-
Ekta-Anita: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఉదయ్ కిరణ్ హీరోయిన్ (ఫొటోలు)
-
Ekta Kapoor: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న బలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ (ఫోటోలు)
-
చరిత్ర సృష్టించిన ఏక్తా కపూర్!..ఆ అవార్డును అందుకున్న తొలి భారతీయురాలు!
భారతీయ టెలివిజన్ రంగాన్ని మహారాణిలా ఏలుతున్నఏక్తా కపూర్ చరిత్ర సృష్టించింది. అమెరికా వెలుపల వివిధ దేశాల్లోని టెలివిజన్ కంటెంట్ నుంచి ఎంచి ఇచ్చే ప్రతిష్ఠాత్మక ఇంటర్నేషనల్ ఎమ్మీ అవార్డ్సులో ఆమెను ‘డైరెక్టరేట్ అవార్డ్’ వరించింది. ఈ అవార్డు అందుకున్న తొలి భారతీయురాలు ఏక్తా. మంగళవారం తెల్లవారుజామున (అమెరికాలో సోమవారం రాత్రి) న్యూయార్క్లో ఈ అవార్డు బహూకరించారు. ఏక్తా కపూర్ (48)కు ముందు అభినందనలు చెప్పాలి. టెలివిజన్ రంగంలో సుదీర్ఘకాలం నిలిచినందుకు, ఢక్కామొక్కీలు తిని విజయం సాధించినందుకు, వేల మందికి ఉపాధి కల్పించినందుకు, టెలివిజన్ చానల్స్ ప్రైమ్టైమ్ను ఏదో ఒక కాలక్షేపంతో నింపినందుకు, ఇంకా కొనసాగుతున్నందుకు. ఇప్పటివరకూ ఆమె 17,000 గంటల టెలివిజన్ కంటెంట్ను ప్రొడ్యూస్ చేసిందంటే దాని వెనుక శ్రమను, ప్యాషన్ను, వ్యాపార శ్రద్ధను అర్థం చేసుకోవచ్చు. అంతే కాదు... 45 సినిమాలను కూడా ఆమె ప్రొడ్యూస్ చేసింది. వ్యాపార ఎత్తుగడల్లో భాగంగా నాసిరకం/సరసమైన కంటెంట్ను తయారు చేసి విమర్శలు ఎదుర్కొన్నా అన్ని రకాల జానర్స్లో కంటెంట్ తయారు చేస్తాను... దేనికి తగ్గ ప్రేక్షకులు దానికి ఉంటారు అనే ధోరణిలో ముందుకు దూసుకుపోతోందామె. అందుకే ఆమె కృషికి అంతర్జాతీయ గుర్తింపు లభించింది. అంతర్జాతీయ గుర్తింపు అమెరికాలోని ‘ఇంటర్నేషనల్ అకాడెమీ ఆఫ్ టెలివిజన్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్’ ప్రతి సంవత్సరం అమెరికా బయటి దేశాలలో టెలివిజన్ రంగంలో విశేష కృషి చేసిన వారికి ‘ఇంటర్నేషనల్ ఎమ్మీ అవార్డు’లను బహూకరిస్తుంది. ఇవి టెలివిజన్ ఆస్కార్స్లాంటివి. ఈ అవార్డులు భారతీయులకు వరించడం తక్కువ. వివిధ కేటగిరీల్లో ఇచ్చే ఈ అవార్డుల్లో విశిష్టమైన ‘డైరెక్టరేట్ అవార్డు’ను ఈ సంవత్సరానికి ఏక్తా కపూర్కు ప్రకటించారు. ఈ అవార్డు పొందిన తొలి భారతీయ మహిళ ఏక్తా. అకాడెమీ సీఈవో బ్రూస్ ప్రైస్నర్ ఈ సందర్భంగా మాట్లాడుతూ ‘భారతీయ మాస్ ప్రేక్షకులను, సౌత్ ఏసియా ప్రేక్షకులను ఏక్తా కపూర్ తన సీరియళ్ల ద్వారా చేరగలిగింది. టెలివిజన్ రంగంలో మార్కెట్ లీడర్గా ఉంది’ అని కొనియాడారు. న్యూయార్క్లో అవార్డు అందుకున్న ఏక్తా ‘ఈ అవార్డు నా మాతృదేశం కోసం’ అంటూ భావోద్వేగానికి గురైంది. విభిన్న వ్యక్తిత్వం ఏక్తా కపూర్ టెలివిజన్ రంగంలో (1995) అడుగు పెట్టే సమయానికి అదంతా పురుష ప్రపంచం. తండ్రి జితేంద్ర (నటుడు) దగ్గర 50 లక్షలు తీసుకొని ‘బాలాజీ టెలి ఫిల్మ్స్’ కింద కొన్ని పైలట్ ప్రాజెక్ట్స్ తీస్తే అన్నీ రిజెక్ట్ అయ్యాయి. దాంతో 50 లక్షలూ వృథా అయ్యాయి. ఆ తర్వాత ఆమె ‘మానో యా మానో’, ‘హమ్ పాంచ్’ సీరియల్స్తో హిట్స్ మొదలుపెట్టింది. 2000 సంవత్సరంలో ‘కె’ అక్షరం సెంటిమెంట్తో మొదలెట్టిన ‘క్యూంకి సాస్భీ కభీ బహూ థీ’ టెలివిజన్ చరిత్రను తిరగరాసింది. ఇది పొందినంత టిఆర్పి మరే సీరియల్ పొందలేదు. ‘కహానీ ఘర్ ఘర్ కీ’, ‘పవిత్ర రిష్టా’, ‘కుంకుమ్ భాగ్య’ లాంటి 134 సీరియల్స్ ఇప్పటి వరకూ తీసింది. పెద్ద పెద్ద సెట్లు, మహిళా పాత్రధారులకు ఖరీదైన చీరలు, ఆభరణాలు, కుటుంబ రాజకీయాలు ఇవన్నీ ఏక్తా మొదలుపెట్టి మొత్తం దేశంలో అదే ట్రెండ్ ఫాలో అయ్యేలా చేసింది. సరోగసి ద్వారా ఏక్తా వివాహం చేసుకోలేదు. కాని 2019లో సరోగసి ద్వారా కుమారుడికి జన్మనిచ్చింది. కొడుక్కి తండ్రి పేరు ‘రవి కపూర్’ అని పెట్టుకుంది. అవార్డు వేదిక మీద ఏక్తా మాట్లాడుతూ ‘మా నాన్నకు, నేనిక్కడ ఉంటే నా కొడుకు కోసం బేబీ సిట్టింగ్ చేస్తున్న మా అన్నయ్య తుషార్కపూర్కు కృతజ్ఞతలు’ అంది. ప్రస్తుతం సొంత ఓటీటీ ప్లాట్ఫామ్ ఆల్ట్ బాలాజీ కోసం ఏక్తా ఎక్కువగా కంటెంట్ను తయారు చేస్తోంది. (చదవండి: చీరకట్టులో కత్తి పాఠాలు! ఆమె కర్ర పట్టిందంటే.. మైమరచిపోవాల్సిందే) -
'నా ఇష్టం.. నేను అలాంటి సినిమాలే చేస్తా': నెటిజన్స్కు ఇచ్చిపడేసిన ఏక్తా కపూర్
భూమి ఫడ్నేకర్, షెహనాజ్ గిల్, కుషా కపిలా ప్రధాన పాత్రల్లో తెరకెక్కించిన చిత్రం 'థ్యాంక్యూ ఫర్ కమింగ్'. కరణ్ బూలానీ దర్శకత్వంలో ఏక్తాకపూర్, రియా కపూర్, అనిల్ కపూర్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇటీవలే రిలీజైన ఈ అడల్ట్ మూవీకి మిశ్రమ స్పందన వచ్చింది. సెన్సార్ బోర్డ్ ఏ సర్టిఫికేట్ ఇచ్చిన ఈ చిత్రంపై నెటిజన్స్ విమర్శలు చేస్తున్నారు. తాజాగా మూవీ ప్రమోషన్లలో నిర్మాత ఏక్తా కపూర్ ట్విటర్ వేదికగా 'ఆస్క్ మీ ఎనిథింగ్' సెక్షన్ నిర్వహించారు. అయితే ఇందులో పాల్గొన్న నెటిజన్స్ నిర్మాతపై విమర్శలు చేశారు. (ఇది చదవండి: నిజం కాబోతున్న సినిమా కథ.. ప్రాణాలకు ముప్పు తప్పదా?) ఓ నెటిజన్ రాస్తూ..'నీ వల్ల ఎంతోమంది యువత చెడిపోతున్నారు. మంచి సినిమాలు చేయడం తెలుసుకో' అంటూ కామెంట్ చేశాడు. కొందరైతే ఏకంగా.. నువ్వు, కరణ్ జోహార్ కలిసి చాలామంది చెడగొడుతున్నారు.. ఎంతోమంది విడాకులకు మీ ఇద్దరే కారణమని పోస్ట్ చేశాడు. దీనికి ఏక్తా కపూర్ స్పందిస్తూ అవునా అని రిప్లై ఇచ్చింది. మరో నెటిజన్ రాస్తూ..దయచేసి మీరు అడల్ట్ సినిమాలు చేయడం మానండి అని విజ్ఞప్తి చేశాడు. దీనిపై స్పందిస్తూ.. 'ఆ ఛాన్సే లేదు.. నేనొక అడల్ట్ కాబట్టి అలాంటి సినిమాలే చేస్తా’ అని కౌంటరిచ్చింది. నెటిజన్ల విమర్శలను ఏమాత్రం లెక్క చేయకుండా తనదైన శైలిలో ఇచ్చిపడేసింది. (ఇది చదవండి: హీరో రవితేజపై విరుచుకుపడ్డ 'కేజీఎఫ్' యష్ ఫ్యాన్స్!) కాగా.. జితేంద్ర, శోభా కపూర్ కుమార్తెగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఏక్తా కపూర్ సినిమాలు, సీరియల్స్ను కూడా నిర్మించారు. రాగిణి ఎంఎంఎస్, ది డర్టీ పిక్చర్, షాదీ కే సైడ్ ఎఫెక్ట్స్, ఏక్ విలన్, ఉడ్తా పంజాబ్, సూపర్ సింగ్, హాఫ్ గర్ల్ఫ్రెండ్, డ్రీమ్గర్ల్ వంటి చిత్రాలకు ఆమె నిర్మాతగా వ్యవహరించారు. -
నిర్మాత ఏక్తా కపూర్పై సుప్రీం కోర్టు ఫైర్
