-
లబ్ధికోసమే బీఆర్ఎస్ నీటి రాజకీయం : దుద్దిళ్ల శ్రీధర్బాబు
పెద్దపల్లి: అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజల చేతిలో భంగపడ్డ బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ మరోసారి తెలంగాణ ప్రజలు, రైతులను మోసగించి పార్లమెంట్ ఎన్నికల్లో రాజకీయలబ్ధి పొందేందుకే ‘నీళ్ల’ రాజకీయం చేస్తున్నారని రాష్ట్రమంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు మండిపడ్డారు. జిల్లా కేంద్రంలో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యేలు విజయరమణారావు, ఠాకూర్ మక్కాన్సింగ్తో కలిసి మాట్లాడారు. అధికారంలో ఉన్న పదేళ్లలో రైతులను ఏనాడూ పట్టించుకోని కేసీఆర్కు ఇప్పుడు వారి కష్టాలు గుర్తుకొచ్చాయని మొసలికన్నీరు కారుస్తున్నారని విమర్శించారు. అయినా రైతులు ఆయనను నమ్మడం లేదన్నారు. కాంగ్రెస్ అఽధికారంలోకి రాగానే బీఆర్ఎస్ పాలనలో చేసిన మోసాలు, పాపాలు బయటకు వస్తున్నాయని, వాటినుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకు యత్నిస్తున్నారని దుయ్యబట్టారు. పత్తిపాక రిజర్వాయర్ నిర్మిస్తాం.. వ్యవసాయ రంగంలో సాగునీటి సమస్యను శాశ్వతంగా పరిష్కరించేలా పత్తిపాక రిజర్వాయర్ నిర్మిస్తామని, అలాగే పాలకుర్తి మండలంలో ఎత్తిపోతల పథకాన్ని ఏర్పాటు చేస్తామని మంత్రి శ్రీధర్బాబు ప్రకటించారు. తమ ప్రభుత్వం అన్నివర్గాల సంక్షేమం కోసం పాటుపడుతోందన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన గ్యారంటీలన్నీ పక్కాగా అమలు చేస్తామని అన్నారు. మహాలక్ష్మి పథకం ద్వారా ఇప్పటికే 35కోట్ల మంది అక్కాచెల్లెళ్లు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం సాగించారని అన్నారు. 200 యూనిట్లలోపు ఉచిత విద్యుత్ అర్హులందరికీ అందిస్తామని తెలిపారు. సాంకేతిక కారణాలతో పొరపాట్లు దొర్లినా ఇబ్బంది పడొద్దని, వారి నుంచి విద్యుత్ అధికారులు బిల్లులు వసూలు చేయరాదని సూచించారు. జిల్లా ప్రజలకు ఆరోగ్యశ్రీ ద్వారా రూ.15కోట్ల విలువైన వైద్యసేవలు అందించామన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని అతలాకుతలం చేసిన బీఆర్ఎస్ పాలకుల తప్పిదాలను గాడిన పెట్టేందుకే సమయం పడుతోందని తెలిపారు. సమావేశంలో నాయకులు శంకర్, రమేశ్గౌడ్, సారయ్య, ప్రకాశ్రావు, మహేందర్, సంపత్, మల్లయ్య, శ్రీనివాస్, మస్రత్, కుమార్, ఈర్ల స్వరూప, కుమారస్వామి, అక్బర్అలీ పాల్గొన్నారు. ఇవి చదవండి: దానం నాగేందర్ను గెలిపించడమే మా బాధ్యత: కోమటిరెడ్డి -
నిజాం షుగర్స్ పునఃప్రారంభానికి కట్టుబడి ఉన్నాం
బోధన్: నిజాం షుగర్స్ ఫ్యాక్టరీని పునఃప్రారంభించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి, నిజాం షుగర్స్ పునరుద్ధరణ కమిటీ చైర్మన్ దుద్దిళ్ల శ్రీధర్బాబు అన్నా రు. సీఎం రేవంత్రెడ్డి సమక్షంలో జరిగిన సమావేశంలో ఫ్యాక్టరీలను తెరిపించాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఇందుకోసం క్షేత్రస్థాయిలో పరిస్థితులను అధ్యయనం చేయడానికి ఫ్యాక్టరీ సందర్శనకు వచ్చామని పేర్కొన్నారు. శనివారం బోధన్లోని ఫ్యాక్టరీని కమిటీ సభ్యులు సందర్శించారు. స్థానిక ఎమ్మెల్యే సుదర్శన్రెడ్డి అధ్యక్షతన ఫ్యాక్టరీ ఆవరణలో చెరుకు రైతులతో సమావేశమై వారి అభిప్రాయాలను సేకరించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ రైతులు, కార్మికుల శ్రేయస్సు కోసం ఫ్యాక్టరీని తెరిపించి లాభాల బాటలో నడిపేందుకు కార్యాచరణ రూపొందిస్తున్నామని చెప్పారు. రైతులకు మేలు చేయాలన్నదే తమ ప్రభుత్వ లక్ష్యమన్నారు. ఇప్పటికే వ్యవసాయ, పారిశ్రామికరంగ నిపుణులతో చర్చిస్తున్నామని వివరించారు. రైతులకు సబ్సిడీ విత్తనాలు, పెట్టుబడి సాయం, వడ్డీ లేని రుణాలు వర్తింపజేసేలా ప్రభుత్వం సానుకూల నిర్ణయం తీసుకుంటుందన్నారు. ఫ్యాక్టరీలను ప్రభుత్వమా లేక సహకార విధానంలోనా లేక ప్రైవేటు రంగంలోనా ఎలా నడపాలో ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదని తెలిపారు. నిపుణులతో చర్చించి తుది నిర్ణయం తీసుకొనేందుకు ఆలోచించకపోతే నిజాం షుగర్స్ కూడా కాళేశ్వరం ప్రాజెక్టులా అవుతుందని వ్యాఖ్యానించారు. మార్పు చేసి చూపుతాం.. ప్రజలు ఆకాంక్షించిన మార్పును చేసి చూపుతామని శ్రీధర్బాబు తెలిపారు. ఈ నెల 27న రూ. 500కే గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల ఉచిత విద్యుత్ పథకాలను ఏఐసీసీ నాయకురాలు ప్రియాంకా గాంధీ ప్రారంభించేందుకు ఏర్పాట్లు పూర్తి చేశామని చెప్పారు. హైదరాబాద్ శివారులో జిల్లాలు, ముఖ్య పట్టణాలను కలుపుతూ రీజినల్ రింగ్రోడ్డు (ఆర్ఆర్ఆర్) నిర్మించేందుకు ముందుకు వెళ్తున్నామన్నారు. కార్యక్రమంలో కమిటీ సభ్యులు బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్రెడ్డి, ఎమ్మెల్సీ జీవన్రెడ్డి, మాజీ ఎమ్మెల్యే చంద్రశేఖర్, రాష్ట్ర పరిశ్రమల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జయేశ్ రంజన్, నిజాం షుగర్స్ ఎండీ డాక్టర్ మక్సూద్, కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి పాల్గొన్నారు. -
317 జీవోపై కేబినెట్ సబ్ కమిటీ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని కొత్త జోన్లు, కొత్త జిల్లాలకు అనుగుణంగా ఉద్యోగుల సర్దుబాటు కోసం ఉద్దేశించిన జీవో నంబర్ 317పై ఆందోళనల నేపథ్యంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఉద్యోగుల అభ్యంతరాల దృష్ట్యా మంత్రి దామోదర రాజనర్సింహ అధ్యక్షతన ప్రభుత్వం మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేసింది. కేబినెట్ సబ్ కమిటీ చైర్మన్గా మంత్రి దామోదర, సభ్యులుగా మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్బాబు, పొన్నం ప్రభాకర్ ఉంటారు. 2021లో ఇచ్చిన జీవో 317, జీవో 46పై వివాదాలు, ఉద్యోగుల అభ్యంతరాలపై ఈ కమిటీ అధ్యయనం చేసి ప్రభుత్వానికి సిఫార్సులు చేయనుంది. పీఆర్టీయూటీఎస్ హర్షం గత ప్రభుత్వం జారీ చేసిన జీవో 317పై ఉద్యోగుల అభ్యంతరాలను అధ్యయనం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కేబ్నెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేయడం పట్ల పీఆర్టీయూటీఎస్ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పింగిలి శ్రీపాల్రెడ్డి, బీరెల్లి కమలాకర్రావు హర్షం వ్యక్తం చేశారు. 317 జీవోతో ఉపాధ్యాయులు తీవ్రంగా నష్టపోయారు: టీఎస్యూటీఎఫ్ ఉద్యోగుల శాశ్వత కేటాయింపు కోసం గత ప్రభు త్వం జీవో 317 ద్వారా ఏకపక్షంగా విడుదల చేసిన మార్గదర్శకాల కారణంగా పలువురు ఉద్యోగులు, ఉపాధ్యాయులు తీవ్రంగా నష్టపోయారని టీఎస్యూటీఎఫ్ అధ్యక్షుడు, ప్రధాన కార్యదర్శులు కె జంగయ్య, చావ రవి పేర్కొన్నారు. ఇప్పుడు ఆ సమస్యలను అధ్యయనం చేసి పరిష్కారాలను సిఫారసు చేయటం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేయడం పట్ల వారు హర్షం వ్యక్తం చేశారు. జీవో 46పై సబ్ కమిటీతో నిరుద్యోగులకు న్యాయం: బల్మూరి వెంకట్ జీవో నంబర్ 46పై కేబినెట్ సబ్ కమిటీ వేయడాన్ని ఎంఎల్సి బల్మూరి వెంకట్ స్వాగతించారు. జీవో 46 వల్ల గ్రామీణ ప్రాంతాల నిరుద్యోగులు ఉద్యోగ అవకాశాలు కోల్పోయే ప్రమాదం ఉందని నాటి బీఆర్ఎస్ ప్రభుత్వానికి తాము సూచనలు, సల హాలు చేసినా పట్టించుకోలేదని గుర్తు చేశారు. కానీ ఇప్పుడు ప్రజా ప్రభుత్వం సబ్ కమిటీ వేసిందని వెంకట్ హర్షం వ్యక్తం చేశారు. రానున్న రోజుల్లో నిరుద్యోగులకు, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నవారికి ఉద్యోగ అవకాశాల్లో ఎలాంటి అన్యా యం జరగకుండా సబ్ కమిటీ నిర్ణయం తీసుకుంటుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. పీఆర్ కమిషనర్కు టీపీఎస్ఏ వినతిపత్రం ప్రభుత్వ ఉద్యోగుల సర్వీసు అంశాలు, బదిలీలపై గత సర్కార్ ఇచ్చిన జీవో 317తో ముడిపడిన సమస్యల పరిశీలనకు సీఎం రేవంత్రెడ్డి కేబినెట్ సబ్కమిటీని నియమించడం పట్ల తెలంగాణ పంచాయతీ సెక్రటరీస్ అసోసియేషన్ (టీపీఎస్ఏ) హర్షం ప్రకటించింది. ఈ జీవో కారణంగా పంచాయతీ కార్యదర్శులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి తగిన చర్యలు తీసుకోవాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ అనితా రామచంద్రన్కు టీఎస్పీఏ విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు శనివారం పీఆర్ కమిషనరేట్లో కమిషనర్కు టీఎస్పీఏ ప్రతినిధులు మధుసూదన్రెడ్డి, .శ్రీనివాస్, పండరీనాథ్ వినతిపత్రం సమర్పించారు. ఈ జీవో వల్ల కొందరు కార్యదర్శులు స్థానికతను కోల్పోయి కుటుంబాలకు దూరంగా ఇబ్బందులుపడుతున్నారని కమిషనర్ దృష్టికి తీసుకొచ్చారు. -
