వన్టౌన్(విజయవాడపశ్చిమ): కేంద్రంలో పదేళ్లు అధికారంలో ఉన్న బీజేపీ నేతృత్వంలోని మోదీ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్కు అన్ని విధాలా అన్యాయం చేసిందని.. అందుకే మోదీని ఈ ఎన్నికల్లో ప్రజలు గద్దె దించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె. రామకృష్ణ పిలుపునిచ్చారు. నగరంలోని పాతబస్తీలో ఉన్న లెనిన్భవన్లో గురువారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రామకృష్ణ మాట్లాడారు. ప్రధాని మోదీ 2014, 2019, 2024 ఎన్నికల సందర్భంగా ప్రచారం నిమిత్తం రాష్ట్రానికి వచ్చి ఏపీ అభివృద్ధికి ఎలాంటి ప్రకటన చేయకుండా కేవలం మాయ మాటలు చెప్పి, రోడ్ షోలు చేసి వెళుతున్నారని విమర్శించారు. 2019లో తిట్టిన వారినే ఇప్పుడు పక్కన పెట్టుకుని మోదీ మాట్లాడుతున్నారని చెప్పారు. మోదీ 2014లో రాష్ట్రంలో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో జాతీయ స్థాయిలో ఎన్డీఏ అధికారంలోకి వస్తే ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలో నిర్ధేశించిన ఏపీకి ప్రత్యేక హోదా, కడపలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు, వెనుకబడిన జిల్లాలకు ప్రత్యేక ప్యాకేజీ, రామాయపట్నం పోర్టు నిర్మాణం వంటి ఇతర విభజన హామీలు అమలు చేస్తామని హామీ ఇచ్చారని గుర్తు చేశారు. కార్పొరేట్ వ్యక్తి సుజనాచౌదరి విజయవాడ పశ్చిమ నియోజకవర్గం నుంచి బీజేపీ ఎమ్మెల్యేగా పోటీ చేయటం సరికాదన్నారు. విజ్ఞులైన ప్రజలు ఆలోచన చేసి ఓట్లు వేయాలన్నారు. సుజనాచౌదరి ఇచ్చే డబ్బు సంచులకు ఆశపడి విజయవాడ ప్రతిష్టతను మంటగలపవద్దన్నారు. ఎన్నికల సమన్వయ కమిటీ కన్వనర్ దోనేపూడి శంకర్, నగర కార్యదర్శి జి. కోటేశ్వరరావు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పెన్మెత్స దుర్గాభవాని పాల్గొన్నారు.
మోదీ ప్రభుత్వాన్ని గద్దె దించాలి
Published Fri, May 10 2024 10:30 PM
Advertisement
Advertisement
సినబాబుకి మరోసారి మంగళమేనా!
పిన్నెల్లి ఎపిసోడ్.. ఫలించని పచ్చ బ్యాచ్ కుట్రలు
చంద్రబాబుకు ‘కుప్పం’ టెన్షన్.. జరిగేది అదేనా?
ఇంకా రాదేం.. నాలుగో తేది!
అప్పుడూ అంతే! ధీమాగా ఉన్నారు.. చివరికి బోర్లా పడ్డారు!
కూటమి ఓటమి.. ఆర్కే నోట ఊహించని పలుకు!
ఈడీ కోర్టును ధిక్కరించింది.. లిక్కర్ కేసులో కవిత లాయర్ వాదనలు
Anant-Radhika Pre Wedding : ఇటలీకి పయనమైన సెలబ్రిటీలు, ఫోటోలు వైరల్
Kavya Maran: మంచి మనసు.. కానీ ఒంటరితనం? పర్సనల్ లైఫ్లో..
ఆయన వల్లే ఇక్కడున్నా.. పుష్ప-2 విషయంలో బాధలేదు: అజయ్ ఘోష్
ఎగ్జిట్ పోల్స్ పై కృష్ణం రాజు సంచలన వ్యాఖ్యలు
చేపలు పట్టేందుకు రూ.581 కోట్లు.. సౌదీ ప్రిన్స్ విలాసం
మేనరికం పెళ్లి చేసుకుంటున్నారా? ఈ విషయాలు తెలుసుకోండి!
'ప్రేమలు' హీరోయిన్కి చేదు అనుభవం.. ఊపిరాడనివ్వలేదు!
బెంగళూరు రేవ్ పార్టీ: విచారణకు హాజరైన హేమ
ఆజం ఖాన్పై భారీ ట్రోలింగ్.. పాక్ ఆటగాడి కీలక నిర్ణయం
గుర్తు పట్టలేని విధంగా మారిపోయిన బిగ్బాస్ బ్యూటీ.. అసలేం జరిగింది?
రిటైర్మెంట్ ప్రకటించిన టీమిండియా క్రికెటర్
ఎమ్మెల్సీ రఘు రాజుపై అనర్హత వేటు
తప్పక చదవండి
- బెంగళూరులో కుండపోత.. 133ఏళ్ల రికార్డు బ్రేక్
- ఇలా అయితే.. టీమిండియాలో ఛాన్స్ రానేరాదు!
- ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 31 సినిమాలు.. అవి ఏంటంటే?
- కూతుర్ని కోల్పోయా.. అందుకే బర్త్డే సెలబ్రేట్ చేసుకోవట్లేదు: ఇళయరాజా
- ఎగ్జిట్ పోల్స్పై సోనియా ఆసక్తికర వ్యాఖ్యలు
- ప్రపంచకప్లో సంచలనం.. టీ20 చరిత్రలోనే తొలి ప్లేయర్గా
- అమెరికాలో హైదరాబాద్ యువతి అదృశ్యం
- బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డిపై కేసు
- జులై 3దాకా తీహార్ జైల్లోనే కవిత!
- పుణె పోర్షే కేసు: ‘నాకేం గుర్తు లేదు.. అప్పుడు తాగి ఉన్నా..!’
Advertisement