న్యూఢిల్లీ: బాలాజీ టెలిఫిలింస్ అధినేత, ప్రముఖ టీవీ.. ఫిల్మ్ ప్రొడ్యూసర్ ఏక్తా కపూర్పై దేశ అత్యున్నత న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది. అభ్యంతరకరమైన కంటెంట్ తెరకెక్కిస్తూ.. యువతరం మనసులను కలుషితం చేస్తున్నారని మండిపడింది. ట్రిపుల్ ఎక్స్ వెబ్ సిరీస్పై నమోదు అయిన ఓ కేసులో ఏక్తా కపూర్ సుప్రీంను ఆశ్రయించగా.. ప్రతిసారీ ఇలాంటి వివాదాలతో కోర్టును ఆశ్రయించడం మంచి పద్దతి కాదంటూ ఆమెకు హితవు పలికింది కోర్టు. మరోసారి ఈ తరహా చర్యల్ని పునరావృతం చేస్తే జరిమానా విధిస్తామని హెచ్చరించింది. తనపై జారీ అయిన అరెస్ట్ వారంట్లను సవాల్ చేస్తూ ఏక్తా కపూర్ దాఖలు చేసిన పిటిషన్పై శుక్రవారం విచారణ సందర్భంగా అత్యున్నత న్యాయస్థానం పైవ్యాఖ్యలు చేసింది. ఏక్తా కపూర్ సమర్పణలో ఓటీటీ ప్లాట్ఫాం ఆల్ట్బాలాజీ (ALTBalaji)లో ట్రిపుల్ ఎక్స్ అనే వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ అవుతోంది. అయితే xxx సీజన్ 2లో సైనికుని భార్య పోర్షెన్కు సంబంధించిన సన్నివేశాలు చాలా అభ్యంతరకరంగా ఉన్నాయంటూ శంభు కుమార్ అనే మాజీ సైనికుడు 2020లో ఫిర్యాదు చేశారు. సైనికులు, వారి కుటుంబ సభ్యుల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఈ సన్నివేశాలు ఉన్నాయని ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు. దీనిపై బిహార్లోని బేగుసరాయ్ ట్రయల్ కోర్టు ఏక్తా కపూర్ను అరెస్టు చేసేందుకు వారంట్లు జారీ చేసింది. ఈ అరెస్ట్ వారంట్లను సవాల్ చేస్తూ ఏక్తా కపూర్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఆమె తరపున సీనియర్ అడ్వకేట్ ముకుల్ రోహత్గి వాదనలు వినిపించారు. తాము పాట్నా హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశామని, అది త్వరగా విచారణకు వస్తుందనే ఆశ లేదని చెప్పారు. ఇటువంటి కేసులో గతంలో అత్యున్నత న్యాయస్థానం ఏక్తా కపూర్నకు ఉపశమనం కల్పించిందని గుర్తు చేశారు. ఓటీటీ ప్లాట్ఫాంపై ప్రసారమవుతున్న కంటెంట్ సబ్స్క్రిప్షన్ ఆధారితమైనదని తెలిపారు. ఈ దేశంలో తమకు నచ్చిన కంటెంట్ను ఎంచుకునే స్వేచ్ఛ ఉందన్నారు. దీనిపై కోర్టు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఓటీటీ ద్వారా వెబ్ సిరీస్ అందరికీ అందుబాటులో ఉంటుందనే విషయాన్ని గుర్తించాలని ముకుల్ రోహత్గికు సూచించింది. ప్రజలకు మీరు ఎలాంటి ఛాయిస్ను ఇస్తున్నారా? అని నిలదీసింది. అసభ్యకరమైన కంటెంట్తో యువతను పాడు చేయాలనుకుంటున్నారా? యువతరం మనసులను కలుషితం చేస్తున్నారంటూ దుయ్యబట్టింది. మంచి న్యాయవాదులు ఉన్నంత మాత్రానా కోర్టులు నోరున్న వారి కోసమే పని చేయవని, నోరు లేని వారి కోసం కూడా పని చేస్తుందని జస్టిస్ అజయ్ రస్తోగీ, జస్టిస్ సీటీ రవి కుమార్ బెంచ్ వ్యాఖ్యానించింది. ఆర్డర్ను పరిశీలించాం, మా అభ్యంతరాలు మాకు ఉన్నాయి. హైకోర్టులో విచారణ పరిస్థితి గురించి తెలుసుకోవడానికి స్థానిక న్యాయవాదిని ఏర్పాటు చేసుకోవాలని సలహా ఇస్తూ.. ఈ పిటిషన్పై విచారణను పెండింగ్లో పెట్టింది. ఇదీ చదవండి: యూట్యూబ్, గూగుల్కి కోర్టు నోటీసులు.. అవెలా వస్తున్నాయ్? -
కోర్టు ధిక్కరణ? నిర్మాత ఎక్తాకపూర్, ఆమె తల్లికి బిహార్ కోర్టు షాక్!
బాలీవుడ్ దర్శక-నిర్మాత ఎక్తాకపూర్, ఆమె తల్లి శోభ కపూర్పై అరెస్ట్ వారెంట్ ఇష్యూ అయ్యింది. కోర్టు ఆదేశాలను ధిక్కరించినందుకు వారిపై బిహార్ కోర్టు అరెస్ట్ వారెంట్ ఇచ్చింది. వివరాలు.. ఎక్తా కపూర్ నిర్మించిన ట్రిపుల్ ఎక్స్-సీజన్ 2 వెబ్ సిరీస్పై అభ్యంతరం వ్యక్తం చేస్తూ రిటైర్ట్ సర్విస్మ్యాన్ శంబు కుమార్ 2020లో బీహార్ కోర్టులో పటిషన్ దాఖలు చేశారు. ఆ సిరీస్లో జవాన్ల భార్యలను అవమానపరిచారని, వారిని ఉద్దేశిస్తూ ఉన్న పలు సీన్స్ వారి కుటంబాలను కించపరిచే విధంగా ఉన్నాయని ఆయన తన పిటిషన్లో పేర్కొన్నారు. శంబు కుమార్ ఫిర్యాదు మేరకు ఎక్తాకపూర్, ఆమె తల్లి శోభ కపూర్లకు కోర్టు నోటీసులు ఇచ్చింది. చదవండి: మిస్ యూ నానమ్మ.. నువ్వు మళ్లీ తిరిగి రావాలి..: సితార ఎమోషనల్ పోస్ట్ అంతేకాదు ఈ విషయమై వారు కోర్టులో హాజరు కావాలని కూడా ఆదేశించింది. అయితే సిరీస్లో అభ్యంతరకరంగా ఉన్న సన్నివేశాలు తొలగించినప్పటికి, వారు కోర్టు ఆదేశాలని ధిక్కరించారని, నోటిసులు అందిన ఎక్తా కపూర్, ఆమె తల్లి కోర్టుకు హాజరు కాకుండా బాధ్యత రహితంగా వ్యవహరించారని శంబు కుమార్ తరపు న్యాయవాది హ్రిషికేశ్ పతక్ తెలిపారు. దీంతో వారిపై అరెస్ట్ వారెంట్ ఇష్యూ అయ్యిందని ఆయన వెల్లడించారు. కాగా 2020లో ఎక్తా కపూర్ దర్శకత్వం వహించిన ట్రిపుల్ ఎక్స్-సీజన్ 2 వెబ్ సిరీస్ను తన సొంత ఓటీటీ సంస్థ ఎఎల్టీబాలజీ (బాలజీ టెలిఫిలింస్ లిమిటెడ్) వేదికగా రిలీజ్ చేశారు. అయితే ఈ ఓటీటీ సంస్థ వ్యవహారాలను ఆమె తల్లి శోభ కపూర్ కూడా చూసుకుంటారు. -
The Dirty Picture Sequel: డర్టీ పిక్చర్ హీరోయిన్ ఎవరు?
‘ది డర్టీ పిక్చర్’కి సీక్వెల్ రానుందా? అంటే బాలీవుడ్ అవునంటోంది. విద్యాబాలన్ కథానాయికగా ఏక్తా కపూర్ నిర్మించిన ‘ది డర్టీ పిక్చర్’ (2011) గుర్తుండే ఉంటుంది. విద్యా నటనకు జాతీయ అవార్డు కూడా వచ్చింది. మిలన్ లూథ్రియా దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం దివంగత ప్రముఖ నటి సిల్క్ స్మిత జీవితంలోని కొన్ని అంశాలతో రూపొందినట్లుగా టాక్ వినిపించింది. అయితే దర్శక–నిర్మాతలు ఆ విషయాన్ని అధికారికంగా ప్రకటించలేదు. ఆ సంగతలా ఉంచితే ‘ది డర్టీ పిక్చర్’కి సీక్వెల్ నిర్మించడానికి ఏక్తా కపూర్ సన్నాహాలు మొదలుపెట్టారని సమాచారం. మరో రచయితతో కలిసి కనికా థిల్లాన్ ఈ సీక్వెల్కి స్టోరీ సిద్ధం చేస్తున్నారట. సీక్వెల్లో విద్యాబాలన్ కాదు... సీక్వెల్లో విద్యాబాలన్ నటించడంలేదు. కాగా ఫస్ట్ పార్ట్ అప్పుడే కంగనా రనౌత్ని కథానాయికగా అడిగారు ఏక్తా కపూర్. అయితే కంగన తిరస్కరించారు. సీక్వెల్కి అడగ్గా.. మళ్లీ తిరస్కరించారట. ఈ నేపథ్యంలో తాప్సీ, కృతీ సనన్ వంటి తారలతో సెకండ్ పార్ట్ గురించి ఏక్తా చెప్పారట. ఇద్దరూ నటించడానికి సుముఖత వ్యక్తపరచారని టాక్. అయితే పూర్తి కథ రెడీ అయ్యాక మరోసారి కలుద్దామని కృతీ, తాప్సీతో అన్నారట ఏక్తా. మరి.. ఇద్దరిలో ‘డర్టీ పిక్చర్ 2’ హీరోయిన్ ఎవరు? అనేది కాలం చెబుతుంది. అలాగే తొలి భాగానికి దర్శకత్వం వహించిన మిలన్ మలి భాగాన్ని కూడా తెరకెక్కిస్తారా? అనేది కూడా తెలియాల్సి ఉంది. వేరే కథ... ‘ది డర్టీ పిక్చర్’ విద్యాబాలన్ పాత్ర చనిపోవడంతో ముగుస్తుంది. మరి.. సీక్వెల్ కథ ఏంటి? అనే చర్చ జరుగుతోంది. అయితే పూర్తిగా వేరే కథ తయారు చేస్తున్నారట. ఈ ఏడాది చివరికి కథ సిద్ధమవుతుందని సమాచారం. వచ్చే ఏడాది ప్రథమార్ధంలో సీక్వెల్ షూటింగ్ ఆరంభించాలను కుంటున్నారని భోగట్టా. -
హాట్ టాపిక్గా భారత్- విండీస్ వన్డే ట్రోపీ.. ఎక్తాకపూర్ తయారు చేసిందా?