పారిశ్రామిక భూముల పరిరక్షణపై ప్రత్యేక దృష్టి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని పారిశ్రామిక భూముల పరిరక్షణపై ప్రత్యేక దృష్టి సారించాలని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో పరిశ్రమల విస్తరణ, అభివృద్ధి నేపథ్యంలో టీఎస్ఐఐసీ విభాగపు అధికారులతో మంత్రి శ్రీధర్బాబు బషీర్బాగ్లోని సంస్థ కార్యాలయంలో శనివారం విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. సమావేశంలో సంస్థ కార్యకలాపాలు, విభాగాల పనితీరు, ల్యాండ్ బ్యాంకు, భూ కేటాయింపులు, వాటి వినియోగం తదితర అంశాలపై పరిశ్రమల శాఖ ముఖ్యకార్యదర్శి జయేశ్ రంజన్, సంస్థ ఎండీ విష్ణువర్ధన్రెడ్డి, అధికారులతో కలిసి సమీక్షించారు. రాష్ట్ర విభజనకు ముందు, తర్వాత జరిగిన కేటాయింపులపై మంత్రి దృష్టిసారించారు. 2014 తర్వాత జరిగిన భూ కేటాయింపులు, ఏయే కంపెనీలు ఎంత మేర, ఏ అవసరాల కోసం భూమి పొందిందీ.. ప్రస్తుత వినియోగం ఎంత, నిరుపయోగంగా ఉన్న భూముల వ్యవహారాలపై మంత్రి ఆరా తీశారు. ఏళ్లు గడిచినా సంబంధిత కంపెనీలు భూములు వినియోగించుకోకపోవడం.. భూములు పొందిన సంస్థలు వారి ప్రయోజనాలకు కాకుండా థర్డ్ పారీ్టలకు లీజుకు ఇచ్చిన అంశాలపై అధికారుల ద్వారా ఆరా తీశారు, అలా థర్డ్ పారీ్టలకు జరిగిన లీజు అగ్రిమెంట్లు, పొందుతున్న ఆదాయం అంశాలపై నివేదిక సమర్పించాలని సంస్థ ఉన్నతాధికారులను ఆదేశించారు. గతంలో భూములు పొంది, ఈడీ , సీబీఐ లాంటి సంస్థలు జప్తు చేసిన భూములపై హక్కు తిరిగి పొందేలా న్యాయస్థానాల్లో పోరాటం చేసేందుకు ప్రత్యేక కార్యాచరణ రూపొందించాలని మంత్రి అధికారులకు సూచించారు. జాయింట్ వెంచర్లో భాగంగా పలు సంస్థలు, కంపెనీలు డివిడెండ్, షేర్ హోల్డ్ అమౌంట్ చెల్లించని అంశాలపై నివేదిక అందించాలని ఆదేశించారు. రాష్ట్ర అభివృద్ధిలో పరిశ్రమల శాఖ అధికారుల కృషి చాలా ఉందని, మరింతగా సంస్థ అభివృద్ధి కోసం సూచనలు, సలహాలతో పాటు సమస్యలు కూడా లిఖిత పూర్వకంగా ఇవ్వాలని ఉద్యోగులకు మంత్రి చెప్పారు. ప్రతి అధికారి ఫీల్డ్ విజిట్ చేసి సంబంధిత కంపెనీలకు సంబంధించిన భూములపై అన్ని వివరాలతో త్వరితగతిన నివేదిక అందించాలని సంస్థ ఎండీని మంత్రి ఆదేశించారు. -
ఫిబ్రవరి నుంచి 200 యూనిట్ల ఉచిత కరెంట్ హామీ అమలు: మంత్రి కోమటిరెడ్డి
సాక్షి, హైదరాబాద్: కేసీఆర్ సర్కార్ నిర్వాకం వల్ల తెలంగాణ అప్పులపాలైందన్నారు రాష్ట్ర రహదారులు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. అందువల్లే ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలులో జాప్యం జరుగుతోందన్నారు. ఫిబ్రవరి నెల నుంచి 200 యూనిట్ల ఉచిత విద్యుత్తు హామీ అమలు చేస్తామని చెప్పారు. నిరుద్యోగ భృతి మొదలుకొని డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల వరకు అన్ని హామీలను గత ప్రభుత్వం విస్మరించిందని మండిపడ్డారు. పార్లమెంటు ఎన్నికల్లో బీఆర్ఎస్కు ఒక్క సీటు కూడా రాదన్న మంత్రి.. కాళేశ్వరం ప్రాజెక్టుతో పాటు అన్ని అక్రమాలపై విచారణ కొనసాగుతుందని తెలిపారు. కాంగ్రెస్ మేనిఫెస్టో కమిటీ భేటీ మంగళవారం గాంధీభవన్లో కాంగ్రెస్ మేనిఫెస్టో కమిటీ సమావేశమైంది. మ్యానిఫెస్టో కమిటీ చైర్మన్ శ్రీధర్ బాబు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ఏఐసీసీ ఇంచార్జ్ దీపదాస్ మున్శి , ఏఐసీసీ ప్రొఫెషనల్ కాంగ్రెస్ కమిటీ చైర్మన్ ప్రవీణ్ చక్రవర్తి, మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ఏఐసీసీ కార్యదర్శులు పాల్గొన్నారు. ఏఐసీసీ మ్యానిఫెస్టోలో తెలంగాణ నుంచి చేర్చాల్సిన అంశాలపై చర్చించారు. అన్ని రాష్ట్రాల్లో తిరిగి అభిప్రాయాలను సేకరిస్తున్న కేంద్ర మేనిఫెస్టో కమిటీ.. తెలంగాణ మేనిఫెస్టో కమిటీ నుంచి కూడా అభిప్రాయాలను సేకరించింది. నాలుగైదు కామన్ స్కీములతో పాటు.. రాష్ట్రాల కోసం ప్రత్యేక అంశాలను మేనిఫెస్టోలో పెట్టాలని కాంగ్రెస్ నిర్ణయం నిర్ణయించింది. చదవండి: కేటీఆర్, హరీశ్రావుపై బీజేపీ నేత రఘునందన్ రావు ఫైర్ ప్రతిపక్షాలవి తొందరపాటు విమర్శలు మేనిఫెస్టోతోనే తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలించిందని అన్నారు పరిశ్రమలశాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు. అధికారంలోకి రాగానే ఆరు గ్యారంటీలను అమలు చేసే దిశగా అడుగులు వేస్తున్నామని తెలిపారు. ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చుతామని చెప్పారు. ప్రజలు కాంగ్రెస్ పార్టీపై ఎంతో విశ్వసాన్ని చూపారని అన్నారు. ప్రతిపక్ష పార్టీ చేస్తున్న విమర్శలు చాలా తొందరపాటుగా ఉన్నాయని విమర్శించారు. ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. ఏఐసీసీ మ్యానిఫెస్టోకు టీ కాంగ్రెస్ సాయం తీసుకుంటాం మేనిఫెస్టో అంటే ప్రజలకు దగ్గరగా, అమలుకు నోచుకునే విదంగా ఉండాలని ఏఐసీసీ ప్రొఫెషనల్ కాంగ్రెస్ చైర్మన్ ప్రవీణ్ చక్రవర్తి తెలిపారు. తెలంగాణలో మంచి మేనిఫెస్టో అందించారని.. అందుకే రాష్ట్ర ప్రజలు విశ్వసించారని పేర్కొన్నారు. ఏఐసీసీ మేనిఫెస్టో కేంద్ర మాజీ మంత్రి చిదంబరం నేతృత్వంలో రూపొందుతుందని చెప్పారు. మ్యానిఫెస్టో పబ్లిక్ ఫ్రెండ్లీగా, క్రోని కాపిటల్కు దూరంగా ప్రజావసరాలకు దగ్గరకు ఉండాలన్నారు. ఏఐసీసీ మ్యానిఫెస్టోకు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ సహకారం తీసుకుంటామన్నారు. -
WEF: దావోస్ బయల్దేరిన సీఎం రేవంత్రెడ్డి
ఢిల్లీ, సాక్షి: తెలంగాణకు భారీ పెట్టుబడులు ఆకర్షించడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి దావోస్(స్విట్జర్లాండ్) పర్యటనకు బయల్దేరారు. సోమవారం ఉదయం ఢిల్లీ నుంచి నేరుగా ఆయన దావోస్కు వెళ్తున్నారు. నేటి నుంచి 19వ తేదీ వరకు వరల్డ్ ఎకనామిక్ ఫోరం (డబ్ల్యూఈఎఫ్) 54వ సమావేశంలో సీఎం రేవంత్ నేతృత్వంలోని అధికారిక బృందం పాల్గొననుంది. తెలంగాణలో పెట్టుబడులకు ఉన్న అనుకూలతలు, బలాబలాలు, ప్రాధాన్యతలను ఈ వేదిక ద్వారా చాటి చెప్పాలని రాష్ట్ర బృందం నిర్ణయించింది. తెలంగాణ ఏర్పడిన తర్వాత ప్రపంచ ఆర్థిక ఫోరం సమావేశానికి వెళ్తున్న రాష్ట్ర అధికారిక బృందానికి ముఖ్యమంత్రి నేతృత్వం వహించడం ఇది తొలిసారి. ఈ బృందంలో ఐటీ, పరిశ్రమల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబుతోపాటు ఆ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ, ముఖ్యమంత్రి ప్రిన్సిపల్ సెక్రెటరీ కూడా ఉన్నారు. రాష్ట్ర బృందం ఎకనామిక్ ఫోరం సమావేశాల్లో భాగంగా దేశ, విదేశ పారిశ్రామికవేత్తలను కలసి కొత్త ప్రభుత్వ విజన్, ప్రభుత్వ ప్రాధాన్యతలను వివరించనుంది. ఐటీ రంగంలో అగ్రగామిగా, లైఫ్ సైన్సెస్ రంగానికి హబ్గా ఉన్న తెలంగాణ బలాలను ప్రపంచానికి చాటి చెప్పి పెట్టుబడులను ఆకర్షించాలని భావిస్తోంది. మూడు రోజుల దావోస్ పర్యటనలో 70మందికిపైగా పారిశ్రామికవేత్తలతో రాష్ట్ర బృందం భేటీ కానుంది. -
T Congress: సీతక్కకు సవాల్.. ఆయనకేమో సులువు?
