలో ఉంటూ హాయిగా నవ్వుకోగల హాస్యాన్ని పుట్టించడం నవ్వు మీద సాముగా మారింది. ఈ సమయంలోనే నేటి తరం ఎటువంటి హాస్యానికి సామీప్యంలో ఉన్నదీ గమనించుకోవాలి. నిత్య ఒత్తిడి వల్ల పాఠకులు ప్రేక్షకులుగా మారి చదవడానికి బదులు చూడటానికి ఇష్టపడుతున్న సమయంలో హాస్యం వ్యాపార వనరుగా మారింది. అభినవ విదూషకులు పుట్టుకొచ్చారు. నిత్యం ప్రతి చానల్లో గంటో అరగంటో హాస్య కార్యక్రమం ఉంటోంది. అయితే అది ఎటువంటి హాస్యం? స్త్రీల రూపాలను, ఎదుటివారి ఆకారాలను పదే పదే హీనపరచడమే హాస్యంగా ఉంది. తెలుపు నలుపులను, పొడవు పొట్టిలను, భాషా యాసలను హీనపరచడమే హాస్యంగా ఉంది. ‘ఒరే దరిద్రుడా’ అనేది హాస్య సంబోధన. దరిద్రుడంటే పేదవాడు. పేదవాడు ఎవరికి హాస్య వస్తువు? ఎందుకు హాస్య వస్తువు? సమాజం లైంగిక అపక్రియల్లో మునిగినట్టుగా వాటి చుట్టూ అల్లిన హాస్యానికి రేటింగులు వస్తున్నాయి. మాటలతో సాగే రతిని హాస్యం అంటున్నారు. ఇవి ఇళ్లల్లో ఉండి చూస్తున్న పిల్లలకూ, యువతీ యువకులకూ ఏం నేర్పిస్తున్నాయి? ఆరోగ్యకరమైన హాస్యాన్ని అలవర్చుకోని పిల్లలు తమక్కావాల్సిన హాస్యాన్ని వెతుక్కోవడంలో ఎదుటివారి దుఃఖానికి హేతువు అవుతారు. బాధించడాన్ని ‘ఎంజాయ్’ చేస్తారు. సత్యానికి, హేతువుకు, వాదనకు నిలబడలేక ‘ముఖాన్నో, మూతినో’ కామెంటు చేసి పారిపోతారు. సాంస్కృతిక దాడి చేస్తారు. ఉన్నతమైన విషయాన్ని కూడా పతనానికి తెచ్చి నవ్వుదామనుకుంటారు. పతన హాస్యపు ప్రతిఫలనం ఇది. ఇప్పుడు చలామణిలో ఉన్నదానిని అపహాస్యం అనడానికి కూడా లేదు. ఇది దుర్మార్గ హాస్యం! -
సత్తి కామెడీకి ప్రొడ్యూసర్ ఓపెన్ ఆఫర్
-
Stand Up Comedians: ఇదిగో నవ్వుల ఆక్సిజన్!
గాలిలో కానరాని గడుసు దెయ్యాలు... అడుగు తీసి అడుగు వేయాలంటే టెన్షన్! హాలో బాగున్నారా? అని ఆత్మీయంగా పలకరించడానికి దగ్గరికి వెళదామంటే ఏ వైపు నుంచి ఏ చెడు నీడ పడుతుందో అని టెన్షన్! ఇప్పుడు టెన్షన్ స్టేషన్లో బతుకు బండి భయంగా ఆగింది. ఆ బండి కాస్త ముందుకు కదలాలంటే మనకు తప్పనిసరిగా కావాలి... నవ్వుల ఆక్సిజన్!! స్టాండ్ అప్ కమెడియన్లుగా రాణిస్తున్న కొందరు మహిళలు తమ దగ్గర ఉన్న నవ్వుల మంత్రదండంతో టెన్షన్ను‘హాంఫట్’ అని మాయం చేసి ‘హ్హాహ్హా’ అని నవ్విస్తూ మనసు తేలిక పరుస్తున్నారు. ‘అనురాధ మెనన్ ఎవరండీ?’ అని అడిగితే చెప్పేవాళ్లు లేకపోవచ్చుగానీ ‘మిస్ లోలా కుట్టీ ఎవరు?’ అంటే జవాబు చెప్పడం చాలామందికి వీజీ. సాధారణంగా వీజేలు పోష్ పోష్ ఇంగ్లిష్ మాట్లాడేస్తుంటారు. లోలా కుట్టి మాత్రం మలయాళీ యాక్సెంట్తో ఇంగ్లిష్ గడగడా మాట్లాడుతూ ప్రేక్షకులను గలగలమని నవ్విస్తుంటుంది. నూనె రుద్దిన జుట్టు, జడలో పూలు, గాజులు, సోడా బుడ్డి కళ్లద్దాలతో ఆమె ఆహార్యమే నువ్వు తెప్పిస్తుంది. ‘చానల్ వి.