-
బెంగళూరులో దుమ్మురేగొట్టిన ఆరెంజ్ ఆర్మీ ‘ఓ రేంజ్’ బ్యాటింగ్ (ఫొటోలు)
-
IPL 2024, DC VS KKR: ఢిల్లీని చిత్తు చేసిన కేకేఆర్
ఢిల్లీని చిత్తు చేసిన కేకేఆర్ ఐపీఎల్ 2024లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్తో ఇవాళ (ఏప్రిల్ 3) జరిగిన మ్యాచ్లో కేకేఆర్ 106 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన కేకేఆర్.. సునీల్ నరైన్ (39 బంతుల్లో 85; 7 ఫోర్లు, 7 సిక్సర్లు), రఘువంశీ (27 బంతుల్లో 54; 5 ఫోర్లు, 3 సిక్సర్లు), ఆండ్రీ రసెల్ (19 బంతుల్లో 41; 4 ఫోర్లు, 3 సిక్సర్లు), శ్రేయస్ అయ్యర్ (11 బంతుల్లో 18; 2 సిక్సర్లు), రింకూ సింగ్ (8 బంతుల్లో 26; ఫోర్, 3 సిక్సర్లు) చెలరేగడంతో నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 272 పరుగుల చేసింది. ఢిల్లీ బౌలర్లలో నోర్జే 3, ఇషాంత్ శర్మ 2, ఖలీల్ అహ్మద్, మిచెల్ మార్ష్ తలో వికెట్ పడగొట్టారు. అనంతరం భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఢిల్లీ.. 17.2 ఓవర్లలో 166 పరుగులకే చాపచుట్టేసింది. రిషబ్ పంత్ (55), ట్రిస్టన్ స్టబ్స్ (54) ఓటమి ఖరారైన దశలో బ్యాట్ను ఝులిపించారు. వీరిద్దరు మినహా ఢిల్లీ ఆటగాళ్లంతా చేతులెత్తేశారు. వార్నర్ (18), పృథ్వీ షా (10) రెండంకెంల స్కోర్లు చేయగా.. మార్ష్, పోరెల్, అక్షర్ డకౌట్లయ్యారు. కేకేఆర్ బౌలర్లలో వైభవ్ అరోరా, వరుణ్ చక్రవర్తి అద్భుతంగా బౌల్ చేసి చెరి 3 వికెట్లు పడగొట్టారు. స్టార్క్ 2, రసెల్, నరైన్ తలో వికెట్ దక్కించుకున్నారు. ఐదో వికెట్ కోల్పోయిన ఢిల్లీ.. పంత్ ఔట్ మెరుపు అర్దశతకం బాదిన అనంతరం పంత్ (55) ఔటయ్యాడు. వరుణ్ చక్రవర్తి బౌలింగ్లో శ్రేయస్ అయ్యర్కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. చితక్కొడుతున్న పంత్.. 23 బంతుల్లో ఫిఫ్టి వెంకటేశ్ అయ్యర్ వేసిన 12వ ఓవర్లో పంత్ చెలరేగిపోయాడు. నాలుగు ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 28 పరుగులు పిండుకున్నాడు. పంత్ 23 బంతుల్లోనే హాఫ్ సెంచరీని కేవలం 23 బంతుల్లోనే పూర్తి చేశాడు. 12 ఓవర్లలో ఢిల్లీ స్కోర్ 125/4గా ఉంది. పోరాడుతున్న పంత్, స్టబ్స్ 273 పరుగల లక్ష్య ఛేదనలో 33 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయిన ఢిల్లీని రిషబ్ పంత్ (11 బంతుల్లో 23; 3 సిక్సర్లు), ట్రిస్టన్ స్టబ్స్ (16 బంతుల్లో 25; 2 ఫోర్లు, 2 సిక్సర్లు) ఆదుకునే ప్రయత్నం చేస్తున్నారు. 9 ఓవర్ల అనంతరం ఢిల్లీ స్కోర్ 83/4గా ఉంది. పేకమేడలా కూలుతున్న ఢిల్లీ క్యాపిటల్స్ ఢిల్లీ బ్యాటింగ్ లైనప్ పేకమేడలా కూలుతుంది. 33 పరుగులకే ఆ జట్టు నాలుగు వికెట్లు కోల్పోయింది. స్టార్క్ బౌలింగ్లో సిక్సర్ బాదిన అనంతరం వార్నర్ (18) ఔటయ్యాడు. 5 ఓవర్లలో ఢిల్లీ స్కోర్ 40/4గా ఉంది. రిషబ్ పంత్ (6), ట్రిస్టన్ స్టబ్స్ (1) క్రీజ్లో ఉన్నారు. మూడో వికెట్ కోల్పోయిన ఢిల్లీ 27 పరుగుల వద్ద ఢిల్లీ మూడో వికెట్ కోల్పోయింది. వైభవ్ అరోరా బౌలింగ్లో సునీల్ నరైన్కు క్యాచ్ ఇచ్చి అభిషేక్ పోరెల్ (0) ఔటయ్యాడు. రెండో వికెట్ కోల్పోయిన ఢిల్లీ 26 పరుగుల వద్ద ఢిల్లీ క్యాపిటల్స్ రెండో వికెట్ కోల్పోయింది. స్టార్క్ బౌలింగ్లో రమన్దీప్కు క్యాచ్ ఇచ్చి మిచెల్ స్టార్క్ (0) ఔటయ్యాడు.డేవిడ్ వార్నర్కు (11) జతగా అభిషేక్ పోరెల్ (0) క్రీజ్లోకి వచ్చాడు. 273 పరుగుల లక్ష్యం.. తొలి వికెట్ కోల్పోయిన ఢిల్లీ 273 పరుగుల లక్ష్య ఛేదనలో ఢిల్లీ క్యాపిటల్స్ తొలి వికెట్ కోల్పోయింది. 21 పరుగుల వద్ద వైభవ్ అరోరా బౌలింగ్లో వరుణ్ చక్రవర్తికి క్యాచ్ ఇచ్చి పృథ్వీ షా (10) ఔటయ్యాడు. వార్నర్తో (10), మిచెల్ మార్ష్ జత కలిశాడు. వీరంగం సృష్టించిన కేకేఆర్ బ్యాటర్లు.. ఐపీఎల్ చరిత్రలో రెండో భారీ స్కోర్ ఢిల్లీ క్యాపిటల్స్తో జరుగుతున్న మ్యాచ్లో కేకేఆర్ బ్యాటర్లు శివాలెత్తిపోయారు. టాపార్డర్ బ్యాటర్లు పోటాపోటీపడి విధ్వంసం సృష్టించారు.తద్వారా ఐపీఎల్ చరిత్రలో రెండో భారీ స్కోర్ నమోదైంది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన కేకేఆర్.. సునీల్ నరైన్ (39 బంతుల్లో 85; 7 ఫోర్లు, 7 సిక్సర్లు), రఘువంశీ (27 బంతుల్లో 54; 5 ఫోర్లు, 3 సిక్సర్లు), ఆండ్రీ రసెల్ (19 బంతుల్లో 41; 4 ఫోర్లు, 3 సిక్సర్లు), శ్రేయస్ అయ్యర్ (11 బంతుల్లో 18; 2 సిక్సర్లు), రింకూ సింగ్ (8 బంతుల్లో 26; ఫోర్, 3 సిక్సర్లు) ఆకాశమే హద్దుగా చెలరేగిపోవడంతో నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 272 పరుగుల అతి భారీ స్కోర్ చేసింది. ఇదే సీజన్లో ముంబై ఇండియన్స్పై సన్రైజర్స్ చేసిన 277 స్కోర్ ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక స్కోర్గా ఉంది. మూడో వికెట్ కోల్పోయిన కేకేఆర్.. రఘువంశీ ఔట్ 27 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 54 పరుగులు చేసి అనంతరం రఘువంశీ ఔటయ్యాడు. నోర్జే బౌలింగ్లో ఇషాంత్ శర్మ క్యాచ్ పట్టాడు. 14 ఓవర్ల తర్వాత కేకేఆర్ స్కోర్ 181/3గా ఉంది. రసెల్ (9), శ్రేయస్ (1) క్రీజ్లో ఉన్నారు. 25 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసిన రఘువంశీ కేకేఆర్ యువ ఆటగాడు రఘువంశీ కేవలం 25 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. ఇందులో 4 ఫోర్లు, 3 సిక్సర్లు ఉన్నాయి. 13 ఓవర్ల తర్వాత కేకేఆర్ స్కోర్ 171/3గా ఉంది. రఘువంశీకి జతగా రసెల్ (5) క్రీజ్లో ఉన్నాడు. చితకబాది ఔటైన నరైన్.. కేకేఆర్ స్కోర్ 164/2 39 బంతుల్లో 7 ఫోర్లు, 7 సిక్సర్ల సాయంతో 85 పరుగులు చేసిన సునీల్ నరైన్ ఇన్నింగ్స్ 13వ ఓవర్ మూడో బంతికి మిచెల్ మార్ష్ బౌలింగ్లో వికెట్కీపర్ పంత్కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. ప్రస్తుతం కేకేఆర్ స్కోర్ 164/2గా ఉంది. రఘువంశీకి (49) జతగా రసెల్ క్రీజ్లోకి వచ్చాడు. 10 ఓవర్లలో వికెట్ నష్టానికి 135 పరుగులు చేసిన కేకేఆర్ సునీల్ నరైన్ (32 బంతుల్లో 74; 7 ఫోర్లు, 6 సిక్సర్లు) , రఘువంశీ (16 బంతుల్లో 33; 4 ఫోర్లు, సిక్స్) ధాటికి కేకేఆర్ 10 ఓవర్లలో వికెట్ నష్టానికి 135 పరుగులు చేసింది. 21 బంతుల్లోనే హాఫ్ సెంచరీ బాదిన నరైన్ కేకేఆర్ ఓపెనర్ సునీల్ నరైన్ శివాలెత్తిపోయాడు. కేవలం 21 బంతుల్లోనే 6 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. ఫలితంగా కేకేఆర్ 6 ఓవర్లలో వికెట్ నష్టానికి 88 పరుగులు చేసింది. తొలి వికెట్ కోల్పోయిన కేకేఆర్ 4.3వ ఓవర్: 60 పరుగుల వద్ద కేకేఆర్ తొలి వికెట్ కోల్పోయింది. నోర్జే బౌలింగ్లో ట్రిస్టన్ స్టబ్స్కు క్యాచ్ ఇచ్చి సాల్ట్ (18) ఔటయ్యాడు. విధ్వంసం సృష్టిస్తున్న సునీల్ నరైన్ కేకేఆర్ ఓపెనర్ సునీల్ నరైన్ విధ్వంసం సృష్టిస్తున్నాడు. 15 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 34 పరుగులు చేశాడు. ఇషాంత్ వేసిన మూడో ఓవర్లో నరైన్ మూడు సిక్సర్లు, రెండు బౌండరీలు బాదాడు. ఫలితంగా ఆ ఓవర్లో ఏకంగా 26 పరుగులు వచ్చాయి. 4 ఓవర్ల తర్వాత కేకేఆర్ స్కోర్ 58/0గా ఉంది. నరైన్తో పాటు ఫిలిప్ సాల్ట్ (16) క్రీజ్లో ఉన్నాడు. ఐపీఎల్ 2024లో భాగంగా విశాఖలోని వైఎస్ రాజశేఖర రెడ్డి స్టేడియంలో ఇవాళ (ఏప్రిల్ 3) ఢిల్లీ క్యాపిటల్స్, కోల్కతా నైట్రైడర్స్ జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్లో కేకేఆర్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. ప్రస్తుత సీజన్లో కేకేఆర్ ఆడిన రెండు మ్యాచ్ల్లో విజయాలు సాధించి పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో ఉండగా.. ఢిల్లీ ఆడిన 3 మ్యాచ్ల్లో ఒకటి గెలిచి ఏడో స్థానంలో నిలిచింది. తుది జట్లు.. కోల్కతా నైట్రైడర్స్: ఫిలిప్ సాల్ట్(వికెట్కీపర్), వెంకటేష్ అయ్యర్, శ్రేయస్ అయ్యర్(కెప్టెన్), రింకూ సింగ్, అంగ్క్రిష్ రఘువంశీ, ఆండ్రీ రస్సెల్, సునీల్ నరైన్, రమణదీప్ సింగ్, మిచెల్ స్టార్క్, హర్షిత్ రాణా, వరుణ్ చక్రవర్తి ఢిల్లీ క్యాపిటల్స్: పృథ్వీ షా, డేవిడ్ వార్నర్, మిచెల్ మార్ష్, రిషబ్ పంత్(కెప్టెన్/వికెట్కీపర్), ట్రిస్టన్ స్టబ్స్, అక్షర్ పటేల్, సుమిత్ కుమార్, రసిఖ్ దార్ సలామ్, అన్రిచ్ నోర్ట్జే, ఇషాంత్ శర్మ, ఖలీల్ అహ్మద్ -
నంద్యాల సభ: సీఎం జగన్ ప్రసంగంలో హైలైట్స్
-
IPL 2024: సన్రైజర్స్ చేతిలో చిత్తైన ముంబై ఇండియన్స్
IPL 2024 SRH VS MI Match Highlights And Updates: బ్యాటర్ల ఊచకోత.. ముంబైను చిత్తు చేసిన సన్రైజర్స్ ఐపీఎల్ 2024లో భాగంగా ముంబై ఇండియన్స్తో ఇవాళ (మార్చి 27) జరిగిన మ్యాచ్లో సన్రైజర్స్ బ్యాటర్లు వీరంగం సృష్టించారు. ఫలితంగా ఆరెంజ్ ఆర్మీ 31 పరుగుల తేడాతో ముంబైను చిత్తు చేయడంతో పాటు లీగ్ చరిత్రలోనే అత్యధిక టీమ్ స్కోర్ నమోదు చేసింది. ఈ మ్యాచ్లో టాస్ ఓడి ముంబై ఆహ్వానం మేరకు తొలుత బ్యాటింగ్ చేసిన సన్రైజర్స్.. ట్రవిస్ హెడ్ (24 బంతుల్లో 62; 9 ఫోర్లు, 3 సిక్సర్లు), అభిషేక్ శర్మ (23 బంతుల్లో 63; 3 ఫోర్లు, 7 సిక్సర్లు), హెన్రిచ్ క్లాసెన్ (34 బంతుల్లో 80 నాటౌట్; 4 ఫోర్లు, 7 సిక్సర్లు) మెరుపు అర్దశతకాలతో విరుచుకుపడటంతో నిర్ణీత ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 277 పరుగులు చేసింది. ఛేదనలో ముంబై 12 ఓవర్ల వరకు సన్రైజర్స్ ధీటుగా బదులిచ్చింది. అయితే ఆ తర్వాత స్కోర్ నెమ్మదించడంతో ముంబై ఓటమి ఖరారైంది. ఇషాన్ కిషన్ (13 బంతుల్లో 34; 2 ఫోర్లు, 4 సిక్సర్లు), రోహిత్ శర్మ (12 బంతుల్లో 26; ఫోర్, 2 సిక్సర్లు), నమన్ ధిర్ (14 బంతుల్లో 30; 2 ఫోర్లు, 2 సిక్సర్లు), తిలక్ వర్మ (34 బంతుల్లో 64; 2 ఫోర్లు, 6 సిక్సర్లు), టిమ్ డేవిడ్ (22 బంతుల్లో 42 నాటౌట్; 2 ఫోర్లు, 3 సిక్సర్లు), హార్దిక్ పాండ్యా (20 బంతుల్లో 24; ఫోర్, సిక్స్), రొమారియో షెపర్డ్ (6 బంతుల్లో 12 నాటౌట్; 2 ఫోర్లు, సిక్స్) సన్రైజర్స్ శిబిరంలో కలకలం సృష్టించారు. ముంబై నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 246 పరుగులు చేసి లక్ష్యానికి 32 పరుగుల దూరంలో నిలిచిపోయి ఓటమిపాలైంది. ముంబై గెలుపుకు 30 బంతుల్లో 93 పరుగులు అవసరం ఈ మ్యాచ్లో ముంబై గెలవాలంటే 30 బంతుల్లో 93 పరుగులు చేయాల్సి ఉంది. హార్దిక్ పాండ్యా (20), టిమ్ డేవిడ్ క్రీజ్లో ఉన్నారు. 15 ఓవర్ తొలి బంతికే కమిన్స్ తిలక్ వర్మ (64) ఔట్ చేశాడు. 15 ఓవర్ల తర్వాత ముంబై స్కోర్ 185/గా ఉంది. రఫ్ఫాడిస్తున్న తిలక్.. 10 ఓవర్లలో ముంబై స్కోర్ 141/2 తిలక్ వర్మ ఆకాశమే హద్దుగా చెలరేగిపోతున్నాడు. షాబాజ్ అహ్మద్ వేసిన ఇన్నింగ్స్ 10వ ఓవర్లో తిలక్ 3 సిక్సర్లు బాది 22 పరుగులు పిండుకున్నాడు. తిలక్ 24 బంతుల్లో 2 ఫోర్లు, 5 సిక్సర్ల సాయంతో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. 10.2 ఓవర్ల తర్వాత ముంబై స్కోర్ 146/2గా ఉంది. తిలక్తో (52) పాటు నమన్ ధిర్ (26) క్రీజ్లో ఉన్నాడు. 7.3 ఓవర్లలోనే 100 పరుగులు పూర్తి చేసిన ముంబై ఇండియన్స్ భారీ లక్ష్యఛేదనలో సన్రైజర్స్కు ధీటుగా ముంబై ఇండియన్స్ బదులిస్తుంది. ముంబై 7.3 ఓవర్లలనే 100 పరుగుల మార్కును తాకింది. ఇషాన్ కిషన్ (34), రోహిత్ శర్మ (26) ఉతికి ఆరేసి ఔట్ కాగా.. నమన్ ధిర్ (16), తిలక్ వర్మ (19) క్రీజ్లో ఉన్నారు. 8 ఓవర్ల తర్వాత ముంబై స్కోర్ 102/గా ఉంది. టార్గెట్ 278.. ధీటుగా బదులిస్తున్న ముంబై 278 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో ముంబై ఇండియన్స్ ధీటుగా బదులిస్తుంది. ఆ జట్టు 5 ఓవర్ల అనంతరం 2 వికెట్లు కోల్పోయి 67 పరుగులు చేసింది. ఇషాన్ కిషన్ (34), రోహిత్ శర్మ (26) ఉతికి ఆరేసి ఔట్ కాగా.. నమన్ ధిర్ (2), తిలక్ వర్మ (1) క్రీజ్లో ఉన్నారు. సన్రైజర్స్ బ్యాటర్ల వీరంగం.. ఐపీఎల్ చరిత్రలో అత్యధిక స్కోర్ నమోదు ముంబై ఇండియన్స్తో ఇవాళ జరుగుతున్న మ్యాచ్లో సన్రైజర్స్ బ్యాటర్లు వీరంగం సృష్టించడంతో ఐపీఎల్ చరిత్రలో అత్యధిక టీమ్ స్కోర్ నమోదైంది. ఈ మ్యాచ్లో ముగ్గురు ఎస్ఆర్హెచ్ బ్యాటర్లు సుడిగాలి అర్దశతకాలు బాదారు. ట్రవిస్ హెడ్ 24 బంతుల్లో 62, అభిషేక్ శర్మ 23 బంతుల్లో 63, హెన్రిచ్ క్లాసెన్ 34 బంతుల్లో 80 పరుగులు (నాటౌట్) చేశారు. మార్క్రమ్ సైతం తానేమీ తక్కువ కాదని 28 బంతుల్లో 42 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. ఫలితంగా సన్రైజర్స్ నిర్ణీత ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 277 పరుగులు చేసింది. 23 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసిన క్లాసెన్ హెన్రిచ్ క్లాసెన్ కేవలం 23 బంతుల్లో బౌండరీ, 5 సిక్సర్ల సాయంతో హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. 18 ఓవర్ల తర్వాత సన్రైజర్స్ స్కోర్ 243/3గా ఉంది. క్లాసెన్తో పాటు మార్క్రమ్ (40) క్రీజ్లో ఉన్నాడు. 14.4 ఓవర్లలోనే 200 పరుగులు పూర్తి చేసిన సన్రైజర్స్ సన్రైజర్స్ కేవలం 14.4 ఓవర్లలోనే 200 పరుగుల మార్కును తాకింది. మార్క్రమ్ (31), క్లాసెన్ (26) క్రీజ్లో ఉన్నారు. 12 ఓవర్లలోనే 173 పరుగులు చేసిన సన్రైజర్స్ 11వ ఓవర్ ఆఖరి బంతికి అభిషేక్ శర్మ (23 బంతుల్లో 63; 3 ఫోర్లు, 7 సిక్సర్లు) ఔటయ్యాడు. పియూశ్ చావ్లా బౌలింగ్లో నమన్ ధిర్కు క్యాచ్ ఇచ్చి అభిషేక్ ఔటయ్యాడు. 12 ఓవర్ల తర్వాత సన్రైజర్స్ స్కోర్ 173/3గా ఉంది. మార్క్రమ్ (21), క్లాసెన్ (8) క్రీజ్లో ఉన్నారు. 16 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసిన అభిషేక్ అభిషేక్ శర్మ కేవలం 16 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. ఇందులో 2 ఫోర్లు, 6 సిక్సర్లు ఉన్నాయి. సన్రైజర్స్ 10 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 148 పరుగులు చేసింది. అభిషేక్ (54), మార్క్రమ్ (13) క్రీజ్లో ఉన్నారు. హాఫ్ సెంచరీ అనంతరం ఔటైన హెడ్.. పెను విధ్వంసం సృష్టించిన అనంతరం హెడ్ (24 బంతుల్లో 62; 9 ఫోర్లు, 3 సిక్సర్లు) కొయెట్జీ బౌలింగ్లో హార్దిక్కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. 8 ఓవర్ల తర్వాత సన్రైజర్స్ స్కోర్ 117/2గా ఉంది. అభిషేక్ (32), మార్క్రమ్ (4) క్రీజ్లో ఉన్నాడు. పవర్ ప్లేలో (81/1) సన్రైజర్స్కు ఇదే అత్యధిక స్కోర్. 7 ఓవర్లలోనే 100 పరుగులు పూర్తి చేసిన సన్రైజర్స్ సన్రైజర్స్ ఆటగాళ్లు శివాలెత్తిపోతున్నారు. ముఖ్యంగా ట్రవిస్ హెడ్ (22 బంతుల్లో 62 నాటౌట్; 9 ఫోర్లు, 3 సిక్సర్లు) ఆకాశమే హద్దుగా చెలరేగిపోతున్నాడు. హెడ్ కేవలం 18 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. ఇన్నింగ్స్ ఏడో ఓవర్లో అభిషేక్ శర్మ సైతం చెలరేగిపోయాడు. పియూశ్ చావ్లా వేసిన ఆ ఓవర్లో అభిషేక్ మూడు సిక్సర్లు బాదాడు. తొలి బంతికే వికెట్ తీసిన హార్దిక్ 4.1 ఓవర్: హార్దిక్ పాండ్యా తన స్పెల్ తొలి బంతికే వికెట్ తీశాడు. టిమ్ డేవిడ్కు క్యాచ్ ఇచ్చి మయాంక్ అగర్వాల్ (11) ఔటయ్యాడు. వీరంగం సృష్టిస్తున్న ట్రవిస్ హెడ్ సన్రైజర్స్ ఓపెనర్ ట్రవిస్ హెడ్ వీరంగం సృష్టిస్తున్నాడు. కేవలం 10 బంతుల్లోనే 4 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 31 పరుగులు చేశాడు. యువ పేసర్ మపాకా వేసిన మూడో ఓవర్లోనే హెడ్ శివాలెత్తిపోయాడు. ఈ ఓవర్లో హెడ్ వరుసగా రెండు సిక్సర్లు, రెండు ఫోర్లు బాది 22 పరుగులు పిండుకున్నాడు. 4 ఓవర్ల తర్వాత సన్రైజర్స్ వికెట్ నష్టపోకుండా 45 పరుగులు చేసింది. హెడ్ (32),మయాంక్ అగర్వాల్ (11) క్రీజ్లో ఉన్నారు. ఐపీఎల్ 2024లో భాగంగా ఇవాళ (మార్చి 27) సన్రైజర్స్ హైదరాబాద్, ముంబై ఇండియన్స్ జట్లు తలపడుతున్నాయి. హైదరాబాద్ వేదికగా జరుగనున్న ఈ మ్యాచ్ రాత్రి 7:30య గంటలకు ప్రారంభమవుతుంది. ఈ మ్యాచ్లో ముంబై కెప్టెన్ హార్దిక్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నాడు. ఈ సీజన్లో ఇరు జట్లు తమతమ తొలి మ్యాచ్ల్లో ఓటమిపాలై బోణీ గెలుపు కోసం ఎదురు చూస్తున్నాయి. సన్రైజర్స్ తమ తొలి మ్యాచ్లో కేకేఆర్ చేతిలో ఓటమిపాలు కాగా.. ముంబై ఇండియన్స్ గుజరాత్ టైటాన్స్ చేతిలో పరాజయంపాలైంది. తొలి మ్యాచ్లో దెబ్బతిన్న ఇరు జట్లు బలాబలాల విషయంలో సమతూకంగా ఉండటంతో నేటి మ్యాచ్ రసవత్తరంగా సాగే అవకాశం ఉంది. ఈ మ్యాచ్ ముంబై ఇండియన్స్ మాజీ సారధి రోహిత్ శర్మకు ఆ జట్టు తరఫున 200వ మ్యాచ్ కావడం విశేషం. సన్రైజర్స్ హైదరాబాద్: ట్రవిస్ హెడ్, మయాంక్ అగర్వాల్, అభిషేక్ శర్మ, ఎయిడెన్ మార్క్రమ్, హెన్రిచ్ క్లాసెన్(వికెట్కీపర్), అబ్దుల్ సమద్, షాబాజ్ అహ్మద్, పాట్ కమిన్స్(కెప్టెన్), భువనేశ్వర్ కుమార్, మయాంక్ మార్కండే, జయదేవ్ ఉనద్కత్ ముంబై ఇండియన్స్: ఇషాన్ కిషన్(వికెట్కీపర్), రోహిత్ శర్మ, నమన్ ధీర్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా(కెప్టెన్), టిమ్ డేవిడ్, గెరాల్డ్ కోయెట్జీ, షమ్స్ ములానీ, పీయూష్ చావ్లా, జస్ప్రీత్ బుమ్రా, క్వేన మపాకా ముంబై ఇండియన్స్ సబ్స్: డెవాల్డ్ బ్రెవిస్, రొమారియో షెపర్డ్, మొహమ్మద్ నబీ, విష్ణు వినోద్, నేహాల్ వధేరా సన్రైజర్స్ హైదరాబాద్ సబ్లు: నితీష్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్, ఉమ్రాన్ మాలిక్, గ్లెన్ ఫిలిప్స్, ఉపేంద్ర యాదవ్ -