సాక్షి, ఆదిలాబాద్: వచ్చే ఏడాది జరిగే లోక్సభ ఎన్నికలపై కాంగ్రెస్ పార్టీ గురి పెట్టింది. జనవరిలో అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో పార్లమెంటు పరిధిలో పార్టీని పటిష్టం చేయడంపై దృష్టి సారించింది. ఇందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా పార్లమెంట్ నియోజకవర్గాలకు ఇన్చార్జీలను నియమించింది. ఆదిలాబాద్కు రాష్ట్ర పంచాయతీరాజ్, మహిళ, శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్కను, పెద్దపల్లికి ఐటీ, అసెంబ్లీ వ్యవహా రాల శాఖ మంత్రి శ్రీధర్బాబును నియమించారు. ఆదిలాబాద్ పార్లమెంట్ పరిధిలో ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండగా, మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో నాలుగింటిలో బీజేపీ గెలిచింది. రెండుచోట్ల బీఆర్ఎస్, ఒకచోట కాంగ్రెస్ విజయం సాధించాయి. ఇక పెద్దపల్లి లోక్సభ పరిధిలో ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండగా అన్నీ కాంగ్రెస్ కై వసం చేసుకుంది. దీంతో లోక్సభ ఎన్నికల్లో పార్టీని గెలిపించడం శ్రీధర్బాబు పెద్దకష్టం కాదని ప్రచారం సాగుతోంది. శ్రీధర్బాబుకు సులువేనా.. ఇక పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గ ఇన్చార్జీగా నియమితులైన మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు ఇదే నియోజకవర్గ పరిధిలోని మంథని శాసనసభ్యుడు. గతంలో కాంగ్రెస్ ఉమ్మడి కరీంనగర్ జిల్లా అధ్యక్షుడిగా పనిచేశారు. స్థానిక నేతలపై పట్టు ఉంది. అయితే గత పార్లమెంట్ ఎన్నికల్లో ఇక్కడ బీఆర్ఎస్ హవాతో అభ్యర్థి బొర్లకుంట వెంకటేశ్నేత ఎంపీగా గెలిచారు. ఇక ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పెద్దపల్లి లోక్సభ నియోజకవర్గం పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలను కాంగ్రెస్ క్లీన్స్వీప్ చేసింది. చెన్నూర్, మంచిర్యాల, మంథని, రామగుండం, పెద్దపల్లి, ధర్మపురిలో హస్తం పార్టీ అభ్యర్థులు విజయం సాధించారు. ఇక ఆరు నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ రెండో స్థానంలో, మంచిర్యాల నియోజకవర్గంలో మూడో స్థానంలో నిలవడం గమనార్హం. దీంతో రాబోయే పార్లమెంట్ ఎన్నికలు ఎదుర్కొనేందుకు కాంగ్రెస్ పార్టీ ఉత్సాహం చూపుతుండగా, బీఆర్ఎస్ 2019 ఫలితాలను పునరావృతం చేయాలని చూస్తోంది. అయితే ఇక్కడ పార్టీని గెలిపించడం శ్రీధర్బాబుకు సులువే అన్న చర్చ సాగుతోంది. ఈ బాధ్యత ఇన్చార్జీలదే.. ఈ రెండు పార్లమెంట్ నియోజకవర్గాల పరిధిలో సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల అమలు బాధ్యతలను కూడా ఇన్చార్జీలే తీసుకోనున్నారు. అయితే ఆదిలాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి ఆరుచోట్ల ఎమ్మెల్యేలు లేకపోవడంతో అక్కడ ఆ పథకాల అమలు పరంగా ఆ పార్టీ నుంచి పోటీ చేసి ఓడిపోయిన వారిని పరిగణలోకి తీసుకుని ముందుకెళ్తారా.. లేక ఇతర ముఖ్య నాయకుల కు ప్రాధాన్యతనిస్తారనేది చూడాలి. ఇక పెద్దపల్లిలో అందరూ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఉండడంతో సంక్షే మ పథకాల అమలులో ఆ పార్టీకి పెద్దగా ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం లేదు. డిసెంబర్ 28 నుంచి గ్రామసభలు నిర్వహించి పథకాల అమలు, లబ్ధిదారుల ఎంపిక చేయనున్నారు. ఈ క్రమంలో ఇన్చార్జీలు కీలకం కానున్నారు. సీతక్కకు సవాలే.. ఆదిలాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ ఇన్చార్జీగా నియమితులైన సీతక్కకు ఇక్కడ సవాళ్లు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఉంది. గత పార్లమెంట్ ఎన్నికల్లో ఇక్కడ బీజేపీ విజయఢంకా మోగించింది. ఎంపీగా సోయం బా పూరావు విజయం సాధించారు. గడిచిన శాస న సభ ఎన్నికల్లో ఈ లోక్సభ పరిధిలోని ఆది లాబాద్, నిర్మల్, ముథోల్, సిర్పూర్ అసెంబ్లీ నియోజకవర్గాలు కమలం ఖాతాలో చేరా యి. బోథ్, ఆసిఫాబాద్ నియోజకవర్గాల్లో బీ ఆర్ఎస్ పార్టీ తమ ప్రాబల్యం నిలుపుకుంది. కేవలం ఖానాపూర్ నియోజకవర్గంలో మాత్ర మే కాంగ్రెస్ గెలిచింది. ఇదిలా ఉంటే గతంలో సీతక్క ఈ పార్లమెంట్ నియోజకవర్గ పరి ధిలో పలుమార్లు పర్యటించారు. నాయకులు, పార్టీ స్థితిగతులపై అవగాహన ఉంది. అ యితే ప్రతికూల పరిస్థితుల నుంచి విజయాన్ని అందుకోవాల్సిన పరిస్థితుల నేపథ్యంలో లోక్సభ సీటును గెలిపించడం సీతక్కకు సవాలే అన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇవి చదవండి: కొలిక్కిరాని మేడిగడ్డ పునరుద్ధరణ! -
సర్కారు ఖజానాలో పైసల్లేవ్.. క్రమశిక్షణతో ఆదాయం పెంచుతాం!
జగిత్యాల/పెద్దపల్లి: ప్రస్తుతం సర్కారు ఖజానాలో పైసల్లేవని, క్రమశిక్షణతో ఆదాయం పెంచుకుంటామని ఐటీ, పరిశ్రమలు, అసెంబ్లీ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు స్పష్టం చేశారు. కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన మాట ప్రకారం పది రోజుల్లో మరో రెండు గ్యారెంటీలు అమలు చేస్తామన్నారు. మంత్రిగా పదవీ ప్రమాణ స్వీకారం చేసిన శ్రీధర్బాబు ఆదివారం జిల్లాలో పర్యటించారు. తొలుత సుల్తానాబాద్ మండలానికి చేరుకున్న ఆయన.. పెద్దపల్లి, కమాన్పూర్, సెంటినరీకాలనీ మీదుగా మంథని చేరుకున్నారు. అడుగడగునా ఆయనకు కాంగ్రెస్ శ్రేణులు ఘనస్వాగతం పలికాయి. ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్కుమార్, రామగుండం ఎమ్మెల్యే ఠాకూర్ మక్కాన్సింగ్ మంత్రి వెంట ఉన్నారు. యువతకు ఉద్యోగాలు ఇస్తాం! జిల్లా కేంద్రంగా మారిన పెద్దపల్లి రూపురేఖలు మార్చుతామని, అభివృద్ధిలో ముందు వరుసలో నిలుపుదామని మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు అన్నారు. జిల్లాలో పరిశ్రమలు ఉన్న రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ప్రణాళిక బద్ధంగా చర్యలు తీసుకుంటామన్నారు. అవసరం మేరకు మరిన్ని పరిశ్రమలు స్థాపిస్తామని హామీ ఇచ్చారు. పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణారావు మాట్లాడుతూ, నియోజకవర్గానికి మంత్రి శ్రీధర్బాబు అండదండలు ఉండాలన్నారు. గతంలోనూ తనకెంతో సహకారం అందించారని గుర్తుచేశారు. స్పందించిన మంత్రి శ్రీధర్బాబు.. సీఎం రేవంత్రెడి ఎమ్మెల్యే విజ్జన్నకు అత్యంత సన్నిహితులన్నారు. తామంతా కలిసే జిల్లా అభివృద్ధికి పాటుపడతామని తెలిపారు. జిల్లాతో తనకెంతో అనుబంధం ఉందని ధర్మపురి ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్కుమార్ అన్నారు. మంత్రి ఆదేశాలు అమలు చేసేందుకు సిద్ధంగా ఉన్నామని రామగుండం ఎమ్మెల్యే మక్కాన్సింగ్ రాజ్ఠాకూర్ అన్నారు. ఆరు గ్యాంరెటీలు అమలు చేస్తాం! ఎన్నికల మేనిఫెస్టోలో చేర్చిన ఆరు గ్యారెంటీలను కచ్చితంగా అమలు చేస్తామని మంత్రి శ్రీధర్బాబు అన్నారు. ఇప్పటికే రెండు గ్యారెంటీలు అమలు చేస్తున్నామని, మరో 15 రోజుల్లో ఇంకో రెండు అమలు చేస్తామన్నారు. పెద్దపల్లి ఎమ్మెల్యే విజయ రమణారావు మాట్లాడుతూ , పెద్దపల్లికి బైపాస్ రోడ్డు, బస్ డిపో, జిల్లా కోర్టు, 50 పడకల సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి మంజూరు చేయిస్తామన్నారు. కాగా, సుల్తానాబాద్ ర్యాలీలో పలువురు దొంగలు చేతివాటం ప్రదర్శిస్తూ నాయకులు, ప్రజాప్రతినిధుల పర్సులు చోరీచేశారు. ప్రజలు శాంతి కోరుకున్నారు.. కమాన్పూర్ మండలం గొల్లపల్లె వద్ద కాంగ్రెస్ ఆధ్వర్యంలో మంత్రికి ఘనస్వాగతం పలికారు. కమాన్పూర్ ఎక్స్ రోడ్డు మంత్రి మాట్లాడారు. గత ప్రభుత్వ హయాంలో మంథని నియోజకవర్గంలో రౌడీయిజం రాజ్యామేలిందన్నారు. ప్రజలు శాంతియుత వాతావరణం కోరుకుని కాంగ్రెస్కు ఓట్లేసి గెలిపించారని అన్నారు. నాయకులు వైనాల రాజు, ఇనగంటి భాస్కర్రావు, కోలేటి మారుతి, తొట్ల తిరుపతియాదవ్, ఆకుల ఓదెలు, కట్కం రవీందర్, తొగరి అన్నపూర్ణ పాల్గొన్నారు. ఇవి చదవండి: అడవిబిడ్డకు అపూర్వ స్వాగతం.. మల్లంపల్లిలో మాట్లాడుతున్న సీతక్క! -
పాలనలో మార్పు చూపిస్తాం! : దుద్దిళ్ల శ్రీధర్బాబు
కరీంనగర్: ప్రజలు మార్పు కోరుకొని, కాంగ్రెస్కు అధికారం కట్టబెట్టారని, తాము పాలనలో మార్పు చూపిస్తామని రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, శాసనసభా వ్యవహారాల శాఖల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు అన్నారు. కష్టకాలంలో పార్టీ కోసం కష్టపడిన కార్యకర్తలను గుర్తుంచుకుంటామని తెలిపారు. రాష్ట్ర మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆదివారం తొలిసారి మంథనికి వెళ్తూ మార్గమధ్యలో కరీంనగర్కు చేరుకున్న ఆయనకు పార్టీ నగర అధ్యక్షుడు కోమటిరెడ్డి నరేందర్రెడ్డి ఆధ్వర్యంలో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఏ లక్ష్యాలు, ఏ ఆశయాల కోసం తెలంగాణ సాధించుకున్నామో వాటిని బీఆర్ఎస్ విస్మరించిందని ఆరోపించారు. అందుకే ప్రజలు ఆ పార్టీని గద్దెదించారన్నారు. పీసీసీ నాయకుడు వైద్యుల అంజన్కుమార్, ఎండీ.తాజ్, సమద్ నవాబ్, కమ్రొద్దీన్, వెంకటరెడ్డి పాల్గొన్నారు. ఇవి చదవండి: ఆరోపణలు నిరూపిస్తే రాజీనామా చేస్తా! : మేయర్ వై.సునీల్రావు -
హైదరాబాద్లో ‘గింబల్స్’ తయారీ పరిశ్రమ
సాక్షి, హైదరాబాద్: భారత రక్షణ దళాలకు అవసరమయ్యే ఆధునిక ‘గింబల్స్’తయారీ పరిశ్రమను హైదరాబాద్లో ఏర్పాటు చేయాల్సిందిగా ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు కోరారు. హైదరాబాద్కు చెందిన హెచ్సీ రోబోటిక్స్ ఫ్రెంచ్ కంపెనీ మేరియోతో కలిసి ఆధునిక గింబల్స్ తయారీ పరిశ్రమను ఏర్పాటు చేయాలని భావిస్తోంది. ఈ నేపథ్యంలో ఫ్రెంచ్ కంపెనీ మేరియోకు చెందిన అత్యున్నతస్థాయి ప్రతినిధి బృందం సంస్థ సీఈవో రెమీప్లెనెట్ నేతృత్వంలో శుక్రవారం మంత్రిని కలిసి హైదరాబాద్లో తమ కార్యకలాపాలను ప్రారంభించేందుకు ఆసక్తిని తెలియజేసింది. హైదరాబాద్లో మేరియో కార్యకలాపాలకు ప్రభుత్వపరంగా మద్దతును ఇస్తామని మంత్రి హామీనిచ్చారు. మేరియో ప్రతినిధి బృందం భారత పర్యటనలో భాగంగా కేంద్ర రక్షణ శాఖ అధికారులతోపాటు ఇతర రక్షణ రంగ ఉత్పత్తుల తయారీ సంస్థలతో సమావేశమైంది. శ్రీధర్బాబును కలిసిన ప్రతినిధి బృందంలో హెచ్సీ రోబోటిక్స్ సీఈవో వెంకట్ చుండి, డైరెక్టర్ డాక్టర్ రాధాకిషోర్ ఉన్నారు. -
జిల్లాల్లో పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్ల బారులు
-
24 గంటల ఉచిత విద్యుత్ కాంగ్రెస్ తోనే సాధ్యం
-
పుట్టకే టికెట్.. మంథనిలో ఉత్కంఠ పోరు!