లోలా’లో లోలా కుట్టి నవ్వుల తోటమాలి. ‘కామెడీ అనేది చాలా సీరియస్ విషయం’ అని బల్ల బాదీ మరీ చెబుతున్న జియా సేథి స్టాండప్– స్టార్ కమెడీయన్గా ‘రాణి’స్తోంది. దేశవ్యాప్తంగా ప్రధాన నగరాల్లో కామెడీ స్టేజీ షోలు చేసిన జియా సేథి ఇప్పుడు జూమ్ వేదికగా నవ్వులు పండిస్తుంది. అంతేకాదు స్టాండప్–కామెడీ కోర్సు ప్రారంభించి ఎంతోమందిని కమెడియన్లుగా తీర్చిదిద్దుతుంది. చాలామందికి ‘నవ్వించడం’ అనేది హాబీ నుంచి ఉపాధి స్థాయికి వెళ్లడం విశేషం. ఇంతకీ స్టాండప్–కామెడీ కోర్స్లో ఏముంటాయి? జోక్ స్ట్రక్చర్ ఎలా ఉండాలి? ఎలాంటి విషయాలు నవ్వు తెప్పిస్తాయి? సందర్భాన్ని బట్టి అప్పటికప్పుడు హాస్యం ఎలా సృష్టించాలి? పంచ్లైన్లను ఎలా రాసుకోవాలి? కామెడీ నాలెజ్డ్ అంటే ఏమిటి? చిన్న చిన్న జోక్స్ను ఆకట్టుకునే స్కిట్లా ఎలా మలుచుకోవచ్చు... మొదలైనవి కామెడి కోర్సులో పాఠాలుగా ఉంటాయి. రంగస్థల నటిగా పేరున్న కోమల్ భాటియా ‘ఆల్–ఉమెన్ స్టాండప్ కామెడీ నైట్స్’ పేరుతో ఢిల్లీ లో చేసిన షోకు అనూహ్యమైన ఆదరణ లభించడంతో దేశంలోని వేరే నగరాల్లో కూడా ఇలాంటి షోలు చేశారు. అహ్మదాబాద్కు చెందిన ప్రీతీ దేశాయ్ కేవలం ‘నవ్వు కోసమే నవ్వు’ అన్నట్లు కాకుండా కాస్తో కూస్తో సామాజిక స్పృహను ఆ నవ్వులకు జోడిస్తుంది. ‘కొందరు పురుష కమెడియన్లు ప్రేక్షకులను నవ్వించడానికి గర్ల్ఫ్రెండ్పైన, భార్యలపైనా వెకిలి హాస్యం సృష్టిస్తుంటారు. ఇది ఆరోగ్యకరమైన హాస్యధోరణి కాదు’ అంటున్న ప్రీతి నొచ్చుకునే హాస్యానికి కాకుండా అందరూ మెచ్చుకునే హాస్యానికే ప్రాధాన్యత ఇస్తోంది. ఇక నీతి పల్టా దగ్గరికి వద్దాం. ‘మనకు ఉండాల్సింది అతి విశ్వాసం కాదు ఆత్మవిశ్వాసం’ అంటున్న ఢిల్లీకి చెందిన నీతి పల్టా అరంగేట్రంలాంటి తొలి షో అట్టర్ ఫ్లాప్ అయింది. ఆ షో లో ఆమె ఏవో జోక్స్ చెబుతూనే ఉంది, నవ్వించే ప్రయత్నం చేస్తూనే ఉంది. కానీ ప్రేక్షక మహానుభావుల ఫేసుల్లో ఎలాంటి నవ్వూ మొలకెత్తలేదు. ఏదో ట్రాజెడీ సినిమాకు వచ్చినట్లుగా పెట్టారు ఫేస్. ‘ఇదేదో మనకు అచ్చిరాని వ్యవహారం’ అని దిగులుపడలేదు నీతి. ఇంటికి వెళ్లిన తరువాత తన కామెడీ షోను తానే సమీక్షించుకుంది. ‘నవ్వించడం అంటే మనం నవ్వడం కాదు... ప్రేక్షకులను నవ్వించడం’ అనే విషయాన్ని చాలా గట్టిగా నేర్చుకుంది. ఆ తరువాత చాలా ప్రాక్టీస్ చేసి గానీ స్టేజ్ ఎక్కలేదు. షో సూపర్ డూపర్ హిట్ అయింది. ‘ప్రేక్షకులకు సెన్స్ ఆఫ్ హ్యూమర్ లేదు. నేను బాగానే పెర్ఫార్మ్ చేశాను’ అని ఆ రోజు ఆమె అనుకొని తనకు తానే సర్టిఫికెట్ ఇచ్చుకొని ఉంటే అక్కడే ఆగిపోయి ఉండేది. తన లోపాల నుంచి గుణ‘పాఠాలు’ నేర్చుకోవడం వల్లే నీతి పల్టా స్టార్–స్టాండప్ కమెడియన్గా మంచి పేరు తెచ్చుకుంటోంది. ‘నవ్వు’ అనే ఆరోగ్యకరమైన ఆక్సిజన్ కొరత తీర్చడానికి లోలా కుట్టీ నుంచి నీతి పల్టా వరకు ఎంతోమంది ఫిమేల్ స్టాండప్ కమెడియన్స్ రంగంలో ఉన్నారు. వారికి వందనాలు తెలియజేద్దాం. -
మోహన్బాబు నవ్వించడంలోనూ దిట్ట
