-
Hrithik Roshan: ఈ బాలీవుడ్ యాక్టర్ ముద్దు పేరు వింటే షాకే..!
ఒక్కొక్కరికి ఒక్కో ముద్దుపేరు ఉండటం సహజం. వారి ప్రవర్తనతో గానీ, అలవాట్లు.. ఇష్టాలతోగానీ, కనిపించే తీరుతోగానీ.. ఇలా చెప్పుకుంటూ వెళ్తే.. చాలా రకాలుగా మారుపేర్లు, ముద్దుపేర్లు వస్తూంటాయి. కొన్ని ముద్దు పేర్లు మాత్రం స్థిరపడిపోతాయి కూడా. ఇలాగే ప్రముఖ బాలీవుడ్ నటుడు అయినటువంటి హృతిక్ రోషన్కి కూడా ఓ చిన్న కథ ఉంది. అదేంటో చూద్దామా! బాలీవుడ్ గ్రీకు వీరుడు హృతిక్ రోషన్ పెట్ నేమ్ దుగ్గూ. ఈ ముద్దు పేరుకీ.. హృతిక్ వాళ్ల నాన్న.. బాలీవుడ్ ఒకప్పటి అందాల హీరో రాకేశ్ రోషన్ పెట్ నేమ్కీ ఏదో కనెక్షన్ ఉండే ఉంటదని బాలీవుడ్ వర్గాలు.. తన పేరునే కాస్త తిరగేసే కొడుకును పిలుచుకుంటున్నాడా ఏంటీ అని హృతిక్ ఫ్యాన్స్ డౌట్ పడతారట. ఇంతకీ రాకేశ్ రోషన్ ముద్దు పేరేంటంటే.. గుడ్డూ! ఇవి చదవండి: ఈ కొరియన్ ఖవ్వాలీ విన్నారో.. వహ్వా వహ్వా..! అనక తప్పదు! -
యంగ్ టైగర్ న్యూ లుక్..హృతిక్ తో ఫైట్ కోసమేనా..?
-
అయ్యో.. ఈ సీన్ ఎప్పుడు జరిగిందంటూ మళ్లీ హృతిక్ పేరు.. మళ్లీ రచ్చ!
బాలీవుడ్ వివాదాస్పద క్వీన్ కంగనా రనౌత్ ఎప్పుడూ లైమ్లైట్లోనే ఉంటుంది. సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే కంగనా తన బ్లాగ్లో ఏదో ఒకటి రాస్తూనే ఉంటుంది. కొన్నిసార్లు తన కోపాన్ని కూడా సోషల్ మీడియా ద్వారా వెళ్లగక్కుతుంది. తాజాగా కంగనా పేరు మరోసారి వైరల్ అవుతుంది. ఈసారి 2014లో రిలీజ్ అయిన 'రివాల్వర్ రాణి'లోని తన ముద్దు సీన్ను తెరపైకి తెస్తూ.. బాలీవుడ్ సూపర్ హీరో హృతిక్ రోషన్ పేరును మరోసారి తెరపైకి తీసుకురావడంతో బాలీవుడ్లో మళ్లీ రచ్చ మొదలైంది. (ఇదీ చదవండి: ఈ సినిమా బడ్జెట్నే రూ. 200 కోట్లు.. నెట్ఫ్లిక్స్ ఎంతకు కొన్నదో తెలిస్తే) ఇటీవల ఓ వార్తా సంస్థ కంగనా - వీర్ దాస్ జంటగా నటించిన 'రివాల్వర్ రాణి' సినిమాలోని ముద్దు సన్నివేశం గురించి ఓ వార్తను ప్రచురించింది. ఆ సినిమాలో హీరో వీర్ దాస్ను కంగనా ముద్దు పెట్టుకున్న సీన్ గురించి కథనం వచ్చింది. అంత వరకు బాగానే ఉన్నా.. ఆ సన్నివేశంలో వీర్ దాస్ పెదవుల నుంచి రక్తం వచ్చేలా కంగనా రనౌత్ ముద్దుపెట్టిందంటూ ఆ వార్త కథనంలో పేర్కొన్నారు. ఇంకేముంది అది చూసిన కంగనా వెంటనే ఆ వార్తకు సంబంధించిన స్క్రీన్ షాట్ను ఇన్స్టాగ్రామ్లో షేర్ చేస్తూ కామెంట్ కూడా ఇలా చేసింది. 'హృతిక్ రోషన్ తర్వాత నేను దాడి చేసింది ఈ పూర్ 'వీర్ దాస్' పైనా..! అయ్యో ఇది ఎప్పుడు జరిగిపోయింది..?' అంటూ ఫన్నీ ఎమోజీలను కూడా అక్కడ జత చేసింది. హృతిక్ రోషన్తో కంగనా గొడవ ఆ ముద్దు సీన్ పక్కన పెడితే ఆ సినిమాకు ఎలాంటి సంబంధం లేని హృతిక్ రోషన్ పేరు ఎందుకు తెచ్చిందనే కదా సందేహం... కంగనా- హృతిక్ రోషన్ జంటగా 2010లో వచ్చిన క్రిష్ 3 చిత్రంలో నటించారు. తర్వాత వీరిద్దరూ డేటింగ్ చేశారని టాక్ నడిచింది. 2016 సమయంలో ఇదే విషయం స్పందిస్తూ.. హృతిక్తో డేటింగ్ చేశానని కంగనా బహిరంగంగానే చెప్పడం కూడా జరిగింది. అప్పట్లో ఈ విషయంపై బాలీవుడ్లో పెద్ద దుమారమే చెలరేగింది. కంగనా చేసిన వ్యాఖ్యల్లో నిజం లేదని హృతిక్ రోషన్ ఖండించాడు. ఇదే విషయంపై ఆయన కోర్టుకు వెళ్లాడు. ఆమెపై పరువు నష్టం కేసు కూడా దాఖలు చేశాడు. ఇలా ఆ సమయంలో వారి మధ్య మాటల యుద్దం కొన్నాళ్ల పాటు సాగింది. తాజాగా మళ్లీ ఇలాంటి వ్యవహారంలో హృతిక్ రోషన్ పేరును కంగనా లాగడంతో బాలీవుడ్లో మళ్లీ చర్చనీయాంశమైంది. మరి హృతిక్ రోషన్ ఎలా రియాక్ట్ అవుతారో వేచి చూడాలి. View this post on Instagram A post shared by Kangana Ranaut (@kanganaranaut) (ఇదీ చదవండి: యాంకర్ రష్మీపై వల్గర్ కామెంట్ చేసిన కమెడియన్) -