మంథని నియోజకవర్గంలో మాజీ ప్రధాని పీవీ నరసింహారావు నాలుగుసార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలుపొంది ప్రధానమంత్రి అయ్యారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ స్పీకర్ దుద్దిల్ల శ్రీపాదరావు మూడుసార్లు మంథని నియోజక వర్గ ఎమ్మెల్యేగా గెలుపొంది స్పీకర్గా సేవలందించారు. అనంతరం దుద్దిల్ల శ్రీధర్ బాబు నాలుగు సార్లు గెలుపొంది వివిధ శాఖలకు మంత్రిగా, ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. ► నియోజకవర్గం గురించి ఏవైనా ఆసక్తికర అంశాలు: మధుకర్ హత్య, న్యాయవాదులైన గట్టు వామన్ రావు - నాగమణి దంపతుల హత్య. ► ఈ నియోజకవర్గంలో ఎన్నికలను ప్రభావితం చేసే అత్యంత కీలకమైన అంశం కాళేశ్వరం ప్రాజెక్ట్ మంథని ఎమ్మెల్యేగా ఉన్న దుద్ధిళ్ల శ్రీధర్ బాబు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత కావడం, అధికార బీఆర్ఎస్ పార్టీకి చెందిన పుట్ట మధు ప్రస్తుతం పెద్దపల్లి జడ్పీ చైర్మన్గా ఉన్నాడు. బీజెపి నుంచి మాజీ ఎమ్మెల్యే రాంరెడ్డి తనయుడు చంద్రుపట్ల సునీల్ రెడ్డి పార్టీ బలోపేతం చేస్తూ ఎన్నికల్లో పోటీ చేయడానికి రెడీ అవుతున్నాడు. కాంగ్రెస్ నుంచి శ్రీధర్ బాబు, బీజెపి పార్టీ నుంచి సునీల్ రెడ్డికి పోటీ ఎవరూ లేకపోవడం పార్టీ టికెట్ కన్ఫాం కావడంతో గెలుపు కోసం ఎవరి ప్రచారాలు వారు చేసుకుంటూ రాజకీయ వ్యూహాలకు పదును పెడుతున్నారు. అధికార బీఆర్ఎస్ పార్టీలో మాత్రం ఆశావాహుల సంఖ్య రోజురోజుకు పెరుగుతుంది... ప్రస్తుత పెద్దపెల్లి జెడ్పీ చైర్మన్, బీఆర్ఎస్ పార్టీ మంథని నియోజకవర్గ ఇన్చార్జీగా ఉన్న పుట్ట మధుపై హైకోర్టు న్యాయవాద గట్టు వామన్ రావు - నాగమణి దంపతులు హత్య అనంతరం వచ్చిన ఆరోపణలు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించాయి. ఆ సమయంలో పుట్టమధు పది రోజులు కనిపించకుండపోవడం నియోజకవర్గ వ్యాప్తంగా చర్చకు దారితీసాయి. తన రాజకీయ అస్తిత్వం కాపాడుకోవడానికి పుట్టమధు బహుజనవాదం, బీసీ వాదాన్ని భుజానికెత్తుకున్నారు. కాటారం సింగిల్ విండో చైర్మన్గా ఉన్న చల్ల నారాయణరెడ్డి ఇటీవల రాజకీయంగా యాక్టివ్ అయ్యారు. అన్ని ప్రభుత్వ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటూ ఆయా శుభకార్యాలకు నియోజకవర్గ వ్యాప్తంగా తిరుగుతున్నాడు. పార్టీ అధిష్టానంతో నిత్యం టచ్లో ఉంటూ, బీఆర్ఎస్ అసంతృప్త నేతలను చేరదీస్తూ పార్టీ టికెట్ ఇస్తే పోటీ చేస్తానంటున్నాడు... రెండు రోజుల క్రితం పెద్దపెల్లి మాజీ ఎంపీ చేలిమల సుగుణ కుమారి మంథని, పెద్దపల్లిలో పర్యటించారు. చాలా సంవత్సరాలుగా విదేశాల్లో ఉంటున్న మాజీ ఎంపీ సుగుణకుమారి ఒక్కసారిగా ప్రత్యక్షం కావడంతో పొలిటికల్ సర్కిల్లో ఆమె రీఎంట్రీ ఇచ్చే అవకాశాలు ఉన్నాయని ఆమె మద్దతుదారులు అంటున్నారు. అయితే సుగుణ కుమారి ఎమ్మెల్యేగా పోటీ చేస్తారా? ఎంపీగా పోటీ చేస్తారా?.. పెద్దపెల్లి పార్లమెంటు పరిధిలోని ఏ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారు.. ఏ పార్టీ నుంచి పోటీ చేస్తారు.. ఇలా వివిధ రకాల గాసిప్స్ స్టార్ట్ అయ్యాయి. రాజకీయ పార్టీల వారీగా ఎవరెవరు ప్రధాన పార్టీల టికెట్ల కోసం పోటీ పడుతున్నారు? దుదిల్ల శ్రీధర్ బాబు (కాంగ్రెస్ పార్టీ). చంద్రుడు పట్ల సునీల్ రెడ్డి (బిజెపి పార్టీ). పుట్ట మధుకర్ (బీఆర్ఎస్ పార్టీ) మంథని నియోజకవర్గంలోని ప్రధాన సమస్యలు: మంథని నియోజవర్గంలోని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాపకంగా నిర్వహించిన కాళేశ్వరం ప్రాజెక్ట్ బ్యాక్ వాటర్ కారణంగా పంట పొలాలు నీట మునుగుతుండటం. అన్నారం బ్యారేజీ బ్యాక్ వాటర్తో గోదావరి నదిని ఆనుకొని ఉన్న గ్రామాలైన ఖాన్ సాయిపేట, ఆరెంద, మల్లారం, ఖానాపూర్, ఉప్పట్ల, విలోచవరం, పోతారం తదితర గ్రామాల్లో గత నాలుగు సంవత్సరాలుగా పంటలు పండలేని పరిస్థితి. గోదావరినదిని ఆనుకొని కరకట్ట నిర్మించాలని లేని పక్షంలో భూసేకరణ చేయాలని కోరుతున్న రైతులు. ఇసుక క్వారీలతో వందలాది లారీలు నిత్యం రాకపోకలతో కాటారం- మంథని ప్రధాన రహదారులు పూర్తిగా ధ్వంసం అయ్యాయి, దీంతో ప్రజలు ప్రయాణికులు ఇబ్బందులు పడాల్సి వస్తున్నాయి. అంతేకాదు తరచూ లారీల రాకపోకల కారణంగా అక్కడ రోడ్డు ప్రమాదాలు జరగడంతో ఇంటి పెద్దలను కొల్పోయి ఎన్నో కుటుంబాలు ఆసరా కోల్పోతున్నాయి. మేజర్ గ్రామపంచాయతీగా ఉన్న మంథని, మున్సిపాలిటీగా మారడంతో పనులు లేక ఉపాధి కోల్పోయిన పేద మధ్యతరగతి కుటుంబాలు. పేరు గొప్ప ఊరు దిబ్బగా మారిన మంథని మున్సిపాలిటీ పరిధిలో చూస్తే మాత్రం ఎక్కడ చూసినా విగ్రహాలే ఎక్కడికక్కడే పేరుకపోయిన సమస్యలు. పట్టణం లోని మాతాశిశు హాస్పిటల్ ముందున్న డంపింగ్ యార్డ్ లో కాల్చిన చెత్త వలన వచ్చే పొగతో అనారోగ్య బారినపడుతున్న ప్రజలు. రామగిరి మండలంలో ప్రధానంగా సింగరేణి భూ నిర్వాసితుల సమస్యలు, భూ నిర్వాసితులకు ఇటు సింగరేణి పరంగా అటు ప్రభుత్వ పరంగా రావలసిన బెనిఫిట్స్ రాకపోవడం రెంటికి చెడ్డ రేవడిలా మారింది... మంథని నియోజకవర్గంలో తెలంగాణ రాష్ట్రం వచ్చాక పెద్దగా అభివృద్ధి పనులు ఏమీ జరగలేదని, మిషన్ భగీరథ పేరుతో ఉన్న రోడ్లను ధ్వంసం చేశారని, సహజ వనలను దోచుకుపోతున్నారనేది మాత్రం వాస్తవం... ముఖ్యంగా రైతుబంధు, రైతు భీమా లాంటి పథకాలు రావడంలేదని ప్రజలు నిరసన వ్యక్తం చేస్తున్నారు. నియోజకవర్గంలో భౌగోళిక పరిస్థితులు: వృత్తిపరంగా రైతులు, ఉద్యోగులు, వ్యాపారులు ఉన్నారు. ఇక్కడ ముఖ్యంగా సింగరేణి బోగ్గు కార్మికులు ఎక్కువ. నదులు: గోదావరి, ప్రాణహిత ఆలయాలు: ప్రముఖ పుణ్యక్షేత్రం కాలేశ్వరంలోని కాలేశ్వర ముక్తేశ్వర దేవాలయం, మంథనిలో పురాతన ఆలయాలు. పర్యాటకం: కాలేశ్వరం ప్రాజెక్ట్, రామగిరి ఖిల్లా, కాటారం మండలంలోని ప్రతాపగిరి కొండ -
Karimnagar: ఉగాది వేళ.. జాతకాల్లో అదృష్టం వెతుక్కుంటున్న నేతలు
సాక్షి, కరీంనగర్: తెలుగువారి కొత్త సంవత్సరాది ఉగాది. శోభకృత్ నామ సంవత్సరం సందర్భంగా ప్రతీ ఒక్కరూ తమ జాతకాన్ని కొత్త పంచాంగంలో వెతుక్కుంటున్నారు. ఈ ఉగాది సాధారణ ప్రజల కంటే.. రాజకీయ నాయకులకు ఎంతో కీలకమైంది. అధికారంలో ఉన్న ఎమ్మెల్యేలు, ప్రతిపక్షంలో ఉన్న ప్రత్యర్థులు, ఈసారి ఎన్నికల బరిలో తమ అదృష్టాన్ని పరీక్షించుకుందామనుకునే ఆశావహులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఉమ్మడి జిల్లాలోని 12 నియోజకవర్గాల్లో అధికార–ప్రతిపక్ష నేతలంతా నూతన పంచాంగంలో తమ జాతకాలలో ఆదాయ వ్యయాల మాట ఎలా ఉన్నా.. రాజ్యపూజ్యంపైనే కన్నేశారు. అవమానాల మాట పక్కనబెట్టి.. రాజ్యపూజ్యం దక్కుతుందా? లేదా అన్న అంశంపైనే ప్రధానంగా దృష్టి కేంద్రీకరిస్తున్నారు. అన్ని నియోజకవర్గాల్లో రాజకీయ పరిస్థితిని ఒకసారి పరిశీలిస్తే.. కరీంనగర్: బీఆర్ఎస్ మంత్రి గంగుల కమలాకర్ తీగల వంతెన, ఎమ్మారెఫ్, స్మార్ట్ సిటీ పనులతో కరీంనగర్పై ఫోకస్ పెట్టారు. హిందుత్వం, మార్పు అన్న ఎజెండాతో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ నుంచి పోటీ ఎదరవనుంది. బీజేపీ నుంచి కొత్త జయపాల్రెడ్డి కూడా ప్రయత్నాలు చేస్తున్నారని సమాచారం. కాంగ్రెస్ నుంచి మాజీ మంత్రి ఎమ్మెస్సార్ మనవడు రోహిత్, నగరాధ్యక్షుడు కోమటిరెడ్డి నరేందర్రెడ్డి టికెట్ ఆశిస్తున్నారు. వైస్సార్టీపీ నుంచి డాక్టర్ నగేశ్ బరిలో నిలవనున్నారు. చొప్పదండి: ప్రస్తుతం ఎమ్మెల్యే రవిశంకర్ (బీఆర్ఎస్)కు ఇంటిపోరు తప్పేలా లేదు. అదేపార్టీ నుంచి గజ్జెల కాంతం, కత్తెరపాక కొండయ్య, కార్పొరేటర్ కంసాల శ్రీనివాస్ టికెట్ రేసులో ఉన్నారు. ఈసారి మేడిపల్లి సత్యం (కాంగ్రెస్) నుంచి గట్టి పోటీ ఇవ్వనున్నారు. బీజేపీ నుంచి బొడిగె శోభ, సుద్దాల దేవయ్యల మధ్య తీవ్ర పోటీ నెలకొంది. వైఎస్సార్టీపీ నుంచి అక్కెనపల్లి కుమార్ బరిలో నిలవనున్నారు. మానకొండూరు: ఇక్కడ నుంచి రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన రసమయి బాలకిషన్కు ఈసారి ఇంటి పోరు తీవ్రంగానే ఉంది. మాజీ ఎమ్మెల్యే ఆరెపల్లి మోహన్, ఇక్కడే నుంచే పోటీ చేసిన ఓరుగంటి ఆనంద్ కూడా టికెట్ కోసం ప్రయత్నిస్తున్నారు. కాంగ్రెస్ నుంచి కవ్వంపల్లి సత్యనారాయణ, బీజేపీ గడ్డం నాగరాజు, దరువు ఎల్లన్న బరిలో నిలవనున్నారు. హుజూరాబాద్: గత ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి గెలిచిన ఈటల రాజేందర్ ప్రస్తుతం బీజేపీలో ఉన్నారు. బీఆర్ఎస్ విప్, ఎమ్మెల్సీ పాడి కౌశిక్రెడ్డి ఈసారి బరిలో దిగనున్నారు. కాంగ్రెస్ నుంచి ఎన్ఎస్యూఐ రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరి వెంకట్ తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. సిరిసిల్ల: ఇక్కడ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రి కేటీఆర్కు ప్రత్యర్థులు పెద్దగా లేరు. కాంగ్రెస్ నుంచి కె.