RR VS LSG Updates: బోణీ కొట్టిన రాజస్తాన్.. లక్నోపై ఘన విజయం
IPL 2024 RR VS LSG Jaipur Live Updates And Highlights బోణీ కొట్టిన రాజస్తాన్.. లక్నోపై ఘన విజయం ఐపీఎల్-2024లో రాజస్తాన్ రాయల్స్ బోణీ కొట్టింది. జైపూర్ వేదికగా లక్నో సూపర్ జెయింట్స్తో జరిగిన మ్యాచ్లో 20 పరుగుల తేడాతో రాజస్తాన్ ఘన విజయం సాధించింది. 194 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన లక్నో.. నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 173 పరుగులు మాత్రమే చేసింది. లక్నో బ్యాటర్లలో పూరన్ (64) పరుగులతో టాప్ స్కోరర్గా నిలవగా.. కెప్టెన్ కేఎల్ రాహుల్(58) పరుగులతో పర్వాలేదన్పించాడు. రాజస్తాన్ బౌలర్లలో బౌల్ట్ రెండు వికెట్లు పడగొట్టగా.. బర్గర్, అశ్విన్, చాహల్, సందీప్ శర్మ తలా వికెట్ సాధించారు. కేఎల్ రాహుల్ ఫిప్టీ.. 14 ఓవర్లకు లక్నో స్కోర్: 129/4 14 ఓవర్లు ముగిసే సరికి లక్నో 4 వికెట్ల నష్టానికి 129 పరుగులు చేసింది. క్రీజులో కేఎల్ రాహుల్(53), పూరన్(35) పరుగులతో ఉన్నారు. లక్నో విజయానికి 36 బంతుల్లో 65 పరుగులు కావాలి. మూడో వికెట్ డౌన్.. హుడా ఔట్ దీపక్ హుడా రూపంలో లక్నో మూడో వికెట్ కోల్పోయింది. 26 పరుగులు చేసిన హుడా.. చాహల్ బౌలింగ్లో ఔటయ్యాడు. క్రీజులోకి నికోలస్ పూరన్ వచ్చాడు. 6 ఓవర్లకు లక్నో స్కోర్ 47/2 6 ఓవర్లు ముగిసే సరికి లక్నో సూపర్ జెయింట్స్ రెండు వికెట్ల నష్టానికి 47 పరుగులు చేసింది. క్రీజులో దీపక్ హుడా(18), కేఎల్ రాహల్(15) ఉన్నారు. రెండో వికెట్ డౌన్ 194 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన లక్నోకు ఆదిలోనే గట్టి ఎదురు దెబ్బ తగిలింది. పడిక్కల్ రూపంలో లక్నో రెండో వికెట్ కోల్పోయింది. ట్రెంట్ బౌల్ట్ పడిక్కల్ను క్లీన్ బౌల్డ్ చేశాడు. 3 ఓవర్లకు లక్నో స్కోర్ 12/2 తొలి వికెట్ కోల్పోయిన లక్నో.. డికాక్ ఔట్ 194 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన లక్నో తొలి వికెట్ కోల్పోయింది. 4 పరుగులు చేసిన క్వింటన్ డికాక్.. బౌల్ట్ బౌలింగ్లో ఔటయ్యాడు. క్రీజులోకి పడిక్కల్ వచ్చాడు. సంజూ శాంసన్ విధ్వంసం.. రాజస్థాన్ రాయల్స్ భారీ స్కోర్ లక్నోతో మ్యాచ్లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ రాయల్స్.. సంజూ శాంసన్ (52 బంతుల్లో 82 నాటౌట్; 3 ఫోర్లు, 6 సిక్సర్లు) విధ్వంసకర ఇన్నింగ్స్తో విరుచుకుపడటంతో నిర్ణీత ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 193 పరుగుల భారీ స్కోర్ చేసింది. రాజస్థాన్ ఇన్నింగ్స్లో బట్లర్ (11), హెట్మైర్ (5) తక్కువ స్కోర్లకే ఔట్ కాగా.. రియాన్ పరాగ్ (43), యశస్వి జైస్వాల్ (24), ద్రువ్ జురెల్ (20 నాటౌట్) వేగంగా పరుగులు సాధించారు. లక్నో బౌలర్లలో నవీన్ ఉల్ హక్ 2, మొహిసిన్ ఖాన్, రవి భిఫ్ణోయ్ తలో వికెట్ పడగొట్టారు. నాలుగో వికెట్ కోల్పోయిన రాజస్థాన్ 150 పరుగుల వద్ద (16.3 ఓవర్) రాజస్థాన్ రాయల్స్ నాలుగో వికెట్ కోల్పోయింది. రవి భిష్ణోయ్ బౌలింగ్లో కేఎల్ రాహుల్కు క్యాచ్ ఇచ్చి హెట్మైర్ (5) ఔటయ్యాడు.శాంసన్కు (62) జతగా ద్రువ్ జురెల్ క్రీజ్లోకి వచ్చాడు. మూడో వికెట్ కోల్పోయిన రాజస్థాన్.. దూకుడుగా ఆడుతున్న రియాన్ పరాగ్ ఔట్ 14.5వ ఓవర్లో 142 పరుగుల వద్ద రాజస్థాన్ మూడో వికెట్ కోల్పోయింది. దూకుడుగా ఆడుతున్న రియాన్ పరాగ్ (29 బంతుల్లో 43; ఫోర్, 3 సిక్సర్లు) నవీన్ ఉల్ హక్ బౌలింగ్లో దీపక్ హుడాకు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. సంజూ శాంసన్ (59) క్రీజ్లో ఉన్నాడు. హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న శాంసన్ సంజూ శాంసన్ తన కెరీర్లో 21వ ఐపీఎల్ ఫిఫ్టిని పూర్తి చేసుకున్నాడు. సంజూ 33 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో హాఫ్ సెంచరీ మార్కును చేరుకున్నాడు. 14 ఓవర్ల తర్వాత రాజస్థాన్ స్కోర్ 128/2గా ఉంది. సంజూ (58), రియాన్ పరాగ్ (32) క్రీజ్లో ఉన్నారు. వరుస సిక్సర్లతో విరుచుకుపడిన సంజూ శాంసన్ 9.0 ఓవర్: యశ్ ఠాకూర్ వేసిన 9వ ఓవర్లో సంజూ శాంసన్ శివాలెత్తిపోయాడు. ఆఖరి రెండు బంతులను సిక్సర్లుగా మలిచాడు. అంకుమందు ఇదే ఓవర్లో రియన్ పరాగ్ కూడా ఓ సిక్సర్ బాదాడు. మొత్తంగా ఈ ఓవర్లో 21 పరుగులు వచ్చాయి. 9 ఓవర్ల తర్వాత రాజస్థాన్ స్కోర్ 84/2. సంజూ (33), పరాగ్ (15) క్రీజ్లో ఉన్నారు. 8 ఓవర్ల తర్వాత 63/2 8.0 ఓవర్: స్ట్రాటజిక్ టైమ్ ఔట్ సమయానికి రాజస్థాన్ స్కోర్ 63/2గా ఉంది. సంజూ శాంసన్ (21), రియాన్ పరాగ్ (6) క్రీజ్లో ఉన్నారు. రెండో వికెట్ కోల్పోయిన రాజస్థాన్.. డేంజర్ యశస్వి ఔట్ 5.6 ఓవర్: మొహిసిన్ ఖాన్ వేసిన ఐదో ఓవర్లో బౌండరీ, సిక్సర్ బాది జోష్ మీదుండిన యశస్వి జైస్వాల్ (12 బంతుల్లో 24; 3 ఫోర్లు, సిక్స్).. అదే ఓవర్ చివరి బంతికి మరో భారీ షాట్కు ప్రయత్నించి కృనాల్ చేతికి క్యాచ్ ఇచ్చి వికెట్ పారేసుకున్నాడు. 5 ఓవర్ల తర్వాత రాజస్థాన్ స్కోర్ 49/2. సంజూ శాంసన్ (13), రియాన్ పరాగ్ క్రీజ్లో ఉన్నారు. WHAT A CATCH BY CAPTAIN RAHUL 🔥🤯 pic.twitter.com/FU2Utxvp2z — Johns. (@CricCrazyJohns) March 24, 2024 అద్బుతమైన క్యాచ్ పట్టిన రాహుల్.. బట్లర్ ఔట్ 1.6 ఓవర్: నవీన్ ఉల్ హక్ బౌలింగ్లో వికెట్కీపర్ కేఎల్ రాహుల్ అద్భుతమైన క్యాచ్ పట్టడంతో జోస్ బట్లర్ (11) ఔటయ్యాడు. 2 ఓవర్ల తర్వాత రాజస్థాన్ స్కోర్ 13/1. యశస్వి (1), సంజూ శాంసన్ క్రీజ్లో ఉన్నారు. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న రాజస్థాన్.. జైపూర్లోని సవాయ్ మాన్ సింగ్ స్టేడియం వేదికగా ఇవాళ (మార్చి 24) రాజస్థాన్ రాయల్స్.. లక్నో సూపర్ జెయింట్స్ జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. తుది జట్లు.. రాజస్థాన్ రాయల్స్ ప్లేయింగ్ XI: యశస్వి జైస్వాల్, జోస్ బట్లర్, సంజు శాంసన్(కెప్టెన్/వికెట్కీపర్), రియాన్ పరాగ్, షిమ్రోన్ హెట్మేయర్, ధ్రువ్ జురెల్, రవిచంద్రన్ అశ్విన్, సందీప్ శర్మ, అవేష్ ఖాన్, ట్రెంట్ బౌల్ట్, యుజ్వేంద్ర చాహల్ లక్నో సూపర్ జెయింట్స్ ప్లేయింగ్ XI: కేఎల్ రాహుల్ (కెప్టెన్), క్వింటన్ డి కాక్ (వికెట్కీపర్), దేవదత్ పడిక్కల్, ఆయుష్ బదోని, మార్కస్ స్టోయినిస్, నికోలస్ పూరన్, కృనాల్ పాండ్యా, రవి బిష్ణోయ్, మొహిసిన్ ఖాన్, నవీన్-ఉల్-హక్, యశ్ ఠాకూర్ -
CM Jagan: రాప్తాడు ‘సిద్ధం’ సభ హైలైట్స్
సాక్షి, అనంతపురం జిల్లా: రాయలసీమలోనే కాదు.. ఏపీలోనే కనివిని ఎరుగని రీతిలో జరిగిన రాప్తాడు సిద్ధం సభ జరిగింది. సభ సముద్రాన్ని తలపించింది. సభకు లక్షలాదిగా జగన్ దండు తరలివచ్చారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రసంగం సింహనాదంలా కొనసాగింది. సీఎం జగన్ స్పీచ్కు జనం యుద్ధ నినాదాన్ని మోగించారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ టార్గెట్ 175 ఫిక్స్ చేసిన సీఎం జగన్.. ఎంత మంది జత కట్టినా.. ఎన్ని పొత్తులు పెట్టుకున్నా.. ప్రజలతోనే తన పొత్తు అని స్పష్టం చేశారు. ప్రజలే స్టార్ క్యాంపెనర్లుగా సీఎం జగన్ ప్రకటించారు. లబ్దిదారులే తనకు ఓటు వేయిస్తారని ప్రకటించిన సీఎం జగన్.. ఫ్యాన్ ఇంట్లో ఉండాలని, సైకిల్ బైట ఉండాలి, తాగేసిన టీ గ్లాస్ ఎప్పుడూ సింక్లోనే ఉండాలంటూ జగన్ పొలిటికల్ పంచ్లు విసిరారు. ఎన్నికలు ముగిసే వరకు కార్యకర్తలు, నాయకులు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. ►మేనిఫెస్టోలో 99 శాతం హామీలు పూర్తి చేశామని సగర్వంగా ప్రకటించిన సీఎం జగన్ ►పరిపాలనలో ఎక్కడా తగ్గలేదు. మరి ఒక్క సీటు కూడా ఎలా తగ్గుతుందని సీఎం జగన్ భరోసా ►భీమిలి, దెందులూరు సభలకు మించి రాప్తాడులో సిద్ధం సభ సక్సెస్తో వైఎస్సార్సీపీ కేడర్లో జోష్ ►ప్రతిపక్షాల కుట్రలను ఎండగట్టిన సీఎం జగన్ ►ప్రజలకు సులభంగా అర్థమయ్యేలా సూటిగా, స్పష్టంగా ఎన్నికల నినాదాన్ని సవివరంగా సోదహారణంగా వివరించిన సీఎం జగన్ ఇదీ చదవండి: రాప్తాడు ‘సిద్ధం’ సభలో సీఎం జగన్ పంచ్లు -
IND VS ENG 3rd Test Day 4: రాజ్కోట్ టెస్టులో భారత్ ఘన విజయం..
IND VS ENG 3rd Test Day 4 Updates And Highlights: రాజ్కోట్ టెస్టులో భారత్ ఘన విజయం.. రాజ్కోట్ వేదికగా ఇంగ్లండ్తో జరిగిన మూడో టెస్టులో 434 పరుగుల తేడాతో టీమిండియా ఘన విజయం సాధించింది. 557 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్ భారత బౌలర్ల దాటికి.. కేవలం 122 పరుగులకే కుప్పకూలింది. ఈ విజయంతో ఐదు టెస్టుల సిరీస్లో 2-1 ఆధిక్యంలోకి భారత్ దూసుకెళ్లింది. భారత స్పిన్నర్ రవీంద్ర జడేజా 5 వికెట్లతో ఇంగ్లీష్ జట్టు పతనాన్ని శాసించగా.. కుల్దీప్ యాదవ్ రెండు, అశ్విన్ ఒక్క వికెట్ సాధించారు. ఒక్క వికెట్ దూరంలో.. రాజ్కోట్ టెస్టులో విజయానికి భారత్ కేవలం ఒక్క వికెట్ దూరంలో నిలిచింది. వరుస క్రమంలో ఇంగ్లండ్ రెండు వికెట్లను కోల్పోయింది. జడేజా బౌలింగ్లో ఫోక్స్ ఔట్ కాగా.. అశ్విన్ బౌలింగ్లో హార్ట్లీ పెవిలియన్కు చేరాడు. ఓటమి దిశగా ఇంగ్లండ్.. ఇంగ్లండ్ బ్యాటర్లు పెవిలియన్కు క్యూ కడుతున్నారు. రెహాన్ అహ్మద్ రూపంలో ఇంగ్లండ్ ఏడో వికెట్ కోల్పోయింది. కుల్దీప్ యాదవ్ బౌలింగ్లో భారీ షాట్కు ప్రయత్నించి సిరాజ్కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. 28 ఓవర్లకు ఇంగ్లండ్ స్కోర్: 53/7 విజయం దిశగా భారత్.. రాజ్కోట్ టెస్టులో టీమిండియా విజయం వైపు అడుగులు వేస్తోంది. 557 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్.. 50 పరుగులకే 6 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ ఆరో వికెట్గా వెనుదిరిగాడు. భారత్ విజయానికి కేవలం 4 వికెట్ల దూరంలో నిలిచింది. ఐదో వికెట్ డౌన్.. జో రూట్ రూపంలో ఇంగ్లండ్ ఐదో వికెట్ కోల్పోయింది. 7 పరుగులు చేసిన రూట్.. జడేజా బౌలింగ్లో రూట్ ఎల్బీగా వెనుదిరిగాడు. 22 ఓవర్లకు ఇంగ్లండ్ స్కోర్: 50/5. క్రీజులో బెన్ స్టోక్స్, బెన్ ఫోక్స్ ఉన్నారు. పీకల్లోతు కష్టాల్లో ఇంగ్లండ్.. 557 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్.. 28 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. జడేజా బౌలింగ్లో జానీ బెయిర్ స్టో.. నాలుగో వికెట్గా వెనుదిరిగాడు. ఇంగ్లండ్ విజయానికి ఇంకా 519 పరుగులు కావాలి. మూడో వికెట్ డౌన్.. 20 పరుగుల వద్ద ఇంగ్లండ్ మూడో వికెట్ కోల్పోయింది. 3 పరుగులు చేసిన ఓలీ పోప్.. జడేజా బౌలింగ్లో రోహిత్కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. 10 ఓవర్లకు ఇంగ్లండ్ స్కోర్: 24/3 రెండో వికెట్ డౌన్.. జాక్ క్రాలే రూపంలో ఇంగ్లండ్ రెండో వికెట్ కోల్పోయింది. 11 పరుగులు చేసిన క్రాలే.. బుమ్రా బౌలింగ్లో ఎల్బీగా వెనుదిరిగాడు. తొలి వికెట్ కోల్పోయిన ఇంగ్లండ్.. 557 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్కు ఆదిలోనే బిగ్ షాక్ తగిలింది. స్టార్ బ్యాటర్ బెన్ డకెట్(4) రనౌటయ్యాడు. క్రీజులోకి ఓలీ పోప్ వచ్చాడు.7 ఓవర్లకు ఇంగ్లండ్ స్కోర్: 18/1 ఇన్నింగ్స్ను డిక్లేర్ చేసిన భారత్ భారత్ సెకెండ్ ఇన్నింగ్స్ను 430/4 స్కోర్ వద్ద డిక్లేర్ చేసింది. టీమిండియా.. ఇంగ్లండ్కు 557 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. యశస్వి జైస్వాల్ 214, సర్ఫరాజ్ ఖాన్ 68 పరుగులతో అజేయంగా నిలిచారు. మరో డబుల్ సెంచరీ చేసిన యశస్వి జైస్వాల్ రెండో టెస్ట్లో డబుల్ సెంచరీతో చెలరేగిన యశస్వి జైస్వాల్.. మూడో టెస్ట్లో మరో డబుల్ సెంచరీతో విరుచుకుపడ్డాడు. ఈ డబుల్ను యశస్వి 231 బంతుల్లో పూర్తి చేశాడు. ఇందులో 10 సిక్సర్లు, 14 ఫోర్లు ఉన్నాయి. ప్రస్తుతం టీమిండియా స్కోర్ 411/3గా ఉంది. లీడ్ 537 పరుగులుగా ఉంది. మరో హాఫ్ సెంచరీ చేసిన సర్పరాజ్ ఖాన్ తొలి ఇన్నింగ్స్లో 62 పరుగుల వద్ద పొరపాటున రనౌటైన సర్ఫరాజ్ ఖాన్ సెకెండ్ ఇన్నింగ్స్లో మరో హాఫ్ సెంచరీ చేశాడు. ఈ ఇన్నింగ్స్లో 66 బంతులు ఎదుర్కొన్న సర్ఫరాజ్.. 5 ఫోర్లు, సిక్సర్ సాయంతో హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. మరో డబుల్ దిశగా దూసుకుపోతున్న యశస్వి భారత యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ మరో డబుల్ సెంచరీ దిశగా దూసకుపోతున్నాడు. నిన్న రిటైర్డ్ హర్ట్గా వెనుదిరిగి ఇవాళ తిరిగి బరిలోకి దిగిన యశస్వి.. ధాటిగా ఆడుతున్నాడు. ప్రస్తుతం యశస్వి 182 పరుగుల వద్ద ఉన్నాడు. అతనికి జతగా సర్ఫరాజ్ ఖాన్ (33) క్రీజ్లో ఉన్నాడు. సెకెండ్ ఇన్నింగ్స్లో టీమిండియా స్కోర్ 359/4గా ఉంది. 440 పరుగుల ఆధిక్యంలో టీమిండియా నాలుగో రోజు లంచ్ విరామం సమయానికి టీమిండియా ఆధిక్యం 440 పరగులుగా ఉంది. సెకెండ్ ఇన్నింగ్స్లో టీమిండియా 4 వికెట్ల నష్టానికి 314 పరుగులు చేసింది. యశస్వి జైస్వాల్ (149), సర్ఫరాజ్ ఖాన్ (22) క్రీజ్లో ఉన్నారు. నాలుగో వికెట్ కోల్పోయిన టీమిండియా 258 పరుగుల వద్ద టీమిండియా నాలుగో వికెట్ కోల్పోయింది. రెహాన్ అహ్మద్ బౌలింగ్లో జో రూట్కు క్యాచ్ ఇచ్చి కుల్దీప్ యాదవ్ (27) ఔటయ్యాడు. యశస్వి జైస్వాల్ (115), సర్ఫరాజ్ ఖాన్ క్రీజ్లో ఉన్నారు. 91 పరుగుల వద్ద ఔటైన శుభ్మన్ గిల్ శుభ్మన్ గిల్ సెంచరీకి చేరువలో (91) రనౌటాయ్యడు. కుల్దీప్ తప్పిదం కారణంగా గిల్ ఔటయ్యాడు. నిన్న రిటైర్ట్ హర్ట్గా వెనుదిరిగిన యశస్వి (107) క్రీజ్లోకి వచ్చాడు. రాజ్కోట్ వేదికగా ఇంగ్లండ్తో జరుగుతున్న మూడో టెస్ట్లో టీమిండియా పటిష్ట స్థితిలో ఉంది. మూడో రోజు ఆట ముగిసే సమయానికి భారత్ స్కోర్ సెకెండ్ ఇన్నింగ్స్లో 192/2గా ఉంది. శుభ్మన్ గిల్ (65), కుల్దీప్ యాదవ్ (3) క్రీజ్లో ఉన్నారు. ప్రస్తుతం టీమిండియా 322 పరుగుల లీడ్లో ఉంది. సెకెండ్ ఇన్నింగ్స్లో యశస్వి జైస్వాల్ అద్బుతమైన సెంచరీతో (107) ఆకట్టుకోగా.. రోహిత్ శర్మ (19), రజత్ పాటిదార్ (0) నిరాశపరిచారు. యశస్వి జైస్వాల్ సెంచరీ అనంతరం రిటైర్డ్ హర్ట్గా వెనుదిరిగాడు. ఇంగ్లండ్ బౌలర్లలో జో రూట్, టామ్ హార్ట్లీ తలో వికెట్ పడగొట్టారు. స్కోర్ వివరాలు.. భారత్ తొలి ఇన్నింగ్స్: 445 ఆలౌట్ (రోహిత్ 131, జడేజా 112) ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్: 319 ఆలౌట్ (బెన్ డకెట్ 153) -
చెలరేగిన పేసర్లు.. సౌతాఫ్రికాపై టీమిండియా చారిత్రక విజయం