ఎన్టీఆర్ డాన్స్ తో పోటీపడుతున్న హృతిక్
-
వార్ 2 కోసం కళ్ళు చెదిరే రెమ్యూనరేషన్ తీసుకుంటున్న ఎన్టీఆర్
-
వార్ 2 వెనుక టాప్ సీక్రెట్
-
ఐటెల్ బ్రాండ్ అంబాసిడర్గా హృతిక్
ముంబై: ఫోన్ల తయారీ సంస్థ ఐటెల్ మొబైల్ ఇండియా కొత్త బ్రాండ్ అంబాసిడర్గా బాలీవుడ్ నటుడు హృతిక్ రోషన్ నియమితులయ్యారు. దేశవ్యాప్తంగా ప్రజాదరణ పొందిన నటుడైన హృతిక్తో భాగస్వామ్యం.. టెక్నాలజీని అందరికీ అందుబాటులోకి తేవాలన్న తమ లక్ష్యానికి తోడ్పడగలదని ట్రాన్షన్ (ఐటెల్) ఇండియా సీఈవో అరిజిత్ తాళపత్ర తెలిపారు. రూ. 8,000 లోపు ఫోన్ల సెగ్మెంట్లో ఇప్పటికే ఫేవరెట్గా ఉన్న తమ బ్రాండ్ స్థానా న్ని మరింత పటిష్టపర్చుకోగలమని చెప్పారు. అత్యుత్తమ మొబైల్స్ను అందుబాటు ధరల్లో ఐటెల్ అందిస్తోందని హృతిక్ తెలిపారు. -
ఆర్యన్ఖాన్కు మద్దతుగా మరో హీరో.. హృతిక్ పోస్ట్ వైరల్
ముంబైలోని క్రూయిజ్ షిప్లో జరిగిన పార్టీకి సంబంధించి డ్రగ్స్ కేసులో అరెస్టు అయిన షారుక్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్ (23)కు బాలీవుడ్ ప్రముఖులు సపోర్టుగా నిలిచిన విషయం తెలిసిందే. అందులో ఇప్పటికే సల్మాన్ ఖాన్, సునీల్ శెట్టి, పూజా భట్ వంటి సెలబ్రీటీలు ఆర్యన్కి మద్దతు తెలపగా.. తాజాగా మరో స్టార్ హీరో హృతిక్ రోషన్ అతనికి సపోర్టు చేస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాడు. అందులో.. ‘నువ్వు (ఆర్యన్) నాకు చిన్న పిల్లాడిగా, పెద్దవాడిగా తెలుసు. ఇప్పుడు నువ్వు ఎదుర్కొంటున్న అన్ని ఈ పరిస్థితులని అర్థం చేసుకో. ఈ అనుభవాలు నీకు ఉపయోగపడతాయి. నన్ను నమ్ము ఇవి నీకు కచ్చితంగా మంచే చేస్తాయి. ఇప్పుడు నువ్వు ఎదుర్కొంటున్న కోపం, అయోమయం, నిస్సహాయ సిట్యువేషన్స్ నీలోని హీరోని బయటికి తీసుకువస్తాయి. దేవుడు ఎప్పుడు బలమైన వారికే ఎక్కువ కష్టాలను ఇస్తాడు. నువ్వు భవిష్యత్తులో మంచి విజయాన్ని సొంతం చేసుకోబోతున్నావు’ అంటూ రాసుకొచ్చాడు ఈ ఇండియన్ సూపర్ హీరో. ఆర్యన్కు సపోర్టుగా పెట్టిన ఈ పోస్ట్ ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో వైరల్గా మారింది. ఇంతకుముందే హ్యాండ్సమ్ హీరో భార్య సుసానే ఖాన్ సైతం షారుక్ కుటుంబానికి మద్దతు తెలిపింది. అయితే హృతిక్ రోషన్ ‘క్రిష్’ సినిమాల సిరీస్తో ఇండియన్ తొలి సూపర్ హీరోగా దేశవ్యాప్తంగా గుర్తింపు పొందాడు. ఆయన ప్రస్తుతం దీపిక పదుకోనే కలిసి‘ఫైటర్’లో నటిస్తుండగా, మరికొన్ని సినిమాలు ప్లానింగ్లో ఉన్నాయి. చదవండి: సోషల్ మీడియాని ఊపేస్తున్న #WeStandWithSRK View this post on Instagram A post shared by Hrithik Roshan (@hrithikroshan) -
జనవరిలో స్టార్ట్
ప్లాన్ ప్రకారం అన్నీ అనుకున్నట్లు జరిగినట్లయితే ఈ ఏడాది క్రిస్మస్ పండగకి హృతిక్ రోషన్ ‘క్రిష్ 4’ చిత్రం థియేటర్లోకి రావాల్సింది. కానీ ‘క్రిష్’ ఫ్రాంచైజీ దర్శకుడు రాకేశ్ రోషన్ (హృతిక్ రోషన్ తండ్రి) క్యాన్సర్ బారిన పడి, కోలుకోవడానికి కొంత సమయం పట్టడంతో ‘క్రిష్ 4’ చిత్రం సెట్స్పైకి వెళ్లలేదు. అయితే ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది ఎలాగైనా విడుదల చేయాలనే పట్టుదలతో ఉన్నారట రాకేశ్ రోషన్. ఇందుకు తగ్గట్లుగానే ఈ సినిమా స్క్రిప్ట్ పనులు శరవేగంగా జరుగుతున్నాయని బాలీవుడ్ సమాచారం. వచ్చే ఏడాది జనవరిలో ఈ సినిమా షూటింగ్ను ఆరంభించాలనుకుంటున్నారని టాక్. అప్పటికి కరోనా పరిస్థితులు ఓ కొలిక్కి వస్తాయని, ఫారిన్ షూటింగ్స్కు పెద్ద సమస్యలు ఉండవని భావిస్తోందట చిత్రబృందం. -
‘దీపికా’ రాజకీయవేత్త అని మీకు తెలుసా?