కె.మహేందర్రెడ్డి మినహా ఇక్కడ ఆయనకు గట్టి వైరిపక్షం కానరావడం లేదు. ఈసారి బీజేపీ మాత్రం సెలబ్రెటీని రంగంలోకి దించుతారన్న ప్రచారం సాగుతోంది. రామగుండం: ప్రస్తుతం ఎమ్మెల్యే కోరుకంటి చందర్కు, ఈసారి కాంగ్రెస్ నేత ఠాకూర్ మక్కాన్ సింగ్ (కాంగ్రెస్) గట్టి పోటీ ఎదురవనుంది. వీరితోపాటు సీనియర్ నేత మాజీ ఎమ్మెల్యే సోమారపు సత్యనారాయణ (బీజేపీ) కూడా బరిలో ఉండటంతో పోరు రసవత్తరంగా మారనుంది. వేములవాడ: ప్రస్తుత ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్ (బీఆర్ఎస్)కు చిరకాల ప్రత్యర్థి ఈసారి కాంగ్రెస్ నేత ఆది శ్రీనివాస్ నుంచి గట్టి పోటీ ఎదురయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. బీజేపీ నుంచి చెన్నమనేని విద్యాసాగర్ రావు కుమారుడు వికాస్ పేరు వినిపిస్తుండగా.. తాను స్వతంత్రంగానైనా పోటీచేస్తానని అదే పార్టీ నేత తుల ఉమ ఇప్పటికే ప్రకటించారు. ఎన్నారైలు గోలి మోహన్ (ఇప్పటికే నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు), మరో ఎన్నారై తోట రాంకుమార్ కూడా బరిలో నిలిచేందుకు ఆసక్తిగా ఉన్నారు. జగిత్యాల: డాక్టర్ సంజయ్ ఇప్పటికే వరుసగా గ్రామాల్లో పర్యటిస్తూ.. పల్లె నిద్ర పేరుతో ప్రజలకు చేరవవుతున్నారు. ఇక మాజీ మంత్రి, ఎమ్మెల్సీ జీవన్రెడ్డి (కాంగ్రెస్) కూడా పోటాపోటీగా పర్యటనలు చేస్తున్నారు. ఇటీవల భోగశ్రావణి బీజేపీ నుంచి బరిలోకి దిగేందుకు ఆసక్తిగా ఉన్నారు. కోరుట్ల: ప్రస్తుత ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు(బీఆర్ఎస్) వరుసగా అభివృద్ధి పనులు, శంకుస్థాపనలు అంటూ పర్యటిస్తున్నారు. ఈసారి జువ్వాడి నర్సింగరావు (కాంగ్రెస్) గట్టి పోటీ ఇచ్చేందుకు సంసిద్ధంగా ఉన్నారు. మార్పులు జరిగితే వీరిద్దరు కుమారులను బరిలో దింపుతారన్న ప్రచారం కూడా జరుగుతోంది. ధర్మపురి: ఇక్కడ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రి కొప్పుల ఈశ్వర్ (బీఆర్ఎస్)కు ఈసారి గట్టి పోటీ ఉంది. ఇక్కడ నుంచి అడ్లూరి లక్ష్మణ్ (కాంగ్రెస్), మాజీ ఎంపీ గడ్డం వివేక్ (బీజేపీ) కూడా బరిలోకి దిగుతారని ప్రచారం సాగుతోంది. పెద్దపల్లి: ప్రస్తుత ఎమ్మెల్యే మనోహర్రెడ్డి (బీఆర్ఎస్)కి సొంత పార్టీ నుంచే తీవ్ర పోటీ ఉంది. ఎమ్మెల్యే టికెట్ కోసం.. సొంత పార్టీకే చెందిన ఎన్నారై నల్ల మనోహర్రెడ్డి, జెడ్పీటీసీ బొద్దుల లక్ష్మణ్ తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. కాంగ్రెస్ నేత విజయరమణారావు నుంచి వీరికి గట్టి పోటీ ఎదురవనుంది. బీజేపీ నుంచి గుజ్జుల రామక్రిష్ణారెడ్డి, దుగ్యాల ప్రదీప్రావు, గొట్టిముక్కల సురేశ్రెడ్డి టికెట్ ఆశిస్తున్నారు. బీఎస్పీ నుంచి దాసరి ఉష బరిలో ఉన్నారు. మంథని: ప్రస్తుత ఎమ్మెల్యే శ్రీధర్బాబు (కాంగ్రెస్)కు, పుట్ట మధు (బీఆర్ఎస్)కు ఈసారి హోరాహోరీ పోరు నడవనుంది. ఇక్కడ వీరిద్దరు మినహా మూడో పార్టీ అభ్యర్థులెవరూ ఇంతవరకూ ఆసక్తి చూపలేదు. -
అసత్యాలను వినసొంపుగా చెప్పారు
సాక్షి, హైదరాబాద్: మంత్రి కేటీఆర్ అసత్యాలను వినసొంపుగా చెప్పారని కాంగ్రెస్ ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీధర్బాబు వ్యాఖ్యానించారు. ప్రస్తుతం రాష్ట్రంలో తాజాగా చోటుచేసుకుంటున్న పరిణామాలను గమనిస్తే బీజేపీకి బీఆర్ఎస్, రాష్ట్ర ప్రభుత్వం మద్దతు తెలుపుతున్నట్టు కనిపిస్తోందన్నారు. తమ పార్టీ నేత భారత్ జోడో ప్రస్తావనను సభలో తేవడంతో పాటు దానిపై కేటీఆర్ ఇష్టంవచ్చినట్టు వ్యాఖ్యలు చేయడం దీనికి బలం చేకూరుస్తోందని, గతంలో రాష్ట్ర సర్కార్ను విమర్శించిన గవర్నర్ సైతం ప్రశంసల్లో ముంచెత్తడాన్ని బట్టి ఈ విషయం స్పష్టమవుతోందని పేర్కొన్నారు. శనివారం గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై శ్రీధర్బాబు మాట్లాడుతూ, ప్రతిపక్ష సభ్యులుగా తమకు ప్రభుత్వాన్ని విమర్శించే హక్కు ఉందని, తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీపై మంత్రి కేటీఆర్ ఇష్టారీతిన కామెంట్స్ చేయడం సరికాదన్నారు. రాష్ట్ర ప్రగతి గురించి గొప్పగా చెబుతూ రాష్ట్రానికి రూ.5 లక్షల కోట్లకుపైగా అప్పులు, కన్సూమర్ ప్రైస్ ఇండెక్స్లో అత్యధిక ధరలున్న రాష్ట్రంగా నిలవడం, నిరుద్యోగ సమస్య తీవ్రంగా ఉండడం, వ్యవసాయరంగ సమస్యలు, కరెంట్కోతలు వంటి వాటిని పూర్తిగా విస్మరించారని విమర్శించారు. తనతోపాటు వస్తే భూపాలపల్లి, పెద్దపల్లిలలో కరెంట్ కోతలున్న విషయాన్ని నిరూపిస్తామని, అసెంబ్లీలో ఆన్ రికార్డ్ ఈ అంశం చెబుతున్నామన్నారు. కాళేశ్వరంను అతిపెద్ద ప్రాజెక్ట్గా ప్రచారం చేస్తున్నారని, దానివల్ల ఎంతమందికి ప్రయోజనం కలిగింది, అదనంగా ఎన్ని ఎకరాలకు నీళ్లు ఇచ్చారో చెప్పాలని డిమాండ్ చేశారు. బడ్జెట్లో ఈ లిఫ్ట్స్కీంలకు, విద్య, వైద్యం తదితర కీలకరంగాలకు కేటాయింపులు చేయాలని డిమాండ్ చేశారు. పత్రికల్లో వచ్చిన వార్తలను బట్టి గతేడాది 107 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని చెప్పారు. గత ఎన్నికల సందర్భంగా నిరుద్యోగులకు రూ.3,016 భృతి ఇస్తామన్న హామీ అమలు ఏమైందని ప్రశ్నించారు. టీఎస్పీఎస్సీలో నమోదు చేసుకున్న నిరుద్యోగులే 26 లక్షల మంది ఉంటారన్నారు. -
కాళేశ్వరం ఫొటోలు గూగుల్లో పెట్టండి: శ్రీధర్బాబు
కాళేశ్వరం: ‘కాళేశ్వరం ప్రాజెక్టు ప్రపంచ దేశాల్లో గొప్ప కట్టడమని గూగుల్లో చూడాలని కేటీఆర్ ఎక్కడికెళ్లినా చెబుతున్నారు. ఇప్పుడు నీట మునిగిన కాళేశ్వరం ప్రాజెక్టులోని లక్ష్మీ పంప్హౌస్, అన్నారంలోని సరస్వతీ పంప్హౌస్, గ్రావిటీ కాల్వల ప్రస్తుత ఫొటోలను గూగుల్లో పెట్టండి’ అని మాజీ మంత్రి, ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీధర్బాబు మంత్రి కేటీఆర్కు సూచించారు. మంగళవారం ఆయన జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం పరిధిలోని లక్ష్మీ పంప్హౌస్లోకి తన కార్యకర్తలతో వెళ్లేందుకు రాగా కాళేశ్వరం ఎస్సైలు లక్ష్మణ్రావు, నరేశ్ అడ్డుకున్నారు. కొంత సమయం తర్వాత డీఈఈ సూర్యప్రకాశ్.. ఎమ్మెల్యే వద్దకు చేరుకుని అనుమతి లేదని, ఉన్నతాధికారుల ఆదేశాలున్నాయని, పంప్హౌస్ బాగానే ఉందని చెప్పి వెళ్లారు. ఈ సందర్భంగా శ్రీధర్బాబు మాట్లాడుతూ ఇంజనీరింగ్ వైఫల్యంతో నీట మునిగిందని, మరమ్మతులు చేస్తున్నట్లు ఇంజనీర్లు చెబుతున్నారని, కానీ నిర్వహణా లోపం కొట్టొచ్చినట్లు కనిపిస్తోందన్నారు. ప్రజాధనాన్ని వృథా చేసి, నాసిరకం పనులు చేయడంతో అవినీతి జరిగిందని మండిపడ్డారు. క్లౌడ్ బరస్ట్పైన సీఎం కేసీఆర్కు ఏమైనా సమాచారం ఉంటే కేంద్ర నిఘా బృందాలకు అందించాలన్నారు. -
ఏఐసీసీ కార్యదర్శిగా దుద్దిళ్ల శ్రీధర్బాబు
సాక్షి, న్యూఢిల్లీ: ఏఐసీసీ కార్యదర్శిగా ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీధర్బాబును కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ నియమించారు. ఈ మేరకు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ శనివారం ఉత్తర్వులు జారీచేశారు. శ్రీధర్బాబుతో పాటు మరో నలుగురు ఏఐసీసీ కార్యాదర్శులకు కర్ణాటక బాధ్యతలు అప్పగించారు. -
తెలంగాణ కాంగ్రెస్లో మరో తుపాన్..