భారత్-వెస్టిండీస్ వన్డే సిరీస్ ట్రోపీని గమనించారా. పాము ఆకారంలో ఉండి కాస్త కొత్తగా కనిపిస్తున్న ట్రోపీ లుక్ అందరిని ఆకట్టుకుంది. మ్యాచ్ చూసేందుకు వచ్చిన ప్రేక్షకులు సైతం ట్రోపీ డిజైన్ చూసి ముచ్చటపడ్డారు. అందుకే భారత్-విండీస్ వన్డే సిరీస్ ట్రోపీ హాట్టాపిక్గా మారి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. దీంతో అభిమానులు ట్రోపీ ఫోటోలును షేర్ చేస్తూ టెలివిజన్ స్టార్ నిర్మాత.. డైరెక్టర్.. ఏక్తాకపూర్ను ట్యాగ్ చేశారు.'' ఏక్తాకపూర్ ఏమైనా ఈ ట్రోపీ తయారు చేసిందా.. సిరీస్ గెలిచిన జట్టుకు పాముకాటు తప్పేలా లేదు'' అంటూ ఫన్నీ కామెంట్స్ చేశారు. ఇక ఏక్తాకపూర్ను ట్యాగ్ చేయడం వెనుక ఒక చిన్న స్టోరీ ఉంది. సూపర్హిట్ సీరియల్ 'నాగిన్' గుర్తుండే ఉంటుంది. నాగిన్ సిరీస్ను ప్రొడ్యూస్ చేస్తుంది ఎవరో కాదు.. మన ఏక్తాకపురే. ఇప్పటివరకు నాగిన్ ఫ్రాంచైజీలో ఐదు సీజన్లు వచ్చాయి. ప్రస్తుతం ఆరో సీజన్ విజయవంతంగా నడుస్తోంది. అంతేకాదు హిందీలో ఎన్నో సూపర్హిట్ సీరియల్స్కు ఏక్తాకపూర్ నిర్మాతగా.. డైరెక్టర్గానూ వ్యవహరించింది. ఇక భారత్- విండీస్ వన్డే సిరీస్ శుక్రవారం ప్రారంభమైంది. సీనియర్ల గైర్హాజరీలో ధావన్ నాయకత్వంలో టీమిండియా యువ జట్టు విండీస్తో తలపడుతోంది. మూడు వన్డేల సిరీస్ అనంతరం జూలై 29 నుంచి ఐదు మ్యాచ్ల టి20 సిరీస్ ప్రారంభం కానుంది. View this post on Instagram A post shared by WINDIES Cricket (@windiescricket) -
కొండ ప్రాంతాల నుంచి వచ్చానని అవమానించేవారు: కంగనా
బాలీవుడ్ డేరింగ్ హీరోయిన్, వివాదాల బ్యూటీ కంగనా రనౌత్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తూ కాంట్రవర్సీ క్వీన్గా రికార్డుకెక్కింది. ఏ అంశమైన తనదైన స్టైల్లో ఎలాంటి భయం లేకుండా విమర్శలను సంధిస్తుంటుంది. అయితే బీటౌన్ నటి, నిర్మాత ఏక్తా కపూర్ ఎంతో మంచి వ్యక్తి అని కంగనా అభిప్రాయపడింది. ఏక్తా కపూర్ నిర్మిస్తోన్న రియాల్టీ షో లాక్ అప్కి కంగనా హోస్ట్గా వ్యవహరిస్తోన్న సంగతి తెలిసిందే. ఇటీవల జరిగిన ఓ ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలను పంచుకుంది. ఈ ఇంటర్వ్యూలో కంగనా 'ఇండస్ట్రీలోకి అడుగుపెట్టినప్పుడు అంతగా పరిచయాలు లేకపోవడంతో అందరూ నన్ను ఏడిపించేవారు. ఇంగ్లీష్ మాట్లాడటం రాదని, కొండ ప్రాంతాల నుంచి వచ్చానని అవమానించేవారు. ఇంకా కొందరైతే ఇండస్ట్రీ నీ లాంటి వారి కోసం కాదు, ఇక్కడి నుంచి వెళ్లిపో అని నా ముఖంపైనే చెప్పేవారు. కానీ, నా నిర్మాత ఏక్తా కపూర్ అలా అన్లేదు. నా కెరీర్ స్టాటింగ్ టైంలో ఆమెతో కలిసిపనిచేశాను. ఆమె చాలా మంచి వ్యక్తి. నాకు ఫస్ట్ హిట్ను ఇచ్చింది కూడా ఆమె. నాకు ఎప్పుడు మద్దతు ఇస్తూనే ఉన్నారు.' అని తెలిపింది. -
'లాకప్'లో బాలీవుడ్ బోల్డ్ బ్యూటీ.. ఎందుకంటే ?
Poonam Pandey As Third Contestant In Kangana Lock Upp Show: బీటౌన్ ఫైర్ బ్రాండ్, మోస్ట్ డేరింగ్ హీరోయిన్ హోస్ట్గా 'లాకప్' అనే రియాల్టీ షో చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రముఖ నిర్మాత ఏక్తా కపూర్ ఈ షోకు నిర్మాతగా వ్యవహరిస్తోంది. మోస్ట్ ఫియర్లెస్ షో అని ప్రచారం చేసిన 'లాకప్' షో ఫిబ్రవరి 27 నుంచి ఆల్ట్ బాలాజీ ఓటీటీ, ఎమ్ఎక్స్ ప్లేయర్లలో స్ట్రీమింగ్ కానుంది. దీంతో షో నిర్వాహకులు ఈ కార్యక్రమంలో పాల్గొనే సెలబ్రిటీలను వరుసగా ప్రకటిస్తూ వస్తున్నారు. ఇప్పటికే మొదటి కంటెస్టెంట్గా నిషా రావల్, రెండో కంటెస్టెంట్గా కాంట్రవర్సీ కమెడియన్ మునవర్ ఫరూఖీని రివీల్ చేశారు. తాజాగా ఈ షోలో మూడో పార్టిస్పెంట్గా బోల్డ్ బ్యూటీ పూనమ్ పాండేను పరిచయం చేశారు నిర్వాహకులు. దీనికి సంబంధించిన వీడియోను పూనమ్ తన ఇన్స్టాగ్రామ్లో షేర్ చేసింది. ఈ వీడియోకు 'నేను హాట్గా ఉన్నందుకే లాకప్ చేశారు.' అని రాసుకొచ్చింది పూనమ్. పాండే షేర్ చేసిన ఈ టీజర్ వీడియోలో పూనమ్ ఆరెంజ్ డ్రెస్లో హాట్గా కనిపించింది. ఈ వీడియోతోపాటు లాకప్లో ఉన్న ఒక పిక్ను కూడా షేర్ చేసింది. ప్రస్తుతం ఈ పోస్ట్లు నెట్టింట వైరల్గా మారాయి. View this post on Instagram A post shared by Poonam Pandey (@poonampandeyreal) View this post on Instagram A post shared by Poonam Pandey (@poonampandeyreal) -
'మోస్ట్ ఫియర్లెస్ షో'కు హోస్ట్గా కంగనా రనౌత్ !