హిందీలో ‘రామాయణ్’ (1987) టీవీ సీరియల్లో సీతగా నటించి విశేష ఆదరణ పొందారు దీపికా చిఖలియా. ప్రస్తుతం బాలీవుడ్ చిత్రాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా చేస్తున్నారు. తాజాగా స్వాతంత్య్ర సమరయోధురాలు, నైటింగేల్ ఆఫ్ ఇండియాగా పేరు పొందిన సరోజినీ నాయుడు బయోపిక్ ‘సరోజిని’లో టైటిల్ రోల్ పోషిస్తున్నారు. గురువారం విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్ నెటిజన్లను తెగ ఆకట్టుకుంటోంది. అంతేకాకుండా లాక్డౌన్ కారణంగా హిందీ రామాయణ్ను దూరదర్శన్లో పునఃప్రసారం చేస్తున్నారు. దీంతో దీపిక క్రేజ్ మరోసారి అమాంతం పెరిగిపోయింది. అయితే నటిగా మంచి గుర్తింపు పొందిన దీపిక రాజకీయ రంగప్రవేశం చేశారని చాలా కొంతమందికే తెలుసు. అయితే ఓ జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో అప్పటి సీత ఇప్పటి సరోజిని పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు. ‘రామాయణం సినిమాగా తెరకెక్కించాలనే డిమాండ్ ఈ మధ్య కాలంలో బాగా పెరిగిపోయంది. అయితే ఈ సినిమాలో నటించాలన్నా, తెరకెక్కించాలన్న రామాయణం గురించి పూర్తిగా తెలిసి ఉండాలి. ఒక వేళ రామాయణాన్ని సినిమాగా తెరకెక్కిస్తే సీతారాముల పాత్రలకు హృతిక్ రోషన్, అలియాభట్లు పర్ఫెక్ట్గా సెట్ అవుతారు. అంతేకాకుండా అజయ్ దేవ్గణ్ రావణుడు, వరుణ్ ధావన్ లక్ష్మణుడి పాత్రలు చేస్తే బాగుంటుంది. ఇక రామయణ్ షూటింగ్ జరుగుతున్న సమయంలో పలు మ్యాగజైన్స్ ఫోటో షూట్కు పిలిచారు. అందుకు భారీ మొత్తం కూడా ఆఫర్ చేశారు. కానీ ఓ వైపు సీత పాత్ర పోషిస్తూ ఫోటో షూట్లో పాల్గొనడం భావ్యం కాదని సున్నితంగా తిరస్కరించాను. 1991లో భారతీయ జనతా పార్టీలో చేరాను. దివంగత నాయకులు అటల్ బిహార్ వాజ్పేయ్ స్పూర్థితో రాజకీయం రంగ ప్రవేశం చేశాను. మా తాత ఆరెస్సెస్ కార్యకర్త. దీంతో నాలో చిన్నప్పట్నుంచే ఆరెస్సెస్ భావాలు ఉండేవి. ఎల్కే అద్వానీ, సుష్మాస్వరాజ్, నరేంద్ర మోదీ తదితరులు నా రాజకీయ సహచరులు. గుజరాత్లోని బరోడా లోని లోక్సభ స్థానం నుంచి ఎంపీగా పోటీచేసి గెలిచాను. ఇప్పటికీ పార్టీకి అవసరమైనప్పుడు నా వంతు సహాయం, సలహాలు అందిస్తుంటాను’అంటూ దీపికా చిఖలియా పేర్కొన్నారు. ఈ నటి తెలుగులో కూడా యమపాశం అనే సినిమా చేసిన విషయం తెలిసిందే. ఈ సినిమాలో రాజశేఖర్ హీరోగా నటించారు. చదవండి: ‘సాహో ఎన్టీఆర్.. నీకు సెల్యూట్’ ‘సితారా.. సింగర్గా ట్రై చేయ్’ -
కరోనా దగ్గర చేసింది!
‘సామాజిక దూరం పాటించండి... కరోనాని నియత్రించండి’ అనే పరిస్థితి ప్రపంచవ్యాప్తంగా ఉంది. ఇలా కరోనా అందరినీ విడదీస్తోంది. కానీ విడివిడిగా ఉంటున్న హృతిక్ రోషన్, ఆయన భార్య సుజానే ఖాన్ని ఒకే ఇంట్లో ఉండేలా చేసింది. విషయం ఏంటంటే... హృతిక్, సుజానే విడిపోయి ఆరేళ్లు పైనే అయింది. వీరికి ఇద్దరు కుమారులు ఉన్నారు. తల్లి దగ్గర కొన్నాళ్లు, తండ్రి దగ్గర కొన్నాళ్లు పిల్లలు ఉంటారు. పండగలు, పార్టీలను భార్యాభర్తలిద్దరూ పిల్లలతో సెలబ్రేట్ చేసుకుంటారు. ఇప్పుడు హృతిక్ దగ్గరే పిల్లలు ఉన్నారు. కరోనా కారణంగా లాక్డౌన్ వల్ల పిల్లలు, హృతిక్ బయటకు వెళ్లడంలేదు. దాంతో పిల్లలను సుజానే మిస్ అవుతున్నారు. ఈ సమయాన్ని పిల్లలతో గడపాలనుకున్న ఆమె సూట్కేస్ సర్దుకుని మాజీ భర్త హృతిక్ ఇంటికి వెళ్లిపోయారు. ‘‘పిల్లలతో గడపాలని నా మాజీ భార్య మా ఇంటికి వచ్చేసింది. ఈ టైమ్లో పిల్లలతో పాటు తను ఉండటం చాలా అవసరం. థ్యాంక్యూ సుజానే’’ అని పేర్కొన్నారు హృతిక్. -
క్రిష్ కలిపింది ఇద్దర్నీ
హృతిక్ రోషన్, దీపికా పదుకోన్ ఇప్పటి వరకూ కలసి నటించలేదు. అయితే త్వరలోనే ఈ ఇద్దర్నీ జంటగా స్క్రీన్ మీద చూసే అవకాశం ఉందట. హృతిక్ రోషన్ నటించిన సూపర్ హీరో చిత్రం ‘క్రిష్’ సిరీస్లో నాలుగో భాగం షూటింగ్ పట్టాలెక్కడానికి రెడీ అవుతోంది. ఈ సినిమాలో హీరోయిన్గా దీపికా పదుకోన్ నటిస్తారని బాలీవుడ్ టాక్. ‘హృతిక్తో కలసి నటించాలనుంది’ అని పలు సందర్భాల్లో దీపికా తన ఆసక్తిని తెలిపారు. ఈ సినిమాలో హీరోయిన్గా దీపికా దాదాపు ఫైనల్ అట. అదే నిజమైతే ‘క్రిష్’ కలిపింది ఇద్దర్నీ అనుకోవాలి. త్వరలోనే ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లనుంది. -
గంగూలీ బయోపిక్?