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర కాంగ్రెస్లో మరో తుపాన్ మొదలైంది. నేతల అసమ్మతి మరోమారు బయటపడింది. టీపీసీసీ అధ్యక్షుడు, ఎంపీ ఎ.రేవంత్రెడ్డి వ్యవహారశైలిపై చర్చించేందుకు పలువురు సీనియర్ కాంగ్రెస్ నేతలు సోమవారం హైదరాబాద్లో సమావేశమయ్యారు. మాజీ మంత్రి మర్రి శశిధర్రెడ్డి నివాసంలో కాంగ్రెస్ విధేయుల ఫోరం పేరుతో జరిగిన ఈ సమావేశానికి ఎమ్మెల్యేలు శ్రీధర్బాబు, జగ్గారెడ్డి, మాజీ ఎంపీ వి. హనుమంతరావు, మాజీ మంత్రులు పొన్నాల లక్ష్మయ్య, గీతారెడ్డిలతోపాటు సీనియర్ కాంగ్రెస్ నాయకులు కోదండరెడ్డి, గోపిశెట్టి నిరంజన్, కమలాకర్రావు, శ్యాంమోహన్ తదితరులు హాజరయ్యారు. దాదాపు 3 గంటలకుపైగా జరిగిన ఈ సమావేశంలో రాష్ట్ర పార్టీలో జరుగుతున్న పరిణామాలు, రేవంత్రెడ్డి వ్యవహారశైలి, ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తు గురించి వారు చర్చించినట్టు తెలిసింది. ముఖ్యంగా టీపీసీసీ అధ్యక్షుడి హోదాలో రేవంత్రెడ్డి పనితీరు పార్టీ ఐక్యతను దెబ్బతీసేలా ఉందని నేతలు అభిప్రాయపడినట్టు సమాచారం. రేవంత్ ఏకపక్ష నిర్ణయాలు, ప్రకటనలతో పార్టీలోని సీనియర్లతోపాటు ముఖ్యనేతలందరినీ అవమానపరిచే తరహాలో వ్యవహరిస్తున్నారని పలువురు నేతలు ఈ సమావేశంలో పేర్కొన్నట్టు తెలిసింది. ఈ క్రమంలోనే రేవంత్ వన్మ్యాన్ షోను కట్టడి చేయాలని కోరుతూ ‘కాంగ్రెస్ పార్టీని కాపాడుకుందాం’ పేరిట.. త్వరలోనే నేతలందరూ ఢిల్లీకి వెళ్లాలని నిర్ణయించినట్టు సమాచారం. రేవంత్ను కట్టడి చేయాలని అధిష్టానం పెద్దలను కోరాలని భావిస్తున్నట్టు తెలిసింది. పార్టీ బలోపేతం కోసమే..: శ్రీధర్బాబు మర్రి శశిధర్రెడ్డి నివాసం నుంచి నేతలు బయటికి వచ్చిన సమయంలో ఎమ్మెల్యే శ్రీధర్బాబు మీడియాతో మాట్లాడారు. అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో ఒకసారి తన నివాసానికి వచ్చి వెళ్లాలని సీనియర్ నేత మర్రి శశిధర్రెడ్డి ఆహ్వానించారని చెప్పారు. తమ భేటీలో ప్రత్యేకత ఏమీ లేదని, ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలపై చర్చించామని చెప్పారు. అయితే తమ సమావేశంలో పార్టీ బలోపేతం కోసం చర్చ జరిగిందని శ్రీధర్బాబు పేర్కొనడం గమనార్హం. కాగా పార్టీలో పరిణామాలు, సీనియర్ల విషయంలో జరుగుతున్న అవమానాలపై చర్చించామని మాజీ ఎంపీ వీహెచ్ తెలిపారు. అన్ని విషయాలను అధిష్టానం దృష్టికి తీసుకెళ్తామన్నారు. పార్టీకి పూర్వవైభవం రావాలి: మర్రి శశిధర్రెడ్డి కాంగ్రెస్లో సంస్థాగత మార్పులు జరగాలని పార్టీ వర్కింగ్ కమిటీ సోనియా గాంధీని కోరిందని.. వచ్చే ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని పార్టీ ఏవిధంగా ప్రజల విశ్వాసం పొందుతుందనే దానిపై నిర్ణయాలు ఉండాలని సూచించిందని మాజీ మంత్రి మర్రి శశిధర్రెడ్డి చెప్పారు. రాష్ట్రంలోనూ పార్టీకి పూర్వ వైభవం రావాలన్నారు. పార్టీ వ్యవహారాలు చూస్తున్నవారు పార్టీకి అనుబంధంగా ఉన్నారా లేదా అనేది చూడాలని.. దీనిపై తాము చర్చించామని వెల్లడించారు. అన్నీ మీడియాకు చెప్పలేం: జగ్గారెడ్డి ఆదివారం ఢిల్లీలో సోనియా గాంధీ సమావేశం ఏర్పాటు చేసిన అంశంపై చర్చించామని.. బయట జరుగుతున్న ఊహాగానాలు సరికాదని ఎమ్మెల్యే జగ్గారెడ్డి చెప్పారు. పార్టీతో కొన్ని సంవత్సరాలుగా అనుబంధం కొనసాగుతున్న నేతలం కలిసి మాట్లాడుకున్నామని.. సోనియాగాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ నాయకత్వం ఉండాలని కోరుకున్నామని తెలిపారు. వీహెచ్ చెప్పిన అంశాలు చర్చకు వచ్చాయని, కానీ అవన్నీ మీడియాకు చెప్పలేనని పేర్కొన్నారు. కాంగ్రెస్కు రెట్టింపు బలం కోసం ఏ విధంగా పనిచేయాలనే దానిపై చర్చించామన్నారు. రేవంత్ ‘పాదయాత్ర’ ప్రకటనతో మళ్లీ దుమారం టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి ఆదివారం కొల్లాపూర్లో జరిగిన సభలో.. తాను రాష్ట్రంలోని 119 నియోజకవర్గాలు, 33 జిల్లాల్లో తిరుగుతానని, పాదయాత్ర చేసి ప్రజల కష్టాలను తెలుసుకుంటానని ప్రకటించడం రాష్ట్ర కాంగ్రెస్ వర్గాల్లో దుమారం రేపుతోంది. రాష్ట్రంలోని పార్టీ ముఖ్య నాయకులతో చర్చించకుండా, అటు టీపీసీసీ కార్యవర్గంలోగానీ, రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశంలోగానీ మాట్లాడకుండా, అధిష్టానానికి చెప్పి అనుమతి తీసుకోకుండా రేవంత్ ఈ ప్రకటన చేశారని.. ఇది ఇతర నేతలను అవమానించడమేనని పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. సోమవారం కాంగ్రెస్ సీనియర్ నేతల భేటీకి కూడా ఈ ప్రకటనే కారణమని అంటున్నారు. భట్టి కూడా చేస్తున్నా.. సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క పీపుల్స్ మార్చ్ పేరుతో మధిర నియోజకవర్గంలో పాదయాత్ర చేస్తున్నారు. ఆయన కూడా పార్టీలో ఎలాంటి చర్చ లేకుండా పాదయాత్ర చేపట్టారని.. అయితే ఎమ్మెల్యే హోదాలో తన నియోజకవర్గానికి మాత్రమే పరిమితమై యాత్రలు చేయడంలో ఎలాంటి తప్పు లేదని కొందరు నేతలు పేర్కొంటున్నారు. మరోవైపు భట్టి పాదయాత్ర చేస్తుంటే లేనిది రేవంత్ చేస్తే తప్పేంటని మరికొందరు వాదిస్తున్నారు. ‘పాదయాత్ర’లకు పోటీ వాస్తవానికి రాష్ట్రవ్యాప్తంగా పాదయాత్ర చేయాలనే ఆలోచన కాంగ్రెస్ పార్టీలో ఎప్పట్నుంచో ఉంది. అదే సమయంలో యాత్రకు నాయకత్వం వహించేందుకు పోటీ పడుతున్న నేతల జాబితా కూడా చాంతాడంత ఉంది. ఈ నేపథ్యంలోనే పార్టీ అధిష్టానంతో చర్చించి పాదయాత్ర చేసే నేతల పేర్లను ప్రకటించాకే రాష్ట్రవ్యాప్త యాత్ర చేపట్టాలనే అభిప్రాయం పార్టీవర్గాల్లో ఉంది. అందులో భాగంగానే అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు ముందు జరిగిన సీఎల్పీ సమావేశంలో పాదయాత్ర అంశంపై చర్చించారు. పార్టీ జిల్లా అధ్యక్షులు, నియోజకవర్గాల ఇన్చార్జుల అభిప్రాయం సేకరించాలని భావించినా.. సమయాభావం వల్ల సాధ్యం కాలేదని తెలిసింది. ఇలాంటి సమయంలోనే రాష్ట్రంలో కాంగ్రెస్ ‘సర్వోదయ పాదయాత్ర’ప్రారంభం కావడం, తెలంగాణలో 26 రోజుల పాటు జరిగే ఈ యాత్రలో ఏదో ఒక రోజు రాహుల్గాంధీ పాల్గొంటారన్న అంశం కీలకంగా మారింది. ఈ సందర్భంగా రాష్ట్ర కాంగ్రెస్ నాయకత్వంతో రాహుల్ సమావేశమై.. పాదయాత్ర చేసేవారిని ఫైనల్ చేస్తారనే ప్రచారం జరిగింది. కానీ ఇవేమీ జరగకుండానే రేవంత్రెడ్డి కొల్లాపూర్ సభలో పాదయాత్ర ప్రకటన చేయడం కాంగ్రెస్ వర్గాల్లో హాట్టాపిక్గా మారింది. ఈ వ్యవహారం ఎంత దూరం వెళ్తుందో తెలియడం లేదని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. -
మంథని లిఫ్ట్ పనుల్లో అలసత్వం ఎందుకు?
సాక్షి, హైదరాబాద్: మంథని లిఫ్ట్ ఇరిగేషన్ పథకం ద్వారా సాగునీరు అందిస్తామని ప్రభుత్వం పదేపదే చెప్తున్నా పనులు ఎందుకు ముందుకు సాగడం లేదని మంథని ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీధర్బాబు ప్రశ్నించారు. సోమవారం అసెంబ్లీ కమిటీ హాల్లో పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ అక్బరుద్దీన్ ఒవైసీ అధ్యక్షతన కమిటీ సమావేశం జరిగింది. కమిటీ సభ్యులు రవీంద్రనాయక్, విఠల్రెడ్డి, అధికారులు పాల్గొన్న ఈ సమావేశంలో సాగునీటి గురిం చిన చర్చ జరిగింది. జీవో 111కు సంబంధించి హిమాయత్సాగర్, ఉస్మాన్సాగర్ జలాశయాల పరీవాహక ప్రాంతంపై కమిటీ అక్బరుద్దీన్ వివరాలు కోరారు. దీంతోపాటు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని చెరువుల పరిస్థితి, మిషన్ కాకతీయలో అసంపూర్తిగా ఉన్న పనులను పూర్తి చేసేందుకు తీసుకున్న చర్యల గురించి పీఏసీ చర్చించింది. సాగునీటి ప్రాజెక్టుల గేట్ల నిర్వహణ సరిగా లేదంటూ వార్తలు వస్తున్న నేపథ్యంలో కడెం, నాగార్జునసాగర్, సరళాసాగర్, మూసీ ప్రాజె క్టు మరమ్మతు, నిర్వహణ వివరాలను కమిటీ చైర్మన్ కోరారు. కాగా కాళేళ్వరం ప్రాజెక్టు లాగా ఇతర ప్రాజెక్టుల పనులు త్వరితగతిన ఎందుకు పూర్తి చేయడం లేదని శ్రీధర్బాబు ప్రశ్నించారు. ఏఐబీపీ కింద ఎస్ఆర్ఎస్పీ రెండో దశ, దేవాదుల వరద కాలువ పనుల్లో ఆలస్యం, రాయలసీమ ఎత్తిపోతల పథకంపై ప్రభుత్వ నిర్లక్ష్యంపై ప్రశ్నిం చారు. కాగా, హుజూరాబాద్ ఉపఎన్నికలో పార్టీ అభ్యర్థిగా టీపీసీసీ ఎవరిని నిర్ణయించినా వారి గెలుపు కోసం కృషి చేస్తానని శ్రీధర్బాబు అన్నారు. -
ఈ ఎమ్మెల్యే ఎవరో.. ఇవేంటో చెప్పగలరా?