Kangana Ranaut Is Confirmed As Host For Ekta Kapoor Show: బీటౌన్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. సమాజంలోని పరిస్థితులపై తనదైన శైలీలో కుండబద్ధలు కొట్టినట్లుగా మాట్లాడేస్తుూ ఉంటుంది. అలా మాట్లాడటంతో దేశంలోనే మోస్ట్ డేరింగ్ హీరోయిన్గా పేరు వచ్చింది. సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తూ కాంట్రవర్సీ క్వీన్గా రికార్డుకెక్కింది. ఏ విషయం గురించి అయినా ఎలాంటి భయం లేకుండా బయటకు చెప్తూ అందర్నీ ఆశ్చర్యపరుస్తుంది. ఈ వ్యాఖ్యలతో కంగనా రనౌత్ పలుసార్లు వివాదాలపాలైంది కూడా. కానీ కంగనా బోల్డ్ యాటిట్యూడ్ అనేకమంది దృష్టిని ఆకర్షించింది. ప్రస్తుతం కంగనా టికు వెడ్స్ షెరు సినిమాతో బిజీగా ఉంది. ఇదిలా ఉంటే తాజాగా కంగనా ఒక మోస్ట్ డేరింగ్ షోకి హోస్ట్గా వ్యవహరించనుందని వార్తలు వినిపిస్తున్నాయి. ప్రముఖ బుల్లితెర నిర్మాత ఏక్తా కపూర్ ఆల్ట్ బాలాజీ, ఎమ్ఎక్స్ ప్లేయర్ కోసం రూపొందించే ఒక 'ఫియర్లెస్ రియాలిటీ షో' కోసం కంగనాను సెలెక్ట్ చేసినట్లు తెలుస్తోంది. బిగ్బాస్ మాదిరిగా ఉన్న ఈ షోను కంగనా హోస్ట్ చేయనుందని సమాచారం. ఈ విషయంపై త్వరలో అధికారికంగా ప్రకటన రానున్నట్లు తెలుస్తోంది. అయితే ఇటీవల ఈ షో గురించి తన ఇన్స్టాలో పోస్ట్ చేసిన కంగనా తర్వాత ఆ పోస్ట్ను డిలీట్ చేసింది. View this post on Instagram A post shared by ALTBalaji (@altbalaji) -
రూ. 130 కోట్ల బడ్జెట్తో సీరియల్ !.. ఒకవేళ హిట్ కాకుంటే
హిందీ బుల్లితెర ప్రేక్షకులను అలరించే మోస్ట్ పాపులర్ సీరియల్లో 'నాగిని' ఒకటి. 2015లో ప్రారంభమైన ఈ సీరియల్ ఇప్పటివరకు ప్రేక్షకులను అలరిస్తూనే ఉంది. తెలుగులో కూడా 'నాగిని' మొదటి రెండు సీజన్లను ప్రసారం చేశారు. ఆ సీజన్స్కు తెలుగు ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణే లభించింది. ఇప్పుడు తాజాగా ఈ సీరియల్ ఆరో సీజన్ రాబోతున్న విషయం తెలిసిందే. ఇందులో హిందీ బిగ్బాస్ సీజన్ 15 విన్నర్ తేజస్వీ ప్రకాష్ ప్రధాన పాత్రలో అలరించనుంది. అయితే తాజాగా ఈ సీరియల్ గురించి ఒక ఆసక్తికర విషయం చక్కర్లు కొడుతోంది. బాలీవుడ్ లైఫ్లోని ఒక నివేదిక ప్రకారం ఈ సీజన్ను రూ. 130 కోట్ల భారీ బడ్జెట్తో రూపొందించినట్లు సమాచారం. ఒకవేళ ఈ సీజన్ అంతగా హిట్ కాకపోతే వచ్చే సంవత్సరం నుంచి ఈ ఫ్రాంచైజీని ఆపేయాలని భావిస్తుందట నిర్మాత ఎక్తా కపూర్. ఈ భారీ బడ్జెట్తో ఒక సినిమానే తీయొచ్చని ఎక్తాకు పలువురు చెప్పినా ఎక్తా కపూర్ వినలేదని తెలుస్తోంది. నాగిని 6లో విజువల్ ఎఫెక్ట్స్ భారీగా ఉంటాయని సమాచారం. ఈ సీజన్ ఫిబ్రవరి 12 నుంచి కలర్స్ ఛానెల్లో ప్రతీ శనివారం, ఆదివారం ప్రసారం కానుంది. Apne bhavya roop aur teeno kaal ki shaktiyon se duniya ko bachane aa rahi hai Naagin. Zaroor dekhiye #Naagin6, 12th February se Sat-Sun, raat 8 baje only on #colors.@itsmetejasswi pic.twitter.com/lEs29HCahX — ColorsTV (@ColorsTV) January 31, 2022 -
ప్రముఖ నిర్మాతకు కరోనా పాజిటివ్.. జాగ్రత్తగా ఉన్నప్పటికీ
Producer Ekta Kapoor Tested Positive For Covid 19: దేశంలో కరోనా మళ్లీ విజృంభిస్తోంది. రోజురోజుకీ పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతోంది. సామాన్యులు, సెలబ్రిటీలు అంటూ తేడా లేకుండా తన పంజా విసురుతోంది. కరోనా కలకలం బీటౌన్లో మరింత ఎక్కువగా ఉంది. ఇప్పటికే బీటౌన్ ప్రముఖులు కరోనా బారిన పడటం ఆందోళన కలిగిస్తోంది. అర్జున్ కపూర్ ఇంట్లో నలుగురికి కొవిడ్ సోకగా వారి ఇంటికి బీఎంసీ అధికారులు సీల్ వేసి శానిటైజ్ చేశారు. కమల్ హాసన్, కరీనా కపూర్, నోరా ఫతేహీతో పాటు తాజాగా జాన్ అబ్రహం, ఆయన భార్య ప్రియా రుంచల్ కరోనా చేతికి చిక్కారు. వీరితోపాటు టాలీవుడ్లో మంచు మనోజ్, నమ్రతా శిరోద్కర్ సోదరి శిల్పా శిరోద్కర్ మహామ్మారి బారిన పడిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా ప్రముఖ నిర్మాత ఏక్తా కపూర్ సోమవారం కొవిడ్ బారిన పడింది. కరోనా పరీక్ష చేయించుకోగా పాజిటివ్గా తేలినట్లు ఆమె ప్రకటించింది. ప్రస్తుతం తాను బాగానే ఉన్నానని సోషల్ మీడియా వేదికగా తెలిపింది. అన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ నేను కొవిడ్కు గురయ్యాను. నేను క్షేమంగా ఉన్నాను. నన్ను సంప్రదించిన వారందరూ దయచేసి కరోనా పరీక్షలు చేయించుకోవాలని కోరుతున్నాను. అని ఇన్స్టా గ్రామ్ పోస్ట్లో చెప్పుకొచ్చింది ఈ 46 ఏళ్ల ఏక్తా కపూర్. View this post on Instagram A post shared by Erk❤️rek (@ektarkapoor) ఇదీ చదవండి: జెర్సీ హీరోయిన్కు కరోనా.. సురక్షితంగా ఉండండని పోస్ట్ -
బుల్లితెర క్వీన్ ఏక్తా కపూర్ మరో ప్రయోగం
ముంబై: వీడియో షేరింగ్ సోషల్ మీడియా సంస్థ రోపోసో తాజాగా ఎంటర్టైన్మెంట్ రంగ సంస్థ బాలాజీ టెలీఫిలిమ్స్ అధినేత ఏక్తా కపూర్తో చేతులు కలిపింది. ‘ఈకే’ బ్రాండ్ పేరిట గృహాలంకరణ, గృహోపకరణాలను ఆవిష్కరించింది. స్థానిక కళాకారులకు ఊతమిచ్చేందుకు, వారు తయారు చేసే ఉత్పత్తులకు విస్తృత మార్కెట్ కల్పించేందుకు ఇది తోడ్పడగలదని ఏక్తా కపూర్ తెలిపారు. మొబైల్ అడ్వర్టైజింగ్ టెక్నాలజీ కంపెనీ ఇన్మొబీలో భాగమైన గ్లాన్స్కి రోపోసో అనుబంధ సంస్థగా ఉంది. కలెక్టివ్ ఆర్టిస్ట్స్ నెట్వర్క్, గ్లాన్స్ మధ్య జాయింట్ వెంచర్ సంస్థ అయిన గ్లాన్స్ కలెక్టివ్ ’ఈకే’ బ్రాండ్ కింద మొట్టమొదటి కలెక్షన్ అందిస్తోందని ఇన్మొబి సీఈవో నవీన్ తివారీ తెలిపారు. ఈ కేటలాగ్లో కుషన్ కవర్లు, వాల్ ఆర్ట్ మొదలైన ఉత్పత్తులు గ్లాన్స్, రోపోసో ప్లాట్ఫామ్లలో కొనుగోలు చేయొచ్చని పేర్కొన్నారు. ధరలు రూ.299 నుంచి ప్రారంభమవుతాయి -
పద్మం దక్కిన వేళ.. ఆనంద హేల
2020 సంవత్సరానికి గాను రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ‘పద్మ’ అవార్డులను ప్రదానం చేశారు. రాష్ట్రపతి భవన్లో సోమవారం ఈ అవార్డుల ప్రదానం జరిగింది. చిత్రసీమ నుంచి తమ తమ విభాగాల్లో సేవలు అందిస్తున్న నటి కంగనా రనౌత్, దర్శక–నిర్మాత కరణ్ జోహార్, నిర్మాత ఏక్తా కపూర్, సంగీత దర్శకుడు అద్నన్ సమి, నేపథ్య గాయకుడు సురేష్ వడ్కర్, సీనియర్ నటి సరితా జోషి ‘పద్మశ్రీ’ అవార్డులు అందుకున్నారు. పద్మం దక్కిన వేళ.. ఆనంద హేలలో పురస్కార గ్రహీతలు ఈ విధంగా స్పందించారు. ఆలస్యంగా వచ్చినా ఆనందమే – సురేష్ వాడ్కర్ ‘‘కాస్త అలస్యంగా వచ్చినప్పటికీ నా దేశం నన్ను గుర్తించినందుకు ఆనందంగా ఉంది. ఏ కళా కారుడికైనా ఈ పురస్కారం చాలా గొప్పది. సంగీత ప్రపంచంలోమరింత ముందుకు వెళ్లడానికి ఈ పురస్కారం నాకు స్ఫూర్తినిచ్చింది’’ అని 66 ఏళ్ల సురేష్ వాడ్కర్ అన్నారు. హిందీ, మరాఠీ భోజ్పురి భాషల్లో పాడారు సురేష్. ‘సద్మా’లో ‘ఏ జిందగీ గలే లగా లే’, ‘పరిందా’లో ‘తుమ్ సే మిల్కే’ , ‘ప్యాసా సావన్’లో ‘మేఘా రే.. మేఘా రే..’ వంటి పాటలు పాడారు వాడ్కర్. ఈ క్షణాలు గుర్తుండిపోతాయి – కరణ్ జోహార్ ‘‘ఈ క్షణాలు నాకు ఎప్పటికీ గుర్తుండిపోతాయి. మా అమ్మ, నా పిల్లలు, నా ప్రొడక్షన్ కంపెనీలా నా మనసులో ఈ పురస్కారం అలా ఉండిపోతుంది’’ అని పేర్కొన్నారు కరణ్ జోహర్. ‘కుచ్ కుచ్ హోతా హై’, ‘కల్ హో నా హో’, ‘మై నేమ్ ఈజ్ ఖాన్’ ‘స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్’ వంటి చిత్రాలకు దర్శకత్వం వహించారు కరణ్ జోహార్. అలాగే ‘దోస్తానా’, ‘2 స్టేట్స్’ వంటి ఎన్నో చిత్రాలను నిర్మించారు. నమ్మలేని క్షణం – ఏక్తా కపూర్ ‘‘ఇదొక గొప్ప గౌరవం. నమ్మలేని క్షణం... అలాగే గర్వకారణం. నాకు రెండు పిల్లర్లలా నిలిచిన మా అమ్మానాన్న (శోభ, జితేంద్ర కపూర్)లకు ఈ పురస్కారాన్ని అంకితం ఇస్తున్నాను. వాళ్లిద్దరూ నన్ను పూర్తిగా నమ్మడంవల్లే నేనీ స్థాయిలో ఉన్నాను. నా కుటుంబం, స్నేహితులు, మా బాలాజీ టెలీ ఫిలింస్ టీమ్, ప్రేక్షకులకు ధన్యవాదాలు. నా కలలను నిజం చేసుకోవడానికి ఆస్కారం ఇచ్చిన ఈ దేశానికి తిరిగి ఇవ్వాలన్నది నా ఆలోచన. మరింతమంది ప్రతిభావంతులకు అవకాశం కల్పిస్తాను’’ అన్నారు ఏక్తా కపూర్. టీవీ రంగంలో దూసుకెళుతున్న ఏక్తా ‘వన్స్ అపాన్ ఎ టైమ్ ఇన్ ముంబై’, ‘ది డర్టీ పిక్చర్’, ‘షూట్ అవుట్ అట్ వడాలా’ వంటి చిత్రాలు నిర్మించారు. ఆ ప్రేమవల్లే ఇంతదాకా... – అద్నన్ సమీ ‘‘నాకింత గొప్ప పురస్కారాన్ని అందించిన భారత ప్రభుత్వానికి కృతజ్ఞతలు. అలాగే భారతదేశ ప్రజలు నా మీద చూపిస్తున్న ప్రేమాభిమానాలకు ఎప్పటికీ రుణపడి ఉంటాను. ప్రేక్షకుల అభిమానం వల్లే నా ప్రయాణం ఇంతదాకా వచ్చింది’’ అన్నారు అద్నాన్ సమీ. హిందీలో పలు పాటలు పాడిన అద్నన్ తెలుగులో ‘శంకర్దాదా ఎంబీబీఎస్’లో ‘ఏ జిల్లా..’, ‘వర్షం’లో ‘నైజామ్ పోరి..’, ‘జులాయి’లో ‘ఓ మధు..’ వంటి పాటలు పాడారు. ఈ అవార్డుల ప్రదానోత్సవంలో ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తదితరులు పాల్గొన్నారు. ప్రముఖ నటి సరితా జోషి (80) ఆరు దశాబ్దాలుగా గుజరాతీ, మరాఠీ, హిందీ, మర్వారీ భాషల్లో 15 వేలకు పైగా షోస్లో భాగమయ్యారు. అలాగే ‘పరివార్’, ‘గురు’, ‘సింబా’, ‘రూహీ’ తదితర చిత్రాల్లో నటించారు. ఆ నోళ్లు మూతపడతాయనుకుంటున్నాను ‘‘ఒక ఆర్టిస్టుగా నేను ఎన్నో అవార్డులు పొందగలిగాను. కానీ ఓ ఆదర్శనీయమైన పౌరురాలిగా ప్రభుత్వం నన్ను గుర్తించి ‘పద్మశ్రీ’ అందించినందుకు సంతోషంగా ఉంది’’ అన్నారు కంగనా రనౌత్. ఇంకా మాట్లాడుతూ– ‘‘నా కెరీర్ను స్టార్ట్ చేసిన తర్వాత దాదాపు పది సంవత్సరాల వరకు నాకు సక్సెస్ రాలేదు. పెద్ద హీరోలు, పెద్ద ప్రొడక్షన్ హౌసెస్కు సంబంధించిన చిత్రాలు, స్పెషల్సాంగ్స్, సౌందర్య లేపనాల ఉత్పత్తులను గురించిన ప్రకటనలను కాదనుకున్నాను. జాతీయ అంశాలను గురించి నేను పలుసార్లు నా గొంతు విప్పాను. అందువల్ల ఎక్కువగా శత్రువులనే సంపాదించుకున్నాను. జాతీయ అంశాలను గురించి ప్రస్తావిస్తోంది అని నన్ను విమర్శించేవారి నోళ్లు ఇప్పుడు మూతపడతాయనుకుంటున్నాను’’ అన్నారు. ‘క్వీన్’, ‘తనువెడ్స్ మను’ ఫ్రాంచైజీ, ‘తలైవి’ వంటి చిత్రాలతో నటిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న కంగనా రనౌత్ నిర్మాతగానూ రాణిస్తున్నారు. – కంగనా రనౌత్ -
నిర్మాతగా మారిన బాలీవుడ్ స్టార్ హీరోయిన్
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కరీనా కపూర్ ఓ వైపు హీరోయిన్గా నటిస్తూనే మరోవైపు నిర్మాతగా ఎంట్రీ ఇస్తున్నారు. ఈ సినిమాకు 'స్కామ్ 1992' వెబ్ సిరీస్తో పాపులర్ అయిన హన్సల్ మెహతా దర్శకత్వం వహించనున్నారు. వాస్తవ సంఘటనల ఆధారంగా థ్రిల్లర్ బ్యాక్డ్రాప్లో ఈ చిత్రాన్నితెరకెక్కిస్తున్నారు. ఈ సందర్భంగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన కరీనా..'హన్సల్ మెహతా చిత్రాలంటే నాకు చాలా ఇష్టం. ఆయనతో కలిసి పనిచేయడం సంతోషంగా ఉంది' అని పేర్కొన్నారు. ఏక్తా కపూర్ సహా నిర్మాతగా వ్యవహరించనున్నారు. యూకేలో షూటింగ్ జరగనున్న ఈ ప్రాజెక్టుకి సంబంధించి మరిన్ని వివరాలు త్వరలోనే వెల్లడి కానున్నాయి. ప్రస్తుతం కరీనా అమిర్ఖాన్తో కలిసి ‘లాల్ సింగ్ ఛద్దా’ చిత్రంలో నటిస్తోన్న సంగతి తెలిసిందే. -
1.83 కోట్ల విలువైన కారు కొన్న బుల్లితెర నటుడు
Ram Kapoor New Car: ప్రముఖ బుల్లితెర నటుడు రామ్ కపూర్ ఖరీదైన కారు కొనుగోలు చేశాడు. సుమారు 1.82 కోట్ల రూపాయలు వెచ్చించి ఖరీదైన పోర్షే 911 కరీరా ఎస్ మోడల్ను సొంతం చేసుకున్నాడు. ఇందుకు సంబంధించిన ఫొటోలను కార్ల సంస్థ తమ ఇన్స్టా అకౌంట్లో పోస్ట్ చేసింది. సెంట్రల్ ముంబైలోని రామ్ కపూర్ నివాసానికి కారును పంపించామని, పోర్షే ఫ్యామిలీలోకి అతడిని ఆహ్వానిస్తున్నామంటూ సంతోషం వ్యక్తం చేసింది. ఇక ఇందుకు స్పందించిన నెటిజన్లు తమదైన శైలిలో సెటైర్లు వేస్తున్నారు. ‘‘అసలే వర్షాలు.. ముంబై రోడ్ల మీద ఈ కారు సాఫీగా సాగిపోతుందా? అయినా.. మన టీవీ ఆర్టిస్టులకు ఇంత పెద్ద మొత్తం పారితోషికంగా లభించడం నిజంగా పెద్ద విషయమే. అంతా ఏక్తా కపూర్ మహిమ’’ అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు. కాగా న్యాయ్ సీరియల్తో 1997లో హిందీ బుల్లితెరపై అడుగుపెట్టిన రామ్ కపూర్... హీనా, సంఘర్ష్, కవిత వంటి డ్రామాలతో గుర్తింపు దక్కించుకున్నాడు. ఇక హిందీ టెలివిజన్ క్వీన్గా గుర్తింపు పొందిన ఏక్తా కపూర్ నిర్మించిన ఘర్ ఏక్ మందిర్తో అతడి కెరీర్ మలుపు తిరిగింది. ముఖ్యంగా కసం సే, బడే అచ్చే లగ్తే హై సీరియల్తో పెద్ద బ్రేక్ వచ్చింది. తన నటనకు గానూ పలు అవార్డులు కూడా పొందాడు. ఇక ఏజెంట్ వినోద్, స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్, హమ్షకల్స్, ఉడాన్, థప్పడ్ వంటి సినిమాల్లో రామ్ కపూర్ నటించాడు. కారు ధర, ముఖ్యమైన ఫీచర్లు: పోర్షే 911 కరీరా ఎస్ ధర- సుమారు 1.83 కోట్లు మైలేజ్- 11.24 కిలోమీటర్/లీటర్ ఇంజన్- 2981సీసీ ఆటోమేటిక్ డ్యుయల్ క్లచ్ పెట్రోల్ వర్షన్ 4 సీటర్ కెపాసిటీ -
ఆస్కార్ అకాడమీ కొత్త సభ్యుల జాబితాలో విద్యాబాలన్, ఏక్తా కపూర్
ప్రపంచ సినీ రంగంలో అకాడమీ అవార్డులకు ఉన్న విలువ మరే అవార్డులకు ఉండదు. ఆస్కార్ వచ్చిందంటే అది ఏ క్యాటగిరి అయినా అత్యంత గౌరవప్రదంగా భావిస్తారు. అభ్యర్థులను ఎంపిక చేయాలంటే ఆయా క్యాటగిరిల్లో వారిని వడబోసి ఆస్కార్ అవార్డులను ఇస్తారు. అంతటి ప్రతిష్టాత్మకమైన ఈ అస్కార్ అవార్డుల ఎంపికలో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న కీలకమైన వ్యక్తులు జ్యూరీ సభ్యులుగా ఉంటారు. ఇదిలా ఉండగా తాజాగా ఈ ఏడాదికి సంబంధించి కొత్త సభ్యుల జాబితాను ఆస్కార్ వెల్లడించింది. ఇందులో బాలీవుడ్ నటి విద్యాబాలన్, నిర్మాత ఏక్తా కపూర్, ఆమె తల్లి శోభా కపూర్లు ఉండటం విశేషం. మొత్తం 50 దేశాలకు చెందిన 395 మంది సభ్యులు ఈ ఏడాది ఆస్కార్ సభ్యులుగా ఉన్నారు. ‘ద క్లాస్ ఆఫ్ 2021’ పేరుతో ఆస్కార్ ఆకాడమీ ఈ జాబితాను విడుదల చేసింది. ఈ సారి ఆస్కార్ సభ్యుల్లో 46 శాతం మంది మహిళలు ఉండటం గమనార్హం. కాగా ‘మిస్టరీ థ్రిల్లర్ కహానీ’ చిత్రంలో విద్యాబాలన్ గర్భవతిగా తన నటనకు విమర్శకుల నుంచి ప్రశంసలు అందుకున్నారు. ఇక ‘పా, బూల్బులయ్యా, పరిణీత, బాబీ జాసూస్, శకుంతలా దేవి’ చిత్రాల్లోనూ ఆమె నటించారు. 2011లో వచ్చిన ‘ద డర్టీ పిక్చర్’ సినిమాలో ప్రధాన పాత్ర పోషించిన విద్యాబాలన్కు జాతీయ ఫిల్మ్ అవార్డు దక్కిన విషయం తెలిసిందే. అలాగే బాలాజీ టెలి ఫిల్మ్స్కు చెందిన ప్రొడ్యూసర్లు ఏక్తా కపూర్, శోభా కపూర్లు కూడా ఆస్కార్ అకాడమీలో కొత్త సభ్యులయ్యారు. డ్రీమ్ గర్ల్, వన్స్ అపాన్ ఏ టైమ్ ఇన్ ముంబై, ఉడ్తా పంజాబ్, డర్టీ పిక్చర్ లాంటి సినిమాలకు వీళ్లు నిర్మాతలుగా వ్యవహరించారు. -