బాలీవుడ్లో బయోపిక్స్ ట్రెండ్ నడుస్తోంది. స్పోర్ట్స్ స్టార్స్ బయోపిక్స్ను స్క్రీన్ మీదకు తీసుకురావడంపై ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నారు దర్శక–నిర్మాతలు. గతంలో ధోనీ బయోపిక్ తీశారు. ప్రస్తుతం 1983 క్రికెట్ ప్రపంచ కప్ ఆధారంగా ‘83’ తెరకెక్కింది. తాజాగా మాజీ భారత క్రికెట్ కెప్టెన్ సౌరవ్ గంగూలీ బయోపిక్ కూడా ప్లాన్ చేస్తున్నారని టాక్. కరణ్ జోహార్ ఈ బయోపిక్ నిర్మించే సన్నాహాలు చేస్తున్నారట. దీని కోసం గంగూలీతో సంప్రదింపులు కూడా జరుపుతున్నారట కరణ్. గంగూలీ పాత్ర కోసం హృతిక్ రోషన్ పేరును పరిశీలిస్తున్నారట. మైదానంలో చూపించిన దూకుడు స్వభావం, కెప్టెన్గా సాధించిన విజయాలు వంటి చాలా అంశాలు గంగూలీ కెరీర్లో ఉన్నాయి. అందుకే అతని కథ పక్కా కమర్షియల్ సినిమాకు సరిపడేలా ఉంటుందని గంగూలీ ఫ్యాన్స్ హర్షిస్తున్నారు. -
బాక్సాఫీస్ వసూళ్లు: సైరా వర్సెస్ వార్
ఈసారి గాంధీ జయంతి సందర్భంగా రెండు ప్రతిష్టాత్మక చిత్రాలు ఒకేసారి, ఒకేరోజు విడుదల అయ్యాయి. వరుస సెలవులను క్యాష్ చేసుకోవడానికి పోటాపోటీగా ప్రేక్షకుల ముందుకువచ్చాయి. ఆ సినిమాలేంటో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. బాలీవుడ్లో భారీ మల్టీస్టారర్, యాక్షన్ థ్రిల్లర్గా ‘వార్’ సినిమా ప్రేక్షకుల ముందుకురాగా.. సౌత్లో చారిత్రక సినిమాగా భారీ బడ్జెట్తో చిరంజీవి ‘సైరా నరసింహారెడ్డి’ విడుదలైంది. ఈ రెండు సినిమాలూ భారీ అంచనాల మధ్యే ప్రేక్షకులను పలుకరించాయి. చారిత్రక నేపథ్యంలో దాదాపు రూ. 300 కోట్ల ఖర్చుతో రేనాటి సూర్యుడు సైరా నరసింహారెడ్డి జీవిత కథతో సైరా సినిమా తెరకెక్కింది. ఈ సినిమాను దేశవ్యాప్తంగా విడుదల చేశారు. తెలుగుతోపాటు హిందీ, కన్నడ, తమిళం, మలయాళ భాషల్లో దేశవ్యాప్తంగా విడుదలైంది. ఈ సినిమా కోసం అన్ని భాషల్లోనూ భారీఎత్తున ప్రమోషన్స్ నిర్వహించారు. అటు బాలీవుడ్ బడా స్టార్స్ హృతిక్ రోషన్, టైగర్ ష్రాఫ్లు తొలిసారి కలిసి నటించిన మల్టీస్టార్ సినిమా వార్ కూడా భారీ అంచనాలతో గత బుధవారం ప్రేక్షకుల ముందుకువచ్చింది. ఈ సినిమాలో హృతిక్ కబీర్గా, టైగర్ ఖలీద్గా.. గురుశిష్యులుగా నటించడం.. ఒళ్లు గగుర్పొడిచే భారీ యాక్షన్ సీక్వెన్స్ ఉండటంతో ఈ సినిమాపై సినీ ప్రియుల్లో మంచి బజ్ క్రియేట్ అయింది. సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను ఈ ఏడాది అతిపెద్ద యాక్షన్ థ్రిల్లర్ మూవీగా ప్రమోట్ చేశారు. దుమ్మురేపిన కలెక్షన్లు.. భారీ చారిత్రక చిత్రం ‘సైరా నరసింహారెడ్డి’... మెగాస్టార్ స్టామినాను చాటుతూ బాక్సాఫీస్ వద్ద భారీగా కలెక్షన్లు రాబడుతోంది. అయితే, ఈ సినిమా ప్రధాన మార్కెట్ అయిన ఏపీ, తెలంగాణలోనే జోరుగా దూసుకుపోతుంది. సౌత్లోని ఇతర రాష్ట్రాల్లో ఓ మోస్తరు వసూళ్లు రాబడుతున్నా.. హిందీలో మాత్రం అనుకున్నంతగా రాణించలేకపోయింది. హిందీలో తొలిరోజు రూ. 2.6 కోట్లు సాధించి.. పర్వా లేదనిపించిన సైరా.. ఆ తర్వాత పుంజుకోలేక చతికిలపడింది. ఓవర్సీస్లోనూ తెలుగు రాష్ట్రాల్లో బాక్సాఫీస్ వద్ద గట్టిగా సత్తా చాటుతున్న ఈ సినిమా తొలి మూడురోజుల్లో వరల్డ్వైడ్గా రూ. 100 కోట్లకు పైగా సాధించినట్టు తెలుస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో తొలిరోజే ఈ సినిమా రూ. 32 కోట్లు రాబట్టినట్టుసమాచారం. దసరా సెలవులు కావడం.. పాజిటివ్ టాక్ ఉండటం తెలుగు రాష్ట్రాల్లో సైరాకు కలిసివస్తోంది. ముఖ్యంగా నైజాంలో ఈ సినిమా తొలి మూడు రోజుల్లో రూ. 14.62 కోట్లు రాబట్టింది. ట్రేడ్ అనలిస్ట్ రమేశ్ బాలా ఈ విషయాన్ని ట్వీట్ చేస్తూ.. నైజాంలో మూడురోజుల కలెక్షన్ వివరాలు (తొలిరోజు రూ. 8.10 కోట్లు, రెండోరోజు రూ. 3.98 కోట్లు, మూడో రోజు రూ. 2.54 కోట్లు) రివీల్ చేశారు. ఇక ఓవర్సీస్ మార్కెట్లోనూ సైరా సత్తా చాటుతోంది. మూడు రోజుల్లో అమెరికాలో ఈ సినిమా రూ. 1.5 మిలియన్ డాలర్లు (రూ. 10.62 కోట్లు) రాబట్టిందని రమేశ్ బాలా మరో ట్వీట్లో వెల్లడించారు. రికార్డుల సృష్టిస్తున్న వార్ భారీ యాక్షన్ థ్రిల్లర్ అయిన వార్ మూవీ ఊహించినరీతిలో భారీ వసూళ్లే రాబడుతోంది. తొలిరోజు ఏకంగా రూ. 53.35 కోట్లు రాబట్టి.. బాలీవుడ్ చరిత్రలోనే అత్యధిక ఓపెనింగ్ డే కలెక్షన్లు రాబట్టిన సినిమాగా రికార్డు సృష్టించింది. అదేవిధంగా మూడు రోజుల్లోనే రూ. 100 కోట్ల క్లబ్బులో చేరింది. హిందీపరంగా విస్తారమైన మార్కెట్ ఉండటంతో వార్.. దసరా పండుగ సీజన్లో అత్యంత భారీ వసూళ్లు రాబట్టే అవకాశం కనిపిస్తోంది. హిందీ వెర్షన్లో తొలిరోజు రూ. 51 కోట్లు, రెండోరోజు గురువారం రూ. 23.10 కోట్లు, మూడో రోజు శుక్రవారం రూ. 21.25 కోట్లు సాధించిన వార్.. . తొలి మూడు రోజుల్లోనే రూ. 96 కోట్లు తన ఖాతాలో వేసుకుంది. ఇక, తెలుగు, తమిళ వెర్షన్లలో రూ. 4.15 కోట్లు సాధించి.. మొత్తంగా రూ. 100.15 కోట్లు వార్ తన ఖాతాలో వేసుకుంది. బాక్సాఫీస్ వద్ద వార్ జోరు చూస్తుంటే.. రానున్న రోజుల్లో మరింత వసూళ్లు సాధించి.. రికార్డులు బద్దలుకొట్టే అవకాశం కనిపిస్తోంది. గురువారం, శుక్రవారం సాధారణ వర్కింగ్ డేస్ అయినప్పటికీ.. వార్ వసూళ్లు తిరుగులేని రీతిలో ఉండటం ఇందుకు తార్కాణం అంటున్నారు ట్రేడ్ అనలిస్టులు. తొలి మూడు రోజుల్లోనే రూ. 100 కోట్లు సాధించిన ఐదో యశ్రాజ్ ఫిలిమ్స్ సినిమాగా వార్ చరిత్ర పుటల్లోకి ఎక్కింది. ఇంతకుముందు ధూమ్-3, సుల్తాన్, టైగర్ జిందా హై, థగ్స్ ఆఫ్ హిందూస్థాన్ సినిమాలు తొలి మూడురోజుల్లోనే వందకోట్ల క్లబ్బులో చేరాయి. మొత్తానికి చూసుకుంటే.. తమకు గట్టి పట్టున్న మార్కెట్లో బాక్సాఫీస్ వద్ద సైరా, వార్ పోటాపోటీగా కలెక్షన్లు రాబడుతున్న పరిస్థితి కనిపిస్తోంది. -
రాముడు – రావణుడు?