‘మా వంటవాడు భారతీయుడు... మా పనివాడు భారతీయుడు... మా బట్టలుతికేవాడు భారతీయుడు’... అని ‘సర్దార్ పాపారాయుడు’లో మోహన్బాబు చెప్పిన బ్రిటిష్ అధికారి డైలాగుకు ప్రేక్షకులు పదేపదే నవ్వుకున్నారు. ఎన్.టి.ఆర్ తర్వాత డైలాగును బాగా పలుకుతారన్న పేరు మోహన్బాబుకు ఉంది. కాని ఆ డైలాగును ఉద్వేగానికి, రౌద్రానికి, సెంటిమెంటుకు ఎంత బాగా ఉపయోగించగలరో కామెడీకి కూడా అంతే బాగా ఉపయోగించగలరు అని ఆయన అనేక సినిమాల ద్వారా ప్రేక్షకులకు నిరూపించారు. ‘దేవత’ సినిమాలో ‘కామెడీ విలన్’గా ఆయన పెద్ద పేరు సాధించారు. అందులో నిర్మలమ్మ జులాయి మనవడిగా నవ్వులు పూయించారు. ఊళ్లో అల్లరి పనులు చేసి ఊరి పెద్ద రావుగోపాలరావు చేతిలో తిట్లు తింటూ ఉంటారు. ఆయన ‘ఔ’ మేనరిజమ్ హిందీలో విలన్ శక్తికపూర్ అదే సినిమా రీమేక్ కోసం వాడి నేటికీ ఆ మేనరిజమ్తోనే గుర్తింపు పొందుతున్నాడు. ‘వారసుడొచ్చాడు’, ‘కొదమసింహం’, ‘శ్రీనివాస కల్యాణం’.. ఇలా చాలా సినిమాల్లో ఆయన కామెడీ విలన్గా ప్రేక్షకులను అలరించారు. కొదమసింహంలో రోజుల తరబడి స్నానం చేయని కౌబాయ్గా, తిండిపోతుగా ఆయన కేరెక్టర్ అందరినీ తెగ నవ్వించింది. హీరో అయ్యాక ఈ కామెడీ అంశను ఆయన వదల్లేదు. ‘అల్లుడు గారు’ మోహన్బాబు కామిక్ టైమింగ్కు మంచి ఉదాహరణ. ‘నాది లైఫ్ అండ్ డెత్ ప్రాబ్లం’ అంటూ రకరకాల మోసాలు చేస్తూ నవ్విస్తారాయన. చంద్రమోహన్ను ‘ఉలవల బస్తా’ అంటూ శోభనను పిచ్చిపిచ్చి తిట్లు తిడుతూ ఆయన ఇంటిల్లిపాదికీ నచ్చేశారు. ఇంత మంచివాడికి ఉరిశిక్ష ఏమిటని ప్రేక్షకులు చివరలో భోరున ఏడ్చారు కూడా. దర్శకుడు రాఘవేంద్రరావు మోహన్బాబు కామెడీని బాగా ఉపయోగించుకున్నారు. ‘అల్లరి మొగుడు’లో ఇద్దరు భార్యల భర్తగా ఆయన చేత కామెడీ పండించారు. ‘అన్నమయ్య’ సినిమాలో ఆయన పాత్రను ఆహ్లాదానికి ఉపయోగించారు. ‘భంగభంగారి భంగ’ అని మేనరిజమ్ పెట్టారు. పరుచూరి బ్రదర్స్ ‘అసెంబ్లీ రౌడీ’లో ‘అరిస్తే చరుస్తా’ లాంటి డైలాగులు రాసి కామెడీ పండించారు. ఆ సినిమాలో విలన్ బాషా దగ్గరకు వెళ్లి మోహన్బాబు ఎగతాళి చేయడం కూడా బాగా నవ్వించింది. దాసరి సినిమాలలో ‘దీపారాధన’, ‘అద్దాలమేడ’ సినిమాలలో మోహన్బాబు చాలా క్లాసిక్ కామెడీ చేస్తారు. ఆయనతో కలిసి కామెడీ చేసిన చివరి సినిమా ‘పాండవులు పాండవులు తుమ్మెద’. ఇవివి సత్యనారాయణ మోహన్బాబుతో ‘అదిరింది అల్లుడు’, ‘వీడెవడండీ బాబూ’ సినిమాలు చేసి తన స్టయిల్లో నవ్విస్తే దర్శకుడు వంశీ ‘డిటెక్టివ్ నారద’గా మోహన్బాబును చూపించి నవ్వించారు. అందులో మల్లికార్జున రావుతో ‘అల్లావుద్దీన్’ అంటే అతను ‘ఎస్బాస్’ అనే మేనరిజం బాగుంటుంది. కోదండరామిరెడ్డి దర్శకత్వంలో ‘తప్పు చేసి పప్పుకూడు’ కూడా కామెడీయే. అల్లరి నరేశ్తో ‘మామ మంచు అల్లుడు కంచు’ చేశారు. మంచి కామెడీ చేసినవాడే మంచి నటుడు అంటారు పెద్దలు. ఆ విధంగా చూస్తే తాను గొప్ప నటుణ్ణి అని మోహన్బాబు అనిపించుకున్నారు. ఆయన మరిన్ని ఆహ్లాద పాత్రలు చేయాలని కోరుకుందాం. చదవండి: చిరంజీవి చేతుల మీదుగా 'విరాటపర్వం' టీజర్ విడుదల నాన్న.. మీరు లేకుండా నేను లేను: మంచు లక్ష్మీ -
‘కరోనా పురుగు’ను కామెడీతో చంపేశారుగా!