South Africa Vs India 2nd Test 2024 Day 2 Updates- కేప్టౌన్: చెలరేగిన పేసర్లు.. సౌతాఫ్రికాపై టీమిండియా చారిత్రక విజయం కేప్టౌన్ వేదికగా సౌతాఫ్రికాతో జరిగిన రెండో టెస్ట్లో టీమిండియా ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్లో పేసర్లు విజృంభించడంతో టీమిండియా చారిత్రక విజయం సాధించింది. 79 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని భారత్ 3 వికెట్లు కోల్పోయి ఛేదించి, 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఫలితంగా రెండు మ్యాచ్ల టెస్ట్ సిరీస్ 1-1తో సమంగా ముగిసింది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా.. సిరాజ్ (9-3-15-6) విజృంభణ ధాటికి తొలి ఇన్నింగ్స్లో 55 పరుగులకు కుప్పకూలగా... భారత్ తమ తొలి ఇన్నింగ్స్లో 153 పరుగులకు పరిమితమైంది. అనంతరం బుమ్రా (6/61) చెలరేగడంతో సౌతాఫ్రికా సెకెండ్ ఇన్నింగ్స్లో 176 పరుగులకు ఆలౌటై, భారత్ ముందు 79 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఉంచింది. ఈ టార్గెట్ను భారత్ ఆడుతూ పాడుతూ ఛేదించింది. స్కోర్ వివరాలు.. సౌతాఫ్రికా- 55 (వెర్రిన్ 15, సిరాజ్ 6/15), 176 (మార్క్రమ్ 106, బుమ్రా 6/61) భారత్- 153 (కోహ్లి 46, ఎంగిడి 3/30), 80/3 (జైస్వాల్ 28, జన్సెన్ 1/15) 7 వికెట్ల తేడాతో భారత్ విజయం మూడో వికెట్ కోల్పోయిన టీమిండియా.. కోహ్లి ఔట్ 75 పరుగుల వద్ద టీమిండియా మూడో వికెట్ కోల్పోయింది. జన్సెన్ బౌలింగ్లో కోహ్లి (12) ఔటయ్యాడు. భారత్ లక్ష్యానికి ఇంకా నాలుగు పరుగుల దూరంలో ఉంది. రెండో వికెట్ కోల్పోయిన టీమిండియా.. గిల్ ఔట్ 57 పరుగుల వద్ద టీమిండియా రెండో వికెట్ కోల్పోయింది. రబాడ బౌలింగ్లో శుభ్మన్ గిల్ (10) ఔటయ్యాడు. భారత్ గెలుపుకు ఇంకా 22 పరుగుల దూరంలో ఉంది. తొలి వికెట్ కోల్పోయిన భారత్.. జైస్వాల్ ఔట్ 44 పరుగుల వద్ద టీమిండియా తొలి వికెట్ కోల్పోయింది. బర్గర్ బౌలింగ్లో జైస్వాల్ (28) ఔటయ్యాడు.భారత్.. దక్షిణాఫ్రికా గడ్డపై చారిత్రక గెలుపుకు ఇంకా 35 పరుగుల దూరంలో ఉంది. దూకుడుగా ఆడుతున్న జైస్వాల్.. లక్ష్యంగా దిశగా దూసుకుపోతున్న టీమిండియా 79 పరుగుల స్వల్ప లక్ష్య ఛేదనలో టీమిండియా దూకుడుగా ఆడుతుంది. ముఖ్యంగా యశస్వి జైస్వాల్ టీ20 తరహాలో విరుచుకుపడుతున్నాడు. అతను కేవలం 21 బంతుల్లో 5 ఫోర్ల సాయంతో 24 పరుగులు చేశాడు. రోహిత్ 6 పరుగులతో అతని జతగా క్రీజ్లో ఉన్నాడు. 5 ఓవర్ల తర్వాత టీమిండియా స్కోర్ 35/0గా ఉంది. 176 పరుగులకు ఆలౌటైన సౌతాఫ్రికా.. టీమిండియా టార్గెట్ ఎంతంటే..? సౌతాఫ్రికా సెకెండ్ ఇన్నింగ్స్ 176 పరుగుల వద్ద ముగిసింది. మార్క్రమ్ అద్భుతమైన సెంచరీ సాధించిన అనంతరం సౌతాఫ్రికా వెంటవెంటనే వికెట్లు కోల్పోయి ఆలౌటైంది. ఆఖరి వికెట్ (ఎంగిడి (8)) కూడా బుమ్రాకే దక్కింది. దీంతో బుమ్రా ఖాతాలో ఆరు వికెట్లు చేరాయి. తొలి ఇన్నింగ్స్లో రెండు, ఈ ఇన్నింగ్స్లో ఆరు కలుపుకుని బుమ్రా ఖాతాలో మొత్తంగా ఎనిమిది వికెట్లు పడ్డాయి. బుమ్రాతో పాటు ముకేశ్ 2, సిరాజ్, ప్రసిద్ద్ కృష్ణ తలో వికెట్ దక్కించుకున్నారు. టీమిండియా టార్గెట్ 79 పరుగులుగా ఉంది. మ్యాచ్కు లంచ్ విరామం ప్రకటించారు. భారత పేసర్ల విజృంభణ.. తొమ్మిదో వికెట్ కోల్పోయిన సౌతాఫ్రికా 32.1: ప్రసిద్ కృష్ణ బౌలింగ్లో రోహిత్కు క్యాచ్ ఇచ్చి తొమ్మిదో వికెట్గా వెనుదిరిగిన రబడ(2) ఎనిమిదో వికెట్ కోల్పోయిన సౌతాఫ్రికా 31.4: సిరాజ్ బౌలింగ్లో సెంచరీ హీరో మార్క్రమ్ అవుట్ సెంచరీ పూర్తి చేసిన మార్క్రమ్.. 60 పరుగుల ఆధిక్యంలో సౌతాఫ్రికా ఓపెనర్గా బరిలోకి దిగిన మార్క్రమ్ అత్యంత కఠినమైన పిచ్పై అద్బుత సెంచరీతో (99 బంతుల్లో 102 నాటౌట్; 16 ఫోర్లు, 2 సిక్సర్లు) చెలరేగాడు. టెస్ట్ల్లో సౌతాఫ్రికా తరఫున ఇది ఆరో వేగవంతమైన సెంచరీ కూడా కావడం విశేషం. ఐదేసిన బుమ్రా.. పట్టుబిగించిన టీమిండియా 3 వికెట్ల నష్టానికి 62 పరుగుల స్కోర్ వద్ద రెండో రోజు ఆటను ప్రారంభించిన సౌతాఫ్రికా.. బుమ్రా ధాటికి తొలి సెషన్లోనే మరో 4 వికెట్లు కోల్పోయింది. మొత్తంగా బుమ్రా ఈ ఇన్నింగ్స్లో ఐదు వికెట్లతో (5/59) చెలరేగడంతో సౌతాఫ్రికా 30 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 158 పరుగులు చేసింది. ప్రస్తుతం ఆ జట్టు 60 పరుగుల ఆధిక్యంలో ఉంది. మార్క్రమ్ (102 నాటౌట్) అద్భుత శతకంతో ఒంటరిపోరాటం చేస్తున్నాడు. అతనికి జతగా రబాడ (2) క్రీజ్లో ఉన్నాడు. భారత బౌలర్లలో ముకేశ్ కుమార్ 2 వికెట్లు పడగొట్టాడు. సౌతాఫ్రికా వర్సెస్ ఇండియా రెండో టెస్టు తుదిజట్లు సౌతాఫ్రికా డీన్ ఎల్గర్ (కెప్టెన్), ఐడెన్ మార్క్రమ్, టోనీ డి జోర్జీ, ట్రిస్టన్ స్టబ్స్, డేవిడ్ బెడింగ్హామ్, కైల్ వెర్రెన్నె(వికెట్ కీపర్), మార్కో జాన్సెన్, కేశవ్ మహారాజ్, కగిసో రబాడ, నండ్రే బర్గర్, లుంగి ఎంగిడి. టీమిండియా రోహిత్ శర్మ(కెప్టెన్), యశస్వి జైస్వాల్, శుబ్మన్ గిల్, విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, రవీంద్ర జడేజా, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, ప్రసిద్ కృష్ణ, ముకేష్ కుమార్. -
IND VS SA 2nd Test: తొలి రోజే 23 వికెట్లు.. ఇంకా ఆధిక్యంలోనే టీమిండియా
South Africa Vs India 2nd Test 2024 Day 1 Updates- కేప్టౌన్: తొలి రోజే 23 వికెట్లు.. ఇంకా ఆధిక్యంలోనే టీమిండియా రెండో టెస్ట్లో తొలి రోజే 23 వికెట్లు నేలకూలాయి. ఇరు జట్లు తొలి ఇన్నింగ్స్ల్లో ఆలౌటయ్యాక, సౌతాఫ్రికా సెకెండ్ ఇన్నింగ్స్ కొనసాగిస్తుంది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా తొలి ఇన్నింగ్స్లో 55 పరుగులకే కుప్పకూలగా.. టీమిండియా తొలి ఇన్నింగ్స్లో 153 పరుగులకు ఆలౌటైంది. అనంతరం సెకెండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన సౌతాఫ్రికా తొలి రోజు ఆట ముగిసే సమయానికి 3 వికెట్ల నష్టానికి 62 పరుగులు చేసింది. సౌతాఫ్రికా భారత తొలి ఇన్నింగ్స్ స్కోర్కు ఇంకా 36 పరుగులు వెనుకపడి ఉంది. మూడో వికెట్ కోల్పోయిన సౌతాఫ్రికా 45 పరుగుల వద్ద సౌతాఫ్రికా మూడో వికెట్ కోల్పోయింది. బుమ్రా బౌలింగ్లో ట్రిస్టన్ స్టబ్స్ (1) ఔటయ్యాడు. ఇదే రోజు తొలి ఇన్నింగ్స్లో కూడా బుమ్రానే స్టబ్స్ను ఔట్ చేశాడు. 16 ఓవర్ల తర్వాత సౌతాఫ్రికా స్కోర్ 49/3గా ఉంది. సౌతాఫ్రికా భారత తొలి ఇన్నింగ్స్ స్కోర్కు ఇంకా 49 పరుగులు వెనుకపడి ఉంది. సెకెండ్ ఇన్నింగ్స్లో సెకెండ్ వికెట్ కోల్పోయిన సౌతాఫ్రికా రెండో టెస్ట్ తొలి రోజు ఇరు జట్ల పేసర్లు అత్యద్భుతాలు చేస్తున్నారు. ఇరు జట్ల పేసర్ల ధాటికి ఇప్పటికే 22 వికెట్లు నేలకూలాయి. తాజాగా సౌతాఫ్రికా సెకెండ్ ఇన్నింగ్స్లో సెకెండ్ వికెట్ కోల్పోయింది. ముకేశ్ కుమార్ బౌలింగ్లో జార్జీ (1) ఔటయ్యాడు. 13 ఓవర్ల తర్వాత సౌతాఫ్రికా స్కోర్ 42/2గా ఉంది. భారత తొలి ఇన్నింగ్స్ స్కోర్కు సౌతాఫ్రికా ఇంకా 56 పరుగులు వెనుకపడి ఉంది. మార్క్రమ్ (25), ట్రిస్టన్ స్టబ్స్ (0) క్రీజ్లో ఉన్నారు. తొలి వికెట్ కోల్పోయిన సౌతాఫ్రికా 37 పరుగుల వద్ద సౌతాఫ్రికా తమ సెకెండ్ ఇన్నింగ్స్లో తొలి వికెట్ కోల్పోయింది. ముకేశ్ కుమార్ బౌలింగ్లో ఎల్గర్ (12) ఔటయ్యాడు. తొలి ఇన్నింగ్స్కు విరుద్దంగా ఆడుతున్న సౌతాఫ్రికా 55 పరుగులకే తొలి ఇన్నింగ్స్లో కుప్పకూలిన సౌతాఫ్రికా.. ఆతర్వాత టీమిండియాను 153 పరుగులకు ఆలౌట్ చేసి తమ సెకెండ్ ఇన్నింగ్స్ను కొనసాగిస్తుంది. అయితే సఫారీలు తమ సెకెండ్ను తొలి ఇన్నింగ్స్లో ఆడినట్లు ఆడట్లేదు. ఆ జట్టు ఓపెనర్లు చాలా జాగ్రత్తగా వికెట్లు పడకుండా ఆడుతున్నారు. 10 ఓవర్ల తర్వాత ఆ జట్టు స్కోర్ 37/0గా ఉంది. సౌతాఫ్రికా భారత తొలి ఇన్నింగ్స్ స్కోర్ను ఇంకా 61 పరుగులు వెనకపడి ఉంది. ఒకే స్కోర్ వద్ద ఆరు వికెట్లు కోల్పోయిన టీమిండియా 153 పరుగుల వద్ద టీమిండియా ఏకంగా ఆరు వికెట్లు కోల్పోయి, అదే స్కోర్ వద్ద ఆలౌటైంది. 34వ ఓవర్లో ఎంగిడి పరుగులేమీ ఇవ్వకుండా మూడు వికెట్లు పడగొట్టగా.. ఆ మరుసటి ఓవర్లోనే రబాడ.. కోహ్లి (46), ప్రసిద్ద్ (0)లను పెవిలియన్కు పంపాడు. అదే ఓవర్లో, అదే స్కోర్ వద్ద (153) సిరాజ్ (0) కూడా రనౌటయ్యాడు. ఒకే ఓవర్లో 3 వికెట్లు తీసిన ఎంగిడి.. టీమిండియా 153/7 లుంగి ఎంగిడి ఒక్క ఓవర్లో మ్యాచ్ స్వరూపాన్నే మార్చేశాడు. భారత ఇన్నింగ్స్ 34వ ఓవర్లో ఎంగిడి ఏకంగా మూడు వికెట్లు పడగొట్టాడు. రాహుల్ (8), జడేజా (0), బుమ్రా (0) ఐదు బంతుల వ్యవధిలో ఔటయ్యారు. కోహ్లి (46), సిరాజ్ క్రీజ్లో ఉన్నారు. టీ విరామం.. టీమిండియా స్కోర్ 111/4 తొలి రోజు టీ విరామం సమయానికి టీమిండియా స్కోర్ 111/4గా ఉంది. విరాట్ కోహ్లి (20), కేఎల్ రాహుల్ (0) క్రీజ్లో ఉన్నారు. నాలుగో వికెట్ కోల్పోయిన భారత్ 110 పరుగుల వద్ద టీమిండియా నాలుగో వికెట్ కోల్పోయింది. నండ్రే బర్గర్ బౌలింగ్లో శ్రేయస్ అయ్యర్ (0) ఔటయ్యాడు. మూడో వికెట్ కోల్పోయిన టీమిండియా 105 పరుగుల వద్ద టీమిండియా మూడో వికెట్ కోల్పోయింది. నండ్రే బర్గర్ బౌలింగ్లో శుభ్మన్ గిల్ (36) ఔటయ్యాడు. విరాట్ కోహ్లి (16), శ్రేయస్ అయ్యర్ క్రీజ్లో ఉన్నారు. రెండో వికెట్ కోల్పోయిన టీమిండియా 39 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద రోహిత శర్మ ఔటయ్యాడు. నండ్రే బర్గర్ బౌలింగ్లో జన్సెన్కు క్యాచ్ ఇచ్చి హిట్మ్యాన్ పెవిలియన్కు చేరాడు. 16 ఓవర్ల తర్వాత టీమిండియా స్కోర్ 90/2గా ఉంది. శుభ్మన్ గిల్ (24), విరాట్ కోహ్లి (1) క్రీజ్లో ఉన్నారు. ఆధిక్యంలోకి వచ్చిన టీమిండియా 10: సౌతాఫ్రికాతో రెండో టెస్టులో టీమిండియా ఆధిక్యంలోకి వచ్చింది. కేప్టౌన్ వేదికగా ఆతిథ్య జట్టును 55 పరుగులకే ఆలౌట్ చేసిన భారత్ ఇన్నింగ్స్ మొదలుపెట్టిన తొలి పది ఓవర్లలోనే లీడ్ సంపాదించింది. ఆరంభంలోనే ఓపెనర్ యశస్వి జైస్వాల్ వికెట్ కోల్పోయినా.. మరో ఓపెనర్, కెప్టెన్ రోహిత్ శర్మ అద్భుతంగా ఆడుతున్నాడు. ఈ నేపథ్యంలో పది ఓవర్లు ముగిసే సరికి వికెట్ నష్టానికి 58 పరుగులు సాధించిన టీమిండియా మూడు పరుగుల స్వల్ప ఆధిక్యంలో నిలిచింది. రోహిత్ శర్మ 37 బంతుల్లో 38 పరుగులు సాధించి జోరు మీదున్నాడు. మరో ఎండ్లో శుబ్మన్ గిల్ ఆరు పరుగులతో ఆడుతున్నాడు. తొలి వికెట్ కోల్పోయిన టీమిండియా సిరాజ్ (9-3-15-6), ముకేశ్ కుమార్ (2.2-2-0-2), బుమ్రా (8-1-25-2) నిప్పులు చెరగడంతో సౌతాఫ్రికాను తొలి ఇన్నింగ్స్లో 55 పరుగులకే ఆలౌట్ చేసిన టీమిండియా.. అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించి 17 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది. రబాడ బౌలింగ్ యశస్వి జైస్వాల్ (0) క్లీన్ బౌల్డ్ అయ్యాడు. 3 ఓవర్ల తర్వాత భారత్ స్కోర్ 20/1గా ఉంది. ఎంగిడి వేసిన రెండో ఓవర్లో మూడు బౌండరీలు బాది రోహిత్ శర్మ జోరుమీదున్నాడు. సౌతాఫ్రికా వర్సెస్ ఇండియా రెండో టెస్టు తుదిజట్లు సౌతాఫ్రికా డీన్ ఎల్గర్ (కెప్టెన్), ఐడెన్ మార్క్రమ్, టోనీ డి జోర్జీ, ట్రిస్టన్ స్టబ్స్, డేవిడ్ బెడింగ్హామ్, కైల్ వెర్రెన్నె(వికెట్ కీపర్), మార్కో జాన్సెన్, కేశవ్ మహారాజ్, కగిసో రబాడ, నండ్రే బర్గర్, లుంగి ఎంగిడి. టీమిండియా రోహిత్ శర్మ(కెప్టెన్), యశస్వి జైస్వాల్, శుబ్మన్ గిల్, విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, రవీంద్ర జడేజా, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, ప్రసిద్ కృష్ణ, ముకేష్ కుమార్. -
సౌతాఫ్రికాను చిత్తు చేసిన టీమిండియా.. సిరీస్ కైవసం
సౌతాఫ్రికాను చిత్తు చేసిన టీమిండియా.. సిరీస్ కైవసం నిర్ణయాత్మక మూడో వన్డేలో టీమిండియా సౌతాఫ్రికాను చిత్తు చేసి 2-1 తేడాతో సిరీస్ను కైవసం చేసుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్.. సంజూ శాంసన్ సెంచరీతో (108) చెలరేగడంతో 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 296 పరుగులు చేయగా.. ఛేదనలో సౌతాఫ్రికా 45.5 ఓవర్లలో 218 పరుగులకు ఆలౌటై 78 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. అర్ష్దీప్ సింగ్ 4 వికెట్లతో చెలరేగగా.. సుందర్, ఆవేశ్ ఖాన్ చెరో 2 వికెట్లు, అక్షర్ పటేల్, ముకేశ్ కుమార్ తలో వికెట్ దక్కించుకున్నారు. ఆరో వికెట్ కోల్పోయిన సౌతాఫ్రికా 177 పరుగుల వద్ద (33.2వ ఓవర్) సౌతాఫ్రికా ఆరో వికెట్ కోల్పోయింది. సుందర్ బౌలింగ్లో రాహుల్కు క్యాచ్ ఇచ్చి ముల్దర్ (1) ఔటయ్యాడు. ఐదో వికెట్ కోల్పోయిన సౌతాఫ్రికా 174 పరుగుల వద్ద సౌతాఫ్రికా ఐదో వికెట్ కోల్పోయింది. ఆవేశ్ ఖాన్ బౌలింగ్లో సాయి సుదర్శన్కు క్యాచ్ ఇచ్చి క్లాసెన్ (21) ఔటయ్యాడు. నాలుగో వికెట్ కోల్పోయిన సౌతాఫ్రికా 161 పరుగుల వద్ద (29.4వ ఓవర్) సౌతాఫ్రికా నాలుగో వికెట్ కోల్పోయింది. అర్షదీప్ బౌలింగ్లో జార్జీ (81) ఔటయ్యాడు. మూడో వికెట్ కోల్పోయిన సౌతాఫ్రికా 141 పరుగుల వద్ద (25.5వ ఓవర్) సౌతాఫ్రికా మూడో వికెట్ కోల్పోయింది. సుందర్ బౌలింగ్లో మార్క్రమ్ (36) ఔటయ్యాడు. 22 ఓవర్ల తర్వాత సౌతాఫ్రికా స్కోర్ 112/2 ఇన్నింగ్స్ ఆరంభంలో కాస్త తడబడిన సౌతాఫ్రికా ఆ తర్వాత నెమ్మదిగా లక్ష్యం దిశగా సాగుతుంది. జార్జీ (64) అర్ధసెంచరీ చేసి ఉత్సాహంగా కనిపిస్తున్నాడు. జార్జీకు జతగా మార్క్రమ్ (19) క్రీజ్లో ఉన్నాడు. 22 ఓవర్ల తర్వాత సౌతాఫ్రికా స్కోర్ 112/2గా ఉంది. రెండో వికెట్ కోల్పోయిన సౌతాఫ్రికా 76 పరుగుల వద్ద (14.4 ఓవర్లో) సౌతాఫ్రికా రెండో వికెట్ కోల్పోయింది. అక్షర్ బౌలింగ్లో డస్సెన్ (2) క్లీన్ బౌల్డ్ అయ్యాడు. టార్గెట్ 297.. తొలి వికెట్ కోల్పోయిన సౌతాఫ్రికా 297 పరుగుల లక్ష్య ఛేదనలో సౌతాఫ్రికా 59 పరుగుల వద్ద (8.2వ ఓవర్) తొలి వికెట్ కోల్పోయింది. అర్ష్దీప్ బౌలింగ్లో రీజా హెండ్రిక్స్ (19) ఔటయ్యాడు. టార్గెట్ 297.. ధాటిగా ఆడుతున్న సౌతాఫ్రికా ఓపెనర్లు 297 పరుగుల లక్ష్య ఛేదనలో సౌతాఫ్రికా ఓపెనర్లు ధాటిగా ఆడుతున్నారు. 6 ఓవర్ల తర్వాత జట్టు స్కోర్ 46/0గా ఉంది. జార్జీ (29), రీజా హెండ్రిక్స్ (11) క్రీజ్లో ఉన్నారు. సంజూ శతకం.. ఆఖర్లో మెరిసిన రింకూ.. సౌతాఫ్రికా టార్గెట్ 297 నిర్ణయాత్మక మూడో వన్డేలో తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 296 పరుగులు చేసింది. సంజూ శాంసన్ (108) తన కెరీర్లో తొలి శతకంతో టీమిండియా ఈ స్థాయి స్కోర్ చేయడానికి పునాది వేయగా.. ఆఖర్లో రింకూ సింగ్ (38) మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. తిలక్ వర్మ (52) సైతం బాధ్యతాయుతమైన హాఫ్ సెంచరీ సాధించాడు. అక్షర్ ఔట్ కేవలం ఒక్క పరుగు చేసి అక్షర్ పటేల్ ఔటయ్యాడు. హెండ్రిక్స్ బౌలింగ్లో అక్షర్ వెనుదిరిగాడు. 47 ఓవర్ల తర్వాత టీమిండియా స్కోర్ 259/6గా ఉంది. రింకూ (24), సుందర్ (2) క్రీజ్లో ఉన్నారు. ఐదో వికెట్ కోల్పోయిన టీమిండియా 108 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద సంజూ శాంసన్ ఔటయ్యాడు. విలియమ్స్ బౌలింగ్లో భారీ షాట్కు ప్రయత్నించి సంజూ పెవిలియన్కు చేరాడు. 46 ఓవర్ల తర్వాత టీమిండియా స్కోర్ 249/5గా ఉంది. రింకూ (18), అక్షర్ పటేల్ (1) క్రీజ్లో ఉన్నారు. శతక్కొట్టిన సంజూ టీమిండియా వికెట్కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ తన అంతర్జాతీయ కెరీర్లో ఎట్టకేలకు మూడంకెల స్కోర్ను సాధించాడు. సౌతాఫ్రికాతో ఇవాళ జరుగుతున్న మూడో వన్డేలో సంజూ 110 బంతుల్లో సెంచరీ మార్కును చేరుకున్నాడు. అంతర్జాతీయ స్థాయిలో సంజూకు ఇది తొలి సెంచరీ. సంజూ శతకంలో 6 ఫోర్లు, 2 సిక్సర్లు ఉన్నాయి. కఠినమైన పిచ్పై జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు సంజూ అత్యంత కీలకమై ఇన్నింగ్స్ ఆడాడు. 44 ఓవర్ల తర్వాత టీమిండియా స్కోర్ 235/4గా ఉంది. సంజూకు జతగా రింకూ (14) క్రీజ్లో ఉన్నాడు. నాలుగో వికెట్ కోల్పోయిన టీమిండియా తిలక్ వర్మ (52) హాఫ్ సెంచరీ పూర్తయిన వెంటనే ఔటయ్యాడు. ఆది కేశవ్ మహారాజ్ బౌలింగ్లో ఇబ్బంది పడ్డ తిలక్ ఆఖరికి తిలక్ హాఫ్ సెంచరీ పూర్తయ్యాక అతని బౌలింగ్లోనే ఔటయ్యాడు. 41.2 ఓవర్ల తర్వాత టీమిండియా స్కోర్ 217/4గా ఉంది. సంజూ (96) జతగా రింకూ సింగ్ బరిలోకి దిగాడు. హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న తిలక్ ఆరంభంలో చాలా నిదానంగా ఆడిన తిలక్ వర్మ ఇన్నింగ్స్ కొనసాగే కొద్ది వేగం పెంచాడు. తిలక్ వన్డేల్లో తన తొలి హాఫ్ సెంచరీని 75 బంతుల్లో పూర్తి చేశాడు. మరో ఎండ్లో సంజూ శాంసన్ (95) శతకానికి చేరువయ్యాడు. 41 ఓవర్ల తర్వాత టీమిండియా స్కోర్ 216/3గా ఉంది. 37 ఓవర్ల తర్వాత టీమిండియా స్కోర్ 178/3 37 ఓవర్ల తర్వాత టీమిండియా స్కోర్ 178/3గా ఉంది. సంజూ శాంసన్ (71), తిలక్ వర్మ (39) క్రీజ్లో ఉన్నారు. హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న సంజూ చాలా రోజుల తర్వాత సంజూ శాంసన్ అంతర్జాతీయ వన్డేల్లో హాఫ్ సెంచరీ చేశాడు. ఈ మ్యాచ్లో అతను 66 బంతుల్లో 4 ఫోర్ల సాయంతో ఈ ఫీట్ను సాధించాడు. సంజూకు జతగా తిలక్ వర్మ (8) క్రీజ్లో ఉన్నాడు. 28 ఓవర్ల తర్వాత టీమిండియా స్కోర్ 121/3గా ఉంది. మూడో వికెట్ కోల్పోయిన టీమిండియా 101 పరుగుల వద్ద (18.5వ ఓవర్) టీమిండియా మూడో వికెట్ కోల్పోయింది. ముల్దర్ బౌలింగ్లో క్లాసెన్కు క్యాచ్ ఇచ్చి రాహుల్ (21) ఔటయ్యాడు. శాంసన్ (38), తిలక్ క్రీజ్లో ఉన్నారు. ఆచితూచి ఆడుతున్న శాంసన్, రాహుల్ 49 పరుగులకే 2 వికెట్లు కోల్పోవడంతో టీమిండియా ఆటగాళ్లు సంజూ శాంసన్ (33), కేఎల్ రాహుల్ (20) ఆచితూచి ఆడుతున్నారు. 18 ఓవర్ల తర్వాత జట్టు స్కోర్ 95/2గా ఉంది. 12 ఓవర్ల తర్వాత టీమిండియా స్కోర్ 68/2 12 ఓవర్ల తర్వాత టీమిండియా స్కోర్ 68/2గా ఉంది. సంజూ శాంసన్ (19), కేఎల్ రాహుల్ (7) క్రీజ్లో ఉన్నారు. రెండో వికెట్ కోల్పోయిన టీమిండియా 49 పరుగుల వద్ద టీమిండియా రెండో వికెట్ కోల్పోయింది. 10 పరుగులు చేసి సాయి సుదర్శన్ ఔటయ్యాడు. హెండ్రిక్స్ బౌలింగ్లో సుదర్శన్ ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. 8 ఓవర్ల తర్వాత టీమిండియా స్కోర్ 50/2గా ఉంది. సంజూ శాంసన్ (9), కేఎల్ రాహుల్ (1) క్రీజ్లో ఉన్నారు. తొలి వికెట్ కోల్పోయిన టీమిండియా ఇన్నింగ్స్ ఐదవ ఓవర్లో సిక్సర్, బౌండరీ బాదిన అనంతరం నండ్రే బర్గర్ బౌలింగ్లో రజత్ పాటిదార్ (22) క్లీన్ బౌల్డ్ అయ్యాడు. 4.4 ఓవర్ల తర్వాత టీమిండియా స్కోర్ 34/1గా ఉంది. సాయి సుదర్శన్ (9), సంజూ శాంసన్ క్రీజ్లో ఉన్నారు. 3 ఓవర్ల తర్వాత టీమిండియా స్కోర్ 20/0 తొలుత బ్యాటింగ్కు దిగిన టీమిండియా ఆచితూచి ఆడుతుంది. ఓపెనర్ల సాయి సుదర్శన్ (5), రజత్ పాటిదార్ (12) నెమ్మదిగా ఆడుతున్నారు. 3 ఓవర్ల తర్వాత టీమిండియా స్కోర్ 20/0గా ఉంది. బ్యాటింగ్కు దిగిన టీమిండియా పార్ల్ వేదికగా జరుగుతున్న నిర్ణయాత్మక మూడో వన్డేలో టీమిండియా టాస్ ఓడి సౌతాఫ్రికా ఆహ్వానం మేరకు తొలుత బ్యాటింగ్కు దిగింది. ఈ మ్యాచ్లో సౌతాఫ్రికా రెండో వన్డేలో బరిలోకి దిగిన జట్టునే కొనసాగిస్తుండగా.. టీమిండియా రెండు మార్పులు చేసింది. గాయం కారణంగా రుతురాజ్ ఈ మ్యాచ్ నుంచి తప్పుకోగా.. కుల్దీప్ యాదవ్కు విశ్రాంతినిచ్చారు. వీరి స్థానాల్లో రజత్ పాటిదార్, వాషింగ్టన్ సుందర్ బరిలోకి దిగనున్నారు. తుది జట్లు: భారత్: సాయి సుదర్శన్, రజత్ పాటిదార్, తిలక్ వర్మ, కేఎల్ రాహుల్ (కెప్టెన్), రింకూ సింగ్, సంజు శాంసన్, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, అర్ష్దీప్ సింగ్, అవేష్ ఖాన్, ముఖేష్ కుమార్ దక్షిణాఫ్రికా: టోనీ డి జోర్జి, రీజా హెండ్రిక్స్, రాస్సీ వాన్ డెర్ డస్సెన్, ఎయిడెన్ మార్క్రమ్ (కెప్టెన్), హెన్రిచ్ క్లాసెన్ (వికెట్ కీపర్), డేవిడ్ మిల్లర్, వియాన్ ముల్డర్, కేశవ్ మహరాజ్, నండ్రే బర్గర్, బ్యూరాన్ హెండ్రిక్స్, లిజాడ్ విలియమ్స్ -