రామాయణ ఇతిహాసాన్ని భారీ బడ్జెట్తో స్క్రీన్ మీదకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు నిర్మా తలు అల్లు అరవింద్, మధు మంతెన, నమిత్ మల్హోత్ర. మూడు భాగాలుగా తెరకెక్కనున్న ఈ సినిమాకు నితేష్ తివారి (‘దంగల్’ ఫేమ్), రవి ఉడయార్ (‘మామ్’ ఫేమ్) దర్శకత్వం వహిస్తారు. ప్రస్తుతం ఈ చిత్రం ప్రీ–ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఈ సినిమాలో ముఖ్య పాత్రలు పోషించేవారిలో రాముడిగా హృతిక్ రోషన్, సీత పాత్రలో దీపికా పదుకోన్ నటిస్తారని ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. తాజాగా రావణ బ్రహ్మ పాత్రను ప్రభాస్ చేస్తే బావుంటుందని చిత్రబృందం భావిస్తోందని ముంబై సమాచారం. రావణుడి పాత్రకు ప్రభాస్ ఫిజిక్ సరిగ్గా సూట్ అవుతుందని, ఆల్రెడీ ‘బాహుబలి’ లాంటి పీరియాడిక్ సినిమా చేసి ఉండటం, ప్యాన్ ఇండియా సూపర్స్టార్ అపీల్ ఉండటం.. ఇలా అన్ని విషయాల్లో ప్రభాసే పర్ఫెక్ట్ అని చిత్రబృందం ఆలోచన చేస్తోందట. మరి ఈ సినిమాలో నటించడానికి ప్రభాస్ ఓకే అంటారా? వేచి చూడాలి. -
శ్రీ రాముడిగా?
‘సూపర్ 30’ సక్సెస్తో సూపర్ ఎనర్జీలో ఉన్నారు హృతిక్ రోషన్. ఇప్పుడు వరుసగా సినిమాలను సైన్ చేస్తున్నారు. ఫర్హాన్ ఖాన్తో ‘సత్తే పే సత్తే’, ఆ తర్వాత ‘క్రిష్ 4’ ఉంటుందని ప్రకటించారు. లేటెస్ట్గా అల్లు అరవింద్, నమిత్ మల్హోత్రా నిర్మాణంలో తెరకెక్కనున్న భారీ పౌరాణిక చిత్రం ‘రామాయణ్’ సినిమాలో హృతిక్ హీరోగా నటించనున్నారని బాలీవుడ్ టాక్. ఇందులో శ్రీరాముడిగా హృతిక్ నటించనున్నారట. లైవ్ యాక్షన్ మూవీగా తెరకెక్కబోయే ఈ సినిమాను ‘దంగల్’ ఫేమ్ నితేష్ తివారి, ‘మామ్’ దర్శకుడు రవి ఉడయార్ దర్శకత్వం వహించనున్నారు. త్వరలోనే ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లనుంది. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో మూడు భాగాలుగా రూపొందనున్న ఈ చిత్రం బడ్జెట్ సుమారు 1500 కోట్లు. -
గన్దరగోళం
హృతిక్ రోషన్, టైగర్ ష్రాఫ్ ఒకరి మీద ఒకరు యుద్ధం ప్రకటించుకున్న సంగతి తెలిసిందే. హృతిక్ను ఢీ కొట్టడానికి టైగర్ ప్రపంచంలోనే పవర్ఫుల్ మెషీన్గన్ ‘గాట్లింగ్’తో వాడబోతున్నారని తెలిసింది. హృతిక్ రోషన్, టైగర్ ష్రాఫ్ హీరోలుగా సిద్ధార్థ్ ఆనంద్ తెరకెక్కిస్తున్న యాక్షన్ చిత్రం ‘వార్’. యశ్ చోప్రా ఫిల్మ్స్ నిర్మిస్తోంది. యాక్షన్ చిత్రాల ప్రేమికులకు కనువిందులా ఉండేందుకు అద్భుతమైన లొకేషన్స్లో యాక్షన్ సీన్లు చిత్రీకరించారు. ఓ సన్నివేశంలో ఈ మెషీన్గన్తో సిటీని ధ్వంసం చేస్తూ గన్దరగోళం సృష్టిస్తారట టైగర్. ఈ సీన్స్ సినిమాకు ఓ హైలైట్గా నిలుస్తాయట. వాణీ కపూర్ హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమా తెలుగు, తమిళ భాషల్లోనూ రిలీజ్ కానుంది. -
విదేశాల్లో వార్
భూమి, సముద్రం, మంచుపై మాత్రమే కాదు గాలిలో కూడా ఫైట్ చేస్తున్నారట హృతిక్ రోషన్ అండ్ టైగర్ ష్రాఫ్. ఈ పవర్ఫుల్ ఫైట్స్ని పావెల్ జెన్నింగ్స్, ఫ్రాంజ్ స్పిల్హాస్, సా యంగ్ ఓహ్, పర్వేజ్ షేక్ ఈ నలుగురు హాలీవుడ్ స్టంట్మాస్టర్స్ కొరియోగ్రఫీ చేస్తున్నారు. సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వంలో హృతిక్ రోషన్, టైగర్ ష్రాఫ్ హీరోలుగా తెరకెక్కుతున్న సినిమా ‘వార్’. ఇందులో వాణీ కపూర్ కథానాయికగా నటిస్తున్నారు. ఇటీవల ఈ సినిమా టీజర్ను కూడా విడుదల చేశారు. అదిరిపోయే యాక్షన్ సన్నివేశాలు అబ్బురపరిచేలా ఉన్నాయి టీజర్లో. ఇటీవల ఫిన్ల్యాండ్లోని ఆర్కిటిక్ సర్కిల్లో ఓ భారీ కార్ ఛేజింగ్ యాక్షన్ సీన్ను చిత్రీకరించారు. ఈ యాక్షన్ సన్నివేశాలను హాలీవుడ్ స్టంట్ కొరియోగ్రాఫర్ పావెల్ జెన్నింగ్స్ డిజైన్ చేశారు. ఇంతకు