నటుడిపై అత్యాచార కేసు: ఏక్తాకపూర్ సంచలన వ్యాఖ్యలు
మైనర్ బాలికపై అత్యాచార, వేధింపుల కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న బాలీవుడ్ నటుడు పరల్ వీ పూరిని పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. అయితే ఆ ఆరోపణల్లో నిజం లేదని బాలిక తల్లి వాదిస్తోంది. దీంతో అక్రమంగా పరల్ను కేసులో ఇరికించారంటూ హిందీ బుల్లితెర అతడికి మద్దతుగా నిలుస్తోంది. ఈ క్రమంలో నిర్మాత ఏక్తా కపూర్ సంచలన వ్యాఖ్యలు చేసింది. "నేను ఓ బాలిక మీద అత్యాచారం చేసినవాడికి మద్దతిస్తానా? ఎవరినైనా సరే లైంగిక వేధింపులకు గురి చేసేవారికి అండగా నిలబడతానా? కానీ నిన్నరాత్రి నుంచి నాకు ఎదురైన పరిస్థితులు చూస్తుంటే మానవత్వం మంటగలిసినట్లు అనిపిస్తోంది. మరీ ఇంత దిగజారుతారా? ఇద్దరి మధ్య గొడవలుంటే అందులోకి మూడో వ్యక్తిని అన్యాయంగా లాగుతారా? అసలు ఓ మనిషి సాటి మనిషి మీద ఇలా ఎలా చేయగలడు? మైనర్ బాలిక తల్లితో చాలాసార్లు మాట్లాడాను. పిరల్ అమాయకుడని, అతడికి దీంతో ఏం సంబంధం లేదని ఆమె స్పష్టంగా చెప్పేసింది. తన భర్తే కావాలని అతడిని ఇరికిస్తున్నాడని వెల్లడించింది. సెట్లో పని చేసే మహిళలు పిల్లలను సరిగా చూసుకోలేరని నిరూపించేందుకు ఇదంతా చేస్తున్నాడని తెలిపింది. ఒకవేళ ఇదే నిజమైతే ఇది ఘోరమైన తప్పు. మీ టూను అడ్డుపెట్టుకుని స్వప్రయోజనాల కోసం చిన్నారిని మానసికంగా హింసిస్తూ ఓ అమాయక వ్యక్తిని దోషిగా నిలబెట్టాలని చూడటం అత్యంత దారుణం. ఈ ఘటనలో ఎవరిది తప్పు? ఎవరిది ఒప్పు? అనేది తేల్చేందుకు నాకెలాంటి హక్కు లేదు. ఆ విషయం న్యాయస్థానమే చూసుకుంటుంది. కానీ బాలిక తల్లి చెప్పినదాని ప్రకారం.. పిరల్ ఏమీ తెలియని అమాయకుడని స్పష్టమవుతోంది. ఇక ఉద్యోగం చేసుకునే మహిళలు పిల్లలను సరిగా చూసుకోలేరని నిరూపించేందుకు ఇలాంటి చెత్త ప్రయత్నాలు చేయడం నిజంగా బాధాకరం. View this post on Instagram A post shared by Erk❤️rek (@ektarkapoor) పిరల్ మీద మోపిన ఆరోపణలు అవాస్తవమని రుజువు చేసేందుకు నా దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయి. మిగతా ఇండస్ట్రీస్లాగానే చిత్ర పరిశ్రమ కూడా కొంత సురక్షితం, మరికొంత సురక్షితం కాకపోవచ్చు. కానీ సొంత ప్రయోజనాల కోసం చిత్రపరిశ్రమకు చెడ్డ పేరు తీసుకురావడం అనేది అత్యంత నీచమైన పని" అని ఏక్తా కపూర్ ఇన్స్టాగ్రామ్లో పోస్టు పెట్టింది. బుల్లితెర సెలబ్రిటీలు సహా పలువురు అభిమానులు ఆమె పోస్టుకు మద్దు తెలుపుతూ పిరల్కు అండగా నిలుస్తున్నారు. చదవండి: అత్యాచారం, వేధింపులు కేసులో ‘నాగిని 3’ నటుడు అరెస్టు -
ఏంటి? నీకు బ్యాగు బరువైతుందా?: నిర్మాతపై సెటైర్లు
-
ఏంటి? నీకు బ్యాగు బరువైతుందా?: నిర్మాతపై సెటైర్లు
ముంబై: కరోనా సెకండ్ వేవ్ కారణంగా మహారాష్ట్ర ప్రభుత్వం 15 రోజుల పాటు లాక్డౌన్ విధించిన సంగతి తెలిసిందే. దీంతో బాలీవుడ్ నిర్మాత ఏక్తా కపూర్ ముంబైని వీడి ఎక్కడికో పయనమైంది. ఇందుకోసం ముంబై ఎయిర్పోర్టుకు చేరుకుంది. ముందు జాగ్రత్త కొద్దీ రెండు ఫేస్ మాస్క్లు ధరించింది. అయితే ఆమె కారు దిగిన వెంటనే తన సామానులను హ్యాండ్ బ్యాగులో వేసుకుంది. కానీ ఆ బ్యాగును మాత్రం ధరించలేదు. ఆమె అసిస్టెంటు ఆ బ్యాగు మోశాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో ప్రత్యక్షం కాగా పలువురు నెటిజన్లు ఆమె తీరును తప్పు పడుతున్నారు. 'తన బ్యాగును తనే మోసుకోలేకపోతుందా?', 'ఆ చిన్న బ్యాగుకు కూడా అసిస్టెంట్ సాయం కావాలా?' అని విమర్శిస్తున్నారు. 'ఎంత ఆటిట్యూడ్ నీకు.. బ్యాగ్ బరువైతుందా? అయినా నువ్వు చాలా తెలివైనదానివి.. టీవీలో ఆదర్శభావాలు చూపించే నువ్వు, వెబ్సిరీస్లో మాత్రం అసభ్యకరమైన కంటెంట్ను చూపిస్తావు' అని విమర్శలు ఎక్కుపెడుతున్నారు. కాగా ఈ నిర్మాత ఇటీవలే గోవాలో 'ఏక్ విలన్ రిటర్న్స్' సినిమా షూటింగ్ను పూర్తి చేసిన విషయం తెలిసిందే. ఇందులో జాన్ అబ్రహాం, దిశా పటానీ, అర్జున్ కపూర్, తారా సుతారియా ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. ప్రస్తుతం ఆమె తన సొంత ఓటీటీ ప్లాట్ఫామ్ ఆల్ట్ బాలాజీలో 'హిస్ స్టోరీ' అనే వెబ్ సిరీస్ తెరకెక్కిస్తోంది. చదవండి: కార్తీ డబుల్ యాక్షన్ మూవీ: హీరోయిన్గా రాశీ ఖన్నా HBD Samantha: ఒక్క సినిమా సమంత జీవితాన్నే మార్చేసింది -
ఆ నటి గొంతు నాకన్నా ఘోరంగా ఉంది
జితేంద్ర అసలు పేరు రవికపూర్. కాని సినిమాల్లో రవీంద్ర కపూర్ అనే నటుడు ఉండటంతో తన పేరును జతేంద్ర అని మార్చుకున్నాడు. దాంతో జతిన్ ఖన్నాగా అసలు పేరు కలిగిన రాజేష్ ఖన్నా జితేంద్రకు దగ్గరగా ఉండే తన పేరు కాదని రాజేష్ ఖన్నా అని మార్చుకోవాల్సి వచ్చింది. రవికపూర్ (ఆర్.కె) అలా జితేంద్ర కపూర్ (జె.కె) అయితే జతిన్ ఖన్నా (జె.కె) పేరు మార్చుకుని రాజేష్ ఖన్నా (ఆర్.కె) అయ్యాడు. ఈ తారుమార్ల సంగతి ఇండియన్ ఐడెల్ తాజా ఎపిసోడ్లో ప్రేక్షకులతో పంచుకున్నారు జితేంద్ర. మార్చి 14న టెలికాస్ట్ అయిన ఇండియన్ ఐడెల్ ‘జితేంద్ర స్పెషల్’లో పాల్గొన్న ఆయన ముంబైలో ‘చాల్’లో తన 20వ ఏట వరకూ జీవించానని చెప్పారు. దాని వల్ల తాను పంజాబీ అయినా మరాఠి చాలా బాగా నేర్చుకోగలిగానని చెప్పారు. ‘మా ఇంట్లో మొదటిసారి ఫ్యాన్ బిగిస్తే దానిని చూడటానికి చాల్లో ఉన్న 60 ఇళ్ల వాళ్లూ వచ్చారు. అదో వింత. ట్యూబ్లైట్ బిగించినా వారికి వింతే. గణపతి పూజను కులమతాలకు అతీతంగా చేసేవారం. ఆ రోజులు మళ్లీ రావు’ అన్నాడాయన.‘నాకు జీవితంలో రెండు కోరికలు ఉన్నాయి. కలలు అనొచ్చు. ఒకటి ఇండియా బ్యాంటింగ్లో ఆరు వికెట్లు కోల్పోయినప్పుడు నేను బ్యాటింగ్కు వెళ్లి ఇండియాను గెలిపించడం. రెండు... మంచి గాయకుణ్ణి కావడం. కాని నా గొంతు చాలా చెడ్డగా ఉంటుంది. పాటల చిత్రీకరణలో నేను పెద్దపెద్దగా పాడుతూ యాక్ట్ చేస్తాను. కాని సౌండ్లో నా కఠినమైన గొంతు ఎవరికీ వినిపించేది కాదు. ఒకసారి ఇలాగే షాట్లో పెద్ద పెద్దగా పాడుతూ నటిస్తున్నాను. ఇంతలో ఏదో వైర్ తెగి పాట ఆగిపోయింది. నా గొంతు మాత్రం అసహ్యంగా అందరికీ వినిపించింది. అయితే కొంతలో కొంత మేలు ఏమిటంటే నాతో పాటు నటిస్తున్న ఆశా పరేఖ్ కూడా నాలాగే పెద్దగా పాడుతూ యాక్ట్ చేస్తోంది. ఆమె గొంతు నాకన్నా ఘోరంగా ఉంది’ అని నవ్వించారాయన. జితేంద్ర వయసు ఇప్పుడు 78 సంవత్సరాలు. ఈ వయసులో కూడా ఆయన చలాకీగా స్టెప్పులేయడం విశేషం. -