ఆఖరి ఓవర్లో అర్షదీప్ మ్యాజిక్.. ఐదో టీ20లోనూ టీమిండియాదే గెలుపు
ఆఖరి ఓవర్లో అర్షదీప్ మ్యాజిక్.. ఐదో టీ20లోనూ టీమిండియాదే గెలుపు ఆఖరి ఓవర్లో ఆసీస్ గెలుపుకు 10 పరుగుల చేయాల్సిన తరుణంలో బంతిని అందుకున్న అర్షదీప్ మ్యాజిక్ చేశాడు. 6 బంతుల్లో వికెట్ తీసి కేవలం మూడు పరుగులు మాత్రమే ఇచ్చి టీమిండియాను గెలిపించాడు. ఈ గెలుపుతో భారత్ 5 మ్యాచ్ల సిరీస్ను 4-1 తేడాతో గెలుచుకుంది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్.. నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 160 పరుగులు చేయగా.. ఛేదనలో తడబడిన ఆసీస్ నిర్ణీత ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 154 పరుగుల మాత్రమే చేసి 6 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. వరుస బంతుల్లో వికెట్లు తీసిన ముకేశ్ కుమార్ 129 పరుగుల వద్ద ఆసీస్ వరుస బంతుల్లో వికెట్లు కోల్పోయింది. 17.3, 4 బంతుల్లో ముకేశ్ కుమార్.. షార్ట్(16), డ్వార్షుయిస్ (0)ను ఔట్ చేశాడు. నాలుగో వికెట్ కోల్పోయిన ఆసీస్ 102 పరుగుల వద్ద ఆసీస్ నాలుగో వికెట్ కోల్పోయింది. అక్షర్ పటేల్ బౌలింగ్లో ఆవేశ్ ఖాన్కు క్యాచ్ ఇచ్చి టిమ్ డేవిడ్ (17) ఔటయ్యారు. మూడో వికెట్ కోల్పోయిన ఆసీస్ 55 పరుగుల వద్ద ఆసీస్ మూడో వికెట్ కోల్పోయింది. రవి బిష్ణోయ్ బౌలింగ్లో ఆరోన్ హార్డీ (6) ఔటయ్యాడు. రెండో వికెట్ కోల్పోయిన ఆసీస్ 47 పరుగుల వద్ద ఆస్ట్రేలియా రెండో వికెట్ కోల్పోయింది. రవి భిష్ణోయ్ బౌలింగ్లో ట్రవిస్ హెడ్ (28) క్లీన్ బౌల్డ్ అయ్యాడు. 5 ఓవర్ల తర్వాత ఆసీస్ స్కోర్ 48/2గా ఉంది. టార్గెట్ 161.. తొలి వికెట్ కోల్పోయిన ఆసీస్ 161 పరుగుల లక్ష్య ఛేదనకు దిగిన ఆసీస్.. 22 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది. ముకేశ్ కుమార్ బౌలింగ్లో జోష్ ఫిలిప్ (4) క్లీన్ బౌల్డ్ అయ్యాడు. రాణించిన ఆసీస్ బౌలర్లు.. నామమాత్రపు స్కోర్కే పరిమితమైన టీమిండియా టాస్ ఓడి ఆసీస్ ఆహ్వానం మేరకు తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా నామమాత్రపు స్కోర్కే పరిమితమైంది. ఆసీస్ బౌలర్లు రాణించడంతో భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 160 పరుగులు చేసింది. భారత ఇన్నింగ్స్లో శ్రేయస్ అయ్యర్ (53) ఒక్కడే అర్ధ సెంచరీతో రాణించాడు. యశస్వి (21), జితేశ్ శర్మ (24), అక్షర్ పటేల్ (31) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. ఆసీస్ బౌలర్లలో బెహ్రెన్డార్ఫ్, డ్వాషుయిస్ చెరో 2 వికెట్లు పడగొట్టగా.. ఆరోన్ హార్డీ, నాథన్ ఇల్లిస్, తన్వీర్ సంగా తలో వికెట్ దక్కించుకున్నారు. ఆరో వికెట్ కోల్పోయిన భారత్ 143 పరుగుల వద్ద టీమిండియా ఆరో వికెట్ కోల్పోయింది. బెహ్రెన్డార్ఫ్ బౌలింగ్లో హార్డీకు క్యాచ్ ఇచ్చి అక్షర్ పటేల్ (31) ఔటయ్యాడు. 97 పరుగులకే సగం వికెట్లు కోల్పోయిన టీమిండియా 97 పరుగుల వద్ద టీమిండియా ఐదో వికెట్ కోల్పోయింది. ఆరోన్ హార్డీ బౌలింగ్లో మాథ్యూ షార్ట్కు క్యాచ్ ఇచ్చి జితేశ్ శర్మ (24) ఔటయ్యాడు. నాలుగో వికెట్ కోల్పోయిన భారత్ 55 పరుగుల వద్ద టీమిండియా నాలుగో వికెట్ కోల్పోయింది. రింకూ సింగ్ తన టీ20 కెరీర్లో తొలిసారి సింగిల్ డిజిట్ స్కోర్కు (6) ఔటయ్యాడు. నిప్పులు చెరుగుతున్న ఆసీస్ బౌలర్లు 46 పరుగుల వద్ద టీమిండియా మూడో వికెట్ కోల్పోయింది. డార్షుయిస్ బౌలింగ్లో మెక్డెర్మాట్ క్యాచ్ పట్టడంతో సూర్యకుమార్ యాదవ్ (5) పెవిలియన్కు చేరాడు. 7 ఓవర్ల తర్వాత టీమిండియా స్కోర్ 46/3. రింకూ సింగ్, శ్రేయస్ అయ్యర్ క్రీజ్లో ఉన్నారు. రెండో వికెట్ డౌన్ నాలుగు బంతుల వ్వవధిలో టీమిండియా రెండో వికెట్ కోల్పోయింది. డ్వార్షుయిస్ బౌలింగ్లో బెహ్రెన్డార్ప్కు క్యాచ్ ఇచ్చి రుతురాజ్ (10) ఔటయ్యాడు. తొలి వికెట్ కోల్పోయిన భారత్.. యశస్వి ఔట్ 33 పరుగుల వద్ద టీమిండియా తొలి వికెట్ కోల్పోయింది. బెహ్రెన్డార్ఫ్ బౌలింగ్లో నాథన్ ఇల్లిస్కు క్యాచ్ ఇచ్చి యశిస్వి జైస్వాల్ (21) ఔటయ్యాడు. 4 ఓవర్ల తర్వాత టీమిండియా స్కోర్ 33/1గా ఉంది. రుతురాజ్ (10), శ్రేయస్ క్రీజ్లో ఉన్నారు. బెంగళూరు వేదికగా టీమిండియాతో ఇవాళ (డిసెంబర్ 3) జరుగుతున్న నామమాత్రపు ఐదో టీ20లో ఆస్ట్రేలియా టాస్ గెలిచి తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్లో భారత్, ఆస్ట్రేలియాలు చెరో మార్పుతో బరిలోకి దిగాయి. భారత్ తరఫున దీపక్ చాహర్ స్థానంలో అర్షదీప్ సింగ్.. ఆసీస్ తరఫున క్రిస్ గ్రీన్ స్థానంలో నాథన్ ఇల్లిస్ బరిలో నిలిచారు. టీమిండియా: యశస్వి జైస్వాల్, రుతురాజ్ గైక్వాడ్, శ్రేయస్ అయ్యర్, సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), రింకూ సింగ్, జితేశ్ శర్మ, శివమ్ దూబే, అక్షర్ పటేల్, అర్షదీప్ సింగ్, రవి బిష్ణోయ్, ఆవేశ్ ఖాన్ ఆస్ట్రేలియా: ట్రవిస్ హెడ్, జోష్ ఫిలిప్, బెన్ మెక్డెర్మాట్, ఆరోన్ హార్డీ, టిమ్ డేవిడ్, మాథ్యూ షార్ట్, మాథ్యూ వేడ్ (కెప్టెన్), బెన్ డ్వారిషుయిస్, జేసన్ బెహ్రెన్డార్ఫ్, నాథన్ ఇల్లిస్, తన్వీర్ సంఘా -
IND Vs AUS: బ్యాటర్ల ఊచకోత.. రెండో టీ20లోనూ టీమిండియాదే విజయం
బ్యాటర్ల ఊచకోత.. రెండో టీ20లో టీమిండియా ఘన విజయం ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్లో భాగంగా తిరువనంతపురం వేదికగా ఆసీస్తో జరుగుతున్న రెండో టీ20లో టీమిండియా 44 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్.. బ్యాటర్లంతా రెచ్చిపోవడంతో నిర్ణీత ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 235 పరుగుల భారీ స్కోర్ చేసింది. యశస్వి (25 బంతుల్లో 53; 9 ఫోర్లు, 2 సిక్సర్లు), రుతురాజ్ (43 బంతుల్లో 58; 3 ఫోర్లు, 2 సిక్సర్లు), ఇషాన్ కిషన్ (32 బంతుల్లో 52; 3 ఫోర్లు, 4 సిక్సర్లు), సూర్యకుమార్ (10 బంతుల్లో 19; 2 సిక్సర్లు), రింకూ సింగ్ (9 బంతుల్లో 31 నాటౌట్; 4 ఫోర్లు, 2 సిక్సర్లు), తిలక్ వర్మ (2 బంతుల్లో 7 నాటౌట్; సిక్స్) మెరుపు ఇన్నింగ్స్లతో విరుచుకుపడ్డారు. అనంతరం 236 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఆసీస్ ఆదిలో కాస్త పోరాటపటిమ కనబర్చినప్పటికీ.. ఆతర్వాత భారత బౌలర్ల ధాటికి చేతులెత్తేసింది. ఆసీస్ నిర్ణీత ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 191 పరుగులకే పరిమితమైంది. భారత బౌలర్లలో భిష్ణోయ్, ప్రసిద్ద్ కృష్ణ తలో 3 వికెట్లు పడగొట్టగా.. ముకేశ్ కుమార్, అక్షర్ పటేల్, అర్షదీప్ తలో వికెట్ దక్కించుకున్నారు. కాగా, ఈ సిరీస్లో తొలి మ్యాచ్లో కూడా టీమిండియానే విజయం సాధించిన విషయం తెలిసిందే. ఓటమి అంచుల్లో ఆసీస్ 236 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఆసీస్ ఆదిలో కాస్త పోరాడినప్పటికీ, ఆతర్వాత భారత బౌలర్ల ధాటికి చేతులెత్తేసింది. ఆ జట్టు 155 పరుగులకే 9 వికెట్లు కోల్పోయి ఓటమి అంచుల్లో నిలిచింది.అర్షదీప్ బౌలింగ్లో ఆడమ్ జంపా (1) క్లీన్ బౌల్డ్ అయ్యాడు. నిప్పులు చెరుగుతున్న ప్రసిద్ద్ కృష్ణ టీమిండియా పేసర్ ప్రసిద్ద్ కృష్ణ నిప్పులు చెరుగుతున్నాడు. ఈ మ్యాచ్లో అతను మూడో వికెట్ పడగొట్టాడు. 152 పరుగుల వద్ద నాథన్ ఇల్లిస్ (1)ను క్లీన్ బౌల్డ్ చేశాడు. ఓటమి దిశగా ఆసీస్.. సీన్ అబాట్ క్లీన్ బౌల్డ్ ఆసీస్ జట్టు ఓటమి దిశగా పయనిస్తుంది. ఆ జట్టు 149 పరుగుల వద్ద ఏడో వికెట్ కోల్పోయింది. ప్రసిద్ద్ కృష్ణ బౌలింగ్లో సీన్ అబాట్ (1) క్లీన్ బౌల్డయ్యాడు. ఆరో వికెట్ కోల్పోయిన ఆసీస్ 148 పరుగుల వద్ద ఆసీస్ ఆరో వికెట్ కోల్పోయింది. గుర్తింపు పొందిన ఆఖరి బ్యాటర్ స్టోయినిస్ (45) ఔటయ్యాడు. ముకేశ్ కుమార్ బౌలింగ్లో అక్షర్ పటేల్కు క్యాచ్ ఇచ్చి స్టోయినిస్ పెవిలియన్కు చేరాడు. ఐదో వికెట్ కోల్పోయిన ఆసీస్ 139 పరుగుల వద్ద ఆసీస్ ఐదో వికెట్ కోల్పోయింది. రవి భిష్ణోయ్ బౌలింగ్లో టిమ్ డేవిడ్ (37) ఔటయ్యాడు. 14 ఓవర్ల తర్వాత ఆసీస్ స్కోర్ 142/5గా ఉంది. స్టోయినిస్ (43), వేడ్ (2) క్రీజ్లో ఉన్నారు. టార్గెట్ 236.. భారత్కు ధీటుగా బదులిస్తున్న ఆసీస్ 236 పరుగుల భారీ లక్ష్యఛేదనలో ఆసీస్.. టీమిండియాకు ధీటుగా బదులిస్తుంది.12 ఓవర్లలో ఆ జట్టు 4 వికెట్ల నష్టానికి 131 పరుగులు చేసింది. స్టోయినిస్ (40), టిమ్ డేవిడ్ (31) చెలరేగి ఆడుతున్నారు. మూడో వికెట్ కోల్పోయిన ఆసీస్ 53 పరుగుల వద్ద ఆసీస్ మూడో వికెట్ కోల్పోయింది. అక్షర్ పటేల్ బౌలింగ్లో మ్యాక్స్వెల్ (12) ఔటయ్యాడు. 6 ఓవర్ల తర్వాత ఆసీస్ స్కోర్ 53/3గా ఉంది. స్టోయినిస్, స్టీవ్ స్మిత్ (17) క్రీజ్లో ఉన్నారు టార్గెట్ 236.. రెండు వికెట్లు కోల్పోయిన ఆసీస్ 236 పరుగుల అతి భారీ లక్ష్యఛేదనకు దిగిన ఆసీస్ 5 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 43 పరుగులు చేసింది. రవి భిష్ణోయ్.. జోస్ ఇంగ్లిస్ (2), మాథ్యూ షార్ట్ను (19) పెవిలియన్కు పంపాడు. టీమిండియా బ్యాటర్ల మహోగ్రరూపం.. సిక్సర్ల సునామీ ఆసీస్తో జరుగుతున్న రెండో టీ20లో టీమిండియా బ్యాటర్లు మహోగ్రరూపం దాల్చారు. టాప్-3 బ్యాటర్లు మెరుపు అర్ధశతకాలతో విరుచుకుపడ్డారు. యశస్వి (25 బంతుల్లో 53; 9 ఫోర్లు, 2 సిక్సర్లు), రుతురాజ్ (43 బంతుల్లో 58; 3 ఫోర్లు, 2 సిక్సర్లు), ఇషాన్ కిషన్ (32 బంతుల్లో 52; 3 ఫోర్లు, 4 సిక్సర్లు) ఆకాశమే హద్దుగా చెలరేగిపోయారు. సూర్యకుమార్ (10 బంతుల్లో 19; 2 సిక్సర్లు), రింకూ సింగ్ (9 బంతుల్లో 31 నాటౌట్; 4 ఫోర్లు, 2 సిక్సర్లు) , తిలక్ వర్మ (2 బంతుల్లో 7 నాటౌట్; సిక్స్) సైతం మెరుపు ఇన్నింగ్స్లు ఆడారు. ఫలితంగా భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 235 పరుగుల అతి భారీ స్కోర్ చేసింది. ఆసీస్ బౌలర్లలో ఇల్లిస్ 3 వికెట్లు పడగొట్టగా.. స్టోయినిస్ ఓ వికెట్ దక్కించుకున్నాడు. ఇషాన్ ఔట్ 52 పరుగుల వద్ద ఇషాన్ కిషన్ ఔటయ్యాడు. స్టోయినిస్ బౌలింగ్లో ఇల్లిస్కు క్యాచ్ ఇచ్చి ఇషాన్ పెవిలియన్కు చేరాడు. అనంతరం క్రీజ్లోకి వచ్చిన స్కై తొలి బంతికే సిక్సర్ బాదాడు. దంచికొడుతున్న ఇషాన్ యశస్వి జైస్వాల్ ఔటయ్యాక కూడా భారత బ్యాటర్లు జోరు కొనసాగిస్తున్నారు. ఇషాన్ కిషన్ (52) విధ్వంసం ఓ రేంజ్లో కొనసాగుతుండగా.. రుతురాజ్ (47) ఆచితూచి ఆడుతున్నాడు. 15 ఓవర్ల తర్వాత టీమిండియా స్కోర్ 164/1గా ఉంది. 10 ఓవర్లలోనే 100 పరుగులు పూర్తి చేసిన భారత్ టీమిండియా 10 ఓవర్లలోనే 100 పరుగులు పూర్తి చేసింది. యశస్వి ధాటిగా ఆడి ఔటైనా రుతురాజ్ (29), ఇషాన్ కిషన్ (10) కూడా ఓ మోస్తరు షాట్లు ఆడి స్కోర్ బోర్డును పరుగులు పెట్టిస్తున్నారు. 10 ఓవర్ల తర్వాత భారత్ స్కోర్ 101/1గా ఉంది. విధ్వంసం సృష్టించి ఔటైన యశస్వి యశస్వి జైస్వాల్ క్రీజ్లో ఉన్నంత సేపు విధ్వంసం సృష్టించాడు. అయితే ఐదో ఓవర్ ఆఖరి బంతికి అతనికి అడ్డుకట్ట పడింది. ఇల్లిస్ బౌలింగ్ యశస్వి (25 బంతుల్లో 53; 9 ఫోర్లు, 2 సిక్సర్లు) ఔటయ్యాడు. 5.5 ఓవర్ల తర్వాత టీమిండియా స్కోర్ 77/1గా ఉంది. రుతురాజ్ (15), ఇషాన్ క్రీజ్లో ఉన్నారు. యశస్వి ఊచకోత.. 24 బంతుల్లోనే..! యశస్వి జైస్వాల్ ఉగ్రరూపం దాల్చాడు. వచ్చిన బంతిని వచ్చినట్లు ఎడాపెడా బాదేస్తున్నాడు. కేవలం 24 బంతుల్లోనే 9 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 53 పరుగులు చేశాడు. యశస్వి జైస్వాల్ ఉగ్రరూపం సీన్ అబాట్ వేసిన నాలుగో ఓవర్లో యశస్వి జైస్వాల్ ఉగ్రరూపం దాల్చాడు. వరుసగా మూడు ఫోర్లు, రెండు సిక్సర్లు బాది ఏకంగా 24 పరుగులు పిండుకున్నాడు. తొలి బంతికే ఫోర్ బాదిన రుతురాజ్ తొలి టీ20లో బంతిని ఎదుర్కోకుండానే డైమండ్ రనౌట్గా వెనుదిరిగిన రుతురాజ్ ఈ మ్యాచ్లో తానెదుర్కొన్న తొలి బంతికే బౌండరీ బాదాడు. తొలి ఓవర్ తర్వాత టీమిండియా స్కోర్ 10/0గా ఉంది. రుతురాజ్ (5), యశస్వి జైస్వాల్ (2) క్రీజ్లో ఉన్నారు. ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్లో భాగంగా తిరువనంతపురం వేదికగా భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య ఇవాళ (నవంబర్ 26) రెండో టీ20 జరుగుతుంది. ఈ మ్యాచ్లో ఆసీస్ టాస్ గెలిచి తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్లో టీమిండియా తొలి మ్యాచ్లో ఆడిన జట్టునే యధాతథంగా కొనసాగించగా.. ఆసీస్ రెండు మార్పులతో బరిలోకి దిగింది. బెహ్రాన్డార్ఫ్, ఆరోన్ హార్డీ స్థానాల్లో గ్లెన్ మ్యాక్స్వెల్, ఆడమ్ జంపా ఆసీస్ జట్టులోకి వచ్చారు. టీమిండియా: యశస్వి జైస్వాల్, రుతురాజ్ గైక్వాడ్, ఇషాన్ కిషన్(వికెట్కీపర్), సూర్యకుమార్ యాదవ్(కెప్టెన్), తిలక్ వర్మ, రింకూ సింగ్, అక్షర్ పటేల్, రవి బిష్ణోయ్, అర్ష్దీప్ సింగ్, ముఖేష్ కుమార్, ప్రసిద్ధ్ కృష్ణ ఆస్ట్రేలియా: స్టీవెన్ స్మిత్, మాథ్యూ షార్ట్, జోష్ ఇంగ్లిస్, మార్కస్ స్టోయినిస్, టిమ్ డేవిడ్, గ్లెన్ మాక్స్వెల్, మాథ్యూ వేడ్(కెప్టెన్), సీన్ అబాట్, నాథన్ ఎల్లిస్, ఆడమ్ జంపా, తన్వీర్ సంఘ -
హామీలను నెరవేర్చిన.. పార్టీలకే ఓటేయాలి