ముందు డార్క్ నైట్, జాక్ రేచర్, గేమ్ ఆఫ్ థ్రోన్స్ వంటి చిత్రాలకు వర్క్ చేశారు పావెల్. ఈ సీన్ కోసం హృతిక్, టైగర్ ముందుగా బాగా ప్రాక్టీస్ చేశారట. ఫిన్ల్యాండ్లోని ఆర్కిటిక్ సర్కిల్లో యాక్షన్ సీన్ను తెరకెక్కించిన తొలి బాలీవుడ్ మూవీ ఇదేనట. ఇండియా లొకేషన్స్తో పాటుగా ఆస్ట్రేలియా, పోర్చుగల్, ఇటలీ, స్విట్జర్లాండ్, స్పీడన్ దేశాల్లోని పదిహేను ముఖ్యనగరాల్లో ఈ సినిమా చిత్రీకరణను టీమ్ ప్లాన్ చేసినట్లు సమాచారం. ‘వార్’ చిత్రం అక్టోబర్ 2న విడుదల కానుంది. -
యుద్ధానికి సిద్ధం
బాలీవుడ్ యాక్షన్ హీరోలు హృతిక్ రోషన్, టైగర్ ష్రాఫ్. ప్రస్తుతం ఈ ఇద్దరూ స్క్రీన్మీద యుద్ధం చేయడానికి సిద్ధమయ్యారు. మరి వీళ్ల ఫైట్ దేనికోసమో తెలియాలి. హృతిక్, టైగర్ హీరోలుగా సిద్ధార్థ్ ఆనంద్ తెరకెక్కిస్తున్న భారీ యాక్షన్ చిత్రం ‘వార్’. యశ్రాజ్ ఫిల్మ్స్ నిర్మిస్తోన్న ఈ చిత్రంలో వాణీకపూర్ కథానాయికగా నటిస్తున్నారు. ఈ సినిమా టీజర్ని సోమవారం విడుదల చేశారు. బైక్ స్టంట్స్, గన్ ఫైరింగ్, చేజ్లు, ఫైట్స్తో నిండిన ఈ టీజర్ భారీ యాక్షన్ చిత్రాన్ని అందించనున్నాం అనే ప్రామిస్ చేస్తోంది. హిందీ, తెలుగు, మలయాళ, తమిళ భాషల్లో అక్టోబర్ 2న ‘వార్’ సినిమా విడుదల కానుంది. -
అమితాబ్గా హృతిక్?
బాలీవుడ్ హ్యాండ్సమ్ హీరో హృతిక్ రోషన్ హీరోగా నటించిన తాజాచిత్రం ‘సూపర్ 30’. బీహార్కు చెందిన గణిత శాస్త్రవేత్త ఆనంద్ కుమార్ జీవితం ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా ఈ నెల 12న విడుదల కానుంది. దీంతో హృతిక్ నెక్ట్స్ సినిమా ఏంటి? అనే ప్రశ్న బీటౌన్లో మొదలైంది. 1982లో అమితాబ్ బచ్చన్, హేమ మాలిని నటించిన యాక్షన్ కామెడీ చిత్రం ‘సత్తే పే సత్తా’ (1982) రీమేక్లో హృతిక్ రోషన్ నటించబోతున్నారని ఖబర్. ఈ సినిమాకు ఫర్హా ఖాన్ దర్శకత్వం వహిస్తారట. దర్శకుడు రోహిత్ శెట్టి ఈ సినిమాను నిర్మిస్తారట. ఇంకో ఆసక్తికరమైన విషయం ఏంటంటే... ఈ సినిమాలో హృతిక్ సరసన దీపికా పదుకోన్ హీరోయిన్గా నటించనున్నారని టాక్. -
అప్పడాలమ్మా అప్పడాలు
.... అని రోడ్డుపై అమ్ముతున్నారు బాలీవుడ్ హ్యాండ్సమ్ హీరో హృతిక్రోషన్. హీరో అప్పడాలు అమ్మాడంటే అది కచ్చితంగా ఏదో సినిమాకే అయ్యుంటుంది. అవును... ‘సూపర్ 30’ కోసం హృతిక్ అప్పడాలు అమ్మారు. బీహార్కు చెందిన గణిత శాస్త్రవేత్త ఆనంద్ కుమార్ జీవితం ఆధారంగా హిందీలో తెరకెక్కిన చిత్రం ‘సూపర్ 30’. ఆనంద్ పాత్రలో హృతిక్ నటించారు. వికాస్ బాల్ దర్శకత్వం వహించారు. తాజాగా ఈ సినిమాలోని హృతిక్ కొత్త పోస్టర్ను రిలీజ్ చేశారు. ‘‘ఆనంద్కుమార్ జీవితంలో ఇలా అప్పడాలు అమ్మే నాటి పరిస్థితులు ఎంతో ఉద్వేగంతో కూడుకున్నవి. ఇలాంటి పరిస్థితులను ఎదుర్కొన్న ఆయన కష్టపడి జీవితంలో ఎంతో ఉన్నత స్థాయికి చేరుకున్నారు’’ అని హృతిక్ పేర్కొన్నారు. ఈ సినిమా ఈ ఏడాది జూలై 12న విడుదల కానుంది. -
రెండోసారి...
హృతిక్ రోషన్ కెరీర్లో పెద్ద హిట్స్లో ఒకటైన ‘అగ్నిపథ్’ చిత్రం అదే పేరుతో చేసిన అమితాబ్ బచ్చన్ చిత్రానికి రీమేక్ అనే సంగతి తెలిసిందే. తాజాగా మరో అమితాబ్ సినిమా రీమేక్లో హృతిక్ నటించబోతున్నాడని బాలీవుడ్ సమాచారం. అమితాబ్ హీరోగా 1982లో వచ్చిన ‘సట్టే పే సట్టా’ చిత్రాన్ని ప్రస్తుత పరిస్థితులకు అనుకూలంగా ఫరాఖాన్ రీమేక్ చేసేందుకు స్క్రిప్ట్ రెడీ చేసుకున్నారట. ఈ సినిమాలో నటించడానికి హృతిక్ అంగీకారాన్ని తెలిపారని తెలిసింది. ప్రస్తుతం స్క్రిప్ట్ ఫైనల్ స్టేజ్లో ఉందట. త్వరలోనే ఈ ప్రాజెక్ట్పై అధికారిక ప్రకటన రానుంది. రోహిత్శెట్టితో కలసి ఫరాఖాన్ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. -
సమాజంలో అలాంటివారిని చూశా!