సాక్షి, మహాముత్తారం: జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని మారుమూల ప్రాంతమైన సింగంపల్లి, కనుకునూర్ గ్రామాల్లో కరోనా బాధితులకు నిత్యావసర సరుకులు పంపిణీ చేయడానికి వెళ్తున్న ఓ వాహనం మంగళవారం వాగులో దిగబడిపోయింది. ఆ సమయంలో అదే దారిలో మరో వాహనంలో వెళ్తున్న మంథని ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీధర్బాబు ఆ దృశ్యాన్ని చూసి ఆగిపోయారు. తన కార్యకర్తలతో కలసి ఆయన వాగులోకి దిగి వాహనం బయటకొచ్చేలా సహకరించారు. ఈ ఫొటో చూడగానే వరి కోశాక మిగిలిన కొయ్య కాళ్ల మాదిరి కనిపిస్తున్నాయి కదూ..! కానీ, ఇవి గడ్డి మొక్కలకు సంబంధించి బెండు కర్రలు. పాడి పశువులకు పోషకాలను మెండుగా అందించే సూపర్ నేపియర్ గడ్డి పెంపకంపై రైతులు ఇటీవల ఆసక్తి చూపుతున్నారు. మొదట ఏపీకే పరిమితమైన ఈ రకం గడ్డి పెంపకం కరీంనగర్, సిద్ధిపేట జిల్లాలకు విస్తరించగా.. ప్రస్తుతం జనగామ జిల్లా చిల్పూరు మండలం కృష్ణాజీగూడెం గ్రామానికి చెందిన రైతు సాదం రమేష్ కూడా నాటాడు. ఇది విత్తనంగా కాకుండా రూ.1కి ఒకటి చొప్పున జానెడు పొడవుతో దొరికే బెండుకర్రలు నాటాల్సి ఉంటుందని ఆయన తెలిపాడు. పోషకాలు ఎక్కువగా ఉండే ఈ గడ్డి.. పాడి పశువులకు వేయడం వల్ల మొక్కజొన్న చొప్పలా మెత్తగా ఉండటంతో ఇష్టంగా తింటాయని, పాల ఉత్పత్తి కూడా పెరుగుతోందని వెల్లడించారు. – చిల్పూరు (జనగామ) -
కలకలం రేపుతున్న ఆడియో టేపు
-
న్యాయవాదుల హత్య కేసు: వామన్రావు ఆడియో వైరల్
సాక్షి, హైదరాబాద్: పెద్దపల్లి జిల్లాలో దారుణ హత్యకు గురైన న్యాయవాది గట్టు వామన్ రావు ఆడియో సోషల్ మీడియాలో వైరల్ కావడం కలకలం సృష్టిస్తుంది. మంథని ఎమ్మెల్యే శ్రీధర్ బాబు పై గట్టు వామన్ రావు మరో వ్యక్తితో ఫోన్ లో మాట్లాడుతు చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. శ్రీధర్ బాబు తనను అవమానపర్చాడని, నీతిలేని వ్యక్తి అని వేరే వ్యక్తితో వామన్ రావు చెప్పుకొచ్చాడు. 20 ఏళ్ళుగా దుద్దిళ్ల శ్రీపాద రావు కుటుంబానికి దూరంగా ఉన్నానని, నేనంటే ఏమిటో చూపిస్తానని తెలిపారు. నీవు పోటీ చేస్తే నాకు ఇబ్బంది అవుతుందని శ్రీధర్ బాబు శరణు కోరాడని, ఆయన అనుభవిస్తున్న పదవి తాను పెట్టిన బిక్షే అంటూ వామన్ రావు కామెంట్ చేశారు. పుట్ట మధు, శ్రీధర్ బాబు బాధితులు ఎందరో ఉన్నారని వారంతా మీకు అండగా నిలుస్తారని మరో వ్యక్తి వామన్ రావుతో చెప్పారు. చాలా రోజుల క్రితం రికార్డు అయిన ఆడియో ఇప్పుడు బయటికి రావడం అందరినీ ఆశ్చర్యానికి ఆందోళనకు గురిచేస్తోంది. చదవండి: న్యాయవాదుల హత్య: పోలీసులపై విమర్శలు సంచలన విషయాలు వెల్లడించిన బిట్టు శ్రీను! -
ఈ ముఖ్యమంత్రికి సోయి లేదు: భట్టి
సాక్షి, సత్తుపల్లి : ముఖ్యమంత్రి కేసీఆర్ కు సోయి, జ్ఞానం లేవని, ఎవరు చెప్పినా వినే రకం కాదని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క తీవ్రస్థాయిలు విమర్శలు చేశారు. నోటికి వచ్చినట్లు బూతులు మాట్లాడే ముఖ్యమంత్రి కేసీఆర్ ఒక్కరేనని భట్టి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఎవరినైనా కొనగలనన్న నమ్మకం, మూర్ఖత్వం ఉన్న కేసీఆర్ కు రైతులు, ప్రజలు కర్రుకాల్చి బుద్ధ వచ్చేలా వాతలు పెట్టాలన్నారు.రైతులతో ముఖాముఖీలో భాగంగా సత్తుపల్లి నియోజకవర్గం తల్లాడలో రైతులతో భట్టి సమావేశం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో భట్టి విక్రమార్కతో పాటు మాజీ మంత్రి సంభాని చంద్రశేఖర్, ఎమ్మెల్యే శ్రీధర్ బాబు, మాజీ ఎంపీ వీ హనుమంతరావు, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు పువ్వాళ్ల దుర్గాప్రసాద్, మాజీ ఎమ్మెల్సీ పోట్ల నాగేశ్వరరావు, జిల్లా బీసీ సెల్ అధ్యక్షుడు పుచ్చకాల వీరభద్రం, జిల్లా కిసాన్ సెల్ అధ్యక్షుడు మొక్కా శేఖర్ గౌడ్, తదితర స్థానిక నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. దేశమంతా వ్యవసాయ రంగం సంక్షోభంలో ఉందన్నారు. రైతాంగ సమస్యలు వదిలిస్తే.. దేశవ్యయసాయ రంగం అగమ్యగోచరంలా తయారవుతందన్నారు. ఈ పరిస్థితులను ముందుగానే గమినించి ఉత్తర భారత రైతులు వారి ప్రాణాలు ఫణంగా పెట్టి.. 55 మంది చనిపోయినా.. పోరాటం చేస్తున్నారని భట్టి వివరించారు. కేంద్రంలోని మోదీ ప్రభుత్వం తెచ్చిన మూడు నల్ల చట్టాలు దేశానికి అత్యంత ప్రమాదకరమని భట్టి రైతులకు చెప్పారు. దేశాన్ని కాపాడేది జవాన్.. దేశ ప్రజలకు అన్నం పెట్టేది కిసాన్.. అని కాంగ్రెస్ పార్టీ.. ఈ ఒక్క నినాదంతోనే తమ విధానం స్పష్టం చేసిందని అన్నారు. మోదీ విధానాలతో రైతుల పరిస్థితి, భవిష్యత్ ఆందోళణకరంగా మారుతుందని అన్నారు. దేశంలో 95 శాతం మంది రైతులు 5 ఎకరాల లోపు వారేనని.. వారు తమ పంటను ఎక్కడైనా అమ్ముకోవచ్చంటే.. ఎక్కడ అమ్ము కుంటారని భట్టి ప్రశ్నించారు. ఇక్కడ స్థానికంగా పండించే మిర్చి, పత్తి, పసుపు పంటను మండల కేంద్రానికి తీసుకెళ్లి అమ్ముకవడానికి ఇబ్బందులు పడుతుచాన్న సమయంలో.. కల్లాల్లోనే అమ్ముకుంటున్నారని చెప్పారు. ఈ పరిస్థితుల్లో ఏ మహారాష్ట్రకో, గుజరాత్ కో పంటను తీసుకెళ్లి రైతు అమ్ముకునే పరిస్థితులు ఉన్నాయా? అని ప్రశ్నించారు. ఏ నినాదం వెనుక.. ఎవరి ప్రయోజనాలు ఉన్నాయన్న సంగతిని కాస్త లోతుగా ఆలోచిస్తే.. ఈ చట్టాలు రైతుల కోసం కాదు.. కేవలం బహుళజాతి సంస్థల కోసమో అన్న వాస్తవం తెలుస్తుందన్నారు. దేశ వ్యవసాయ రంగం మొత్తం కార్పరేట్ ల చేతుల్లో పెట్టడం కోసమే ఈ చట్టాలు తీసుకువచ్చారన్నది స్పష్టమైన అంశమని చెప్పారు. ఇది నిజంగా రైతుల కోసమే తెచ్చిన చట్టాలు అయితే.. వారు వద్దని ఢిల్లీ సరిహద్దులో ప్రాణాలను లెక్కచేయకుండా దీక్ష చేస్తుంటే.. వెంటనే వాటిని వెనక్కు తీసుకునేవారినన్నారు. కాంట్రాక్టు ఫార్మింగ్ తో భూములను, పంటలను కార్పొరేట్ చేతుల్లో పెట్టేందుకు కుట్ర చేస్తున్నారని అన్నారు. అంబానీ, అదానీ వంటి వారితో సామాన్య రైతులు పోరాటం చేయలేరని... అన్నారు. ఆహర ధాన్యాలు అందరికీ అందుబాటులో ఉంచాలని నాటి కాంగ్రెస్ ప్రభుత్వం ఎసెన్షియల్ కమెడిటీస్ చట్టం తీసుకువచ్చిందని.. దానివల్ల ధరల నియంత్రణ ఉంటుందని అన్నారు. కానీ దానిని ఎత్తేయడం వల్ల ఎవరైనీ ఎంతైన ఆహార పదార్థాలను, పంటలను గోడౌన్ల్లో దాచేస్తే.. అవి అందక.. ధరలు ఆకాశంలోకి వెళ్లే ప్రమాదం ఉంది. దీని వల్ల ఇటు వినియోగదారుడు.. అటు.. రైతులు తీవ్రంగా నష్టపోతారని భట్టి ప్రజలకు వివరించారు. ఇప్పటికే దేశవ్యాప్తగా అనే ఎఫ్.సీ.ఐ గోడౌన్లను అదానీ సంస్థకు కేంద్రం లీజుకు ఇచ్చిందని చెప్పారు. ఈ మూడు చట్టాలవల్ల దేశ రైతులకు అత్యంత ప్రమాదకరమని చెప్పారు. దేశ స్వాతంతరం వచ్చిన తరువాత గణతంత్ర దినోత్సవం నాడు.. కేవలం సైనికుల కవాతు మాత్రమే ఉండేది.. కానీ మొదటిసారు.. రైతులు బటయకు వచ్చి కవాతు చేశారుని చెప్పారు. ఈ పరిస్థితుల్లో రాజకీయాలకు అతీతంగా రైతులంతా పోరాటం చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందని భట్టి ఇది దుస్తితి.. మనమం విక్రమార్క చెప్పారు. అప్పుడే పాలకులు దిగివస్తారని చెప్పారు. మోడీ, కేసఆర్ లు కేవలం బహుళజాతి సంస్థల కోసం మాత్రమే పని చేస్తున్నారు.. బీజేపీ స్వాతంత్ర పోరాటంలో పాల్గొనలేదు.. ప్రజలకు సేవ చేయాలన్న ఆలోచన.. వారికి లేదని చెప్పారు. మోడీ, కేసీఆర్ లకు ప్రజల సంక్షేమం అవసరం లేదని.. కేవలం కార్పొరేట్ల కోసమో పనిచేస్తున్నారని ఆగ్రహంగా చెప్పారు. వారిద్దరికీ అధికారం తప్ప మరేమీ అవసరం లేదని చెప్పారు. అదే సమయంలో ఈ మధ్య మద్దతు ధర ఉన్న సమయంలో.. మొక్కలు క్వింటాలకు రూ.1800 ధర పలికింది.. అదే మద్దతు ధర లేకపోతే.. వెంటనే రూ.900 కి పడిపోయింది. దీంతో రైతులకు క్వింటాలుకు రూ. 