సాక్షి, హైదరాబాద్: ‘మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను నెరవేర్చిన పార్టీలకు, మంచి చేస్తారనే అభ్యర్థులకే ఓటేయాలి. అధికారంలోకి రావడం కోసం అనేక వాగ్దానాలు చేస్తుంటారు. కానీ అవి అమలయ్యే హామీలా? కాదా? అనేది చూడాలి. అలాగే ఇంతకుముందు ఇచ్చిన హామీలను ఏ మేరకు అమలు చేశారో చూడాలి. పార్టీలిచ్చే హామీలు రాష్ట్ర బడ్జెట్ను మించిపోతున్నాయి. కొన్ని పార్టీల మేనిఫెస్టోలు ఉత్తుత్తవిగా ఉంటున్నాయి’ అని పలువురు వక్తలు అభిప్రాయపడ్డారు. శనివారం హైదరాబాద్ ప్రెస్క్లబ్లో ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ (ఎఫ్జీజీ) ‘ప్రజల మేనిఫెస్టో–2023’ని విడుదల చేసింది. ఈ కార్యక్రమంలో సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ సుదర్శన్రెడ్డి, హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ రామలింగేశ్వరరావు, ఎఫ్జీజీ అధ్యక్షుడు పద్మనాభరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జస్టిస్ సుదర్శన్రెడ్డి మాట్లాడుతూ ‘ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే ప్రజలకు ప్రజాస్వామ్యంపై నమ్మకం పోయేలా ఉంది. పార్టీలు చట్టాల పరిధిలో లేక తామే ఒక చట్టంగా వ్యవహరిస్తున్నాయి. గెలిచిన పార్టీలు అంతా తమదే అనుకుంటున్నాయి. మార్పు కోసం రాజ్యాంగ సంస్కరణలు రావాలి’ అని చెప్పారు. ఎఫ్జీజీ అధ్యక్షుడు పద్మనాభరెడ్డి మాట్లాడుతూ ‘మా ఓటు అమ్మకానికి లేదు. మద్యం, డబ్బు సంచులతో రావద్దు’ అని ఓటర్లు నినదించాలన్నారు. జస్టిస్ రామలింగేశ్వరరావు మాట్లాడుతూ.. పార్టీలు రకరకాల తాయిలాలతో విడుదల చేసే మేనిఫెస్టులు చిత్తు కాగితాలతో సమానమని వ్యాఖ్యానించారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి సోమా శ్రీనివాస్రెడ్డి తదిరులు పాల్గొన్నారు. ఎఫ్జీజీ మేనిఫెస్టోలోని ముఖ్యాంశాలు.. రాష్ట్ర బడ్జెట్లో విద్య, ఆరోగ్యానికి 25 శాతం నిధులు కేటాయించాలి. సంక్షేమ పథకాలకు బడ్జెట్లో 30 శాతానికి మించకుండా కేటాయించాలి. పెట్రోలు, డీజిల్పై ట్యాక్స్ తగ్గించాలి. రైతుబంధు పది ఎకరాల్లోపు రైతులకే ఇవ్వాలి. కౌలు రైతులకూ రైతుబంధు ఇవ్వాలి. పంటల బీమా అమలు చేయాలి. వ్యవసాయానికి ఉచిత విద్యుత్, మూడు బోర్ల వరకు పరిమితి విధించాలి. నీటి పారుదల ప్రాజెక్టులపై ఒక ఉన్నత కమిటీ ఉండాలి. ప్రభుత్వ పనితీరు పారదర్శకంగా, జవాబుదారీతనంతో ఉండాలి. అవినీతికి అడ్డుకట్ట వేయాలి. లోకాయుక్త చట్టాన్ని కర్ణాటకలో మాదిరిగా సవరించాలి. కేంద్రంతో రాష్ట్రం మంచి సంబంధాలు కలిగి ఉండాలి. పాఠశాలలు, కాలేజీలు, ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఉన్న ఖాళీలను భర్తీ చేయాలి. దశల వారీగా మద్యనిషేధాన్ని అమలు చేయాలి. మాదక ద్రవ్యాలను ఉక్కుపాదంతో అణచివేయాలి. పార్టీలు తమ మేనిఫెస్టోలో చెప్పిన పథకాలకయ్యే వ్యయం వివరిస్తూ, ఆ డబ్బు ఎక్కడి నుంచి వస్తోందో కూడా తెలపాలి. ఆహార కల్తీపై గట్టి నిఘా ఉండాలి. నైపుణ్యం, ఉపాధి పెంచాలి. సీఎం, మంత్రులు, ప్రజా ప్రతినిధులు తమ ఆస్తి వివరాలు వెల్లడించాలి. మహిళలకు 25శాతం టికెట్లు కేటాయించాలి. నేర చరిత్రులకు టికెట్ ఇవ్వొద్దు. ప్రభుత్వ భూముల అమ్మకంపై నిషేధం విధించాలి. ధరలపై నియంత్రణ ఉండాలి. గల్ఫ్ కార్మికుల సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలి. క్రీడలకు ప్రోత్సాహం ఇవ్వాలి. -
WC 2023: కాన్వే, రచిన్ విధ్వంసకర శతకాలు.. ఇంగ్లండ్పై ప్రతీకారం తీర్చుకున్న న్యూజిలాండ్
కాన్వే, రచిన్ విధ్వంసకర శతకాలు.. ఇంగ్లండ్పై ప్రతీకారం తీర్చుకున్న న్యూజిలాండ్ గత వరల్డ్కప్ (2019) ఫైనల్లో ఇంగ్లండ్ చేతిలో ఎదురైన అపజయానికి న్యూజిలాండ్ టీమ్ ప్రతీకారం తీర్చుకుంది. అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియంలో ఇవాళ జరిగిన వరల్డ్కప్ ఆరంభ మ్యాచ్లో కివీస్ టీమ్.. ప్రపంచ ఛాంపియన్ ఇంగ్లండ్ను 9 వికెట్ల భారీ తేడాతో చిత్తు చేసి, మెగా టోర్నీలో ఘనంగా బోణీ కొట్టింది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ నిర్ణీత 50 ఓవరల్లో 9 వికెట్ల నష్టానికి 282 పరుగులు చేయగా.. కాన్వే (121 బంతుల్లో 152 నాటౌట్; 19 ఫోర్లు, 3 సిక్సర్లు), రచిన్ రవీంద్ర (96 బంతుల్లో 123 నాటౌట్; 11 ఫోర్లు, 5 సిక్సర్లు) అజేయమైన శతకాలతో విరుచుకుపడటంతో న్యూజిలాండ్ 36.2 ఓవర్లలో కేవలం ఒక్క వికెట్ మాత్రమే కోల్పోయి విజయతీరాలకు చేరింది. శతక్కొట్టిన రచిన్ రవీంద్ర.. గెలుపుకు చేరువైన కివీస్ వన్డౌన్లో బ్యాటింగ్కు దిగిన రచిన్ రవీంద్ర అద్భుతమైన సెంచరీతో కదంతొక్కాడు. రచిన్ 82 బంతుల్లో 9 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో సెంచరీ పూర్తి చేశాడు. రచిన్కు కెరీర్లో ఇది తొలి శతకం. మరో ఎండ్లో కాన్వే (111) సెంచరీ పూర్తయ్యాక కూడా నిలకడగా ఆడుతున్నారు. 30.4 ఓవర్ల తర్వాత న్యూజిలాండ్ స్కోర్ 214/1గా ఉంది. న్యూజిలాండ్ గెలుపుకు కేవలం 69 పరుగుల దూరంలో ఉంది. డెవాన్ కాన్వే మెరుపు శతకం.. గెలుపుకు చేరువైన కివీస్ న్యూజిలాండ్ ఓపెనర్ డెవాన్ కాన్వే 83 బంతుల్లో 13 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో కెరీర్లో ఐదో శతకాన్ని పూర్తి చేశాడు. మరో ఎండ్లో రచిన్ రవీంద్ర (90) కూడా శతకానికి చేరువయ్యాడు. ఈ ఇద్దరి మెరుపు ఇన్నింగ్స్ల సహకారంతో కివీస్ ఆడుతూపాడుతూ విజయం దిశగా సాగుతుంది. 26.1 ఓవర్ల తర్వాత న్యూజిలాండ్ స్కోర్ 193/1గా ఉంది. శతకాల దిశగా పరుగులు పెడుతున్న కాన్వే, రచిన్ న్యూజిలాండ్ బ్యాటర్లు రచిన్ రవీంద్ర (71), డెవాన్ కాన్వే (82) శతకాల దిశగా దూసుకుపోతున్నారు. వీరిద్దరి ధాటికి స్కోర్ బోర్డు పరుగులు పెడుతుంది. 20 ఓవర్ల తర్వాత న్యూజిలాండ్ స్కోర్ 154/1గా ఉంది. న్యూజిలాండ్ గెలవాలంటే 30 ఓవర్లలో 129 పరుగులు చేయాలి. హాఫ్ సెంచరీలు పూర్తి చేసుకున్న కాన్వే, రచిన్ న్యూజిలాండ్ బ్యాటర్లు డెవాన్ కాన్వే (62 నాటౌట్), రచిన్ రవీంద్ర (58 నాటౌట్) హాఫ్ సెంచరీలు పూర్తి చేసుకున్నారు. 15 ఓవర్ల తర్వాత న్యూజిలాండ్ స్కోర్ 121/1గా ఉంది. న్యూజిలాండ్ గెలవాలంటే 35 ఓవర్లలో 162 పరుగులు చేయాలి. లక్ష్యం దిశగా దూసుకుపోతున్న న్యూజిలాండ్ 283 పరుగుల లక్ష్య ఛేదనలో న్యూజిలాండ్ ధాటిగా ఆడుతుంది. ఆ జట్టు ఏడో బంతికే తొలి వికెట్ కోల్పోయినప్పటికీ.. వన్డౌన్లో వచ్చిన రచిన్ రవీంద్ర (47), డెవాన్ కాన్వే (44) ధాటిగా ఆడుతూ స్కోర్ బోర్డును పరుగులు పెట్టిస్తున్నారు. 11 ఓవర్ల తర్వాత న్యూజిలాండ్ స్కోర్ 92/1గా ఉంది. టార్గెట్ 283.. రెండో ఓవర్లోనే వికెట్ కోల్పోయిన న్యూజిలాండ్ 283 పరుగుల లక్ష్య ఛేదనలో న్యూజిలాండ్ ఏడో బంతికే వికెట్ కోల్పోయింది. సామ్ కర్రన్ బౌలింగ్లో బట్లర్కు క్యాచ్ ఇచ్చి విల్ యంగ్ డకౌటయ్యాడు. 4 ఓవర్ల తర్వాత న్యూజిలాండ్ స్కోర్ 19/1గా ఉంది. డెవాన్ కాన్వే (11), రచిన్ రవీంద్ర (8) క్రీజ్లో ఉన్నారు. పడి లేచిన ఇంగ్లండ్.. గౌరవప్రదమైన స్కోర్ న్యూజిలాండ్తో జరుగుతున్న మ్యాచ్లో ఇంగ్లండ్ జట్టు గౌరవప్రదమైన స్కోర్ చేసింది. ఈ మ్యాచ్లో టాస్ ఓడి న్యూజిలాండ్ ఆహ్వానం మేరకు తొలుత బ్యాటింగ్కు దిగిన ఇంగ్లండ్ క్రమం తప్పకుండా వికెట్లు కోల్పోయినప్పటికీ రూట్ (77), బట్లర్ (43) బాధ్యతాయుతమైన ఇన్నింగ్స్లు ఆడి జట్టును గట్టెక్కించారు. ఆఖర్లో టెయింలెండర్లు మేము సైతం అని ఓ చేయి వేయడంతో ఇంగ్లండ్ ఊహించిన దాని కంటే ఎక్కువ పరుగులు చేయగలిగింది. ఆ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 282 పరుగులు చేసింది. మార్క్ వుడ్ (13), ఆదిల్ రషీద్ (15) అజేయంగా నిలువగా.. బెయిర్స్టో (33), మలాన్ (14), బ్రూక్ (25), మొయిన్ అలీ (11), బట్లర్ (43), రూట్ (77), లివింగ్స్టోన్ (20), సామ్ కర్రన్ (14), క్రిస్ వోక్స్ (11) ఔటయ్యారు. కివీస్ బౌలర్లలో మ్యాట్ హెన్రీ 3, సాంట్నర్, ఫిలిప్స్ తలో 2, బౌల్ట్, రవీంద్ర చెరో వికెట్ దక్కించుకున్నారు. తొమ్మిదో వికెట్ కోల్పోయిన ఇంగ్లండ్ 252 పరుగుల వద్ద ఇంగ్లండ్ తొమ్మిదో వికెట్ కోల్పోయింది. మ్యాట్ హెన్రీ బౌలింగ్లో లాథమ్కు క్యాచ్ ఇచ్చి సామ్ కర్రన్ (14) ఔటయ్యాడు. ఎనిమిదో వికెట్ కోల్పోయిన ఇంగ్లండ్ 250 పరుగుల వద్ద ఇంగ్లండ్ ఎనిమిదో వికెట్ కోల్పోయింది. సాంట్నర్ బౌలింగ్లో విల్ యంగ్కు క్యాచ్ ఇచ్చి క్రిస్ వోక్స్ (11) ఔటయ్యాడు. జో రూట్ ఔట్.. ఏడో వికెట్ కోల్పోయిన ఇంగ్లండ్ రివర్స్ స్వీప్ జో రూట్ (77) కొంపముంచింది. ఈ ఇన్నింగ్స్ ఆరంభం నుంచి క్రమం తప్పకుండా ఈ షాట్లు ఆడి సక్సెస్ సాధించిన రూట్.. గ్లెన్ ఫిలిప్స్ బౌలింగ్ మరోసారి ఆ ప్రయత్నం చేయబోయి మూల్యం చెల్లించుకున్నాడు. అప్పటివరకు బాధ్యతాయుతమైన ఇన్నింగ్స్ ఆడిన రూట్ అనవసర షాట్కు ప్రయత్నించి ఫిలిప్స్ బౌలింగ్లో క్లీన్ బౌల్డయ్యాడు. ఫలితంగా ఇంగ్లండ్ 229 పరుగుల వద్ద (41.1 ఓవర్లు) ఏడో వికెట్ కోల్పోయింది. సామ్ కర్రన్, క్రిస్ వోక్స్ క్రీజ్లో ఉన్నారు. ఆరో వికెట్ కోల్పోయిన ఇంగ్లండ్ 221 పరుగుల వద్ద (38.5 ఓవర్లు) ఇంగ్లండ్ ఆరో వికెట్ కోల్పోయింది. ట్రెంట్ బౌల్ట్ వేసిన స్లో బాల్కు లివింగ్స్టోన్ (20) ఔటయ్యాడు. జో రూట్ (72), సామ్ కర్రన్ క్రీజ్లో ఉన్నారు. కష్టాల్లో ఇంగ్లండ్.. ఐదో వికెట్ డౌన్ ఇంగ్లండ్ టీమ్ కష్టాల్లో పడింది. 188 పరుగులకే ఆ జట్టు సగం వికెట్లు (33.2 ఓవర్లలో)బౌలింగ్లో వికెట్కీపర్ టామ్ లాథమ్కు క్యాచ్ ఇచ్చి జోస్ బట్లర్ (43) ఔటయ్యాడు. జో రూట్ (59) క్రీజ్లో ఉన్నాడు. హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న రూట్ జో రూట్ 57 బంతుల్లో తన హాఫ్ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. 30 ఓవర్ల తర్వాత ఇంగ్లండ్ స్కోర్ 166/4గా ఉంది. రూట్తో పాటు జోస్ బట్లర్ (30) క్రీజ్లో ఉన్నారు. మొయిన్ అలీ క్లీన్ బౌల్డ్ 118 పరుగల వద్ద (21.2 ఓవర్లు) ఇంగ్లండ్ నాలుగో వికెట్ కోల్పోయింది. గ్లెన్ ఫిలిప్స్ బౌలింగ్లో మొయిన్ అలీ (11) క్లీన్ బౌల్డయ్యాడు. జో రూట్ (32) క్రీజ్లో ఉన్నాడు. 94 పరుగుల వద్ద మూడో వికెట్ కోల్పోయిన ఇంగ్లండ్ వరుసగా 2 బౌండరీలు, ఓ సిక్సర్ బాది జోష్ మీదుండిన హ్యారీ బ్రూక్ (25) అనవసరమైన షాట్ ఆడి వికెట్ పరేసుకున్నాడు. 17 ఓవర్ల తర్వాత ఇంగ్లండ్ స్కోర్ 94/3. జో రూట్ (20), మొయిన్ అలీ క్రీజ్లో ఉన్నారు. జానీ బెయిర్స్టో ఔట్.. ఇంగ్లండ్ రెండో వికెట్ డౌన్ 64 పరుగుల వద్ద (12.5 ఓవర్లు) ఇంగ్లండ్ రెండో వికెట్ కోల్పోయింది. మిచెల్ సాంట్నర్ బౌలింగ్లో డారిల్ మిచెల్కు క్యాచ్ ఇచ్చి జానీ బెయిర్స్టో (33) ఔటయ్యాడు. జో రూట్ (15), హ్యారీ బ్రూక్ క్రీజ్లో ఉన్నారు. తొలి వికెట్ కోల్పోయిన ఇంగ్లండ్ 40 పరుగుల వద్ద (7.4 ఓవర్లు) ఇంగ్లండ్ తొలి వికెట్ కోల్పోయింది. ఫామ్లో ఉన్న డేవిడ్ మలాన్ 14 పరుగులు చేసి మ్యాట్ హెన్రీ బౌలింగ్లో వికెట్ కీపర్ టామ్ లాథమ్కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. జానీ బెయిర్స్టో (24) క్రీజ్లో ఉన్నాడు. దూకుడుగా ఆడుతున్న బెయిర్స్టో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేస్తున్న ఇంగ్లండ్కు శుభారంభం లభించింది. ఓపెనర్ జానీ బెయిర్స్టో దూకుడుగా ఆడుతున్నాడు. 6 ఓవర్ల తర్వాత ఇంగ్లండ్ స్కోర్ 35/0గా ఉంది. బెయిర్స్టో (21), మలాన్ (13) క్రీజ్లో ఉన్నారు. తొలి బంతికే సిక్సర్ బాదిన బెయిర్స్టో టాస్ ఓడి న్యూజిలాండ్ ఆహ్వానం మేరకు తొలుత బ్యాటింగ్కు దిగిన ఇంగ్లండ్కు ఊహించని ఆరంభం లభించింది. ట్రెంట్ బౌల్ట్ బౌలింగ్లో తొలి బంతికే బెయిర్స్టో సిక్సర్ బాదాడు. ఆతర్వాత ఐదో బంతికి బౌండరీ కొట్టాడు. ఫలితంగా ఇంగ్లండ్ తొలి ఓవర్లో 12 పరుగులు రాబట్టింది. బెయిర్స్టో (11), డేవిడ్ మలాన్ (1) క్రీజ్లో ఉన్నారు. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న న్యూజిలాండ్.. అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియంలో ఇవాళ (అక్టోబర్ 5) డిఫెండింగ్ చాంపియన్ ఇంగ్లండ్- గత ఎడిషన్ రన్నరప్ న్యూజిలాండ్ మధ్య టోర్నీ ఓపెనింగ్ మ్యాచ్ జరుగుతుంది. ఈ మ్యాచ్లో న్యూజిలాండ్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్లో ఇంగ్లండ్ టీమ్ బెన్ స్టోక్స్ లేకుండా బరిలోకి దిగుతుండగా.. న్యూజిలాండ్ టీమ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ సేవలను కోల్పోయింది. విలియమ్సన్తో పాటు ఫెర్గూసన్, టిమ్ సౌథీ, ఐష్ సోధి ఈ మ్యాచ్లో ఆడటం లేదు. న్యూజిలాండ్: డెవాన్ కాన్వే, విల్ యంగ్, రచిన్ రవీంద్ర, డారిల్ మిచెల్, టామ్ లాథమ్(వికెట్ కీపర్/ కెప్టెన్), గ్లెన్ ఫిలిప్స్, మార్క్ చాప్మన్, మాట్ హెన్రీ, మిచెల్ శాంట్నర్, జేమ్స్ నీషమ్, ట్రెంట్ బౌల్ట్ ఇంగ్లండ్: జానీ బెయిర్స్టో, డేవిడ్ మలాన్, జో రూట్, హ్యారీ బ్రూక్, జోస్ బట్లర్(వికెట్కీపర్/ కెప్టెన్), లియామ్ లివింగ్స్టోన్, మొయిన్ అలీ, సామ్ కరన్, క్రిస్ వోక్స్, ఆదిల్ రషీద్, మార్క్ వుడ్. -
మూడో వన్డేలో ఆస్ట్రేలియా విజయం
భారత్ అలౌట్ 286 పరుగుల వద్ద (49.4 ఓవర్లు) టీమిండియా ఆఖరి వికెట్ కోల్పోయింది. దీంతో ఆస్ట్రేలియా 66 పరుగుల తేడాతో విజయం సాధించింది. తొమ్మిదో వికెట్ కోల్పోయిన టీమిండియా 286 పరుగుల వద్ద (48.3 ఓవర్లు) టీమిండియా తొమ్మిదో వికెట్ కోల్పోయింది. సంగా బౌలింగ్లో జడేజా(35) ఔటయ్యాడు. ఎనిమిదో వికెట్ కోల్పోయిన భారత్ 270 పరుగుల వద్ద (45.3 ఓవర్లు) టీమిండియా ఎనిమిదో వికెట్ కోల్పోయింది. కమిన్స్ బౌలింగ్లో లబూషేన్కు క్యాచ్ ఇచ్చి బుమ్రా (5) ఔటయ్యాడు. ఓటమి దిశగా పయనిస్తున్న టీమిండియా టీమిండియా ఓటమి దిశగా పయనిస్తుంది. 257 పరుగుల వద్ద (41.5 ఓవర్లు) భారత్ ఏడో వికెట్ కోల్పోయింది. హాజిల్వుడ్ బౌలింగ్లో కుల్దీప్ యాదవ్ (2) క్లీన్ బౌల్డయ్యాడు. ఆరో వికెట్ కోల్పోయిన టీమిండియా 249 పరుగుల వద్ద (38.3 ఓవర్లు) టీమిండియా ఆరో వికెట్ కోల్పోయింది. మ్యాక్స్వెల్ బౌలింగ్లో శ్రేయస్ అయ్యర్ (48) క్లీన్ బౌలయ్యాడు. రవీంద్ర జడేజా (9), కుల్దీప్ యాదవ్ క్రీజ్లో ఉన్నారు. ఐదో వికెట్ కోల్పోయిన టీమిండియా 233 పరుగుల వద్ద టీమిండియా ఐదో వికెట్ కోల్పోయింది. హాజిల్వుడ్ బౌలింగ్లో మ్యాక్స్వెల్కు క్యాచ్ ఇచ్చి సూర్యకుమార్ యాదవ్ (8) ఔటయ్యాడు. భారత్ గెలవాలంటే 76 బంతుల్లో 120 పరుగులు చేయాలి. చేతిలో మరో 5 వికెట్లు మాత్రమే ఉన్నాయి. నాలుగో వికెట్ కోల్పోయిన టీమిండియా 223 పరుగుల వద్ద టీమిండియా నాలుగో వికెట్ కోల్పోయింది. స్టార్క్ బౌలింగ్లో క్యారీకి క్యాచ్ ఇచ్చి కేఎల్ రాహుల్ (26) ఔటయ్యాడు. 35.5 ఓవర్ల తర్వాత జట్టు స్కోర్ 223/4గా ఉంది. భారత గెలుపుకు 85 బంతుల్లో 130 పరుగులు చేయాల్సి ఉంది. చేతిలో 6 వికెట్లు ఉన్నాయి. కోహ్లి ఔట్.. మూడో వికెట్ కోల్పోయిన భారత్ విరాట్ కోహ్లి 56 పరుగుల వద్ద మ్యాక్స్వెల్ బౌలింగ్లో స్టీవ్ స్మిత్కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. 26.5 ఓవర్ల తర్వాత టీమిండియా స్కోర్ 171/3గా ఉంది. శ్రేయస్ (14), కేఎల్ రాహుల్ క్రీజ్లో ఉన్నారు. హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న కోహ్లి విరాట్ కోహ్లి 55 బంతుల్లో 5 ఫోర్లు, సిక్స్ సాయంతో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. 26 ఓవర్ల తర్వాత టీమిండియా స్కోర్ 168/2గా ఉంది. విరాట్ (54), శ్రేయస్ (13) క్రీజ్లో ఉన్నారు.భారత్ లక్ష్యానికి మరో 185 పరుగుల దూరంలో ఉంది. రెండో వికెట్ కోల్పోయిన టీమిండియా 144 పరుగుల వద్ద టీమిండియా రెండో వికెట్ కోల్పోయింది. మ్యాక్స్వెల్ బౌలింగ్లో హిట్మ్యాన్ 81 పరుగులు చేసి ఔటయ్యాడు. 23 ఓవర్ల తర్వాత టీమిండియా స్కోర్ 153/2గా ఉంది. విరాట్ కోహ్లి (46), శ్రేయస్ అయ్యర్ (6) క్రీజ్లో ఉన్నారు. భారత్ లక్ష్యానికి మరో 200 పరుగుల దూరంలో ఉంది. చేతిలో 8 వికెట్లు ఉన్నాయి. తొలి వికెట్ కోల్పోయిన టీమిండియా 74 పరుగుల వద్ద టీమిండియా తొలి వికెట్ కోల్పోయింది. మ్యాక్స్వెల్ బౌలింగ్లో లబూషేన్కు క్యాచ్ ఇచ్చి వాషింగ్టన్ సుందర్ (18) ఔటయ్యాడు. రోహిత్ శర్మ (55), విరాట్ కోహ్లి క్రీజ్లో ఉన్నారు. టార్గెట్ 353.. సిక్సర్ల వర్షం కురిపిస్తున్న రోహిత్ శర్మ 353 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో టీమిండియా ఓపెనర్లు ధాటిగా ఆడుతున్నారు. ముఖ్యంగా రోహిత్ శర్మ ఆకాశమే హద్దుగా చెలరేగి ఆడుతున్నారు. 24 బంతుల్లో 3 ఫోర్లు, 5 సిక్సర్ల సాయంతో 46 పరుగులతో అజేయంగా నిలిచాడు. మరో ఎండ్లో సుందర్ నిదానంగా ఆడుతున్నాడు. సుందర్ 18 బంతుల్లో 10 పరుగులతో అజేయంగా ఉన్నాడు. 7 ఓవర్ల తర్వాత టీమిండియా స్కోర్ 56/0గా ఉంది. రెచ్చిపోయిన ఆసీస్ బ్యాటర్లు.. టీమిండియా ముందు భారీ లక్ష్యం టాపార్డర్ బ్యాటర్లు రెచ్చిపోవడంతో టీమిండియాతో జరుగుతున్న మూడో వన్డేలో ఆసీస్ భారీ స్కోర్ చేసింది. వార్నర్ (56), మార్ష్ (96), స్టీవ్ స్మిత్ (74), లబూషేన్ (72) అర్ధసెంచరీలతో రాణించడంతో ఆసీస్ నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 352 పరుగులు చేసింది. భారత బౌలర్లలో బుమ్రా 3, కుల్దీప్ 2, సిరాజ్, ప్రసిద్ద్ కృష్ణ తలో వికెట్ పడగొట్టారు. ఏడో వికెట్ కోల్పోయిన ఆసీస్ బుమ్రా బౌలింగ్లో శ్రేయస్ అయ్యర్కు క్యాచ్ ఇచ్చి లబూషేన్ (72) ఔటయ్యాడు. 49 ఓవర్ల తర్వాత ఆసీస్ స్కోర్ 345/7. ఆరో వికెట్ కోల్పోయిన అసీస్ 299 పరుగుల వద్ద ఆసీస్ ఆరో వికెట్ కోల్పోయింది. కుల్దీప్ యాదవ్ బౌలింగ్లో శ్రేయస్ అయ్యర్కు క్యాచ్ ఇచ్చి గ్రీన్ (9) ఔటయ్యాడు. లబూషేన్ (42), కమిన్స్ క్రీజ్లో ఉన్నారు. మ్యాక్స్వెల్ క్లీన్ బౌల్డ్ జస్ప్రీత్ బుమ్రా బౌలింగ్లో మ్యాక్స్వెల్ (5) క్లీన్ బౌల్డయ్యాడు. 39 ఓవర్ల తర్వాత ఆసీస్ స్కోర్ 281/5. లబూషేన్ (33), గ్రీన్ క్రీజ్లో ఉన్నారు. నాలుగో వికెట్ కోల్పోయిన ఆసీస్ 267 పరుగుల వద్ద ఆసీస్ నాలుగో వికెట్ కోల్పోయింది. బుమ్రా బౌలింగ్లో కోహ్లికి క్యాచ్ ఇచ్చి అలెక్స్ క్యారీ (11) ఔటయ్యాడు. లబూషేన్ (26), మ్యాక్స్వెల్ క్రీజ్లో ఉన్నారు. మూడో వికెట్ కోల్పోయిన ఆసీస్ 242 పరుగుల వద్ద ఆసీస్ మూడో వికెట్ కోల్పోయింది. 