-
ఫుడ్ కోసం తగ్గిన ఖర్చు.. అంతా వాటికోసమే!
గత పదేళ్లలో భారతీయులు గృహాల కోసం చేస్తున్న ఖర్చు రెండింతలు పెరిగిందని, ఖర్చులో కూడా ఎక్కువ భాగం అనవసరమైన అంశాలకే ఖర్చు చేస్తున్నట్లు బ్లూమ్బెర్గ్ ఒక నివేదికలో వెల్లడించింది. బట్టలు, టెలివిజన్ సెట్లు, వినోదం కోసం విచక్షణా రహితంగా డబ్బు వెచ్చిస్తున్నట్లు వెల్లడించింది. గృహాలకు, వినోదాలకు ఎక్కువ డబ్బు ఖర్చు చేస్తున్న ప్రజలు ఆహార పదార్థాలు తక్కువ ఖర్చు చేస్తున్నట్లు తెలుస్తోంది. గ్రామీణ ప్రాంతాల్లో నెలవారీ వినియోగంలో ఆహార పదార్థాల కోసం చేసే ఖర్చు 2011-12లో 53 శాతం. అయితే ఇప్పుడు ఇది 46.4 శాతానికి తగ్గింది. అదే సమయంలో ఆహారేతర వినియోగం కోసం పెట్టే ఖర్చు 47 శాతం నుంచి 53.6 శాతానికి పెరిగిందని బ్లూమ్బెర్గ్ నివేదించిన సర్వేలో తేలింది. పట్టణ ప్రాంతాల విషయానికి వస్తే.. ఆహారం కోసం పట్టణవాసులు పెడుతున్న ఖర్చు 42.6 శాతం నుంచి 39.2 శాతానికి తగ్గిపోయింది. ఆహారేతర వినియోగం 60.8 శాతానికి చేరింది. గతంలో దీనికోసం చేసే ఖర్చు 57.4 శాతంగా ఉండేది. ఇదీ చదవండి: కళ్ళముందే సరికొత్త ప్రపంచం.. మొదలైన 'మొబైల్ వరల్డ్ కాంగ్రెస్' ఈవెంట్ ఇక తలసరి ఆదాయం విషయానికి వస్తే.. 2011-12లో పట్టణవాసులు తలసరి ఆదాయం రూ. 2630 నుంచి రూ. 6459కు చేరింది. గ్రామీణప్రాంతాల్లో అయితే తలసరి ఆదాయం 1430 రూపాయల నుంచి రూ. 3773కు చేరింది. తలసరి ఆదాయం పెరిగేకొద్దీ ఆహరం కోసం చేసే ఖర్చు తగ్గుతుందని తెలుస్తోంది. -
చార్జింగ్తో పాటు డేటా స్టోరేజ్
చార్జింగ్తో పాటు డేటా స్టోరేజ్ చేతిలో ఇమిడిపోయే ఈ పరికరం ఒకేసారి రెండుపనులు చేస్తుంది. రీచార్జబుల్ బ్యాటరీతో ఈ పరికరం పోర్టబుల్ చార్జర్లా పనిచేస్తుంది. దీని ద్వారా స్మార్ట్ఫోన్లు, లాప్టాప్లు వంటి వాటిని చార్జింగ్ చేసుకోవచ్చు. పరికరాలను చార్జింగ్ చేస్తున్న సమయంలోనే, వాటిలోని ముఖ్యమైన డేటాను కూడా ఇందులో భద్రపరచుకోవచ్చు. ఇది సైనిక అవసరాల కోసం ఉపయోగించే ‘ఏఈఎస్–256’ ఎన్క్రిప్షన్ సాంకేతికతతో పనిచేస్తుంది. ఇది ఏకకాలంలో రెండు పరికరాలకు 65 వాట్ల విద్యుత్తును సరఫరా చేస్తూ చార్జింగ్ చేయగలదు. అలాగే, 1000 ఎంబీపీఎస్ వేగంతో డేటాను స్టోర్ చేసుకోగలదు. డేటా స్టోరేజ్ సామర్థ్యం ప్రకారం ‘మెమ్కీపర్’ పేరుతో చైనాకు చెందిన మెమ్కీపర్ టెక్ కంపెనీ రూపొందించిన ఈ పరికరం మూడు మోడల్స్లో– 256 జీబీ, 512 జీబీ, 1టీబీ మోడల్స్లో దొరుకుతుంది. మోడల్ను బట్టి ఈ పరికరం ధర 99 డాలర్ల నుంచి 132 డాలర్ల (రూ.8,214 నుంచి రూ.10,957)వరకు ఉంటుంది. -