(వెబ్ స్పెషల్): ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ను కూడా మనవాళ్లు వదల్లేదు. కామెడీతో ఫుట్బాల్ ఆడుకున్నారు. కరోనా మహమ్మారి దేశంలోకి ప్రవేశించినప్పటి నుంచి అనేక పేరడి కథలు, పాటలు, జోకులు, షార్ట్ ఫిలిమ్స్ సోషల్ మీడియాలో హల్చల్ చేశాయి. కొందరు ప్రముఖుల నుంచి సామాన్యుల వరకు కరోనా పేరుతో కామెడీ సిక్సర్లను బౌండరీలు దాటించారు. మొత్తం మీద కరోనా సమయంలోనూ కామెడీ కల్లోలం స్పష్టించింది. కొన్ని సందర్భాల్లో నెటిజన్లు కరోనాపై వచ్చిన హాస్యాన్ని సరదాగా ఆస్వాదించగా.. మరి కొన్ని సందర్భాల్లో వెకిలి చేష్టలు, వివాదాస్పద వ్యాఖ్యలపై మండిపడ్డారు. హద్దులు దాటిన హాస్యంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కరోనాతో ప్రపంచం అంతా వణికిపోతుంటే.. దీనిపై కూడా కామెడీ చేయడం ఏమిటని ధ్వజమెత్తారు. కరోనా వేళ.. కామన్ సెన్స్ లేకుండా చేస్తోన్న కామెడీ సెన్స్ పై వ్యతిరేకత వ్యక్తమయ్యింది. (కంగన ఎందుకలా మాట్లాడుతుందో తెలుస్తా?) కరోనాకు స్వాగతం పలికిన చార్మీ.. కరోనా వైరస్ దేశ రాజధానితో పాటు, తెలంగాణలో ప్రవేశించిన సమయంలో కరోనా వైరస్కు స్వాగతం అంటూ సోషల్ మీడియాలో ప్రముఖ నటి చార్మీ వ్యాఖ్యలు చేయడంపై పెద్ద దుమారమే రేగింది. కోవిడ్ గురించి ఫన్నీగా టిక్ టాక్ వీడియో చేసింది. ‘‘ఢిల్లీకి, తెలంగాణకి కరోనా వైరస్ చేరిందిట. హ.. హ.. హా.. వార్తల్లో చదివాను. మరి ఆల్ ది బెస్ట్ మీకు... హా.. హహ్హ..’’ అంటూ ఆమె చేసిన వెకిలి చేష్టలపై నెటిజన్లు ట్రోల్ చేశారు. దీంతో తప్పు తెలుసుకున్న చార్మి వెంటనే వీడియోను డిలీట్ చేయడంతోపాటు నెటిజన్లకు క్షమాపణ చెప్పిన సంగతి తెలిసిందే. కరోనాను వదలని వర్మ.. వివాదాస్పద దర్శకుడు రామ్గోపాల్ వర్మ కరోనా మహమ్మారిని కూడా వదల్లేదు. కరోనాపై ఎన్నో వివాదాస్పద ట్వీట్లు చేసిన ఆయన `కనిపించని పురుగు` పేరుతో ఓ గీతాన్ని కూడా స్వయంగా పాడారు. సాయంత్రం ఐదున్నర గంటలకు విడుదల చేయాల్సిన ఈ పాటను గంట ఆలస్యంగా విడుదల చేసిన వర్మ. టెస్ట్ చేస్తే పాజిటివ్ వచ్చింది.. అది తగ్గిన తర్వాత పాటను విడుదల చేస్తున్నానంటూ వ్యంగ్యంగా పేర్కొన్నారు. "మిమ్మల్ని డిజప్పాయింట్ చేస్తున్నందుకు సారీ, ఇది ఏప్రిల్ ఫూల్ జోక్ అని డాక్టర్ చెప్పారు. ఇది ఆయన తప్పు, నాది కాదు" అని ట్వీట్ చేశాడు. భయంకరంగా ఉన్న స్థితిని తేలిక చేయడానికి మాత్రమే తాను ప్రయత్నిస్తున్నాననీ, ఈ జోక్ తన మీదే వేసుకున్నాననీ ఆయన అన్నారు. "ఎవరినైనా నేను బాధించకపోతే, వారికి సిన్సియర్గా క్షమాపణలు చెప్తున్నా" అని మరో జోక్ వేయడంతో నెటిజన్లు దుమ్మెత్తిపోశారు. పగలబడి నవ్విన నాగబాబు.. ఒక కామెడీ కార్యక్రమానికి సంబంధించి ప్రోమోలో కరోనాపై వచ్చిన జోక్కి ప్రముఖ నటుడు నాగబాబు పగలపడి నవ్వడం పట్ల నెటిజన్లు మండిపడ్డారు. ‘‘కరీనా కాదు కరోనా, కరోనా అంటే చైనాది, కరీనా అంటే బాలీవుడ్ ది’’ అంటూ వేసిన జోక్ కి నాగబాబు పడి పడి నవ్వడం పట్ల వివాదస్పదం అయ్యింది. కరోనాతో ప్రపంచమే అల్లకల్లోలమవుతుంటే ఇలాంటి జోకులా అంటూ నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. కరోనాపై నాగబాబు చేసిన ట్వీట్ పట్ల కూడా తీవ్ర వ్యతిరేకత వచ్చింది. ‘‘కరోనాని కావాలనే కొన్ని మతాల వాళ్లు, వాళ్ల దేవుడే ఈ కరోనాని, భూమ్మీదకి