1000 నష్టపోయిన పరిస్థితి అని చెప్పారు. మద్దతు ధర లేకపోతే ఒక్క పంటకే ఇలా ఉంటే.. మొత్తంగా అసలు మద్దతు ధర లేకపోతే.. రైతుల పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుందో ఊహకే అందడం లేదని భట్టి విక్రమార్క చెప్పారు. ఢిలీ సరిహద్దుల్లో 85 రోజలుగా జరగుతున్న రైతు ఉద్యమం గురించి ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి. కొనుగోలు కేంద్రాలు ఎత్తేయాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. వ్యవసాయాన్ని పూర్తిస్థాయిలో కార్పొరేట్ చేసేలా కేంద్రం ప్రయత్నిస్తోంది. మార్కెట్ యార్డులను ఎత్తేసేలా కుట్రలు చేస్తున్నారు. దేశంలో 60 శాతం ప్రజలు వ్యవసాయం మీద ఆధారపడి ఉన్నారు.. వారికి మద్దతు ధర లేకపోతే.. ఇబ్బందులు ఎదుర్కొంటారు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం గిట్టుబాటు, మద్దతు ధర కల్పించింది. - దుద్దిళ్ల శ్రీధర్ బాబు, మంథని ఢిల్లీలో రైతులు మూడు నెలల నుంచి నల్ల చట్టాలకు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నారు. ఇప్పటికీ దాదాపు 53 మంది చనిపోయినా.. రైతులు పోరాటం ఆపడం లేదు. రైతులకు కనీస మద్దతు ధర లేకపోతే.. రైతులు తీవ్రంగా నష్టపోతారు. కేసీఆర్ కూడా మోదట చట్టాలను వ్యతిరేకించినా.. తరువాత యూటర్న్ తీసుకున్నాడు. ఈ బిల్లు వల్ల కార్పొరేట్లకు తప్ప.. రైతులకు ఎటువంటి ప్రయోజనం ఉండదు. - వి.హనుమంతరావు, మాజీ ఎంపీ భట్టి విక్రమార్క మల్లు నేత్రుత్వంలో చేస్తున్న రైతు వ్యతిరేక చట్టాలపై సీఎల్పీ బ్రుందం చేస్తున్న పోరాటం చాలా గొప్పది. ఈ పోరాటంలో భట్టి గారికి మేము అండగా ఉంటాం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతులను మోసం చేశాయి. కేసీఆర్.. చెప్పేవన్నీ అబద్దాలే. పేదలకు సేవచేసింది కాంగ్రెస్ మాత్రమే. మాట తప్పిన వాళ్లను ఏమి చేయాలో ప్రజలే నిర్ణయిస్తారు. సంభాని చంద్రశేఖర్, మాజీ మంత్రి -
'అప్పులు చేయడానికి అవసరమైన బిల్లుల కోసమే అసెంబ్లీ'
సాక్షి, హైదరాబాద్: అప్పులు చేయటానికి అవసరమైన బిల్లులు పాస్ చేయటానికే కేసీఆర్ అసెంబ్లీ సమావేశాలను ఉపయోగించుకున్నారని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క మండిపడ్డారు. అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద ఆయన మాట్లాడుతూ.. 'శాసనసభలో ప్రభుత్వం సమస్యలపై మాట్లాడలేకే పారిపోయింది. బీఏసీలో 28వ తేదీ తర్వాత కూడా అసెంబ్లీని జరపుతామన్నారు. అయితే కాంగ్రెస్కు సమాధానం చెప్పలేక పారిపోయారు. ఏపీ ప్రభుత్వం రోజుకు 12 టీఎంసీలు శ్రీశైలం నుండి వాడుకుంటోంది. దీనివల్ల తెలంగాణలో భారీ నీటికొరత ఏర్పడింది. టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా ప్రవర్తిస్తోంది. ప్రతిపక్షం లేకుండా చేయాలనే ఉద్దేశంతో పనిచేస్తోంది. నిరుద్యోగ సమస్యపై మాట్లాడనివ్వలేదు. వర్షాలు, ఫీల్డ్ అసిస్టెంట్లు, ప్రయివేట్ టీచర్లు, చేనేత కార్మికులు, పేదల సమస్యలు, అనారోగ్య సమస్యలు ఎన్నో ఉన్నాయి. రాష్ట్రంపై 6లక్షల కోట్ల అప్పులు మోపడానికే కేసీఆర్ సభను ఉపయోగించుకున్నారు. 100 మంది ఉన్న టీఆర్ఎస్ సభ్యులను ఆరుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలం ఎదుర్కొన్నాం. హైదరాబాద్ నగరాన్ని విశ్వనగరంగా అభివృద్ధి చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీదే. బీహెచ్ఈఎల్, రింగ్ రోడ్డు, హాస్పిటళ్లు, ఎయిర్ పోర్టు అన్నీ కాంగ్రెస్ నిర్మించినవే. దళితులకు మూడెకరాల భూమిని పంచినపుడే అంబేద్కర్కి అసలైన నివాళి' అని అన్నారు. (ట్రాఫిక్ జరిమానాలు ఆపేయాలి: జగ్గారెడ్డి) ప్రతిపక్షాల గొంతు నొక్కుతున్నారు- ఎమ్మెల్యే సీతక్క అసెంబ్లీకి ముందు కేసీఆర్ ఆర్భాటపు ప్రకటనలు చేస్తున్నారు. కాంగ్రెస్ సభ్యుల్ని అవమానకరంగా మాట్లాడారు. కరోనా టెస్టులు చాలా తక్కువ చేశారు. జీహెచ్ఎంసీలో కాంగ్రెస్ చేసిన అభివృద్ధి చెప్పనివ్వలేదు. పబ్బులు, డ్రగ్స్ విషయంలో హైదరాబాద్ పేరు ముందు ఉంటుంది. డ్రగ్స్ విషయంలో ప్రభుత్వం అంబాసిడర్గా పెట్టుకున్న రకుల్ పేరు వినిపిస్తోంది. మంచినీళ్లు ఇవ్వలేని పరుస్థితిలో ప్రభుత్వం ఉన్నది. ప్రతిపక్షాల గొంతు నొక్కుతున్నారు' అని సీతక్క పేర్కొంది. (శివ బాలాజీ ఫిర్యాదుపై హెచ్ఆర్సీ స్పందన) ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు- దుద్దిళ్ల శ్రీధర్ బాబు 8రోజుల్లోని 31గంటల్లో 24 గంటలు సీఎం, మంత్రులు, అధికార పార్టీ ఎమ్మెల్యేలు మాట్లాడారు. వారి మిత్రపక్షం ఎంఐఎంకు 3 గంటలు మాట్లాడించారు. కాంగ్రెస్కు ఇచ్చిన 3 గంటల్లో అనేకసార్లు అడ్డు తగిలారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు. రేపటి నుంచి వర్చువల్ అసెంబ్లీ సెషన్ పెట్టాలి. ప్రతిపక్షం అడిగే ప్రశ్నలకు ముఖ్యమంత్రి సమాధానం చెప్పాలి. -
కొత్త సచివాలయం అవసరమా?
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రంలో కరోనా వైరస్ తో జనం అల్లాడుతుంటే ఆఘమేఘాల మీద పాత సచివాలయం కూల్చివేయాల్సిన అవసరం ఏమొచ్చిందని తెలంగాణ ప్రభుత్వాన్ని కాంగ్రెస్ పార్టీ ప్రశ్నించింది. ముఖ్యమంత్రి కేసీఆర్కి ప్రజల బాధలకంటే తన మొండి పట్టుదలే ప్రాధాన్యతగా ఉందని పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్కుమార్రెడ్డి, మాజీ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు మంగళవారం మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో విమర్శించారు. కరోనా సంక్షోభంతో తీవ్రమైన ఆర్థిక ఇబ్బందుల్లో ఉండి ఉద్యోగులకు జీతాలు సక్రమంగా ఇవ్వడం లేదని, రైతులకు రుణమాఫీ డబ్బులు లేవని.. ఇలాంటి పరిస్థితుల్లో కొత్త సచివాలయం అవసరమా అని ప్రశ్నించారు. (తెలంగాణ సచివాలయం కూల్చివేత ప్రారంభం) తెలంగాణలో ఇంతటి దుర్భర పరిస్థితులుంటే ముఖ్యమంత్రి కనీసం వైద్యం పైన సమీక్ష కూడా చేయకుండా ఎక్కడో చీకటిలో ఉన్నారని ధ్వజమెత్తారు. ముఖ్యమంత్రి దేనికి ప్రాధాన్యత ఇస్తున్నారో ప్రజలు గమనించి ప్రశ్నించాలని కోరారు. పాత సచివాలయంలో కోవిడ్ ఆసుపత్రి ఏర్పాటు చేయమని తాము కోరామని, 10 వేల మంది రోగులకు అక్కడ వైద్య సౌకర్యాలు కల్పించే అవకాశం ఉండేదని పేర్కొన్నారు. సీఎం తన మొండి వైఖరితో జనం ప్రాణాలు తీస్తున్నారని, మొదటి నుంచి కరోనా విషయంలో తప్పుడు విధానాలనే ఆయన అవలంభిస్తున్నారని మండిపడ్డారు. సీఎం మొండివైఖరి కారణంగానే రాష్ట్రం దుర్భర పరిస్థితులను ఎదుర్కొంటోందని విమర్శించారు. ఇప్పటికైనా కేసీఆర్ ప్రజా సంక్షేమం పైన దృష్టి సారించాలని హితవు పలికారు. కూల్చివేత దారుణం: జీవన్ రెడ్డి సచివాలయాన్ని కేసీఆర్ ఫాంహౌస్ దగ్గర ఔటర్ రింగ్ రోడ్డు మీద కట్టుకోవాలని కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్రెడ్డి అన్నారు. ఊరి వాడికి వారి ఆపద వస్తే... ఊసు గళ్ళ వాడికి దోమల ఆపద అన్నట్టుగా తెలంగాణ ప్రభుత్వ తీరు ఉందని ఎద్దేవా చేశారు. వెయ్యి కోట్ల రూపాయల విలువ చేసే సచివాలయ భవనాలు కూల్చివేయడం దారుణమని ఆయన వ్యాఖ్యానించారు.
Pagination
మళ్లీ చరిత్ర సృష్టిస్తున్నాం
చేతులు కాలాక ఆకులు పట్టుకున్న ఈసీ
ఓటీటీలోకి వచ్చేసిన మిడిల్ క్లాస్ మూవీ.. స్ట్రీమింగ్ అందులోనే?
వరల్డ్కప్ జట్టులో నో ఛాన్స్: రోహిత్పై కేఎల్ రాహుల్ కామెంట్స్ వైరల్
ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు అలెర్ట్.. మారిన విత్ డ్రా నిబంధనలు
ఎన్ఆర్ఐతో విధి ఆడిన వింత నాటకం.. విషాదం
స్వాతి మలివాల్ డ్రామా.. బీజేపీ కుట్రే ఇదంతా: సంచలన వీడియో బయట పెట్టిన ఆప్
Heeramandi Jewellery ఎవరీ సినిమా నగల స్పెషలిస్ట్ జంట
రాములమ్మ ఆలోచనలు ఏంటి? కాంగ్రెస్లో కొనసాగుతారా.. లేక?
దిగ్గజ బ్యాంకర్ 'నారాయణన్ వాఘుల్' కన్నుమూత
వేగంగా దర్యాప్తు జరిపి, నిందితులను అరెస్టు చేస్తాం: ఐజీ వినీత్ బ్రిజ్లాల్
‘‘స్వాతి మలివాల్కు సీఎం అపాయింట్మెంట్ లేదు’’
పంజాబ్ కింగ్స్ కెప్టెన్గా జితేష్ శర్మ..
Summer special థండయ్ కుల్ఫీ రెసిపీ
రోహిత్తో నీతా అంబానీ సీరియస్ డిస్కషన్.. వీడియో వైరల్
Music Shop Murthy: ఆకట్టుకుంటున్న రాహుల్ సిప్లిగంజ్ ‘అంగ్రేజీ బీట్’ సాంగ్
Serial Actor Chandu: నేను పిచ్చివాడినైపోతా.. నటుడు చందు చివరి మాటలు వైరల్
200 లోక్సభ స్థానాల్లో గెలవడం కష్టమే.. దీదీ ఎద్దేవా
తప్పక చదవండి
- ‘‘స్వాతి మలివాల్కు సీఎం అపాయింట్మెంట్ లేదు’’
- 200 లోక్సభ స్థానాల్లో గెలవడం కష్టమే.. దీదీ ఎద్దేవా
- ప్రధానిపై చర్యలు తీసుకోండి: ‘ఈసీ’కి ఖర్గే డిమాండ్
- ఎండీహెచ్, ఎవరెస్ట్ మసాలాల సంస్థలకు మరో ఎదురు దెబ్బ
- స్టార్ హీరో సినిమాలో సునీల్కు ఛాన్స్.. అక్కడ కూడా ఎంట్రీ ఇచ్చేశాడు
- ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు అలెర్ట్.. మారిన విత్ డ్రా నిబంధనలు
- Virat Kohli: బహుశా ఇదే చివరి మ్యాచ్.. కోహ్లి వ్యాఖ్యలు వైరల్
- బంగారాన్ని మించి.. వెండి హడల్..
- Pavithra Chari నా కల నెరవేరింది, ఆయనతో పనిచేయడం నా అదృష్టం
- టీడీపీ చీటింగ్: వందల మందికి జీతాలు ఎగ్గొట్టి..
Advertisement