ఈపీఎఫ్ఓ, పీఎంఓ డేటా లీకేజీ కలకలం?.. అప్రమత్తమైన కేంద్రం
దేశంలో డేటా లీకేజీ కలకలం రేపుతోంది. ప్రధాని కార్యాలయం (పీఎంఓ), ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్(ఈపీఎఫ్ఓ)ల డేటాబేస్ నుంచి డేటా లీకైనట్లు తెలుస్తోంది. ఈ డేటా లీకేజీపై స్పష్టత ఇవ్వాలని కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ ఆఫ్ ఇండియా (CERT-In) కేంద్రం ఆదేశాలు జారీ చేసినట్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. డేటా లీకేజీపై సమాచారం ఉంది. కానీ వాస్తవమా? కాదా? అని తెలుసుకునేందుకు రివ్యూ జరుపుతున్నాం. సీఈఆర్టీ.ఇన్ ఇచ్చే రిపోర్ట్ కోసం ఎదురు చూస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. డేటా లీకేజీ అంటూ వస్తున్న నివేదికలను పరిశీలిస్తున్నట్లు కేంద్రానికి చెందిన సైబర్ సెక్యూరిటీ నిపుణులు తెలిపారు. ‘డేటా లీకేజీని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నాం. అయితే, సైబర్ నేరస్తులు ఒక సర్వర్ ను యాక్సిస్ చేసినట్లు కొన్ని వాదనలు వినిపిస్తున్నాయని, అందుకు తగ్గ ఆధారాలు లేవు’ అని స్పష్టం చేశారు. గ్లోబల్ సాఫ్ట్వేర్, కోడ్ రిపోజిటరీ గిత్ హబ్లో చైనీస్ సైబర్ ఏజెన్సీలకు చెందిన కొన్ని పత్రాలు లీక్ అయ్యాయని, ఈ డాక్యుమెంట్లలో ఈపీఎఫ్ఓ, ఇండియన్ పీఎంఓ, ఇతర పబ్లిక్ నుండి డేటా ఉందని సోషల్ మీడియా ప్లాట్ ఫారమ్ ఎక్స్ లో పలు పోస్ట్ లు వెలుగులోకి వచ్చాయి. అయితే, ఈ డేటా లీకేజీ అంశంపై మరింత స్పష్టత రావాల్సి ఉంది. భారత్ లక్ష్యంగా గత ఏడాది నవంబర్ లో విడుదల చేసిన నివేదిక ప్రకారం..ఇటీవల కాలంలో ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్, తాజ్ హోటల్స్, ప్రభుత్వ రంగ సంస్థ బీహెచ్ఈఎల్ వంటి సంస్థలపై సైబర్ దాడులు జరిగిన సందర్భాలు ఉన్నాయి. దీంతో పాటు ఐటీ, బిజినెస్ ఔట్ సోర్సింగ్ సంస్థలతో సహా పలు సర్వీసులు అందించే సంస్థలపై అత్యధికంగా సైబర్ దాడులు జరిగినట్లు నివేదికలు హైలెట్ చేశాయి. సింగపూర్ కు చెందిన సైబర్ ఫిర్మా 2023 నివేదిక సైతం ప్రపంచ వ్యాప్తంగా జరిగే సైబర్ దాడులు భారత్ ను లక్ష్యంగా చేసుకుని 13.7శాతం ఉందని, ఆ తర్వాత అమెరికా, ఇండో నేషియా,చైనా దేశాలు ఉన్నట్లు తేలింది. -
Jio AirFiber: ఎయిర్ఫైబర్ కస్టమర్లకు జియో ఆఫర్లు..