బాలీవుడ్లో నటుడు హృతిక్ రోషన్, నటి కంగనా రనౌత్ల మధ్య పచ్చిగడ్డి వేస్తే భగ్గుమనేంత వైరం ఉన్న సంగతి తెలిసిందే. వ్యక్తిగత విషయాల నుంచి సినిమాల రిలీజ్ల వరకు వీరి మధ్య పరస్పర ఆరోపణలు మీడియాలో వినిపిస్తూనే ఉన్నాయి. తాజాగా మరోసారి కంగనా, హృతిక్ పరోక్షంగా మాటల బాణాలు విసురుకున్నారు. హృతిక్ ‘సూపర్ 30’, కంగనా ‘మెంటల్ హై క్యా’ సినిమాలు ఒకేరోజు (జూలై 26) విడుదలవుతుండమే ఇందుకు కారణం. ముందుగా ‘సూపర్ 30’ సినిమాను హృతిక్ రిలీజ్ రెడీ చేశారని, కంగనా తన సినిమా విడుదల వాయిదా వేయాలని హృతిక్ అభిమానులు సోషల్ మీడియాలో కామెంట్స్ చేశారు. కంగనా ప్రయత్నించినప్పటికీ కుదర్లేదట. ఇంతలోనే..‘కంగనా చేతిలో నీ పనైపోవడం ఖాయం’ అని హృతిక్ను ఉద్దేశిస్తూ కంగనా సోదరి రంగోలి అన్నారు. దీనిపై అనవసరంగా మరో వివాదాన్ని తెరపైకి తీసుకురావడం ఎందుకు అనుకున్నారేమో కానీ హృతిక్ ఓ ప్రెస్నోట్ను విడుదల చేశారు. ‘‘సూపర్ 30’ చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది. మీడియా సర్కస్లో నా సినిమా వివాదం నలగకుండా ఉండటంతో పాటుగా, నా మానసిక ప్రశాంతత కోసం ‘సూపర్ 30’ సినిమా విడుదలను వాయిదా వేయమని మా సినిమా నిర్మాతలను కోరాను. సరైన తేదీలో వీలైనంత తొందరగా విడుదలకు ప్లాన్ చేయమని చెప్పాను. ఒకరు ఒకర్ని పరోక్షంగా బాధపెడుతుంటే బాధపడుతున్న వారిని చూసి ఆనందపడేవారిని కొందర్ని ఈ సమాజంలో చూశాను. సమాజం పట్ల నమ్మకం కోల్పోకుండా ఉండాలంటే ఇలాంటి విషయాలపై అందరికీ అవగాహన కలగాలి. దీని కోసం ఇప్పటికీ ఆశగా ఎదురు చూస్తున్నాను. ఇలాంటి పరిస్థితులకు ముగింపు పలకాలి’’ అని హృతిక్ అన్నారు. ఈ విషయంపై కంగనా రనౌత్ స్పందించారు. ‘‘హృతిక్ రోషన్ ఆ విషాదకరమైన స్టోరీ ఎందుకు రాశారో నాకు తెలియదు. కానీ, మా ‘మెంటల్ హై క్యా’ సోలోగా రిలీజ్కు రెడీ అవడం హ్యాపీగా ఉంది. ఈ పురుషాధిక్య ఇండస్ట్రీలో సోలో రిలీజ్కు కృషి చేసిన మహిళా నిర్మాత ఏక్తా కపూర్ నిజంగా గ్రేట్. ఆమె పవర్ను మెచ్చుకోవాలి’’ అన్నారు. గతంలోనూ ఇలాగే...! నిజానికి గత ఏడాది సెప్టెంబరు నుంచి ఈ ఏడాది రిపబ్లిక్ డేకి ‘సూపర్ 30’ సినిమాను తొలుత వాయిదా వేశారు హృతిక్ రోషన్. ఆ తర్వాత సడన్గా రిపబ్లిక్ డే వీకెండ్లో కంగనా రనౌత్ ‘మణికర్ణిక: ది క్వీన్ ఆఫ్ ఝాన్సీ’ చిత్రం రిలీజ్కు సిద్ధం అయ్యింది. అప్పట్లో కూడా కంగనా వర్సెస్ హృతిక్ అని వార్తలు వచ్చాయి. అయితే ఆ తర్వాత కొన్ని అనుకోని కారణావల్ల ‘సూపర్ 30’ సినిమాను జూలై 26కి పోస్ట్పోన్ చేశారు టీమ్. దీంతో కంగనా ‘మణికర్ణిక: ది క్వీన్ఆఫ్ ఝాన్సీ’ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇప్పుడు కూడా కంగనా నటించిన ‘మెంటల్ హై క్యా’ సినిమానే ప్రేక్షకుల ముందుకు రాబోతుండటం విశేషం. -
పండగ ఎవరికి?