పంపించారు. ఈ దేవుళ్లకి కోపం ఎక్కువే సుమీ’’ అంటూ నాగబాబు వేసిన సెటైర్లపై పట్ల విమర్శలు వచ్చాయి. సీరియస్ ఇష్యూపై జోకులు ఏమిటంటూ నెటిజన్లు నిలదీశారు. శ్రీరెడ్డి సంచలనం.. కరోనాపై వివాదాస్పద నటి శ్రీరెడ్డి సోషల్ మీడియాలో చేసిన వ్యాఖ్యలు వైరల్ అయ్యాయి. కరోనా మహమ్మారి పోవాలంటే శృంగారం అవసరమంటూ సంచలన వ్యాఖ్యలు చేయడంతో ఆమెపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. (కరోనా: సర్వేలో షాకింగ్ నిజాలు) మతపెద్ద వివాదాస్పద వ్యాఖ్యలు కరోనా వైరస్ వ్యాపించడానికి అమ్మాయిలే కారణమంటూ పాక్కు చెందిన ఓ మతపెద్ద వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం తీవ్ర దుమారం రేపింది. అమ్మాయిలు పొట్టి దుస్తులు వేసుకోవడం వల్లే వైరస్ సోకిందని, వారి వల్లే ఎక్కువగా కరోనా వ్యాపిస్తోందని పాకిస్తాన్ మత పెద్ద మౌలానా తారీఖ్ జమీల్ వ్యాఖ్యనించారు. అది కూడా పాక్ ప్రధాని ఇమ్రాన్ఖాన్ సమక్షంలోనే ఈ వింత వ్యాఖ్యలు చేయడం మరింత దుమారానికి దారి తీసింది. ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయి. అత్యంత ప్రమాదకర వైరస్పై బాధ్యతారహితంగా వ్యహరించిన తీరుపై నెటిజన్లు తీవ్రంగానే స్పందించినట్టు దీన్నిబట్టి అర్థమవుతోంది. సో.. కరోనాతో కామెడీలొద్దు! -
తెలుగు కమెడియన్లూ... మీ నవ్వులు కావాలి
తెలుగువారు హాస్యప్రియులు. కాని ప్రస్తుతం భయం భయంగా నవ్వుతున్నారు. జాగ్రత్తగా నవ్వుతున్నారు. తుమ్ము, దగ్గు రాకుండా చూసుకొని మరీ నవ్వుతున్నారు. కరోనా అలా చేసి పెట్టింది. రోజూ తన వార్తలతో తెలియకుండానే వొత్తిడి తెచ్చి పెడుతోంది. ఆ వొత్తిడిని దూరం చేయాల్సిన బాధ్యత కళాకారులది. ధైర్యం చెప్పాల్సిన సందర్భం కళాకారులది. దేశీయంగా, ప్రాంతీయంగా చాలా రంగాలలోని కళాకారులు తమ ప్రయత్నం చేస్తున్నారు. తెలుగు కమెడియన్లు ఏదైనా కొత్త ఆలోచన చేయాల్సిన సమయం ఇది.భారతదేశంలోని అమితాబ్, చిరంజీవి, రజనీకాంత్ వంటి సూపర్స్టార్లు ‘ఫ్యామిలీ’ అనే షార్ట్ఫిల్మ్ చేశారు కరోనా ప్రచారం కోసం. ‘ఇంట్లోనే ఉండండి’ అని మెసేజ్ ఇచ్చిన షార్ట్ఫిల్మ్ అది. ఆ తర్వాత సంగీతకారులందరూ ‘సంగీత్సేతు’ అనే కార్యక్రమాన్ని టెలికాస్ట్ చేశారు. అందరూ ఇళ్లల్లోనే ఉండి తాము పాడదగ్గ పాటలను ట్రాక్లు ప్లే చేస్తూ పాడారు. బాలూ, ఏసుదాస్ దగ్గరి నుంచి కుమార్షాను, ఆశా భోంస్లే వరకూ అందరూ ఇందులో పాల్గొన్నారు. అక్షయ్ కుమార్ దీనికి యాంకర్గా పని చేశారు. కైలాష్ ఖేర్ ఈ కార్యక్రమంలో మన బాహుబలిలోని ‘దండాలయ్యా దండాలయ్య’ హిందీ వెర్షన్ పాడారు. బాలూ ‘రోజా’లోని ‘నా చెలి రోజావే’ పాడారు. సురేష్ వాడ్కర్ ‘సద్మా’లోని ఇళయరాజా కంపొజిషన్ ‘ఏ జిందగీ గలే లగాలే’ పాడారు. ఏసుదాస్ అదే ‘సద్మా’లోని ‘సుర్మయి అఖియోంమే’ పాడారు. కవితా కృష్ణమూర్తి ‘ప్యార్ హువా చుప్కేసే’ ఆలపించారు. ఇదంతా వారు చేసింది ఇళ్ల పట్టున ఉండి రకరకాల ఆలోచనలు చుట్టుముట్టిన ప్రజలను ఊరడింప చేయడానికే.ఇదే సందర్భంలో తెలుగు టెలివిజన్ ఆర్టిస్టులు కూడా కలిసి ఒక షార్ట్ఫిల్మ్ చేశారు. ‘స్టేహోమ్’ అనే ఈ షార్ట్ఫిల్మ్లో ఎస్.పి.