జియో ఎయిర్ ఫైబర్ (Jio AirFiber) కస్టమర్లకు అదనపు డేటా కోసం డేటా బూస్టర్ ప్లాన్లను అందిస్తోంది. నెలవారీ అన్లిమిటెడ్ డేటా కోటా పూర్తయి అదనపు డేటా కావాల్సినవారి కోసం మూడు డేటా బూస్టర్ ప్లాన్లను జియో తీసుకొచ్చింది. జియో కొన్ని నెలలుగా దేశంలోని పలు నగరాల్లో ఎయిర్ఫైబర్ సేవలను అందిస్తోంది. ఇది హై-స్పీడ్ ఇంటర్నెట్ని అందించడానికి 5G టెక్నాలజీని ఉపయోగించే వైర్లెస్ ఇంటర్నెట్ సర్వీస్. 1 నుంచి 1.5 Gbps వేగంతో ఇంటర్నెట్ అందించగల దీన్ని నివాస, కార్యాలయ వినియోగం కోసం రూపొందించారు. జియో ప్రకారం.. దాని ఎయిర్ ఫైబర్ వినియోగదారులు నెలకు 1TB హై-స్పీడ్ డేటాను ఆనందించవచ్చు. అయితే ఈ పరిమితిని చేరుకున్న తర్వాత, వేగం తగ్గుతుంది. వినియోగదారులకు మరిన్ని డేటా ఎంపికలను అందించడానికి మూడు రకాల డేటా బూస్టర్ ప్యాక్లను అందిస్తోంది. డేటా బూస్టర్ ప్లాన్ వివరాలు 1TB కంటే ఎక్కువ హై-స్పీడ్ డేటా అవసరమయ్యేవారు స్పీడ్ బూస్ట్ పొందడానికి ఈ ప్యాక్లను ఎంచుకోవచ్చు. రూ. 101 ప్లాన్: ఈ ప్లాన్ మీ బేస్ ప్లాన్తో సమానమైన వేగంతో 100GB అదనపు డేటాను అందిస్తుంది. రూ. 251 ప్లాన్: ఈ ప్లాన్తో మీరు మీ బేస్ ప్లాన్లో ఉన్న వేగంతో 500GB అదనపు డేటాను పొందుతారు. రూ. 401 ప్లాన్: ఇది మీ బేస్ ప్లాన్లో ఉన్నట్టుగానే అదే వేగంతో 1000GB డేటా టాప్ అప్ అందిస్తుంది. -
ఉద్యోగాలకు అప్లై చేసిన మహిళలు.. 2023లో ఇంతమందా?
గత కొంతకాలంగా ఉద్యోగాల్లో చేరే మహిళల సంఖ్య బాగా పెరిగింది. దీంతో జాబ్ కోసం అప్లై చేసుకునే వారు క్రమంగా పెరుగుతున్నారు. 2023లో దేశం మొత్తం మీద ఎంత మంది ఉద్యోగాలకు అప్లై చేశారనే డేటాను apna.co విడుదల చేసింది. విడుదలైన డేటా ప్రకారం, గత ఏడాది ఉద్యోగాలకు అప్లై చేసుకున్న వారిలో మహిళలు కోటి మంది ఉన్నట్లు తెలుస్తోంది. వివిధ రంగాల్లో ఉద్యోగాల కోసం పురుషులతో పాటు మహిళలు ఇంతమంది అప్లై చేసుకోవడం గొప్ప విషయమని చెప్పాలి. ఇందులో కూడా టైర్ 1, టైర్ 2 నగరాల నుంచి ఎక్కువమంది మహిళలు ఉద్యోగాలకు అప్లై చేసుకున్నట్లు తెలుస్తోంది. 