ఏక్తా కపూర్.. కష్టాలను ఎత్తి కుదేయండి
చిన్న వయసులో పెళ్లి. భర్త దాష్టీకం. మేరిటల్ రేప్. ఇంటి నుంచి పారిపోయి వస్తే ఎక్కడికీ పారిపోనివ్వని కడుపులో బిడ్డ. డిప్రెషన్. ఇన్ని కష్టాలు చుట్టుముడితే ఏం చేయాలి? భయపడి పారిపోవాలా? కండలు పెంచుతాను అనుకుంది నైనిటాల్కు చెందిన ఏక్తా. ఫిట్నెస్ ప్రోగ్రామ్ ద్వారా తన మనసును, శరీరాన్ని ఫిట్గా మార్చుకుంది. ఇవాళ పవర్లిఫ్టింగ్ ఛాంపియన్ అయ్యింది. అంతేనా ఉత్తరాఖండ్లో మొదటి ఖరీదైన పర్సనల్ ఫిట్నెస్ సెంటర్ యజమాని అయ్యింది. ‘నా పోరాటం తెలిస్తే మీ కష్టాలు చిన్నవైపోతాయి. వాటిని ఎత్తి కుదేస్తారు’ అంటోంది ఏక్తా. ‘నేను నా కథను ఎందుకు చెబుతున్నానంటే కష్టాలు ఉన్నాయని భావించే స్త్రీలు నా కథ విని ధైర్యం తెచ్చుకుంటారనే. కష్టాలు నెత్తి మీద ఎప్పుడూ ఉండే బండరాళ్లు కాదు. వాటిని ఎత్తి కిందకు కుదేయవచ్చు. దాటి ముందుకెళ్లవచ్చు’ అంటుంది 32 ఏళ్ల ఏక్తా కపూర్. ఈ పేరు వినగానే ఎంటర్టైన్మెంట్ రంగంలో ఉన్న ఏక్తా కపూర్ గుర్తుకు రావచ్చుగాని ఆమెకు ఈమెకు ఏ సంబంధమూ లేదు... ఆమె సీరియల్స్లో పెట్టే నాటకీయ కష్టాలు ఈమె నిజ జీవితంలో ఉన్నాయన్న ఒక్క పోలిక తప్ప. పోరాటం మొదలు.. ఏక్తా కపూర్ది నైనిటాల్. స్కూల్ అమ్మాయిగా ఉండగానే తల్లిదండ్రులు విడిపోయారు. ఏక్తా తండ్రితో ఉండిపోయింది. తండ్రి మళ్లీ పెళ్లి చేసుకోకుండా సింగిల్ పేరెంట్గా ఆమెను పెంచాడు. అతడు స్కూల్ టీచరు. 18 ఏళ్లు రాగానే తల్లితోడు లేని పిల్ల అని పెళ్లి చేశాడు. ‘ఆ పెళ్లితో నా కొత్త జీవితం మొదలవుతుందని అనుకున్నాను’ అంటుంది ఏక్తా. కాని అత్తవారింటిలో ఆమె నరకం చూసింది. భర్తకు వయసు చాలా ఎక్కువ. అబద్ధం చెప్పి చేశారు. పైగా అతను ఆమెను ఏనాడూ భార్యగా చూడలేదు. తాను భర్తగా ఉండలేదు. ‘నాకు ఏమీ తెలియదు. లైంగిక జీవితంపై అవగాహన లేదు. నేను అతన్ని స్వీకరించే లోపే అతను రోజూ మేరిటల్ రేప్ చేసేవాడు. ఆ రోజుల్లో దాని మీద ఫిర్యాదు చేసే పరిస్థితి లేదు. అదొక నేరం కూడా కాదు’ అంది ఏక్తా. పారిపోయి ఇల్లు చేరి ఏక్తా అత్తవారింటి నుంచి పారిపోయి ఇల్లు చేరింది. తండ్రి అక్కున చేర్చుకున్నాడు. విడాకులు ఇప్పించాడు. ‘బంధువులందరూ నా వైపు సానుభూతిగా చూడటమే. ఇది చిన్నప్పటి నుంచి దురదృష్టవంతురాలు అనేవారు. నాకు డిప్రెషన్ పెరిగిపోయి ఆత్మహత్యాయత్నం చేశాను. హాస్పిటల్లో చేరిస్తే నేను గర్భవతిని అని చెప్పారు. అప్పటికే బాగా వీక్గా ఉన్నాను. గర్భం నిలవడం కూడా కష్టమే అన్నారు. కాని కడుపులో ఉన్న నా కూతురిని కాపాడుకున్నాను’ అంది ఏక్తా. కూతురు పుట్టాక బంధువులు మళ్లీ ఆమెను చుట్టుముట్టారు. ఆ పిల్లను ఎవరికైనా దత్తత ఇచ్చేయ్.. అప్పుడే నువ్వు మరొకరిని పెళ్లి చేసుకోగలవు అన్నారు. కాని ఏక్తా ఒప్పుకోలేదు. బిడ్డను తనతోనే ఉంచుకుంది. రకరకాల ప్రయత్నాలు పాపకు మూడేళ్లు వచ్చాక తండ్రికి అప్పగించి ఏక్తా రకరకాల పనుల వెంట తిరిగింది. ఢిల్లీలో కొన్నాళ్లు పని చేసింది. కొన్నాళ్లు ఏక్టింగ్ నేర్చుకుంది. కొన్నాళ్లు టీచర్గా పని చేసింది. కాని తనకు ఏదీ సూట్ కాలేదు. అప్పుడే ఒక బంధువు ఆమెకు ఫిట్నెస్ ప్రోగ్రామ్ గురించి చెప్పాడు. ‘2014లో ముంబైలో జరిగిన ఆ ఫిట్నెస్ ప్రోగ్రామ్కు హాజరయ్యాక నాకు ఏది ఆనందాన్ని ఇస్తుందో అర్థమైంది. నా ఫిట్నెస్ కోసం నేను చేసిన కృషి నా శరీరాన్నే కాదు మైండ్ను కూడా గట్టి పరిచింది. ఏ కష్టమైనా ఎదుర్కొనగలననే ధైర్యం వచ్చింది నాకు.’ అంటుంది ఏక్తా. మలుపు తిరిగిన జీవితం ఫిట్నెస్ ట్రైనింగ్లోనే ఆమెకు ప్రస్తుత భర్త శశాంక్ పరిచయం అయ్యాడు. అతను కూడా ఫిట్నెస్ ట్రైనరే. ‘అతని ద్వారా ఫిట్నెస్ మీద నుంచి మెల్లగా నా ఫోకస్ వెయిట్లిఫ్టింగ్పై పెట్టాను. కాని అది ఎక్కువగా మగాళ్ల ప్రపంచం. నీకు ఇక్కడ ఏం పని అన్నట్టు చూశారు. కాని వెయిట్ లిఫ్టింగ్లో నా సత్తా చూపాలనుకున్నాను. జాతీయ స్థాయిలో మెడల్ సాధించాక గాని అందరు మగాళ్ల నోళ్లు మూత పడలేదు’ అంది ఏక్తా. ఆమె సాధించిన విజయాలను చూసి ఒకప్పుడు జాలిగా మాట్లాడినవారు ఇప్పుడు గొప్పగా మాట్లాడటం మొదలుపెట్టారు. కండలు తిరిగిన ఆమె చేతులను చూసి వినయంగా తప్పుకుంటున్నారు. అంతే కాదు... ఆమె కష్టాలు దాటిన పద్ధతిని చూసి గౌరవిస్తున్నారు. ‘నా ఫిట్నెస్ నేను అందరికీ ఇవ్వాలనుకున్నాను. అందుకే డెహరాడూన్లో అత్యంత అధునాతనమైన ఫిట్నెస్ స్టూడియోను ప్రారంభించాను’ అంటోంది ఏక్తా. భర్త, ఆమె కలిసి ఆ స్టూడియో నిర్వహిస్తున్నారు. కూతురు చదువుకుంటోంది. ‘నా కూతురిని మనస్ఫూర్తిగా ప్రేమించే భర్త దొరికాడు’ అని సంతోషపడుతోంది ఏక్తా. ‘పోరాడండి. గెలుపొందండి. ఆగిపోవద్దు అని స్త్రీలకు నేను చెప్పదలుచుకున్నాను’ అంటున్న ఏక్తా కచ్చితంగా ఒక బలమైన కండలు తిరిగిన స్ఫూర్తి మనకు. – సాక్షి ఫ్యామిలీ -
‘నాగినిలకు నాగ పంచమి శుభాకాంక్షలు’
న్యూఢిల్లీ: ఇవాళ నాగ పంచమి సందర్భంగా బాలీవుడ్ నిర్మాత ఏక్తా కపూర్ తన 'నాగిని'లకు ఇన్స్టాగ్రామ్ వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. అంతేగాక రాబోయే ‘నాగిని’ సీజన్-5 ప్రోమోను ఈ సందర్భంగా ఏక్తా ఆవిష్కరించారు. కానీ ఈ సిజన్లో కనిపించే కొత్త నాగిని ఎవరనేది మాత్రం తెలియకుండా కొత్త పోస్టర్ను షేర్ చేసి అభిమానులను అయోమయంలో పెట్టారు. ఏక్తా ఈ పోస్టులో ‘నా నాగినీలకు.. హ్యాపీ నాగ పంచమి’ అంటూ గత సీజన్ల్లోని నాగినిలు మోనీ రాయ్, అనిత, కరిష్మా, సురభీ జ్యోతీ, నియా శర్మ తదితరులను ట్యాగ్ చేశారు. (చదవండి: నాగుల పంచమి రోజున అరుదైన దృశ్యం) అయితే ఈ సీజన్లో హినా ఖాన్ నటించనున్నట్లు వార్తలు వస్తున్నప్పటికీ తను లీడ్రోల్లో నటిస్తుందా లేదా సపోర్టింగ్ క్యారెక్టర్లో నటించనుందా అనే దానిపై స్పష్టత లేదు. ఏదేమైనప్పటికీ ‘నాగినీ-5’లో నటించే ప్రధాన పాత్రల పేర్లను నిర్మాత గోప్యంగా ఉంచారు. 'కుండలి భాగ్య' ఫేమ్ ధీరజ్ ధూపర్ మేల్ లీడ్రోల్లో ఈ సీజన్లో కనిపించనున్నాడు. తన కొత్త సీరియల్పై ధీరజ్ అనందం వ్యక్తం చేస్తూ... ‘‘ఇది నాకు చాలా ఉత్తేజకరమైన సమయం. టెలివిజన్లో అగ్రశ్రేణి షో అయిన ‘నాగినీ’ వంటి కార్యక్రమంలో నటించాలన్నది ప్రతి నటుడి కల. ఇది నాకు సరికొత్త అనుభవంగా ఉంటుందని ఆశిస్తున్నాను. ఎందుకంటే నేను ఇంతకు ముందెన్నడు ఇలాంటి పాత్రలు చేయలేదు. ఏక్తా కపూర్తో కలిసి పనిచేయడం, కలర్స్తో మళ్లీ సంబంధం కలిగి ఉండటం చాలా ఆనందంగా ఉంది’ అంటూ చెప్పుకొచ్చాడు. View this post on Instagram HAPPY NAAG ‘PAANCHAMI’ ... to all my Naagins @imouniroy @anitahassanandani @adaakhann @karishmaktanna @surbhijyoti @imrashamidesai @niasharma90 A post shared by Erk❤️rek (@ektarkapoor) on Jul 24, 2020 at 11:57pm PDT -
పరిస్థితి మెరుగయ్యేదాకా షూటింగ్లు ఆపాలి!