74 పరుగులు చేసి స్మిత్ (74) ఔటయ్యాడు. సిరాజ్ బౌలింగ్లో స్మిత్ ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. 32 ఓవర్ల తర్వాత ఆసీస్ స్కోర్ 242/3గా ఉంది. లబూషేన్ (13), అలెక్స్ క్యారీ (0) క్రీజ్లో ఉన్నారు. తృటిలో సెంచరీ చేజార్చుకున్న మార్ష్ మిచెల్ మార్ష్ 4 పరుగుల తేడాతో సెంచరీ చేసే అవకాశాన్ని చేజార్చుకున్నాడు. మార్ష్ 84 బంతుల్లో 13 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 96 పరుగులు చేసి కుల్దీప్ బౌలింగ్లో ప్రసిద్ద్ కృష్ణకు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. 28 ఓవర్ల తర్వాత ఆసీస్ స్కోర్ 215/2. స్మిత్ (61), లబూషేన్ క్రీజ్లో ఉన్నారు. స్మిత్ హాఫ్ సెంచరీ.. సెంచరీ దిశగా మార్ష్ 26.2 ఓవర్లలోనే ఆస్ట్రేలియా 200 పరుగుల మార్కును అందుకుంది. మార్ష్ (89) సెంచరీ దిశగా పరుగులు పెడుతుండగా.. స్మిత్ (55) అర్దసెంచరీ పూర్తి చేసుకున్నాడు. 27 ఓవర్ల తర్వాత ఆసీస్ స్కోర్ 202/1. 15 ఓవర్ల తర్వాత ఆసీస్ స్కోర్ ఎంతంటే..? 15 ఓవర్ల తర్వాత ఆసీస్ స్కోర్ 120/1గా ఉంది. మిచెల్ మార్ష్ (43), స్టీవ్ స్మిత్ (21) క్రీజ్లో ఉన్నారు. విధ్వంసకర హాఫ్ సెంచరీ అనంతరం ఔటైన వార్నర్ డేవిడ్ వార్నర్ (34 బంతుల్లో 56; 6 ఫోర్లు, 4 సిక్సర్లు)మెరుపు ఇన్నింగ్స్ ఆడిన అనంతరం ప్రసిద్ద్ కృష్ణ బౌలింగ్లో అనవసర షాట్ ఆడి ఔటయ్యాడు. 9 ఓవర్ల తర్వాత ఆసీస్ స్కోర్ 84/1. మిచెల్ మార్ష్ (22), స్టీవ్ స్మిత్ (6) క్రీజ్లో ఉన్నారు. వార్నర్ విధ్వంసకర హాఫ్ సెంచరీ చాలా రోజుల తర్వాత వార్నర్ మునుపటి ఫామ్ను కనబరుస్తున్నాడు. టీమిండియాతో ఇవాళ జరుగుతున్న మ్యాచ్లో అతను 32 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. సిరాజ్ బౌలింగ్లో సిక్సర్ కొట్టి వార్నర్ హాఫ్ సెంచరీ మార్క్ను చేరుకున్నాడు. ధాటిగా ఆడుతున్న వార్నర్.. 7 ఓవర్ల తర్వాత స్కోర్ ఎంతంటే..? రాజ్కోట్ వేదికగా టీమిండియాతో జరుగుతున్న నామమాత్రపు మూడో వన్డేలో ఆస్ట్రేలియా ధాటిగా ఇన్నింగ్స్ను ప్రారంభించింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆసీస్కు ఓపెనర్లు వార్నర్ (27 బంతుల్లో 43), మిచెల్ మార్ష్ (15 బంతుల్లో 22) శుభారంభాన్ని అందించారు. 7 ఓవర్ల తర్వాత ఆసీస్ స్కోర్ 65/0గా ఉంది. టీమిండియా: రోహిత్ శర్మ(కెప్టెన్), విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, సూర్యకుమార్ యాదవ్, రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ ఆస్ట్రేలియా: మిచెల్ మార్ష్, డేవిడ్ వార్నర్, స్టీవ్ స్మిత్, మార్నస్ లబుషేన్, అలెక్స్ క్యారీ, గ్లెన్ మ్యాక్స్వెల్, కామెరూన్ గ్రీన్, ప్యాట్ కమిన్స్(కెప్టెన్), మిచెల్ స్టార్క్, తన్వీర్ సింగ్, జోష్ హేజిల్వుడ్. -
ఆసీస్ ఆలౌట్.. భారత్ ఘన విజయం
ఆసీస్ ఆలౌట్.. భారత్ ఘన విజయం 217 పరుగుల వద్ద ఆసీస్ ఆఖరి రెండు వికెట్లను కోల్పోయింది. దీంతో భారత్ 99 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఎనిమిదో వికెట్ కోల్పోయిన ఆసీస్ 140 పరుగుల వద్ద ఆసీస్ ఎనిమిదో వికెట్ కోల్పోయింది. జాంపా (5) క్లీన్ బౌల్డయ్యాడు. ఏడో వికెట్ కోల్పోయిన ఆసీస్ 135 పరుగుల వద్ద ఆసీస్ ఏడో వికెట్ కోల్పోయింది. గ్రీన్ (19)రనౌటయ్యాడు. ఆరో వికెట్ కోల్పోయిన ఆసీస్ 128 పరుగుల వద్ద ఆసీస్ ఆరో వికెట్ కోల్పోయింది. జడేజా బౌలింగ్లో అలెక్స్ క్యారీ (14) క్లీన్ బౌల్డయ్యాడు. 101 పరుగులకే సగం వికెట్లు కోల్పోయిన ఆసీస్.. అశ్విన్కు 3 వికెట్లు 101 పరుగులకే సగం వికెట్లు కోల్పోయిన ఆసీస్ కష్టాల్లో కూరుకుపోయింది. అశ్విన్కు ఒకే ఓవర్లో (15వ ఓవర్) 2 వికెట్లు సహా మొత్తం 3 వికెట్లు పడగొట్టి ఆసీస్ను దెబ్బకొట్టాడు. 15వ ఓవర్ తొలి బంతికి వార్నర్ను (53) ఎల్బీడబ్ల్యూ చేసిన యాష్.. ఐదో బంతికి ఇంగ్లిస్ను (6) పెవిలియన్కు పంపాడు. మూడో వికెట్ కోల్పోయిన ఆసీస్ 89 పరుగుల వద్ద ఆసీస్ మూడో వికెట్ కోల్పోయింది. అశ్విన్.. లబూషేన్ (27)ను క్లీన్ బౌల్డ్ చేశాడు. వార్నర్ (48), ఇంగ్లిస్ క్రీజ్లో ఉన్నారు. తగ్గిన వర్షం.. మొదలైన ఆట.. 33 ఓవర్లకు మ్యాచ్ కుదింపు వర్షం తగ్గడంతో మ్యాచ్ మళ్లీ మొదలైంది. వర్షం కారణంగా సమయం వృధా కావడంతో మ్యాచ్ను 33 ఓవర్లకు కుదించి, డక్వర్త్ లూయిస్ పద్దతి ప్రకారం ఆసీస్ లక్ష్యాన్ని 317 పరుగులుగా నిర్ధేశించారు. 10 ఓవర్ల తర్వాత ఆసీస్ స్కోర్ 63/2గా ఉంది. వార్నర్ (31), లబూషేన్ (18) క్రీజ్లో ఉన్నారు. వర్షం కారణంగా నిలిచిపోయిన మ్యాచ్ ఆసీస్ ఇన్నింగ్స్ 9 ఓవర్ల తర్వాత వర్షం మొదలైంది. దీంతో అంపైర్లు మ్యాచ్ను నిలిపివేశారు. అంతకుమందు భారత ఇన్నింగ్స్ సందర్భంగా కూడా వరుణుడు అడ్డుతగిలాడు. 9 ఓవర్ల తర్వాత ఆసీస్ స్కోర్ 56/2గా ఉంది. మాథ్యూ షార్ట్ (9), స్టీవ్ స్మిత్ (0)లను ప్రసిద్ద్ కృష్ణ వరుస బంతుల్లో ఔట్ చేయగా.. డేవిడ్ వార్నర్ (26), లబూషేన్ (17) క్రీజ్లో ఉన్నారు. టార్గెట్ 400.. రెండో ఓవర్లో 2 వికెట్లు కోల్పోయిన ఆసీస్ ఆస్ట్రేలియా రెండో ఓవర్లోనే రెండు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ప్రసిద్ధ్ కృష్ణ బౌలింగ్లో మాథ్యూ షార్ట్ (9), స్టీవ్ స్మిత్ (0) వరుస బంతుల్లో ఔటయ్యారు. 2.3 ఓవర్ల తర్వాత ఆసీస్ స్కోర్ 10/2గా ఉంది. లబూషేన్, వార్నర్ క్రీజ్లో ఉన్నారు. గిల్, అయ్యర్ శతకాలు.. స్కై విధ్వంసం.. టీమిండియా భారీ స్కోర్ టాస్ ఓడి ఆసీస్ ఆహ్వానం మేరకు తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 399 పరుగుల భారీ స్కోర్ చేసింది. శుభ్మన్ గిల్ (104), శ్రేయస్ అయ్యర్ (105) శతకాలతో విరుచుకుపడగా.. ఆఖర్లో సూర్యకుమార్ యాదవ్ (37 బంతుల్లో 72 నాటౌట్; 6 ఫోర్లు, 6 సిక్సర్లు) విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడాడు. భారత ఇన్నింగ్స్లో కేఎల్ రాహుల్ (52) అర్ధసెంచరీతో రాణించగా.. ఇషాన్ కిషన్ (31) పర్వాలేదనిపించాడు. రుతురాజ్ (8) ఒక్కడే విఫలమయ్యాడు. ఆసీస్ బౌలర్లలో కెమరూన్ గ్రీన్ 2 వికెట్లు పడగొట్టగా.. ఆడమ్ జంపా, జోష్ హాజిల్వుడ్, సీన్ అబాట్ తలో వికెట్ దక్కించుకున్నారు. వరుసగా నాలుగు సిక్సర్లు బాదిన సూర్యకుమార్ గ్రీన్ వేసిన ఇన్నింగ్స్ 44వ ఓవర్లో సూర్యకుమార్ చెలరేగిపోయాడు. వరుసగా నాలుగు సిక్సర్లు బాదాడు. ఈ ఓవర్లో మొత్తం 26 పరుగులు వచ్చాయి. 46 ఓవర్ల తర్వాత టీమిండియా స్కోర్ 355/5గా ఉంది. 46వ ఓవర్ ఆఖరి బంతికి గ్రీన్ బౌలింగ్లో రాహుల్ (52) ఔటయ్యాడు. నాలుగో వికెట్ కోల్పోయిన భారత్ 302 పరుగుల వద్ద టీమిండియా నాలుగో వికెట్ కోల్పోయింది. ఆడమ్ జంపా బౌలింగ్లో అలెక్స్ క్యారీకి క్యాచ్ ఇచ్చి ఇషాన్ కిషన్ (18 బంతుల్లో 31; 2 ఫోర్లు, 2 సిక్సర్లు) ఔటయ్యాడు. 41 ఓవర్ల తర్వాత జట్టు స్కోర్ 306/4గా ఉంది. రాహుల్ (45), సూర్యకుమార్ యాదవ్ (2) క్రీజ్లో ఉన్నారు. గిల్ ఔట్.. మూడో వికెట్ కోల్పోయిన భారత్ 104 పరుగుల వద్ద శుభ్మన్ గిల్ ఔటయ్యాడు. గ్రీన్ బౌలింగ్లో అలెక్స్ క్యారీకి క్యాచ్ ఇచ్చి గిల్ పెవిలియన్ బాట పట్టాడు. 35 ఓవర్ల తర్వాత భారత్ స్కోర్ 249/3గా ఉంది. కేఎల్ రాహుల్ (18), ఇషాన్ కిషన్ (6) క్రీజ్లో ఉన్నారు. శుభ్మన్ గిల్ సెంచరీ ఓపెనర్ శుభ్మన్ గిల్ (92 బంతుల్లో 100 నాటౌట్; 6 ఫోర్లు, 4 సిక్సర్లు) తన భీకర ఫామ్ను కొనసాగిస్తూ వన్డే కెరీర్లో ఆరో సెంచరీ నమోదు చేశాడు. ఫలితంగా భారత్ భారీ స్కోర్ దిశగా సాగుతుంది. 33 ఓవర్ల తర్వాత భారత్ స్కోర్ 230/2గా ఉంది. గిల్ (100), కేఎల్ రాహుల్ (9) క్రీజ్లో ఉన్నారు. సెంచరీ తర్వాత ఔటైన అయ్యర్ శ్రేయస్ అయ్యర్ సెంచరీ చేసిన వెంటనే ఔటయ్యాడు. 105 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద సీన్ అబాట్ బౌలింగ్లో మాథ్యూ షార్ట్ క్యాచ్ పట్టడంతో అయ్యర్ పెవిలియన్ బాట పట్టాడు. 30.5 ఓవర్ల తర్వాత భారత్ స్కోర్ 216/2గా ఉంది. శుభ్మన్ గిల్ (95), కేఎల్ రాహుల్ క్రీజ్లో ఉన్నారు. శతక్కొట్టిన శ్రేయస్ అయ్యర్ ఆసీస్తో జరుగుతున్న రెండో వన్డేలో శ్రేయస్ అయ్యర్ సెంచరీ సాధించాడు. అయ్యర్ 86 బంతుల్లో 10 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో కెరీర్లో మూడో సెంచరీని నమోదు చేశాడు. మరోవైపు శుభ్మన్ గిల్ (94) సైతం సెంచరీ దిశగా సాగుతున్నాడు. 29.5 ఓవర్ల తర్వాత భారత్ స్కోర్ 210/1గా ఉంది. సెంచరీల దిశగా దూసుకుపోతున్న గిల్, శ్రేయస్ శుభ్మన్ గిల్ (90), శ్రేయస్ అయ్యర్లు (92) సెంచరీల దిశగా దూసుకుపోతున్నారు. 28 ఓవర్ల తర్వాత భారత్ స్కోర్ 198/1గా ఉంది. శ్రేయస్ హాఫ్ సెంచరీ గాయం నుంచి కోలుకున్న తర్వాత శ్రేయస్ అయ్యర్ తన తొలి హాఫ్ సెంచరీని నమోదు చేశాడు. అయ్యర్ కూడా గిల్ లాగే సిక్సర్తో ఫిఫ్టిని కంప్లీట్ చేశాడు. అయ్యర్ 41 బంతుల్లో 7 ఫోర్లు, సిక్స్ సాయంతో 50 పరుగులు పూర్తి చేశాడు. 17 ఓవర్ల తర్వాత టీమిండియా స్కోర్ 131/1గా ఉంది. గిల్ 61, శ్రేయస్ 54 పరుగులతో క్రీజ్లో ఉన్నారు. సిక్సర్తో ఫిఫ్టి పూర్తి చేసుకున్న గిల్ శుభ్మన్ గిల్ కెరీర్లో తన 10వ హాఫ్ సెంచరీని సిక్సర్తో పూర్తి చేశాడు. కేవలం 37 బంతుల్లోనే గిల్ ఫిఫ్టిని కంప్లీట్ చేశాడు. గిల్ తన హాఫ్ సెంచరీలో 2 ఫోర్లు, 4 సిక్సర్లు కొట్టాడు. 14 ఓవర్ల తర్వాత టీమిండియా స్కోర్ 111/1గా ఉంది. గిల్ 53, శ్రేయస్ 44 పరుగులతో క్రీజ్లో ఉన్నారు. మొదలైన ఆట.. 10 ఓవర్ల తర్వాత టీమిండియా స్కోర్ 80/1 వర్షం అంతరాయం అనంతరం ఆట మళ్లీ మొదలైంది. ఓవర్ల కుదింపు ఏమీ జరగలేదు. మ్యాచ్ యధావిధిగా 50 ఓవర్ల పాటు సాగనుంది. 10 ఓవర్ల తర్వాత టీమిండియా స్కోర్ 80/1గా ఉంది. గిల్ (33), శ్రేయస్ అయ్యర్ (34) క్రీజ్లో ఉన్నారు. వర్షం కారణంగా నిలిచిపోయిన ఆట వర్షం కారణంగా మ్యాచ్కు అంతరాయం కలిగింది. భారత ఇన్నింగ్స్ 10వ ఓవర్లో వర్షం మొదలుకావడంతో మ్యాచ్ను నిలిపివేశారు. 9.5 ఓవర్ల తర్వాత భారత్ స్కోర్ 79/1గా ఉంది. రుతరాజ్ (8) ఔట్ కాగా.. శుభ్మన్ గిల్ (32), శ్రేయస్ అయ్యర్ (34) క్రీజ్లో ఉన్నారు. తొలి వికెట్ కోల్పోయిన భారత్ టాస్ ఓడి ఆసీస్ ఆహ్వానం మేరకు బ్యాటింగ్కు దిగిన భారత్ 16 పరుగుల వద్ద రుతురాజ్ గైక్వాడ్ (8) వికెట్ కోల్పోయింది. హాజిల్వుడ్ బౌలింగ్లో అలెక్స్ క్యారీకు క్యాచ్ ఇచ్చి రుతు ఔటయ్యాడు. 5 ఓవర్ల తర్వాత భారత్ స్కోర్ 26/1. శుభ్మన్ గిల్ (3), శ్రేయస్ అయ్యర్ (10) క్రీజ్లో ఉన్నారు. ఇండోర్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో వన్డేలో టీమిండియా టాస్ ఓడి, ప్రత్యర్ధి ఆహ్వానం మేరకు తొలుత బ్యాటింగ్కు దిగింది. ఈ మ్యాచ్లో టీమిండియా ఓ మార్పుతో బరిలోకి దిగింది. బుమ్రా స్థానంలో ప్రసిద్ధ్ కృష్ణ తుది జట్టులోకి వచ్చాడు. మరోవైపు ఆస్ట్రేలియా మూడు మార్పులతో బరిలోకి దిగింది. మిచెల్ మార్ష్, మార్కస్ స్టోయినిస్, పాట్ కమిన్స్ స్థానాల్లో అలెక్స్ క్యారీ, జోష్ హాజిల్వుడ్, స్పెన్సర్ జాన్సన్ తుది జట్టులోకి వచ్చారు. ఆస్ట్రేలియా : డేవిడ్ వార్నర్, మాథ్యూ షార్ట్, స్టీవ్ స్మిత్ (కెప్టెన్), మార్నస్ లాబుషేన్, జోష్ ఇంగ్లిస్, అలెక్స్ కారీ (వికెట్ కీపర్), కామెరాన్ గ్రీన్, సీన్ ఆంథోనీ అబాట్, ఆడమ్ జంపా, స్పెన్సర్ జాన్సన్, జోష్ హాజిల్వుడ్ ఇండియా : శుభమన్ గిల్, రుతురాజ్ గైక్వాడ్, శ్రేయాస్ అయ్యర్, లోకేష్ రాహుల్ (కెప్టెన్), ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్, రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, శార్దూల్ ఠాకూర్, మహమ్మద్ షమీ, ప్రసిద్ధ్ కృష్ణ -
వచ్చే వారం మార్కెట్లలో ర్యాలీ? నిఫ్టీ 20 వేలు దాటేస్తుందా?
దేశీయ స్టాక్మార్కెట్లు ఈ వారాంతంలో నష్టాల్లో ముగిసాయి.గతవారం చీర్పుల్గా మార్కెట్లు ఈ వారం షాక్ ఇచ్చాయి. కానీ పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా శుక్రవారం నాటి ట్రేడింగ్లో కనిష్టాల వద్ద రికవరీని సాధించాయి. ఈనేపథ్యంలో తదుపరి వారం పాజిటివ్గా ట్రేడ్లో ఉండవచ్చు. నియోట్రేడర్ కో-ఫౌండర్ రాజా వెంకటరామన్ సాక్షిబిజినెస్ కన్సల్టెంట్ కారుణ్య రావు సంభాషణ విందాం. వచ్చే వారం మార్కెట్ ధోరణి ఎలా ఉండబోతోంది. బ్యాంకింగ్ షేర్లలో ఏవి బెటర్. ముఖ్యంగా నిఫ్టీ సపోర్ట్ లెవల్స్ ఏంటి అనేది ఒక సారి చూద్దాం. నిఫ్టీ 50 కచ్చితంగా 20000-20200, కానీ 202600 వద్దకు వెళ్లే ఛాన్స్ వుంది. లోయర్స్ లెవల్స్లో కొనుగోళ్లు జరిగే అవకాశం ఉంది. బ్యాంక్ నిఫ్టీకి ఇప్పటివరకూ పాజిటివ్ సంకేతాలే ఉన్నాయి. అయితే నిఫ్టీ19600-19500 వద్ద కొనుగోలు చేయడం ఉత్తమం. ఈ లెవల్ బ్రేక్ అవ్వనంత వరకు పెద్దగా ఆందోళన అవసరం లేదు. ఈ లెవల్స్లో కొనుగోలు చేస్తే మళ్లీ నిఫ్టీ 20వేలకు చేరే అవకాశం ఉంది. బ్యాంకింగ్ స్టాక్స్ బలహీనంగా ఉన్నాయి. బ్యాంకింగ్ ఇండెక్స్లో ప్రభుత్వ బ్యాంకులా, ప్రైవేటు బ్యాంకులా అనేది ఎలా చూడాలి. కచ్చితంగా పీఎస్యూ బ్యాంకులే పటిష్టంగా ఉన్నాయి. అలాగే హెచ్డీఎఫ్సీభారీగా నష్టపోయినప్పటికీ కనిష్టాల వద్ద కొనుగోళ్లు చోటు చేసుకునే అవకాశం ఉంది. రికమెండెడ్ స్టాక్స్: టీవీఎస్ మోటార్స్, టీసీఎస్ కొనుగోలు చేయవచ్చుని రాజా వెంకటరామన్ సూచిస్తున్నారు. (Disclaimer:మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప..వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు) -
ఆస్ట్రేలియాపై భారత్ ఘన విజయం
Australia tour of India, 2023- India vs Australia, 1st ODI: భారత్ ఘన విజయం మొదటి వన్డేలో ఆస్ట్రేలియాపై టీమిండియా 5 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. 48.4 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 277 పరుగుల లక్ష్యాన్ని చేధించింది. కేఎల్ రాహుల్ 58 పరుగులతో నాటౌట్గా నిలిచాడు. లక్ష్యం దిశగా భారత్ టీమిండియా లక్ష్యం దిశగా సాగుతుంది. 45 ఓవర్ల తర్వాత జట్టు స్కోర్ 253/4గా ఉంది. మరో 24 పరుగులు చేస్తే టీమిండియా విజయం సాధిస్తుంది. కేఎల్ రాహుల్ (44), సూర్యకుమార్ యాదవ్ (40) క్రీజ్లో ఉన్నారు. లక్ష్యానికి 54 పరుగుల దూరంలో ఉన్న భారత్ 40 ఓవర్ల తర్వాత టీమిండియా స్కోర్ 223/4గా ఉంది. భారత్ లక్ష్యానికి మరో 54 పరుగుల దూరంలో ఉంది. చేతిలో 6 వికెట్లు ఉన్నాయి. సూర్యకుమార్ యాదవ్ (25), కేఎల్ రాహుల్ (29) క్రీజ్లో ఉన్నారు. నాలుగో వికెట్ కోల్పోయిన భారత్.. ఇషాన్ ఔట్ 185 పరుగుల వద్ద టీమిండియా నాలుగో వికెట్ కోల్పోయింది. పాట్ కమిన్స్ బౌలింగ్లో వికెట్కీపర్కు క్యాచ్ ఇచ్చి ఇషాన్ కిషన్ (18) ఔటయ్యాడు. భారత్ లక్ష్యానికి ఇంకా 92 పరుగుల దూరంలో ఉంది. మరో 17.3 ఓవర్లు మిగిలి ఉన్నాయి. రాహుల్ (16), సూర్యకుమార్ యాదవ్ క్రీజ్లో ఉన్నారు. 25.3: మూడో వికెట్ కోల్పోయిన టీమిండియా ఆడం జంపా బౌలింగ్లో శుబ్మన్ గిల్ బౌల్డ్(74). స్కోరు: 155/3 (25.5). రాహుల్, ఇషాన్ కిషన్ క్రీజులో ఉన్నారు. రెండో వికెట్ కోల్పోయిన భారత్.. శ్రేయస్ రనౌట్ 148 పరుగుల వద్ద టీమిండియా రెండో వికెట్ కోల్పోయింది. అనవసర పరుగుకు ప్రయత్నించి శ్రేయస్ అయ్యర్ (3) రనౌటయ్యాడు. 23.4 ఓవర్ల తర్వాత టీమిండియా స్కోర్ 148/2గా ఉంది. గిల్ (72), రాహుల్ క్రీజ్లో ఉన్నారు. తొలి వికెట్ కోల్పోయిన భారత్ 142 పరుగుల వద్ద టీమిండియా తొలి వికెట్ కోల్పోయింది. ఆడమ్ జంపా బౌలింగ్లో రుతురాజ్ (71) ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. 23 ఓవర్ల తర్వాత టీమిండియా స్కోర్ 147/1. గిల్ (71), శ్రేయస్ అయ్యర్ (3) క్రీజ్లో ఉన్నారు. కెరీర్లో తొలి హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న రుతురాజ్ టీమిండియా ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ వన్డే కెరీర్లో తొలి హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. 60 బంతుల్లో 7 ఫోర్ల సాయంతో రుతు ఈ మైలురాయిని చేరుకున్నాడు. 17.4 ఓవర్ల తర్వాత టీమిండియా స్కోర్ 112/0. గిల్ (59), రుతురాజ్ (51) క్రీజ్లో ఉన్నారు. హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న గిల్ మాథ్యూ షార్ట్ బౌలింగ్లో వరుసగా బౌండరీ, సిక్సర్ కొట్టి శుభ్మన్ గిల్ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. 37 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సర్లతో గిల్ ఈ మార్కును చేరుకున్నాడు. 14 ఓవర్ల తర్వాత టీమిండియా స్కోర్ 95/0. గిల్ (53), రుతురాజ్ (40) క్రీజ్లో ఉన్నారు. 