2023లో మొత్తం 3.2 కోట్లమంది ఉద్యోగాలకు అప్లై చేసుకోగా.. ఇందులో 1 కోటి మంది మహిళలే కావడం గమనార్హం. అదే 2022లో ఉద్యోగాలకు అప్లై చేసుకున్న 2.7 కోట్ల మందిలో 87 లక్షలమంది మహిలు ఉన్నారు. దీన్ని బట్టి చూస్తే ఉద్యోగాలకు అప్లై చేసిన మహిళల సంఖ్య 2022 కంటే 13 శాతం పెరిగినట్లు తెలుస్తోంది. ఇదీ చదవండి: రోబో పనికి ఫిదా అయిన ఆనంద్ మహీంద్రా - వీడియో వైరల్ ప్రస్తుతం ఇంటిదగ్గరే ఉంది ఇంటిపనులు మాత్రమే చేయడానికి మహిళలు ఎక్కువ ఆసక్తి చూపడం లేదు. తమను తాము నిరూపించుకోవడానికి ఉద్యోగాలు చేయడానికి ఆసక్తి చూపుతున్నారు.. తమదైన రీతిలో గుర్తింపు తెచ్చుకుంటున్నారు. 2023లో నిమిషానికి 100 ఉద్యోగాలకు ధరఖాస్తులు వచ్చినట్లు.. ఇందులో ఎక్కువగా సేల్స్ సపోర్ట్, ఎంటర్ప్రైజ్ సేల్స్, అడ్వర్టైజింగ్, రియల్ ఎస్టేట్, ఇన్సైడ్ సేల్స్, మార్కెటింగ్, ఈ కామర్స్ వంటి ఉద్యోగాలకు ఎక్కువ అప్లికేషన్స్ వచ్చినట్లు తెలుస్తోంది.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
నేహా కుటుంబానికి అండగా అమిత్షా..
ఆ టాలీవుడ్ హీరోతో కలిసి పని చేయాలని ఉంది: అల్లరి నరేశ్
రుతురాజ్ కెప్టెన్ ఇన్నింగ్స్.. పంజాబ్ టార్గెట్ ఎంతంటే?
టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ కుమార్తెకు అరుదైన గౌరవం!
వరల్డ్కప్కు సెలక్టయ్యాడు.. తొలిసారి డకౌటయ్యాడు! వీడియో వైరల్
ఈవీఎంలపై మమతా బెనర్జీ సంచలన ఆరోపణలు
ఎందుకంత ఓవరాక్షన్.. వాళ్లతో పోలిస్తే నువ్వెంత?: పూరి
వడగళ్ల వానతో దెబ్బతిన్న విమానం.. ఒడిశాలో ఎమర్జెన్సీ ల్యాండింగ్
పోటెత్తిన అభిమానం.. దద్దరిల్లిన ఏలూరు (ఫొటోలు)
బీఆర్ఎస్కు ఎదురు దెబ్బ : కాంగ్రెస్లో చేరిన ఇంద్రకరణ్ రెడ్డి
తప్పక చదవండి
- సీఎం రేవంత్పై ’ఈసీ‘కి బీఆర్ఎస్ ఫిర్యాదు
- కాస్మొటిక్ సర్జీలు : యాక్టర్స్ విషాద మరణాలు (ఫొటోలు)
- రిలీజైన ఏడాది తర్వాత తెలుగులో పీరియాడికల్ చిత్రం!
- కేసీఆర్పై ఈసీ చర్యలు, ఎన్నికల ప్రచారంపై 48 గంటల నిషేధం
- తెలుగులో స్ట్రీమింగ్ అవుతోన్న భారీ బడ్జెట్ వెబ్ సిరీస్..!
- నా కుమారుడు వరల్డ్కప్ జట్టుకు ఎంపికవుతాడని స్వీట్లు, టపాసులు తెచ్చా: రింకూ తండ్రి ఆవేదన
- సుల్తాన్పూర్ లోక్సభ స్థానానికి మేనకా గాంధీ నామినేషన్ దాఖలు
- ‘దిశ’ ఎన్కౌంటర్ కేసు.. సిర్పూర్ కర్ కమిషన్ రిపోర్ట్పై స్టే
- జనసేన నేతలకు అవమానం.. టీడీపీ ప్రచార రథంపై నుంచి గెంటేసి..
- రాయ్బరేలీ, అమేథి స్థానాలపై 24 గంటల్లో తుది నిర్ణయం
Advertisement