సాక్షి, ముంబై: కరోనా మహమ్మారి అటు బాలీవుడ్ ప్రముఖులను, ఇటు బుల్లి తెర నటులను బెంబేలెత్తిస్తోంది. వరుసగా నటులు కరోనా బారినపడుతూ ఉండటంతో లాక్డౌన్ సడలింపుల తరువాత మొదలైన షూటింగ్ల సందడి నీరుగారిపోయింది. దీనికి తోడు బిగ్బీ అమితాబ్ బచ్చన్, సీనియర్ నటుడు అనుపమ్ ఖేర్ కుటుంబానికి వైరస్ సోకడం మరింత ఆందోళన కలిగిస్తోంది. షూటింగ్ సమయంలోనే అమితాబ్కు వైరస్ అంటుకుందన్నఅంచనాలు ఈ భయాలకు మరింత తోడయ్యాయి. దక్షిణాది టీవీ నటుడు, ఏక్తా కపూర్ నిర్మిస్తున్న ‘కసౌతి జిందగీ కే-2’ నటుడు పార్థ్ సమతాన్కు కోవిడ్-19 పాజిటివ్ రావడంతో నటి బిపాసా బసు సోషల్ మీడియాలో స్పందించారు. కరోనా వైరస్ బారిన పడే అవకాశాలు నటీనటులకే ఎక్కువ ఉన్నాయంటూ ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. అంతేకాదు కొంత కాలంపాటు షూటింగ్లకు దూరంగా ఉంటే మంచిదని ఆమె సూచించారు. యూనిట్ సభ్యులు పర్సనల్ ప్రొటెక్షన్ ఎక్విప్మెంట్ (పీపీఈ) కిట్లు, ఫేస్ షీల్డ్స్ లాంటి సేఫ్టీ మెజర్స్తో పనిచేయవచ్చు..కానీ నటులకు అలాంటి పరిస్థితి లేదు. మాస్క్లు తదితర రక్షణ కవచాలు లేకుండానే నటించాల్సి ఉంటుందని బిపాసా బసు గుర్తు చేశారు. నటీనటులు కరోనా బారిన పడుతుండటానికి ఇదే కారణమన్నారు. అందుకే పరిస్థితులు మెరుగయ్యేంతవరకు అన్ని రకాల షూటింగులను ఆపేయాలని కోరారు. (నటుడికి కరోనా.. సహా నటులకు కోవిడ్ పరీక్షలు) మరోవైపు బిపాసా బసు భర్త, నటుడు కరణ్ సింగ్ గ్రోవర్, కసౌతి జిందగీ కే 2 లో మిస్టర్ బజాజ్ పాత్రను పోషించారు. అయితే కరోనా కారణంగా కరణ్ సింగ్ ఈ ప్రాజెక్టునుంచి తప్పుకోవడంతో నటుడు కరణ్ పటేల్ ఈ పాత్రలో నటిస్తున్నారు. దీనికి సంబంధించి కొన్ని ఎపిసోడ్ల షూటింగ్ పూర్తయింది. ఈ వారంలో ఇవి టెలికాస్ట్ కావాల్సి ఉంది. అయితే పార్థ్ సమతాన్ కు కరోనా సోకడంతో ‘కసౌతి జిందగీ కే’ సెట్లో ప్రకంపనలు రేపింది. దీనిపై నిర్మాత ఏక్తా కపూర్ కూడా ఒక ప్రకటన విడుదల చేశారు. అవసరమైన అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని వెల్లడించారు.(బాలీవుడ్లో మరో విషాదం) కాగా కరోనా కట్టడికోసం దేశవ్యాప్తంగా విధించిన లాక్డౌన్లో క్రమంగా సడలింపుల నేపథ్యంలో టెలివిజన్ షోలు, సినిమాలు, ఇతర ఎంటర్టైన్మెంట్ ప్రాజెక్టుల చిత్రీకరణ పనులు తిరిగి ప్రారంభమయ్యాయి. ఇటు తెలుగు టీవీ నటులు కూడా కరోనా బారిన పడటం కలవరం రేపిన సంగతి తెలిసిందే. View this post on Instagram All necessary precautions are being taken, SOPs being followed. For us at Balaji, Health & Safety comes first, above all else! Take care. Jai Mata Di.🙏🏻 #Repost @balajitelefilmslimited with @make_repost A post shared by Erk❤️rek (@ektarkapoor) on Jul 12, 2020 at 4:50am PDT
Pagination
ఓటు ఎలా వేయాలో తెలుసా..?
ఇది కదా క్రేజ్ అంటే.. సీఎం జగన్ ఇంటర్వ్యూకి మిలియన్ల వ్యూస్
Sakshi.com ఇప్పుడు సరికొత్తగా మీ ముందుకు
కాపులు, ముస్లింలకు రిజర్వేషన్లు అక్కర్లేదు: పవన్కళ్యాణ్
రైతు కుమార్తె విజయం.. రిషబ్ శెట్టి అభినందనలు
పులివెందుల ప్రజలకు ఇద్దరిపైనా ప్రేమే: వైఎస్ భారతి
RCB Vs PBKS: కోహ్లి అరుదైన రికార్డు.. ఐపీఎల్ చరిత్రలోనే తొలి క్రికెటర్గా
Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో బిగ్ ట్విస్ట్..
బిజీగా ఉండటం ఇంత డేంజరా! హెచ్చరిస్తున్న సైకాలజిస్ట్లు
కారులో వాసన బాగుందని తెగ పీల్చుకుంటున్నారా.?
కాల యముళ్లు
కాళేశ్వరం ప్రాజెక్ట్ తో కాంగ్రెస్ కు ఈ ఎన్నికల్లో గట్టి దెబ్బే..
చుండ్రు సమస్య వేధిస్తోందా? ఇలా ట్రై చేయండి!
భారత్ దౌత్యం సక్సెస్.. ఇరాన్ చెర నుంచి ఐదుగురు రిలీజ్
Priyanka Kholgade: స్టైలిష్ లుక్లో ప్రియాంక ఖోల్గడే.. పిక్స్ వైరల్ (ఫొటోలు)
Sreemukhi: ఈమె వాయిస్ ముందు డీజే కూడా తక్కువే.. శ్రీముఖి బర్త్డే స్పెషల్ (ఫోటోలు)
పేదలను ముప్పుతిప్పలు పెడుతున్న చంద్రబాబు
మేతకొచ్చాడు.. మరో నేత!
Mirnalini Ravi: లవ్ గురు బ్యూటీ కొంటె అందాలు (ఫోటోలు)
నాకోసం ఆ స్టార్ హీరో నెలలతరబడి వెయిట్ చేశాడు: కమెడియన్
తప్పక చదవండి
- ఏఐ యూనివర్సిటీ.. ఒడిశా మేనిఫెస్టోలో ఆసక్తికర హామీలు
- అక్కా నన్ను పెళ్లి చేసుకుంటావా?.. యంగ్ హీరోయిన్కు ఉహించని ప్రశ్న!
- జనగణన లేకుండా ఈ లెక్కలేల?
- మారుతీ స్విఫ్ట్ కొత్త మోడల్
- ఇదిగో ప్రోగ్రెస్ రిపోర్ట్
- ఎస్బీఐ లాభం రికార్డ్
- 15 సెకన్లు కాదు.. 15 గంటలు ఇవ్వండి..: అసదుద్దీన్ ఒవైసీ
- మద్యం మత్తుతో ఓటర్ల చిత్తుకు చంద్రబాబు కుట్ర
- RCB Vs PBKS: ఆర్సీబీ ఘన విజయం.. ఐపీఎల్ నుంచి పంజాబ్ ఔట్
- ఓటు ఎలా వేయాలో తెలుసా..?
Advertisement