వచ్చే ఏడాది క్రిస్మస్కు బాక్సాఫీస్ వద్ద పోటీ పడేందుకు రెడీ అవుతున్నారు బాలీవుడ్ టాప్ హీరోలు ఆమిర్ఖాన్, హృతిక్ రోషన్. గత ఏడాది డిసెంబర్లో ‘థగ్స్ ఆఫ్ హిందూస్తాన్’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు ఆమిర్ ఖాన్. ఈ చిత్రం అంతగా ప్రేక్షకాదరణకు నోచుకోలేదు. దీంతో తర్వాతి సినిమాకు కాస్త టైమ్ తీసుకున్న ఆమిర్ ఖాన్ ఆస్కార్ అవార్డ్ సాధించిన హాలీవుడ్ మూవీ ‘ఫారెస్ట్ గంప్’ హిందీ రీమేక్ ‘లాల్సింగ్ చద్దా’లో నటించనున్నట్లు ఇటీవల తన పుట్టినరోజు నాడు వెల్లడించాడు. ‘సీక్రెట్ సూపర్స్టార్’ ఫేమ్ అద్వైత్ చందన్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఆమిర్ఖాన్ ప్రొడక్షన్స్, వయాకామ్ 18 సంస్థలు నిర్మిస్తున్న ఈ సినిమాను క్రిస్మస్ సందర్భంగా విడుదల చేయనున్నట్లు చిత్రబృందం ప్రకటించిందని బాలీవుడ్ సమాచారం. ‘క్రిష్’ ఫ్రాంచైజీలో రానున్న ‘క్రిష్ 4’ సినిమాను వచ్చే ఏడాది క్రిస్మస్కే విడుదల చేయనున్నట్లు హృతిక్ రోషన్ తెలిపారు. సో.. ఇలా వచ్చే ఏడాది క్రిస్మస్కు ఇద్దరు టాప్ హీరోలు బాక్సాఫీస్ వద్ద పోటీ పడనున్నారు. మరి.. బాక్సాఫీస్ వద్ద ఎవరి పంట పండుతుందో, సినిమా విజయంతో ఎవరు పండగ చేసుకుంటారో చూడాలి. అయితే ఇంకా ‘క్రిష్ 4’ సెట్స్ పైకి వెళ్లలేదు. హృతిక్ తండ్రి రాకేష్ రోషన్ కేన్సర్ బారిన పడి, చికిత్స తీసుకుని ప్రస్తుతం బాగానే ఉన్నారు. త్వరలో ఈ చిత్రం షూటింగ్ మొదలుపెట్టాలనుకుంటున్నారు. -
మా ఇద్దరి మధ్య ఏమీ లేదు
వినోద ప్రపంచంలో ఎక్కువగా ఆకర్షించేవి సినిమా, క్రీడలు. అది కూడా స్పోర్ట్స్లో క్రికెట్ది ప్రత్యేక స్థానం. సినిమా, క్రీడలను కలిపేది యాడ్స్. క్రికెటర్స్, మూవీ స్టార్స్ కలసి యాడ్ ఫిల్మ్స్లో కనిపించడం చాలాసార్లు చూశాం. 2012లో క్రికెటర్ విరాట్ కోహ్లీ, హీరోయిన్ తమన్నా ఓ యాడ్ ఫిల్మ్ కోసం కలిశారు. ఆ స్మార్ట్ఫోన్ యాడ్ చిత్రీకరణ సమయంలోనే ఇద్దరూ దగ్గరయ్యారని, డేటింగ్ చేశారని ఆ మధ్య వార్తలొచ్చాయి. కానీ ఈ ఇద్దరిలో ఎవరూ ఆ వార్తలకు సమాధానం చెప్పలేదు. చాలా కాలం తర్వాత ఆ విషయం మీద ఓ షోలో మాట్లాడారు తమన్నా. ‘‘యాడ్ షూట్ సమయంలో నేను, విరాట్ గట్టిగా నాలుగు మాటలు కూడా మాట్లాడుకోలేదు’ అని పేర్కొన్నారు తమన్నా. ‘‘ఆ యాడ్ తర్వాత మేమిద్దరం మళ్లీ కలవలేదు, మాట్లాడుకోనూ లేదు. కానీ నేను యాక్ట్ చేసిన చాలామంది యాక్టర్స్ కంటే కూడా విరాట్ చాలా బెటర్ యాక్టర్’’ అని ప్రశంసించారు. ప్రస్తుతానికి ఎవరితో రిలేషన్షిప్లో లేనన్నారామె. హృతిక్ ఒక్కరే మినహాయింపు ఇదే షోలో మరికొన్ని విశేషాలు చెబుతూ – ‘‘సాధారణంగా సినిమాల్లో లిప్కిస్ సన్నివేశాలను చేయను నేను. ఏదైనా సినిమాకు సంతకం చేసేటప్పుడు నా కాంట్రాక్ట్లో ఆ నియమం కచ్చితంగా ఉంటుంది. కానీ హృతిక్తో కలసి నటిస్తే మాత్రం ఆ రూల్ని బ్రేక్ చేస్తానని సరదాగా ఫ్రెండ్స్తో జోక్ చేస్తుంటాను’’ అని పేర్కొన్నారామె.
Pagination
మళ్లీ చరిత్ర సృష్టిస్తున్నాం
చేతులు కాలాక ఆకులు పట్టుకున్న ఈసీ
ఓటీటీలోకి వచ్చేసిన మిడిల్ క్లాస్ మూవీ.. స్ట్రీమింగ్ అందులోనే?
వరల్డ్కప్ జట్టులో నో ఛాన్స్: రోహిత్పై కేఎల్ రాహుల్ కామెంట్స్ వైరల్
ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు అలెర్ట్.. మారిన విత్ డ్రా నిబంధనలు
ఎన్ఆర్ఐతో విధి ఆడిన వింత నాటకం.. విషాదం
స్వాతి మలివాల్ డ్రామా.. బీజేపీ కుట్రే ఇదంతా: సంచలన వీడియో బయట పెట్టిన ఆప్
Heeramandi Jewellery ఎవరీ సినిమా నగల స్పెషలిస్ట్ జంట
మహిళా చైతన్యంపై కక్ష కట్టిన చంద్రబాబు
యాదాద్రికి పోటెత్తిన భక్త జనం (ఫోటోలు)
నాణ్యతలేని ‘పతంజలి సోన్పాపిడి’.. ముగ్గురికి జైలు, జరిమానా
పరారీలో టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్
'బేబి' హీరో ఇంతలా మారిపోయాడేంటి? ఏకంగా అలా..
యశ్ దయాల్పై కోహ్లి ఫైర్.. దెబ్బకు ధోని ఖేల్ ఖతం!
భర్తతో పుణ్యక్షేత్రాల చుట్టూ తిరుగుతున్న నయనతార.. కారణం ఇదేనా?
మేమిద్దరం ఎక్కువగా కలిసుండము.. అందుకే! :నటి ఆసక్తికర వ్యాఖ్యలు
'సెలవులు'! ఒక మరపురాని జ్ఞాపకంగా రీచార్జ్గా చేసుకోండిలా..!
టీడీపీపై బొత్స సెటైర్లు
తప్పక చదవండి
- 'సెలవులు'! ఒక మరపురాని జ్ఞాపకంగా రీచార్జ్గా చేసుకోండిలా..!
- Delhi: కేజ్రీవాల్ ఛాలెంజ్.. బీజేపీ హెడ్క్వార్టర్స్ వద్ద హైటెన్షన్
- In Time Review: బతకాలంటే అక్కడ 'టైమ్' కొనాల్సిందే.. ఓటీటీలో ఈ మూవీ మిస్సవ్వొద్దు!
- ఏపీలో పెట్రోల్ బంకులకు ఈసీ సీరియస్ వార్నింగ్
- రేపే లోక్సభ ఐదో దశ పోలింగ్.. అందరి చూపు వీళ్లపైనే!
- ప్రైవేట్ బస్సులో మంటలు.. తిరుపతిలో తప్పిన ఘోర ప్రమాదం
- Weekly Horoscope: ఈ రాశి వారికి చిత్రవిచిత్ర సంఘటనలు ఎదురుకావచ్చు
- పరారీలో చింతమనేని.. పోలీసుల గాలింపు
- Vizag: కాంబోడియాలో ఉద్యోగాల పేరిట మానవ అక్రమ రవాణా
- అయ్యో అనూష.. ప్రాణం తీసిన ఫుట్బోర్డ్ ప్రయాణం
Advertisement