బాలుతో సహా సుజిత, జయలలిత, యమున, జాకీ వీరంతా కలిసి నటించారు. ‘పుట్టడానికి తొమ్మిని నెలలు ఓపిక పట్టావ్.. బతకడానికి కొన్ని రోజులు ఓపిక పట్టలేవా’ అని ఇంట్లో ఉండమని ఈ షార్ట్ఫిల్మ్ మెసేజ్ ఇస్తుంది. ఇక ర్యాప్సాంగ్స్ చేసి వీడియోలు పోస్ట్ చేస్తున్నవారు, మిమిక్రీలు చేసి సందేశాలు ఇస్తున్నవారు చాలామందే ఉన్నారు. ఈ నేపథ్యంలో కామెడీ స్టార్లు కూడా తమ వంతుగా జనం కోసం ఏదైనా చేస్తే బాగుంటుందని హాస్యప్రియులు ఆశిస్తున్నారు. ఒకరినొకరు కలవకుండా ఇళ్లల్లోనే ఉంటూ ఏదైనా షూట్ చేసి పోస్ట్ చేస్తే బాగుంటుందని కోరుకుంటున్నారు. నిజానికి అన్ని భాషలలోనే కంటే తెలుగులో హాస్యనటులు ఎక్కువని అందరూ ఆనందపడుతుంటారు. బ్రహ్మానందం, అలీ, రమా ప్రభ, వెన్నెల కిశోర్, కృష్ణ భగవాన్, పోసాని కృష్ణమురళి, హేమ, పృథ్వి, సప్తగిరి, రాజేష్, ప్రియదర్శి, తాగుబోతు రమేష్, రఘుబాబు, శ్రీనివాస్ రెడ్డి, ధన్రాజ్, సత్య, షకలక శంకర్, రాహుల్ రామకృష్ణ, మహేశ్ విట్టా... ఇలా ఎందరో ఇప్పుడు అందరికి మల్లే లాక్డౌన్లో ఇళ్లకు పరిమితమయ్యారు. వీరు లాక్ అయినా వీరి ద్వారా కొన్ని నవ్వులు ఔట్ అవ్వాల్సిన అవసరం ఉంది. ఇక రాజేంద్ర ప్రసాద్, సీనియర్ నరేష్, అల్లరి నరేష్, సునీల్ వంటి కామెడీ హీరోస్ కూడా ఏదైనా ఆలోచన చేయవచ్చు. విషాదం కమ్ముకున్న వేళ హాస్యానికి చాలా ప్రాధాన్యం ఉంటుంది. తెలుగు నవ్వులు ఎన్ని వీలైతే అన్ని పకపకలాడాలని కోరుకుందాం. -
లోక్సభలో నవ్వులు పూయించిన అఠవాలే
న్యూఢిల్లీ: కేంద్ర మంత్రి, ఆర్పీఐ అధ్యక్షుడు రాందాస్ అఠవాలే బుధవారం లోక్సభలో తన మాటలతో ప్రధాని మోదీ, యూపీఏ చైర్పర్సన్ సోనియా గాంధీ, కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ ముఖాల్లో నవ్వులు పూయించారు. ‘రాహుల్ గారు, ప్రతిపక్షంలో కూర్చునే అవకాశం మీకు వచ్చినందుకు అభినందనలు. యూపీఏ అధికారంలో ఉన్నప్పుడు నేను మీ కూటమిలోనే ఉన్నాను. తాజా ఎన్నికలకు ముందు కూడా మళ్లీ యూపీఏలో చేరాల్సిందిగా కాంగ్రెస్ నేతలు నన్ను కోరారు. అయితే గాలి ఎటువైపు వీస్తోందో నేను గమనించి, ఎన్డీయేతోనే ఉండాలని నిర్ణయించుకున్నాను’ అని అఠవాలే అన్నారు. ఈ వ్యాఖ్యలను సరదాగా తీసుకున్న రాహుల్, సోనియాలు చిరునవ్వులు చిందిస్తూ కనిపించారు. అఠవాలే మాట్లాడుతుండగా మోదీ కూడా పలుసార్లు నవ్వారు. మోదీ మరో ఐదేళ్లు అధికారంలో ఉండి మంచిపనులు చేస్తారన్నారు. -
వినాయకుడి విగ్రహం
తెలుగులో చిన్న బడ్జెట్ సినిమాల్లో ఒక ప్రభంజనం సృష్టించిన సినిమాలోని కొన్ని సన్నివేశాలివి. ఈ సినిమా తర్వాత క్రైమ్ కామెడీ అన్నది తెలుగులో పాపులర్ జానర్గా మారిపోయింది. ఈ సినిమా పేరేంటో చెప్పుకోండి చూద్దాం... ప్రసిద్ధ విష్ణు దేవాలయం. తిరువనంతపురం (కేరళ).సంపద లెక్కింపు జరుగుతున్న రోజులు.. అక్కడ పనిచేస్తున్న పూజారి, సెక్యూరిటీ ఆఫీసర్ కలిసి ఒక వెల కట్టలేని వినాయకుడి విగ్రహాన్ని తస్కరించారు. సూర్యోదయం అవ్వడానికి ఇంకా కొద్ది సమయం ఉంది. పూజారి చేతుల్లో ఉన్న విగ్రహం, అక్కడున్న ఏ కంటికీ కనిపించకుండా గుడికి దూరంగా కారులో కూర్చొని అంతకు గంటముందు నుంచే అక్కడ ఎదురుచూస్తున్న వ్యక్తి చేతుల్లోకి వెళ్లింది.