8 ఓవర్ల తర్వాత భారత్ స్కోర్ 43/0 277 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన భారత్ ఆచితూచి ఆడుతుంది. 8 ఓవర్ల తర్వాత జట్టు స్కోర్ 43/0గా ఉంది. రుతురాజ్ గైక్వాడ్ (17), శుభ్మన్ గిల్ (25) క్రీజ్లో ఉన్నారు. ఐదేసిన షమీ.. ఆసీస్ 276 ఆలౌట్ టీమిండియా ఏస్ పేసర్ మహ్మద్ షమీ (5/51) ఐదు వికెట్లతో రెచ్చిపోవడంతో తొలి వన్డేలో ఆసీస్ 276 పరుగులకు ఆలౌటైంది. షమీకి ఇవి కెరీర్లో అత్యుత్తమ గణాంకాలు. ఆసీస్ ఇన్నింగ్స్లో మిచెల్ మార్ష్ (4), వార్నర్ (52), స్టీవ్ స్మిత్ (41), మార్నస్ లబూషేన్ (39), కెమరూన్ గ్రీన్ (31), ఇంగ్లిస్ (45), స్టోయినిస్ (29) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. ఆఖర్లో కమిన్స్ (21 నాటౌట్) వేగంగా పరుగులు రాబట్టాడు. భారత బౌలర్లలో బుమ్రా, అశ్విన్, జడేజాలకు తలో వికెట్ దక్కాయి. ఐదేసిన షమీ ఈ మ్యాచ్లో షమీ ఐదు వికెట్లు పడగొట్టాడు. సీన్ అబాట్ (0) క్లీన్ బౌల్డయ్యాడు. షమీకి నాలుగో వికెట్ ఈ మ్యాచ్లో షమీ నాలుగో వికెట్ తీసుకున్నాడు. షమీ బౌలింగ్లో సూర్యకుమార్ యాదవ్ క్యాచ్ పట్టడంతో షార్ట్ (2) పెవిలియన్కు చేరాడు. 48.2 ఓవర్ల తర్వాత ఆసీస్ స్కోర్ 254/8. ఆసీస్ ఏడో వికెట్ డౌన్ 250 పరుగుల వద్ద ఆసీస్ ఏడో వికెట్ కోల్పోయింది. బుమ్రా బౌలింగ్లో శ్రేయస్ అయ్యర్కు క్యాచ్ ఇచ్చి ఇంగ్లిస్ (45) ఔటయ్యాడు. షార్ట్ (1), కమిన్స్ క్రీజ్లో ఉన్నారు. మరో వికెట్ తీసిన షమీ.. డేంజరెస్ స్టోయినిస్ క్లీన్ బౌల్డ్ షమీ ఈ మ్యాచ్లో తన మూడో వికెట్ను పడగొట్టాడు. స్టోయినిస్ను (29) షమీ క్లీన్బౌల్డ్ చేశాడు. 46.4 ఓవర్ల తర్వాత ఆసీస్ స్కోర్ 248/6. ఇంగ్లిస్ (44), షార్ట్ క్రీజ్లో ఉన్నారు. ఐదో వికెట్ కోల్పోయిన ఆసీస్.. గ్రీన్ రనౌట్ 186 పరుగుల వద్ద ఆసీస్ ఐదో వికెట్ కోల్పోయింది. గ్రీన్ (31) రనౌటయ్యాడు. బుమ్రా,సూర్యకుమార్ యాదవ్లు కలిసి గ్రీన్ను ఔట్ చేశారు. 40 ఓవర్ల తర్వాత ఆసీస్ స్కోర్ 187/5. ఇంగ్లిస్ (14), స్టోయినిస్ క్రీజ్లో ఉన్నారు. వర్షం ముప్పు.. ఆటకు విరామం వర్షం కురిసే అవకాశం ఉండటంతో ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా ఆటగాళ్లు మైదానాన్ని వీడారు. పిచ్ను కవర్లతో కప్పేశారు. ఆకాశం మేఘావృతం కావడంతో అంపైర్లు ఈ నిర్ణయం తీసుకున్నారు. నాలుగో వికెట్ కోల్పోయిన ఆసీస్.. అశ్విన్కు వికెట్ 157 పరుగుల వద్ద ఆసీస్ నాలుగో వికెట్ కోల్పోయింది. అశ్విన్ బౌలింగ్లో కేఎల్ రాహుల్ అద్భుతమైన స్టంపింగ్ చేసి లబూషేన్ (39)ను ఔట్ చేశాడు. 32.4 ఓవర్ల తర్వాత ఆసీస్ స్కోర్ 157/4. గ్రీన్ (15), ఇంగ్లిస్ క్రీజ్లో ఉన్నారు. Mitchell Marsh ✅ Steven Smith ✅ Mohammed Shami is on fire against the Aussies! 🔥#INDvsAUS #CricketTwitter #SteveSmith pic.twitter.com/bsw6hwJuCe — OneCricket (@OneCricketApp) September 22, 2023 స్టీవ్ స్మిత్ను క్లీన్ బౌల్డ్ చేసిన షమీ మహ్మద్ షమీ బౌలింగ్లో స్టీవ్ స్మిత్ (60 బంతుల్లో 41; 3 ఫోర్లు, సిక్స్) క్లీన్ బౌల్డయ్యాడు. 22 ఓవర్ల తర్వాత ఆసీస్ స్కోర్ 114/3. లబూషేన్ (11), కెమరూన్ గ్రీన్ (1) క్రీజ్లో ఉన్నారు. 🫣🫣🫣 pic.twitter.com/mW4EH4c7O3 — Sitaraman (@Sitaraman112971) September 22, 2023 రెండో వికెట్ కోల్పోయిన ఆసీస్.. వార్నర్ (52) ఔట్ 52 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద వార్నర్ ఔటయ్యాడు. జడేజా బౌలింగ్లో గిల్కు క్యాచ్ ఇచ్చి వార్నర్ పెవిలియన్కు చేరాడు. వార్నర్ 53 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్సర్లు బాదాడు. 20 ఓవర్ల తర్వాత ఆసీస్ స్కోర్ 107/2. స్టీవ్ స్మిత్ (39), లబూషేన్ (7) క్రీజ్లో ఉన్నారు. 15 ఓవర్ల తర్వాత ఆసీస్ స్కోర్ ఎంతంటే..? 15 ఓవర్ల తర్వాత ఆస్ట్రేలియా స్కోర్ 78/1గా ఉంది. వార్నర్ (48), స్టీవ్ స్మిత్ (21) క్రీజ్లో ఉన్నారు. వార్నర్ ధాటిగా ఆడుతున్నాడు. 10 ఓవర్ల తర్వాత ఆస్ట్రేలియా స్కోరు 42/1 10 ఓవర్ల తర్వాత ఆస్ట్రేలియా స్కోర్ 42/1గా ఉంది. డేవిడ్ వార్నర్ (17), స్టీవ్ స్మిత్ (17) క్రీజ్లో ఉన్నారు. The sensational Shami for India! pic.twitter.com/2TzPgB7UjW — Mufaddal Vohra (@mufaddal_vohra) September 22, 2023 తొలి వికెట్ కోల్పోయిన ఆసీస్ 0.4: మిచెల్ మార్ష్ రూపంలో ఆస్ట్రేలియా తొలి వికెట్ కోల్పోయింది. షమీ బౌలింగ్లో గిల్కు క్యాచ్ ఇచ్చి మార్ష్(4) అవుటయ్యాడు. స్మిత్, వార్నర్ క్రీజులో ఉన్నారు. స్కోరు: 4-1 3 మ్యాచ్ల వన్డే సిరీస్లో భాగంగా టీమిండియాతో ఇవాళ (సెప్టెంబర్ 22) జరుగుతున్న తొలి వన్డేలో ఆసీస్ తొలుత బ్యాటింగ్ చేస్తుంది. టీమిండియా టాస్ గెలిచి ఆసీస్ను బ్యాటింగ్కు ఆహ్వానించింది. టీమిండియా: శుభమన్ గిల్, రుతురాజ్ గైక్వాడ్, శ్రేయాస్ అయ్యర్, లోకేష్ రాహుల్ (కెప్టెన్), ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్, రవీంద్ర జడేజా (వైస్ కెప్టెన్), రవిచంద్రన్ అశ్విన్, శార్దూల్ ఠాకూర్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ షమీ ఆస్ట్రేలియా: డేవిడ్ వార్నర్, మిచెల్ మార్ష్, స్టీవ్ స్మిత్, మాథ్యూ షార్ట్, మార్నస్ లబుషేన్, కామెరాన్ గ్రీన్, జోష్ ఇంగ్లిస్ (వికెట్కీపర్), మార్కస్ స్టోయినిస్, పాట్ కమిన్స్ (కెప్టెన్), సీన్ ఆంథోనీ అబాట్, ఆడమ్ జంపా. -
నోరుజారిన డాక్టర్బాబు.. రెచ్చిపోయి ఛాలెంజ్ చేసిన శోభా
'బిగ్బాస్ 7'.. గత రెండు వారాలతో పోలిస్తే రోజురోజుకీ వెరైటీగా మారుతోంది. ఈ వారం నామినేషన్స్లో భాగంగా కాస్త హడావుడి జరిగినా.. తర్వాతి రోజుకే అది చల్లారిపోయింది. మరోవైపు మూడో పవరస్త్ర కోసం ముగ్గుర్ని సెలెక్ట్ చేసిన బిగ్బాస్.. హౌస్ మొత్తాన్ని ఆగమాగం చేసేశాడు. ఇందులో భాగంగా బుధవారం కూడా శోభాశెట్టి, ప్రిన్స్ యవర్ సెంటరాఫ్ ఎట్రాక్షన్గా నిలిచారు. ఇంతకీ హౌసులో 17వ రోజు ఏం జరిగిందనేది Day-17 హైలైట్స్లో ఇప్పుడు చూద్దాం. ఒకే ప్లేటులో తిన్నారు మంగళవారం జరిగిన పవరస్త్ర టాస్కులో యవర్.. అనర్హుడని రతిక నామినేట్ చేసింది. తనతోనే ఉంటూ తననే వెన్నుపోటు పొడవడంపై తొలుత కాస్త ఇబ్బందిపడ్డ ప్రిన్స్.. తనని తాను సంభాళించుకున్నాడు. రతికతోనే మాట్లాడుతూ.. తనకు ఏం ప్రాబ్లమ్ లేదని ఆమెకే చెప్పుకొచ్చాడు. ఇద్దరూ చాలాసేపు మాట్లాడుకున్నారు. రాత్రి ఒకే ప్లేటులో కలిసి భోజనం కూడా చేశారు. ఇది చూసి శుభశ్రీ, దామిని, గౌతమ్.. గుసగుసలాడుకున్నారు. (ఇదీ చదవండి: రతిక బండారం బయటపెట్టిన మాజీ బాయ్ఫ్రెండ్!) శివాజీ పవరస్త్ర గొడవ తన పవరస్త్ర దొంగిలించారని పిల్లాడిలా శివాజీ గిలగిలా కొట్టేసుకుంటూనే ఉన్నాడు. సందీప్తో మాట్లాడుతూ తేజపై అనుమానం వ్యక్తం చేశాడు. వాడిని నామినేషన్స్ నుంచి సేవ్ చేస్తే, ఇలా చేస్తాడా? వాడికి అసలు అర్హతే లేదని అంటూ రెచ్చిపోయాడు. మరోవైపు పవరస్త్ర కొట్టేసిన అమరదీప్.. శివాజీ, రతిక బెడ్స్ దగ్గర టిష్యూ పేపర్పై ఏఏ, ఏ ఏడీ అని రాసి హింట్స్ ఇచ్చేలా పెట్టాడు. కానీ వాళ్లు కనిపెట్టలేకపోయారు. యవర్ని ఆటాడేసుకున్నారు అయితే పవరస్త్ర పోటీలో ఉన్న ప్రిన్స్ యవర్.. కంటెండర్గా నిలబడాలంటే ఓ పోటీ తట్టుకోవాల్సి ఉంటుందని చెప్పాడు. ఇందులో భాగంగా ఓ బల్లపై గడ్డం పెట్టాలి. అతడిని నామినేట్ చేసిన తేజ, దామిని, రతిక డిస్ట్రబ్ చేస్తారు. కదలకుండా గంటసేపు నిలబడాలని రూల్ పెట్టాడు. దీన్ని పాటించిన యవర్.. కదలకుండా అలానే నిలబడ్డాడు. అయితే దామిని,రతిక, తేజ మాత్రం.. పేడ, గడ్డి, శాంపూ నీళ్లు, ఐస్ గడ్డలతో ఆటాడేసుకున్నారు. కానీ యవర్ ఇందులో గెలిచి నిలబడ్డాడు. (ఇదీ చదవండి: హీరోయిన్ సాయిపల్లవి పెళ్లి రూమర్స్.. అసలేం జరిగింది?) శోభాశెట్టి vs గౌతమ్ ఇక యవర్ టాస్క్ అయిపోయిన తర్వాత శోభాశెట్టిని నామినేట్ చేసిన వాళ్ల వీడియోలు చూపించారు. ప్రశాంత్, శుభశ్రీ వరకు పెద్దగా పట్టించుకుని ఈమె.. గౌతమ్ తో మాత్రం పెద్ద గొడవ పెట్టుకుంది. ఫిజికల్గా స్ట్రాంగ్ అని కారణం చెప్పడంపై శోభా మండిపడింది. తను శారీరకంగా బలంగా లేకపోతే.. పుల్ రాజా పుల్ టాస్కులో ఎలా గెలుస్తాను, కుస్తీ పోటీల్లో ఎలా గెలుస్తాను అంటూ గొడవ పెట్టుకుంది. దీంతో గౌతమ్.. తను అనుకున్న కారణాలు చెబుతూ షర్ట్ విప్పేశాడు. అయితే అతడు షర్ట్ తీసి షో హాఫ్ చేస్తున్నాడని శోభాశెట్టి అతడిపై ఆగ్రహం వ్యక్తం చేసింది. దీంతో గౌతమ్ మరింత రెచ్చిపోయాడు. అవసరమైతే ప్యాంట్ కూడా తీసేస్తానని అన్నాడు. అలా మాటామాట పెరిగిన ఒకానొక టైంలో.. 'అసలు నీకు హౌసులో ఉండటానికి అర్హతే లేదు' అని గౌతమ్ నోరుజారాడు. దెబ్బకు శోభాశెట్టి కౌంటర్ ఇచ్చింది. 'హౌసులో నీకంటే ఎక్కువ రోజులు ఉండి చూపిస్తా' అని ఛాలెంజ్ చేసింది. అయితే ఈ గొడవంతా చూస్తుంటే.. కార్తీకదీపం మోనిత శోభాశెట్టిని పూనిందేమో అని ప్రేక్షకులకు డౌట్ వచ్చింది. మరోవైపు అమరదీప్ని ప్రియాంక నామినేట్ చేసిన వీడియోని కూడా ప్లే చేశారు. అలా బుధవారం ఎపిసోడ్కి ఎండ్ కార్డ్ పడింది. (ఇదీ చదవండి: ఓటీటీకి వచ్చేస్తున్న మెగాహీరో సినిమా.. స్ట్రీమింగ్ అప్పుడే) -
రతిక వెన్నుపోటు.. గిలగిలా కొట్టేసుకున్న ప్రిన్స్ యవర్
'బిగ్బాస్'లో మూడోవారం నామినేషన్స్ పర్వం ముగిసింది. హౌస్మేట్స్ దాన్నుంచి బయటకొచ్చేశారు. అంతా ఓకే అనుకునేలోపు.. బిగ్బాస్ మరో ఫిట్టింగ్ పెట్టేశాడు. దీంతో హౌస్ వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. ఇక రతిక వల్ల ప్రశాంత్, యవర్ మెంటలెక్కిపోయారు. ఇంతకీ బిగ్బాస్ హౌసులో మంగళవారం ఏం జరిగిందనేది Day-16 హైలైట్స్లో ఇప్పుడు చూద్దాం. (ఇదీ చదవండి: హీరోయిన్ త్రిషకు పెళ్లి? ఆ నిర్మాతతో ఏడడుగులు!) మాజీ బాయ్ఫ్రెండ్ టాపిక్ ఇక సోమవారం నామినేషన్స్ పూర్తయిన దగ్గర మంగళవారం ఎపిసోడ్ ప్రారంభమైంది. తేజని సేవ్ చేసి, అమరదీప్ని ఎందుకు నామినేట్ చేయాల్సి వచ్చిందనేది సందీప్, శోభాశెట్టితో చెప్పుకొచ్చాడు. గతవారం ప్రశాంత్కి ఎక్కువ ఓట్లు పడ్డాయని, అందుకే ఈసారి అమర్ని అయితే తట్టుకోగలడని, కచ్చితంగా సేవ్ అవుతాడని అన్నాడు. మరోవైపు తన మాజీ బాయ్ఫ్రెండ్ గురించి పరోక్షంగా మాట్లాడుతున్నారని, దీంతో తన మైండ్ ఆఫ్ అయిపోయిందని రతిక, శివాజీతో మాట్లాడుతూ బాధపడింది. బాధపడిన ప్రశాంత్ ఇక హౌసులో ఉన్న అందరూ కలిసి వినాయక చవితి సెలబ్రేషన్స్ చేసుకున్నారు. పిండితో ముద్దలా చేసి, దానితో గణేశుడి ప్రతిమ చేసుకుని పూజా చేసుకుని, ప్రసాదం తిన్నారు. ఇక అసలు విషయంలోకి వచ్చేసిన బిగ్బాస్.. మూడో పవరస్త్ర కోసం తాను ముగ్గుర్ని సెలెక్ట్ చేశానని అమర్దీప్, శోభాశెట్టి, ప్రిన్స్ యవర్ పేర్లు చెప్పాడు. దీంతో మిగతా వాళ్లలో అసంతృప్తి మొదలైంది. అయితే ఏదో భూమి బద్దలైనట్లు ప్రశాంత్ తెగ బాధపడిపోయాడు. 'ఓడిపోయా.. నేను ఓడిపోయా' అని తనలో తానే అనుకున్నాడు. (ఇదీ చదవండి: హిట్ ఇచ్చిన డైరెక్టర్నే అవమానించిన రజనీకాంత్!) ఫిట్టింగ్ పెట్టిన బిగ్బాస్ బాధపడుతున్న ప్రశాంత్ని కన్ఫెషన్ రూంకి పిలిచిన బిగ్బాస్.. పవరస్త్ర కోసం తాను ఎంపిక చేసిన ముగ్గురిలో అనర్హులు అనిపించిన వారి పేరు చెప్పమన్నాడు. సందీప్, శివాజీతో పాటు సెలెక్ట్ అయిన ముగ్గుర్ని కాకుండా అందరినీ పిలిచి అనర్హులు అనిపించిన వారి పేరు, అభిప్రాయాలు చెప్పమన్నాడు. అలా అసలు సిసలైన ఫిట్టింగ్ పెట్టేశాడు. ఎవరు ఎవరిని నామినేట్ చేశారు? ప్రశాంత్ - శోభాశెట్టి ప్రియాంక - అమర్దీప్ శుభశ్రీ - శోభాశెట్టి తేజ - యవర్ దామిని - యవర్ గౌతమ్ - శోభాశెట్టి రతిక - యవర్ (ఇదీ చదవండి: అవినీతి బాబును వెనకేసుకొస్తోన్న 'టాలీవుడ్' పెద్దలు) శివాజీ పవరస్త్ర చోరీ ఓవైపు ఈ గేమ్ జరుగుతుండగానే శివాజీ గెలుచుకున్న పవరస్త్రని అమరదీప్ దొంగతనం చేశాడు. అతడు సైలెంట్గా ఏం తెలియనట్లు ఉండిపోయాడు. మరోవైపు ప్రశాంత్ తీశాడమేనని అతడితో రతిక గొడవ పెట్టుకుంది. ఏదో సరదా కోసం అనుకున్న గొడవ కాస్త.. అరిచి గోల గోల చేసుకునేలా మారిపోయింది. ప్రశాంత్, రతికని టచ్ చేస్తూ మాట్లాడటం కాస్త వింతగా అనిపించింది. రతిక వెన్నుపోటు ఎవరు అనర్హులో ఏడుగురు కంటెస్టెంట్స్ చెప్పిన వీడియోస్ని టీవీలో ప్లే చేసిన బిగ్బాస్.. బాంబు పేల్చాడు. తొలుత యవర్ పేరు చెప్పిన వాళ్ల వీడియోలు ప్లే చేశారు. ఈ క్రమంలోనే అతడు తేజతో గార్డెన్ ఏరియాలో గొడవపెట్టుకున్నాడు. అక్కడితో ఈ తతంగం అయిపోలేదు. తనని తాను కంట్రోల్ చేసుకోలేకపోయిన యవర్.. స్మోక్ రూంలోని బెంచ్పై ఉన్న గ్లాసుని పదేపదే కొడుతూ.. అందరినీ భయపెట్టాడు. మిగతా వాళ్ల సంగతేమో కానీ రతిక తనకు ఈ రేంజులో వెన్నుపోటు పొడుస్తుందని ఊహించని యవర్.. ఇదే విషయాన్ని ఆమెతో చెబుతూ తెగ బాధపడ్డాడు. అలా మంగళవారం ఎపిసోడ్ పూర్తయింది. (ఇదీ చదవండి: ఆ సీన్ చేసినందుకు ఇప్పటికీ బాధపడుతున్నా: సదా) -
ప్రధాని మోదీ కీలక ప్రసంగంలో పలు అంశాల ప్రస్తావన
-
నామినేషన్స్లో యవర్ అతి.. ప్రశాంత్ సిల్లీ రీజన్స్!
'బిగ్బాస్' మూడో వారంలోకి అడుగుపెట్టేశాడు. షకీలా ఎలిమినేట్ అయి, బయటకెళ్లిపోవడంతో కాస్త ఎమోషనల్ అయిన ఇంటి సభ్యులు.. నామినేషన్స్ వచ్చేసరికి మళ్లీ ఎనర్జీతో కనిపించారు. ఒకరిపై ఒకరు అరుస్తూ, బాగానే హడావుడి చేశారు. ఈ వారం కూడా ఏడుగురు నామినేషన్స్లో నిలవగా, చివరలో 'బిగ్బాస్' చిన్న ట్విస్ట్ ఇచ్చాడు. అయితే 14వ రోజు ఏం జరిగిందనేది ఇప్పుడు హైలైట్స్లో చూద్దాం. సుత్తిలేకుండా మొదలయ్యాయి షకీలా ఎలిమినేట్ అయి, హౌస్ నుంచి బయటకెళ్లిపోవడంతో ఆదివారం ఎపిసోడ్ ఎండ్ అయిపోయింది. అక్కడి నుంచే సోమవారం ఎపిసోడ్ షురూ అయింది. బెడ్ రూంలో దామిని, ప్రియాంక.. ప్రిన్స్ యవర్ గురించి మాట్లాడుకున్నారు. అతడి ప్రవర్తన నచ్చలేదని అన్నారు. నిద్రపోయే లేచేసరికి సోమవారం వచ్చేసింది. నేరుగా సుత్తిలేకుండా నామినేషన్స్ ప్రారంభమైపోయాయి. హుసులో అనర్హుడు అనిపిస్తున్న ఇద్దరినీ నామినేట్ చేయమని బిగ్బాస్ చెప్పాడు. (ఇదీ చదవండి: తెలుగు యంగ్ హీరో తల్లిపై పోలీస్ కేసు.. ఏం జరిగింది?) ఎవరు ఎవరిని నామినేట్ చేశారు? ప్రియాంక - యవర్, గౌతమ్ ప్రశాంత్ - తేజ, దామిని శోభాశెట్టి - శుభశ్రీ, రతిక అమర్దీప్ - గౌతమ్, శుభశ్రీ రతిక - శుభశ్రీ, గౌతమ్ తేజ - ప్రశాంత్, గౌతమ్ యవర్ - ప్రియాంక, దామిని దామిని - యవర్, శుభశ్రీ గౌతమ్ - రతిక, అమర్దీప్ శుభశ్రీ - తేజ, ప్రియాంక నామినేషన్స్లో ఏం జరిగింది? తొలుత వచ్చిన ప్రియాంక.. యవర్, గౌతమ్ని నామినేట్ చేసింది. అయితే గౌతమ్ పెద్దగా వ్యతిరేకించనప్పటికీ, ప్రిన్స్ యవర్ మాత్రం చాలా హడావుడి చేశాడు. ఇక ప్రశాంత్.. తేజని నామినేట్ చేస్తూ సరైన కారణం చెప్పలేకపోయాడు. మధ్యలో కల్పించుకున్న బిగ్బాస్.. సిల్లీ రీజన్స్ వద్దని మొట్టికాయలు వేశాడు. అయినా వల్ల కాకపోయేసరికి వదిలేశాడు. దామిని కూడా నామినేట్ చేసిన ప్రశాంత్.. వంట విషయంలో తనకు పదే పదే చెప్పడం నచ్చలేదని అన్నాడు. శోభాశెట్టి.. శుభశ్రీ నామినేషన్స్ లోకి రాకుండా సేఫ్ గేమ్ ఆడుతుందని చెప్పింది. రతికకి మొండితనం, స్వార్థం ఎక్కువని కారణాలు చెప్పింది. (ఇదీ చదవండి: పెళ్లికి ముందే అత్తారింట్లో మెగా కోడలు సందడి) అతి చేసిన యవర్! అమర్దీప్, రతిక, యవర్.. తమ తమ నామినేషన్స్ని పెద్దగా హడావుడి లేకుండా ముగించేశారు. అయితే దామిని.. తనని నామినేట్ చేసేసరికి ప్రిన్స్ యవర్ తట్టుకోలేకపోయాడు. అలానే ఆమె చెప్పేది అతడికి సరిగా అర్థం కాకపోవడం వల్ల వేరేది అనుకుని అటుఇటూ తిరుగుతూ కాస్త అతి చేశాడనిపించింది. ఇక శుభశ్రీ అయితే దామిని తనని టార్గెట్ చేస్తుందని ఈ విషయాన్ని ఆమెతోనే చెప్పింది చివర్లో ట్విస్ట్ మిగిలిన వాళ్లలో గౌతమ్, శుభశ్రీ కూడా తమ తమ నామినేషన్స్ని సింపుల్గానే ముగించేశారు. దీంతో ఈ వారం నామినేషన్స్లో తొలుత శుభశ్రీ, గౌతమ్, తేజ, ప్రియాంక, దామిని, రతిక, యవర్ నిలిచారు. అయితే చివర్లో ఎంట్రీ ఇచ్చిన బిగ్బాస్.. పవరస్త్ర గెల్చుకున్న శివాజీ, సందీప్లకు ఓ టాస్క్ ఇచ్చాడు. లిస్టులో ఒకరిని సేవ్ చేసి, సేఫ్ గా ఉన్నవాళ్లని నామినేట్ చేయాలని అన్నారు. దీంతో ఇద్దరూ అనుకుని తేజని సేవ్ చేసి, అతడి ప్లేసులో అమర్దీప్ నామినేట్ చేశారు. అలా ఏడుగురు నామినేషన్స్లో నిలవడంతో సోమవారం ఎపిసోడ్ పూర్తయింది. మిగతారోజుల సంగతెలా ఉన్నా.. సోమవారం మాత్రం టాప్ లేచిపోతూ ఉంటుంది. ఈసారి అలాంటిదేం లేకుండా, చాలా ప్లెయిన్గా అనిపించింది. (ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లో 20 సినిమాలు రిలీజ్) -
కంట్రోల్ తప్పిన యవర్.. అపరిచితుడులా బిహేవ్ చేశాడు!
'మాయ అస్త్ర' గెలుచుకున్న రణధీర టీమ్లో ఎవరు దాన్ని ఉంచేందుకు అనర్హులో చెప్పే టాస్క్ మధ్యలోనే గురువారం ఎపిసోడ్ ముగిసింది. అక్కడి నుంచి శుక్రవారం ఎపిసోడ్ మొదలైంది. అయితే ఇందులో భాగంగా ప్రిన్స్ యవర్.. గౌతమ్, సందీప్తో పెద్ద గొడవలు పెట్టుకున్నాడు. అలానే రెండో 'పవర్ అస్త్ర' కోసం ఆ ముగ్గురి మధ్య 'బిగ్బాస్' ఓ పోటీ పెట్టారు. ఇంతకీ అదేంటి? 12వ రోజు హైలైట్స్ ఏంటనేది ఇప్పుడు చూద్దాం. యవర్ vs గౌతమ్ టాస్కులో భాగంగా ప్రిన్స్ దగ్గరున్న భాగాన్ని తీసుకుని.. 'మహబలి' టీమ్ దాన్ని శివాజీ చేతిలో పెట్టారు. దీనికి ప్రిన్స్ ఒప్పుకోలేదు. తన పార్ట్ని అస్సలు ఇచ్చేదే లేదని నానా రాద్ధాంతం చేశాడు. ఒకానొక దశలో బరస్ట్ అయిపోయిన యవర్.. తనకు ఇక్కడ ఉండటం ఇష్టం లేదని, ఇది చాలా బ్యాడ్ గేమ్ అన్నాడు. 'ఇచ్చేయ్ ఇచ్చేయ్' అని తన భాగాన్ని విసిరేసి.. గౌతమ్ వైపు చూస్తూ అరిచాడు. గేటు తెరవండి, ఇంటికెళ్లిపోతా అని చిన్నపిల్లాడిలా గుక్కపట్టి ఏడ్చాడు. (ఇదీ చదవండి: కొత్త ఇంట్లోకి ఫైమా.. అమ్మని పట్టుకుని ఏడ్చేసింది!) ప్లేట్ మార్చిన రతిక మహబలి టీమ్ లో అందరూ అనుకుని.. శివాజీ, షకీలాకు మాయ అస్త్ర భాగాల్ని ఇచ్చారని అందరూ అనుకున్నారు. కానీ అదే గ్రూపులో ఉన్న రతిక.. ఒక్కసారిగా గట్టిగట్టిగా అరుస్తూ ప్లేట్ తిప్పేసింది. తాను శివాజీ, ప్రిన్స్ అని చెబితే.. తన మాట అస్సలు వినలేదని సొంత టీమ్పైనే చాడీలు చెప్పింది. ఆడితే జెన్యూన్గా ఆడండని అరిచి గోల చేసింది. రతిక అలా అనేసరికి ప్రశాంత్, గౌతమ్ ఆమెపై రెచ్చిపోయారు. ఇప్పుడు చెబితే ఎలా అని గొడవపడ్డారు. కాసేపు అయితే ఆమెని కొట్టేవాళ్లేమో అన్నంతలా ఊగిపోయారు. ఇకపోతే రతిక, వాళ్ల టీమ్ వాళ్లతో గొడవపడుతుంటే మధ్య ప్రిన్స్ ఎంట్రీ ఇచ్చాడు. గౌతమ్ ముఖం వరకు వచ్చి గట్టిగా అరుస్తూ నానా రచ్చ చేశాడు. ఇంగ్లీష్, హిందీలో మాటాడుతూ హౌస్ రూల్స్ మళ్లీ బ్రేక్ చేశాడు. బాడీ చుడూ అని ప్రిన్స్ అంటే.. ఏంటి అవి ఇంజెక్షన్స్తో తెచ్చుకున్నవే కదా అని గౌతమ్ సైగ చేశాడు. దీంతో యవర్ ఒళ్లు మండింది. పర్సనల్కి వెళ్లొద్దు అని ప్రిన్స్ కోపం కట్టలు తెచుకుంది. కానీ గౌతమ్ తగ్గితేగా! గౌతమ్ ఎంత కంట్రోల్ చేసుకున్నా.. పదే పదే మీదకొస్తూ యవర్ అల్లరల్లరి చేశాడు. బిగ్బాస్కే వార్నింగ్ హౌసులో రాజకీయాలు ఎక్కువైపోయాయని రతిక.. గట్టిగా అరుస్తూ చెప్పింది. అలానే ఇక్కడందరూ ఫేక్ మనుషులు అని, వాళ్లతో ఉండలేనని యవర్ చెప్పాడు. తన పార్ట్ లాగేసుకున్నారని, ఏకంగా సందీప్తోనూ గొడవపడ్డాడు. తనకు ఆన్సర్ కావాలని, లేకపోతే అప్పటివరకు మైక్ వేసుకోనని బిగ్బాస్కే వార్నింగ్ ఇచ్చేలా మాట్లాడాడు. (ఇదీ చదవండి: 'ఛాంగురే బంగారు రాజా' సినిమా రివ్యూ) యవర్ కూల్ అయ్యాడు అర్థరాత్రి కన్ఫెషన్ రూంలోకి పిలిచి ఏమైందని యవర్ని బిగ్బాస్ అడిగాడు.. దీంతో జరిగినదంతా చెప్పేశాడు. ఈ క్రమంలోనే.. మిమ్మల్ని బిగ్ బాస్ చూస్తున్నారు. బయట ప్రేక్షకులూ చూస్తున్నారు అని చెప్పుకొచ్చాడు. గౌతమ్ నుంచి సారీ కావాలని యవర్ అడగ్గా.. అలాంటిదే ఉండదు అని డైరెక్ట్గా చెప్పకుండా, మీరు ఇక్కడికి గెలవడానికి వచ్చారు, మీరు ఇక బయటకెళ్లొచ్చు అని బిగ్బాస్, యవర్ని కూల్ చేశాడు. ట్విస్ట్ ఇచ్చిన పెద్దన్న అయితే గొడవ జరుగుతున్న టైంలో మాట వదిలావ్ అని రతికకి షకీలా గీతోపదేశం చేసింది. ఏదైతేనేం చివరకు సారీ చెప్పిన రతిక.. షకీలా కాళ్లకు దండం పెట్టింది. మరోవైపు రెండో పవర్ అస్త్ర కోసం మరో పోటీదారుడ్ని ఎంచుకునే ఛాన్స్ ఇస్తున్నారు అని సందీప్తో బిగ్బాస్ చెప్పారు. దీంతో చాలాసేపు ఆలోచింది అతడు అమరదీప్ పేరు చెప్పాడు. అయితే పోటీకి ఇద్దరే ఫిక్స్ అయిన తర్వాత మరో వ్యక్తిని ఎంటర్ చేయడేం ఏంటని శివాజీ, షకీలాతో వాదన పెట్టుకున్నాడు. నలుగురు కలిసి ఆడుతున్నారని క్లియర్గా తెలిసిపోతుందని(నలుగురు అంటే శోభాశెట్టి, ప్రియాంక, అమరదీప్తో సందీప్ కుమ్మక్కయ్యాడు) శివాజీ తన అభిప్రాయాన్ని బయటపెట్టాడు. తలుపు తీయరా సామీ నేను వెళ్లిపోతా.. నాకొద్దు ఈ గోల అని బిగ్ బాస్ తో అన్నాడు. (ఇదీ చదవండి: ఈ శుక్రవారం ఓటీటీల్లోకి 30 సినిమాలు) రతికతో యవర్ లవ్? అయితే బిగ్బాస్ తీరు తనకు నచ్చట్లేదని, ప్లీజ్ నన్ను ఎలిమినేట్ చేసేయండి అని శివాజీ వేడుకున్నాడు. మరోవైపు రతికని లవ్ చేస్తున్నావా అని ప్రశాంత్ యవర్ని అడిగితే.. కొంచెం ఫీలింగ్స్ ఉన్నాయని అన్నాడు. కొన్నిరోజులు ఆగు నీకే తెలుస్తుందని ప్రశాంత్.. తనకు తొలివారం జరిగిన అనుభవం దృష్ట్యా యవర్పై సెటైర్ వేశాడు. లవ్ వద్దురా నాయనా అని అన్నాడు. అరిచే టాస్కులో రచ్చ రెండో పవర్ అస్త్ర కోసం.. గార్డెన్ ఏరియాలో ఉన్న ఓ చెవిలో గట్టిగా బిగ్ బాస్ అని మూడుసార్లు అరవాల్సి ఉంటుంది. ఎవరైతే పెద్దగా అరుస్తారో వాళ్లు గెలిచినట్లు. కాస్త గ్యాప్ ఇచ్చి, శివాజీ-అమరదీప్-షకీలా తలో మూడుసార్లు అరిచారు. ఈ గ్యాప్లో యవర్.. సందీప్తో గొడవపెట్టుకున్నాడు. చపాతీలు ఎవరూ చేయట్లేదని తనవైపు వేలు చూపిస్తున్నావ్ ఏంటని దగ్గరకెళ్లి గొడవపెట్టుకోవడానికి చూశాడు. సందీప్ చాలా ప్రశాంతంగా ఉండటంతో అక్కడికది ఎండ్ అయిపోయింది. ఇకపోతే రెండో పవర్ అస్త్రతోపాటు నాలుగు వారాల ఇమ్యూనిటీ గెలుచుకున్నది ఎవరో వీకెండ్లో నాగార్జున చెప్తారు, అప్పటివరకు వెయిట్ చేయండని బిగ్బాస్ చెప్పడంతో శుక్రవారం ఎపిసోడ్ పూర్తయింది. (ఇదీ చదవండి: 'జవాన్' కోసం దీపిక నో రెమ్యునరేషన్.. కారణం అదే?) -
Bigg Boss 7: అందరితోనూ శోభా గొడవలు.. అడ్డంగా దొరికిపోయిన తేజ!
'బిగ్బాస్ 7' మొదలైన రెండో రోజుకే గొడవలు షురూ అయ్యాయి. సోమవారం ఎపిసోడ్లో శివాజీ, ప్రియాంక మాత్రమే నామినేషన్స్ పూర్తి చేశారు. మంగళవారం మిగిలిన వాళ్లందరూ తమ తమ నామినేషన్స్ కంప్లీట్ చేశారు. ఈ క్రమంలోనే హౌస్ అంతా గొడవ గొడవగా మారింది. శోభాశెట్టి.. పలువురు కంటెస్టెంట్స్తో మాటామాటా అనుకుంది. టేస్టీ తేజ ఓ విషయమై అడ్డంగా దొరికిపోయాడు. ఇంతకీ రెండో రోజు ఏం జరిగిందనేది ఇప్పుడు Day 2 హైలైట్స్లో చూద్దాం. గౌతమ్ vs శోభాశెట్టి మంగళవారం ఎపిసోడ్లో భాగంగా తొలుత శోభాశెట్టిని బిగ్బాస్.. యాక్టివిటీ రూంలోకి పిలిచారు. గౌతమ్, కిరణ్ రాథోడ్ని ఆమె నామినేట్ చేసింది. తెలుగు సరిగా రాకపోవడం, మాట్లాడని కారణంగా కిరణ్ని నామినేట్ చేశానని చెప్పింది. కనెక్ట్ కాకపోవడం, బాండింగ్ ఏర్పడకపోవడం, పాజిటివ్ వైబ్స్ రాకపోవడంతో గౌతమ్ని నామినేట్ చేసినట్లు చెప్పింది. బయటకొచ్చిన తర్వాత దీని గురించి మాట్లాడుతూ.. 'నువ్వు వినడానికే రెడీగా లేవు' అని గౌతమ్తో శోభాశెట్టి గొడవ పెట్టుకుంది. శోభా ఏడుపు ఆ తర్వాత దామిని.. రతికని నామినేట్ చేసింది. డల్గా ఉందని, కిచెన్లో హెల్ప్ చేయలేదని కారణం చెప్పింది. శోభాశెట్టిని నామినేట్ చేస్తూ.. డిన్నర్ తర్వాత ప్లేట్ కడగలేదని రీజన్ చెప్పింది. ఇకపోతే లాన్లో కూర్చుని టేస్టీ తేజ-శోభాశెట్టి మాట్లాడుకున్నారు. తాను సహాయం చేస్తున్న అందరూ తననే నామినేట్ చేస్తున్నారని శోభా వలవలా ఏడ్చేసింది. దొరికిపోయిన తేజ ఇక ప్రిన్స్.. షకీలా, గౌతమ్ని నామినేట్ చేశాడు. 'నువ్వు ప్రిన్సా, మీ ఫాదర్ కింగా' అని అన్నందకు షకీలాని నామినేట్ చేశానని అన్నాడు. 'షో హాఫ్' అని తనపై కామెంట్స్ చేసినందుకు గౌతమ్ని నామినేట్ చేసినట్లు చెప్పుకొచ్చాడు. ఇది జరిగిన తర్వాత కంటెస్టెంట్స్ అందరిముందే తేజ ఏమన్నాడో గౌతమ్ కృష్ణ.. ప్రిన్స్తో చెప్పాడు. దీంతో తేజ అడ్డంగా దొరికిపోయినట్లు అయింది. దీనిపై మాట్లాడిన తేజ.. ఎవరేం చెప్పారో, ఎవరికేం చెప్పాలో అదే చెప్పానని తనని తాను సమర్థించుకున్నాడు. ఫైనల్గా తమ మధ్య మిస్ అండర్ స్టాండింగ్ వచ్చిందని ప్రిన్స్-గౌతమ్ హగ్ ఇచ్చుకున్నారు. కరెక్ట్ కాదని రతిక ఆట సందీప్.. రతికని నామినేట్ చేశాడు. కిచెన్లో కాస్త ఇర్రెస్పాన్సిబుల్గా ప్రవర్తించిందనే కారణం చెప్పాడు. పనిలో హెల్ప్ చేయట్లేదనే కారణంతో ప్రిన్స్ని నామినేట్ చేశాడు. అయితే ఇర్రెస్పాన్సిబుల్ అనే పదం తన గురించి ఉపయోగించడం కరెక్ట్ కాదని రతిక, సందీప్తో వాగ్వాదం పెట్టుకుంది. మరోవైపు దామిని తనని నామినేట్ చేయడంపై శోభాశెట్టి.. ప్రిన్స్తో చాలాసేపు మాట్లాడింది. ఆమె(దామిని) విధానం నచ్చలేదని అతడితో చెప్పుకొచ్చింది. చెత్త రీజన్ అని ప్రశాంత్ మరోవైపు షకీలా -ప్రిన్స్ని నామినేట్ చేసింది. తను సరదాగా 'మీ డాడీ కింగా?' అన్నానని, దానికి అతడు సీరియస్ అయినందుకు నామినేట్ చేస్తున్నానని చెప్పుకొచ్చింది. పల్లవి ప్రశాంత్ తనకు ఎక్కడో కనెక్ట్ కాలేదని నామినేట్ చేసింది. ఏదైనా పని చెబుతుంటే సరిగా పలకట్లేదని కారణం చెప్పుకొచ్చింది. షకీలా తనని ఓ చెత్త రీజన్కి నామినేట్ చేశారని తనలో తానే ప్రశాంత్ అనుకున్నాడు. ఇక గౌతమ్.. అందరిలో తక్కువ పని చేశారనే కారణంతో శోభాశెట్టి, ప్రిన్స్ని నామినేట్ చేశాడు. బయటకొచ్చిన తర్వాత మరోసారి గౌతమ్-శోభాశెట్టి మాటలతో కొట్లాడుకున్నారు. శోభాశెట్టి పశ్చాత్తాపం శుభశ్రీ.. రతిక, శోభాశెట్టిని నామినేట్ చేసింది. వాళ్లిద్దరికీ కనెక్ట్ కాలేకపోయానని, అలానే హౌసులో వాళ్లు పెద్దగా పనిచేయట్లేదని కారణాలు చెప్పుకొచ్చింది. గౌతమ్ చెప్పడం వల్లే శుభశ్రీ తనని నామినేట్ చేసిందని, ఇలాంటి మనుషులతో ఉండలేను బాబోయ్ అని శోభా తెగ పశ్చాత్తాప పడిపోయింది. ఇకపోతే పల్లవి ప్రశాంత్.. వీక్గా ఉన్నారని చెప్పి షకీలా, కిరణ్ రాథోడ్ని నామినేట్ చేశాడు. అమర్దీప్.. ప్రిన్స్, తేజని నామినేట్ చేశాడు. కిరణ్ రాథోడ్.. ప్రశాంత్, శోభాశెట్టిని నామినేట్ చేసింది. టేస్టీ తేజ.. ప్రశాంత్, కిరణ్ని నామినేట్ చేశాడు. మరోవైపు రతిక.. ప్రియాంక, దామినిని నామినేట్ చేసింది. అయితే ప్రియాంకని నామినేట్ చేస్తానని ముందే ఆమెకు రతిక చెప్పి వెళ్లింది. ఓవరాల్గా ఈ వారం ఎనిమిది మంది నామినేషన్స్లో నిలిచారు. నామినేషన్స్లో ఉన్నది వీళ్లే శోభా రతిక ప్రిన్స్ ప్రశాంత్ కిరణ్ గౌతమ్ షకీలా దామిని -
'బిగ్బాస్ 7'లో తొలిరోజే గొడవ? నామినేషన్లలో ఉన్నది వీళ్లే!
'బిగ్బాస్ 7' అసలు గేమ్ మొదలైంది. 14 మంది కంటెస్టెంట్స్ని ఆదివారం లోపలికి పంపించిన నాగార్జున.. హౌస్కి లాక్ వేసేశాడు. అలా ఆదివారం ఎపిసోడ్కి ఎండ్ పడింది. ఇకపోతే సోమవారం నామినేషన్స్ షురూ అయ్యాయి. హౌసులో ఫస్ట్ లవ్ ట్రాక్ కూడా మొదలైపోయింది. టేస్టీ తేజ అప్పుడే ఇద్దరి మధ్య పుల్ల పెట్టేశాడు. వీటితో పాటు తొలిరోజు ఇంకా ఏమేం జరిగాయనేది.. ఇప్పుడు Day-1 హైలైట్స్లో డీటైల్గా చూద్దాం. టాస్క్ ఇచ్చిన పొలిశెట్టి మూవీ ప్రమోషన్లో భాగంగా హౌసులోకి వెళ్లిన హీరో నవీన్ పొలిశెట్టిని సీక్రెట్ రూంలో పెట్టి బిగ్బాస్ లాక్ చేశాడు. హౌసులోని అమ్మాయిలందరూ కలిసి అతడిని బయటకు తీసుకొచ్చారు. అందరూ తమని తాము పరిచయం చేసుకున్నారు. అనంతరం 'మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి' సినిమాలోని 'లేడీ లక్' పాటని గుర్తు చేసిన నవీన్.. హౌసులో అబ్బాయిలు, అమ్మాయిల్లో నచ్చినవాళ్లకు బ్యాండ్ కట్టాలని టాస్క్ ఇచ్చాడు. బ్యాండ్ కట్టేశారు దీంతో ఆట సందీప్-ప్రియాంక జైన్కు, గౌతమ్ కృష్ణ- దామినికి, అమరదీప్ - శోభాశెట్టికి, పల్లవి ప్రశాంత్- రతికకి, శివాజీ-శుభశ్రీకి, ప్రిన్స్ యవర్ - కిరణ్ రాథోడ్కి, టేస్టీ తేజ- షకీలాకి బ్యాండ్ కట్టారు. ఆ తర్వాత లేడీ లక్ పాటకు అందరితో కలిసి డ్యాన్స్ చేసిన నవీన్.. హౌసు నుంచి బయటకొచ్చేశాడు. నాగ్ ఇచ్చిన సంకెళ్ల టాస్కులో భాగంగా గౌతమ్ కృష్ణ.. తన చేతికి ఉన్న హ్యాండ్ కఫ్ని శుభశ్రీకి వేశాడు. కాసేపటి తర్వాత అందరితో మాట్లాడిన బిగ్బాస్.. హౌసులో ఎన్నో కొత్త విషయాలు, ఆశ్చర్యపరిచేవి ఎన్నో రెడీగా ఉన్నాయని చెప్పారు. హౌసులో ఉన్నంత మాత్రాన హౌజ్మేట్స్ అయినట్లు కాదని క్లారిటీ ఇచ్చాడు. పులిహోర షురూ బిగ్ బాస్ అంటేనే పులిహోర కంపల్సరీ. ఈ క్రమంలోనే పల్లవి ప్రశాంత్, రతికకు బ్యాండ్ కట్టాడు. దీంతో వీళ్లిద్దరి మధ్య మాటలు కలిశాయి. ఈ క్రమంలోనే అసలు బిగ్ బాస్ హౌసులోకి ఎందుకు రావాలనుకున్నావ్ అని ప్రశాంత్ని రతిక అడిగింది. 'ఫస్ట్ టైమ్ బిగ్బాస్ లోకి రావాలని అనిపించి ఓ వీడియో పెట్టాను. కానీ అందరూ తిట్టడంతో డిలీట్ చేశాను. అప్పుడే షోలోకి ఎలాగైనా రావాలని ఫిక్స్ అయ్యాను' అని ప్రశాంత్, రతికతో చెప్పాడు. శోభాశెట్టి ఏడుపు రాత్రి ఒంటి గంటకు లైట్ ఆపు చేయడంతో అందరూ నిద్రపోవడానికి రెడీ అయ్యారు. కానీ మంచిగా పడుకోవడానికి రెడీ అవుతున్న సందీప్, శివాజీ, పల్లవి ప్రశాంత్ని.. రతిక, టాస్క్ పేరు చెప్పి భయపెట్టింది. దీంతో వాళ్లు నిద్రపోలేదు. మిగిలిన వాళ్లందరికీ బెడ్స్ లేకపోవడంతో కిచెన్లో మాట్లాడుతూ టైమ్ పాస్ చేశారు. మరోవైపు శోభాశెట్టి ఏడుపు మొదలుపెట్టేసింది. 'వీక్ అవ్వకూడదు.. వీక్ అవ్వకూడదు బీ స్ట్రాంగ్' అని తనకు తానే చెప్పుకుని కన్నీళ్లు పెట్టుకుంది. రతిక టాస్క్ తిప్పలు సోమవారం ఉదయం 10:15 గంటలకు కంటెస్టెంట్స్ అందరూ నిద్రలేచారు. 'భోళా శంకర్'లోని జాం జాం జజ్జనక పాటకు స్టెప్పులేసి బిగ్ బాస్కి గుడ్ మార్నింగ్ చెప్పారు. ఆ తర్వాత శివాజీకి పెళ్లయిందా? లేదా? అనే టాపిక్ పైన డిస్కషన్ పెట్టారు. తనకు పెళ్లి కాలేదని, బ్యాచిలర్ అని శివాజీ చెప్పాడు. నాగార్జున ఇచ్చిన బ్రోకన్ హార్ట్ టాస్క్ పూర్తి చేసేందుకు రతిక తిప్పలు పడింది. అమరదీప్-ప్రియాంక మధ్య గొడవ పెట్టమని.. శోభాశెట్టికి చెప్పగా ఆమె నో చెప్పింది. గెలిస్తే పర్లేదు లేదంటే తను నామినేట్ అయిపోతాను కదా అని భయపడింది. ఈ టాస్క్ వల్ల నీకు అడ్వాంటేజ్ దక్కుతుంది కదా అని రతికతో శోభాశెట్టి డిస్కషన్ పెట్టింది. రతికతో పల్లవి ప్రశాంత్ టాస్క్ పూర్తి చేసేందుకు రతిక.. పల్లవి ప్రశాంత్ దగ్గరకు వెళ్లింది. దీంతో 'నీకోసం ఏ రిస్క్ అయినా సరే చేస్తా' అని మనోడు రతికతో అన్నాడు. ఆమె అలా నవ్వుతూ ఉండిపోయింది. మరోవైపు టేస్టీ తేజ-షకీలా మధ్య ఇంట్రెస్టింగ్ డిస్కషన్ జరిగింది. అసలు వ్యాంప్ తరహా సినిమాలు ఎందుకు చేశారు? అని షకీలాని టేస్టీ తేజ అడగ్గా.. అలాంటి క్యారెక్టర్స్ వచ్చాయని, అవే ఒప్పుకున్నానని షకీలా సమాధానమిచ్చింది. ఈ క్రమంలోనే షకీలా, కిరణ్ రాథోడ్.. ఇద్దరికీ(వేర్వేరుగా) పెళ్లి కాలేదనే విషయం బయటపడింది. గొడవకి తేజ రెడీ టాస్క్ చేయమని.. రతిక టేస్టీ తేజని కూడా బతిమాలాడింది. కానీ అతడు కనీసం పేర్లు కూడా చెప్పొద్దని ఆమెతో అన్నాడు. ఫైనల్గా ఒప్పుకున్నాడు. మరోవైపు బ్రోకన్ హార్ట్ ఫస్ట్ తీసుకుంది శోభాశెట్టి. దీంతో ఇది తీసుకున్నందుకు తను కచ్చితంగా నామినేషన్స్లో ఉంటానని భయపడిపోయింది. పుల్లపెట్టిన టేస్టీ తేజ టేస్టీ తేజ.. ప్రిన్స్ యవర్-గౌతమ్ కృష్ణ మధ్య పుల్ల పెట్టేశాడు. ఉదయం జిమ్ చేసే సమయంలో ఒకరిని ఒకరు ఇమిటేట్ చేసుకోవడం గురించి ప్రిన్స్ చెప్పింది గౌతమ్ దగ్గరికి వెళ్లి చెప్పాడు. కానీ గౌతమ్ మాత్రం ప్రిన్స్తో మాట్లాడటానికి నో చెప్పాడు. ఈ క్రమంలోనే ఎవరివైపు నిలబడతావ్ అని గౌతమ్, శుభశ్రీని అడిగాడు. ఆమె.. నీవైపే అని గౌతమ్తో చెప్పుకొచ్చింది. నామినేషన్స్ షురూ సోమవారం సాయంత్రం 6 గంటలకు తొలివారం నామినేషన్ ప్రక్రియ మొదలైంది. యాక్టివిటీ ఏరియాని నరకంలా డిజైన్ చేశారు. బిగ్ బాస్ కూడా వాయిస్ మార్చి మాట్లాడాడు. యాక్టివిటీ ఏరియాకి వెళ్లి.. అక్కడ వేలాడదీసిన ఫొటొల్లో ఎవరిదైతే చింపి, నరకపు వోల్కనోలో వేస్తారో వాళ్లు నామినేట్ అయినట్లు. మొదటగా వెళ్లిన శివాజీ.. దామిని, గౌతమ్ కృష్ణని నామినేట్ చేశాడు. అయితే అతడు చెప్పిన కారణాలు బిగ్బాస్కి నచ్చలేదు. అది అయిపోయిన తర్వాత శివాజీ.. దామిని, గౌతమ్ కృష్ణతో మాట్లాడాడు. తర్వాత యాక్టివిటీ రూంలోకి వెళ్లిన ప్రియాంక జైన్.. పల్లవి ప్రశాంత్, రతికని నామినేట్ చేసింది. తనతో వాళ్లిద్దరూ పెద్దగా కలవకపోవడం వల్లే నామినేట్ చేశానని కారణం చెప్పింది. దీనికి ప్రశాంత్, రతిక ఇద్దరూ ఒప్పుకోలేదు. సరికదా ఈ విషయమై ప్రియాంకతో యాక్టివిటీ ఏరియా నుంచి బయటకొచ్చిన తర్వాత డిస్కషన్ పెట్టారు. అలా సోమవారం ఎపిసోడ్ ఎండ్ పూర్తయింది.
Pagination
ఆ బీప్ సౌండ్ వస్తేనే.. మీ ఓటు వేసినట్టు
ఇది కదా క్రేజ్ అంటే.. సీఎం జగన్ ఇంటర్వ్యూకి మిలియన్ల వ్యూస్
Sakshi.com ఇప్పుడు సరికొత్తగా మీ ముందుకు
కాపులు, ముస్లింలకు రిజర్వేషన్లు అక్కర్లేదు: పవన్కళ్యాణ్
రైతు కుమార్తె విజయం.. రిషబ్ శెట్టి అభినందనలు
పులివెందుల ప్రజలకు ఇద్దరిపైనా ప్రేమే: వైఎస్ భారతి
RCB Vs PBKS: కోహ్లి అరుదైన రికార్డు.. ఐపీఎల్ చరిత్రలోనే తొలి క్రికెటర్గా
Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో బిగ్ ట్విస్ట్..
బిజీగా ఉండటం ఇంత డేంజరా! హెచ్చరిస్తున్న సైకాలజిస్ట్లు
కారులో వాసన బాగుందని తెగ పీల్చుకుంటున్నారా.?
చరిత్ర సృష్టించిన సాయి సుదర్శన్.. సచిన్ రికార్డు బద్దలు
జగనన్న పాలన దేశానికే ఆదర్శం
గుంటూరును తీర్చిదిద్దుకుందాం
టీడీపీ హయాంలో అభివృద్ధి శూన్యం
No Headline
హరితయానం..
ఫొటోగ్రఫీలో గోలి వెంకట శివకుమార్కు అవార్డు
మోదీ ప్రభుత్వాన్ని గద్దె దించాలి
ఓటు వేసిన 99 ఏళ్ల అడుసుమిల్లి
వైఎస్సార్ సీపీలో చేరికలు
తప్పక చదవండి
- ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్కు వ్యతిరేకంగా యాడ్ .. బీజేపీ నేత సీరియస్
- ఐపీఎల్ మధ్యలోనే దుబాయ్ వెళ్లిన సన్రైజర్స్ కెప్టెన్..
- ఫోటో తీస్తే కవిత రాసే కెమెరా.. ఇది కదా టెక్నాలజీ అంటే!
- పాపం బ్రెజిల్.. ఎటు చూసినా వరదలే..
- కష్టాల్లో 'పద్మ శ్రీ మొగిలయ్య'.. సాయం చేసిన బుల్లితెర నటి
- మేనిఫెస్టోకు, విశ్వసనీయతకు అర్థం చెప్పింది మీ బిడ్డే: సీఎం జగన్
- ‘ కృష్ణమ్మ’ మూవీ రివ్యూ
- టీడీపీ అడ్డంగా బుక్కైంది: సజ్జల కీలక వ్యాఖ్యలు
- వివేకా కేసు: సునీత దంపతులకు ఎదురుదెబ్బ
- ఆ బీప్ సౌండ్ వస్తేనే.. మీ ఓటు వేసినట్టు
Advertisement