ఆ వ్యక్తి ఒక తెల్లటి గుడ్డలో వినాయకుడి విగ్రహాన్ని పెట్టుకున్నాడు. కారు స్టార్ట్ చేశాడు. హైవే మీద ఆ కారు అలా దూసుకెళ్లిపోతోంది. ఎదురుగా పెద్ద గుంత. కారు ఎగిరి గాల్లో పల్టీలు కొడుతోంది. ఆ విగ్రహం ఎక్కడో రోడ్డు పక్కన పడిపోయింది. అందులోని వ్యక్తి అదే రోడ్డుకి అటుపక్కన పడిపోయాడు. ఆ విగ్రహం రోడ్డు పక్కనే చాలాసేపు ఉంది. ఒక చిన్నపిల్లాడు వచ్చి తీసుకునే వరకూ అదక్కడే ఉంది. ఆ పిల్లాడి చేతుల్లోకి వెళ్లినప్పుడు ఆ విగ్రహం విలువ సున్నా. అది ఆ పిల్లాడి దగ్గర్నుంచి వాళ్ల నాన్న దగ్గరికి, ఆ నాన్న దగ్గర్నుంచి వీధి చివరి జ్యూవెలరీ వర్క్స్ అతని దగ్గరికి, అక్కణ్నుంచి పెద్ద షాపుకు, అక్కణ్నుంచి నగల వ్యాపారికి... చేతులు మారుతూ మారుతూ విలువ పెంచుకుంటూ పెంచుకుంటూ పోయింది. కోటీ పది లక్షల రూపాయలు. చాలా చేతులు మారిన ఆ విగ్రహం ఈ ధర దగ్గర వచ్చి ఆగినప్పుడు ఒక బ్యాగ్లో అనుకోకుండా పడింది. ఆ బ్యాగ్ స్వాతిది. తన బ్యాగ్లో కోట్లు విలువ గల ఒక విగ్రహం ఉన్న విషయం స్వాతికి తెలియదు. సూర్య, భాను, రవి.. ముగ్గురు మంచి ఫ్రెండ్స్. ఏ పని చేసినా కలిసి చేస్తారు. వాళ్లకంటూ ఉన్న ఒక్కటే పని దొంగతనం. జేబులు కొట్టడం, చిన్న చిన్న మోసాలు చేయడం, అప్పటికలా బతికేయడం వాళ్ల పని. వాళ్లకు ఈ దొంగతనాల మధ్యనే, వీళ్లు దొంగలుగా కాకుండా పరిచయమయింది స్వాతి. కొద్దిరోజుల్లోనే స్వాతి ఈ గ్యాంగ్లో ఒకరుగా చేరిపోయింది. కాకపోతే, ఈ గ్యాంగ్ చేసే పనులేవీ ఆమెకు తెలియదు. సూర్య వాళ్లింటి పక్కనే ఉండే ఒక అనాథ పిల్లాడికి చదువు చెప్పేంత దగ్గరైపోయింది స్వాతి ఈ గ్యాంగ్కి. సూర్య అంటే ఆమెకు ప్రేమ కూడా. అలాగే సూర్యకూ. ఇద్దరిదీ మంచి జోడీ. స్వాతితో ప్రతిపూటా ఫోన్లో బిజీగా గడిపేస్తోన్న సూర్యను చూస్తూ, ‘‘వీడు ఈ మధ్య పని మానేసి ఈ పన్లో పడ్డాడు.’’ అన్నాడు రవి. అవునంటూ భాను కూడా సూర్యకు చిన్న వార్నింగ్ ఇచ్చింది. వాళ్లు అలా మాట్లాడుకుంటూ ఉండగానే సూర్య ఇంటి పక్కనుండే పిల్లాడు పరిగెత్తుకుంటూ వచ్చాడు. వస్తూనే గట్టిగా అరుస్తూ చెప్పాడు – ‘‘అన్నా! టీవీ పెట్టన్నా’’. అందరూ టీవీ ముందు వాలిపోయి న్యూస్ చూస్తున్నారు. కేరళలోని విష్ణు దేవాలయంలో వినాయకుడి విగ్రహం చోరీకి గురైందన్న వార్త అన్ని చానళ్లలో ప్రధానంగా వినిపిస్తోంది. పిల్లాడు ఈ న్యూస్ ఎందుకు చూపిస్తున్నాడో సూర్యకు అర్థం కాలేదు. వాడి వైపు చూస్తూ, ‘‘ఏంట్రా!’’ అనడిగాడు. ఆ పిల్లాడు మెల్లిగా, జాగ్రత్తగా తన జేబులో ఉన్న వినాయకుడి విగ్రహాన్ని తీసి చూపించాడు. ‘‘ఎక్కడిదిరా నీకు?’’ అడిగింది భాను. పిల్లాడు తాను ఆ విగ్రహాన్ని స్వాతి బ్యాగులో కాజేసినట్టు చెప్పాడు. సూర్య ఆ విగ్రహాన్ని తన చేతుల్లోకి తీసుకొని తీక్షణంగా పరీక్షించి, ‘‘అమ్మేద్దాం!’’ అన్నాడు. ‘‘దేవుడితో వ్యాపారమా? రిస్కేమోరా..’’ అన్నాడు రవి. ‘‘రిస్కేంటిరా! యాజిటీజ్ ఒరిజినల్ లాగానే ఉంది. అమ్మితే ఎంతో కొంత వస్తుంది.’’ అన్నాడు సూర్య. దాన్ని కొనగలిగే వ్యక్తి కోసం వెతకడం మొదలుపెట్టారు. సాలర్జంగ్ శంకర్ను పట్టుకున్నారు.శంకర్ఇలాంటి వెలకట్టలేని వస్తువులను కాజేసో, కాజేసిన వాళ్ల దగ్గర్నుంచి తక్కువకు కొనో దందా నడిపిస్తుంటాడు. అదే అతని వ్యాపకం. సూర్య గ్యాంగ్ శంకర్ ఇంట్లో ఉన్నారు. ‘‘విగ్రహం?’’ అడిగాడు శంకర్.సూర్య తన జేబులోంచి విగ్రహాన్ని తీసి శంకర్ చేతుల్లో పెట్టాడు. ఆ సమయానికి అక్కడున్న ఎవ్వరికీ ఆ విగ్రహం ఎంత విలువ చేయగలదన్న దానిమీద అవగాహనే లేదు. ఆ విగ్రహాన్ని పరీక్షగా చూసిన శంకర్, ‘‘ఒక్క నిమిషం..’’ అంటూ దాన్ని తన వాళ్లకు చూపించడానికి లోపలికి తీసుకెళ్లాడు. తమ దగ్గరున్న కెమికల్స్తో విగ్రహాన్ని పక్కాగా టెస్ట్ చేయించాడు. ‘‘నా అరవై ఏళ్లసర్వీస్లో ఇంత విలువైన విగ్రహాన్ని చూడటం ఇదే మొదటిసారి.’’ అన్నాడు శంకర్ గ్యాంగ్లోని ఓ పెద్దాయన. ‘‘ఎంతకి అమ్మొచ్చు?’’ అడిగాడు శంకర్. ‘‘పది కోట్లకు పైనే సార్!’’ అన్నాడు ఆ పెద్దాయన. శంకర్కు ఎక్కడిలేని ఉత్సాహం వచ్చింది. ఒక ఐదు కోట్లు రెడీ చేస్కోమని తన వాళ్లకు చెప్పి, సూర్య గ్యాంగ్ దగ్గరికి వచ్చి కూర్చున్నాడు. ‘‘ఎంత కావాలో చెప్పండి?’’ అడిగాడు శంకర్. ‘‘మీరే చెప్పండి..’’ అన్నాడు సూర్య. మూడు అన్నాడు శంకర్. ఏడు అన్నాడు సూర్య. చివరకు ఐదుకు ఫిక్స్ చేసుకున్నారు. ఐదు కోట్ల రూపాయల బ్యాగ్ను వాళ్లకు ఇచ్చేయమంటూ సైగ చేశాడు శంకర్. సూర్య, రవి, భాను ఎగై్జటింగ్గా డబ్బులు అందుకోవడానికి ఎదురుచూస్తున్నారు. రవి అప్పుడే టైమ్ చూస్కొని, ‘‘ఆగండి. ఏం లేదు కొంచెంపెద్ద అమౌంట్ కదా.. ఐదు నిమిషాలు పోతే రాహుకాలం అయిపోతుంది. అప్పుడు తీస్కుంటే బాగుంటుందని..’’ అన్నాడు. ‘‘ఏంట్రా నీ ఎదవ చాదస్తం..’’ విసుక్కున్నాడు సూర్య. ‘‘ఏ.. ఐదు లక్షల కోసం ఐదు నిమిషాలు ఆగలేవా? చచ్చిపోతావా?’’ విసుగ్గానే చెప్పాడు రవి. శంకర్ వీళ్లిద్దరి మాటల్ని వింటూ షాకింగ్గా చూస్తూండిపోయాడు. ‘‘ఐదంటే.. ఐదు లక్షలేగా?’’ అన్నాడు అనుమానంగా. ‘‘ఏ! ఐదు వేలనుకున్నావా?’’ వెటకారంగా అన్నాడు రవి. ‘‘ఆరు లక్షలని వినిపిస్తేనూ..’’ శంకర్ ఆనందాన్ని దాచిపెడుతూ సమాధానమిచ్చాడు. ‘‘రాహుకాలం దాటేసింది. మీరిచ్చేయండి..’’ అన్నాడు రవి. శంకర్ బ్యాగులోంచి ఐదు లక్షలు తీసి వాళ్ల చేతుల్లో పెట్టాడు. వాళ్లు అంతసేపూ బేరమాడింది కోట్ల రూపాయలకని, వాళ్లు ఒరిజినల్లా ఉందని తెచ్చిచ్చిన వినాయకుడి విగ్రహం నిజంగానే ఒరిజినల్ అని అప్పటికి సూర్య గ్యాంగ్కి తెలియదు.
Pagination
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
పంచాయత్ సీజన్ 3 ట్రైలర్ విడుదల
Buddy First Single: పాటతో రూమర్స్కి చెక్ పెట్టిన అల్లు శిరీష్!
మిస్ యూఎస్ఏ విజేతల వరుస రాజీనామాలు! రీజన్ ఏంటో చెప్పిన తల్లులు
ఇన్ఫోసిస్ ప్రైజ్.. 40 ఏళ్లకు తగ్గించిన వయో పరిమితి
ఓటీటీలోకి వచ్చేస్తున్న హాలీవుడ్ సినిమా.. ఉచితంగా స్ట్రీమింగ్
వారి కోసం విరుష్క స్పెషల్ గిఫ్ట్.. ఎందుకంటే? (ఫొటోలు)
ఏపీ సీఎస్, డీజీపీని ఢిల్లీకి పిలిచిన ఈసీఐ
పబ్లిసిటీ కోసం వాడుకున్నారు.. అందువల్లే తీవ్రమైన సమస్య: నటి సోదరుడు
వడదెబ్బ మరణాలు.. ఐదో వంతు భారత్లోనే !
WC: నో రిజర్వ్ డే!.. ఒకవేళ టీమిండియా సెమీస్ చేరితే.. జరిగేది ఇదే!
తప్పక చదవండి
- అమ్ముడుపోని లక్షలాది ఇళ్లు.. చైనా కీలక ప్రతిపాదన!
- లైంగిక వేధింపుల కేసు: భారత్కు ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ!
- నాన్స్టిక్ పాత్రలు వినియోగిస్తున్నారా? ఐసీఎంఆర్ స్ట్రాంగ్ వార్నింగ్!
- యంగ్ హీరోతో మృణాల్ డేటింగ్? ఏంటి విషయం!
- టీడీపీ మూకలకు మంత్రి మేరుగ వార్నింగ్
- ఆంధ్రాలో చిన్న ఆలయానికి జూ.ఎన్టీఆర్ భారీ విరాళం
- ‘ఆ దేవాలయాలు నిర్మించాలంటే 400కుపైగా సీట్లు కావాల్సిందే’
- అతడి కంటే చెత్త కెప్టెన్ ఎవరూ లేరు.. పైగా హార్దిక్ను అంటారా?
- ఇవాళే అంతర్జాతీయ కుటుంబ దినోత్సవం!
- NewsClick Row: ప్రబీర్ తక్షణ రిలీజ్కు సుప్రీం కోర్టు ఆదేశం
Advertisement