-
Fact Check: గ్రామాల్లో అభివృద్ధిపైనా ‘పచ్చ’పాతమే
సాక్షి, అమరావతి: గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో గుర్తించిన సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం ప్రత్యేకంగా వేల కోట్ల నిధులు విడుదల చేస్తుంటే.. రామోజీ మాత్రం కడుపు మంటతో అబద్ధాలు అచ్చేస్తున్నారు. గ్రామ, వార్డు సచివాలయాల పరిధిలో ప్రజలకు అవసరమైన ప్రాధాన్యత పనులను చేస్తున్నా.. అక్కసుతో అడ్డమైన రాతలు రాస్తున్నారు. ‘గడప గడపకు బోల్తా’ అంటూ పచ్చి అవాస్తవాలతో ఈనాడులో అవాస్తవాలను ప్రచురించారు. చంద్రబాబు హయాంలో గ్రామాలు, వార్డుల్లో ప్రజలకు అవసరమైన కనీస మౌలిక సదుపాయాల కల్పనను ఏ మాత్రం పట్టించుకోకపోయినా రామోజీ ఒక్క కథనం రాయలేదు. ఆరోపణ: రూ. 3 వేల కోట్ల పనుల్లో మొదలైనవి రూ.వెయ్యి కోట్ల పనులే.. వాస్తవం: వైఎస్ జగన్ సర్కారు గ్రామ, వార్డు సచివాలయాలు కేంద్రంగా ఆ పరిధిలోని ఇళ్లకు మంత్రులు, ఎమ్మెల్యేలను పంపించి వారి సమస్యలు తెలుసుకుంది. అక్కడి ప్రజలకు అవసరమైన అత్యంత ప్రాధాన్యత పనులు చేపట్టేందుకు చర్యలు తీసుకుంది. ఇందులో భాగంగా ఒక్కో గ్రామ, వార్డు సచివాలయానికి రూ.20 లక్షల చొప్పున నిధులను కేటాయించారు. గత చంద్రబాబు ప్రభుత్వంలో ప్రజాప్రతినిధులు అసలు గ్రామాలు, వార్డుల ముఖం చూసిన పాపాన పోలేదు. ప్రజలకు అవసరమైన పనులు చేపట్టకుండా నీరు–చెట్టు పేరుతో నామినేషన్పై వేల కోట్లు పచ్చ నేతలు జేబులు నింపుకున్నారు. ఇప్పుడు గ్రామ, వార్డు సచివాలయాల్లో వేల సంఖ్యలో పనులు జరుగుతున్నా ఈనాడు రామోజీ అక్కసు వెళ్లగక్కారు. రూ.1000 కోట్ల విలువైన పనులు కూడా ప్రారంభం కాలేదని అవాస్తవలు ప్రచురించారు. గ్రామ, వార్డు సచివాలయాల పరిధిలో గుర్తించిన అత్యంత ప్రాధాన్యత పనుల్లో ఇప్పటికే రూ.1100.78 కోట్ల విలువైన 30,025 పనులు పూర్తయ్యాయి. మరో 1978.46 కోట్ల విలువైన పనులు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఆరోపణ: 65 వేల పనుల్లో 25 వేల పనులు ఇప్పటికీ ప్రారంభం కాలేదు.. వాస్తవం: గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో 11,753 సచివాలయాల పరిధిలో 65,857 పనులను మంజూరు చేశారు. వాటిలో చాలా పూర్తి కాగా.. మరికొన్ని కొనసాగుతున్నాయి. స్థానికంగా ఆయా సచివాలయాల పరిధిలో ప్రజలకు అవసరమైన అత్యంత ముఖ్యమైన ప్రాధాన్యత పనులను మంత్రులు, ప్రజాప్రతినిధులు గుర్తించిన వెంటనే ఆ పనుల వివరాలను గడప గడపకు మన ప్రభుత్వంలో అత్యంత ప్రాధాన్యత పనుల పోర్టల్లో అప్లోడ్ చేస్తున్నారు. అప్లోడ్ చేసిన పనుల తక్షణ మంజూరు నిరంతరంగా కొనసాగుతోంది. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో అత్యంత ప్రాధాన్యత పనుల కోసం ఒక్కో గ్రామ, వార్డు సచివాలయానికి రూ.20 లక్షల చొప్పున రూ.3000 కోట్లకు పరిపాలనా అనుమతులు మంజూరు చేశారు. పూర్తయిన పనులకు బిల్లులు చెల్లింపు చేస్తున్నారు. అత్యంత ప్రాధాన్యత పనుల పురోగతిపై ఎప్పటికప్పుడు గడప గడపకు మన ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత పనుల పోర్టల్లో అప్లోడ్ చేయాల్సిందిగా ఇంజనీరింగ్ అసిస్టెంట్లు, ఎంపీడీవోలను రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. పూర్తి అయిన పనుల బిల్లులను సీఎఫ్ఎంఎస్ పోర్టల్లో అప్లోడ్ చేసి నిబంధన ప్రకారం చెల్లింపులు చేయాలని డీడీఓలను రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. పనులు పూర్తయిన వాటికి ఎప్పటికప్పుడు బిల్లులు చెల్లింపు చేస్తున్నారు. పనులు పెద్ద ఎత్తున కొనసాగుతున్నాయని గ్రామ, వార్డు సచివాలయాల శాఖ ప్రత్యేక సీఎస్ అజయ్ జైన్ తెలిపారు. -
నయా ఆతిథ్యం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని ఆతిథ్య రంగం బలోపేతానికి ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. దేశ, విదేశీ పర్యాటకుల అభిరుచులకు తగ్గట్టుగా ‘ఆతిథ్య’ మౌలిక వసతులను కల్పిస్తోంది. ఇందులో భాగంగా పర్యాటకాభివృద్ధి సంస్థ హరిత హోటళ్లను ఆధునికీకరించేందుకు కార్యాచరణ రూపొందించింది. సుమారు రూ.140 కోట్లతో తొలి దశలో 16 హోటళ్ల ఆధునికీకరణకు శ్రీకారం చుట్టింది. నిర్మాణ రంగంలో అనుభవజు్ఞలైన అర్కిటెక్చర్లతో హోటళ్లకు హంగులు అద్దుతోంది. విశాఖ నుంచి ప్రారంభం.. ఆంధ్రప్రదేశ్ పర్యాటకాభివృద్ధి సంస్థ (ఏపీటీడీసీ) ఈ–టెండరింగ్ ప్రక్రియ ద్వారా హరిత హోటళ్ల అప్గ్రేడ్, పునర్నిర్మాణ పనులు చేపడుతోంది. ఇప్పటికే 16 హోటళ్ల పనులకు పరిపాలన అనుమతులు వచ్చాయి. విశాఖలోని యాత్రీనివాస్ హోటల్లో పనులు చురుగ్గా సాగుతున్నాయి. అరకులోని హరిత వ్యాలీ రిసార్టు, నెల్లూరు, ద్వారకాతిరుమలలోని హోటళ్ల పనులు చేపట్టేందుకు టెండర్లు ఖరారయ్యాయి. ఒకట్రెండు రోజుల్లో ఒప్పంద ప్రక్రియ పూర్తయిన వెంటనే పనులు ప్రారంభించనున్నారు. మరో వారంలోగా అల్లూరి సీతారామరాజు జిల్లాలోని టైడా జంగిల్ బెల్స్ రిసార్టు, విజయపురిసౌత్, శ్రీశైలం, సూర్యలంక, కడప, అరకులోని మయూరి, హార్సిలీహిల్స్, కర్నూలు, గండికోట హోటళ్లతో పాటు నెల్లూరు మైపాడు బీచ్ రిసార్టు, దిండి కోకోనట్ రిసార్టు, అనంతగిరి హిల్ రిసార్టులకు టెండర్లు పిలవనుంది. అత్యాధునిక సౌకర్యాలతో.. ఆతిథ్య రంగంలోని ప్రైవేటు హోటళ్లకు దీటుగా ఏపీటీæడీసీ హరిత హోటళ్లను తీర్చిదిద్దుతోంది. ప్రతి హోటల్లో లగ్జరీ ఫర్నీచర్ నుంచి గోడలకు పెయింటింగ్, ఇంటీరియర్పై ప్రత్యేక దృష్టి సారించారు. రెస్టారెంట్, స్పా, మోడ్రన్ జిమ్, స్విమ్మిగ్ పూల్, సావనీర్ షాపు, మినీ బ్యాంకెట్/సమా వేశ మందిరం, టెర్రాస్ ఫ్లోర్, గ్రౌండ్ ఫ్లోర్, టీవీ యూనిట్, హై స్పీడ్ ఇంటర్నెట్, ఉడెన్ ర్యాక్స్, టేబుల్ విత్ మిర్రర్, లైటింగ్, డ్రై–వెట్ ఏరియా ఉండేలా టాయిలెట్ల నిర్మాణం చేపడుతోంది. పార్కింగ్ సౌకర్యం, ల్యాండ్ స్కేపింగ్, పచ్చదనాన్ని పెంచనుంది. పులివెందులలో 4స్టార్ హోటల్ పులివెందులలో రూ.23.50 కోట్లతో 4స్టార్ హోటల్ సౌకర్యాన్ని అందుబాటులోకి తెచ్చేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇప్పటికే మధ్యలో నిర్మాణం నిలిచిపోయిన 1.71 ఎకరాల్లోని ఓ భవనాన్ని గుర్తించి కొనుగోలు చేసింది. ఇందులో వసతి గదులు, కన్వెన్షన్ సెంటర్ (క్లబ్ హౌస్), జిమ్, పిల్లల ఆటస్థలం, ఎలివేటర్స్, సరై్వలెన్స్ సిస్టమ్, సౌర విద్యుత్ స్టేషన్తో పాటు ఇతర ముఖ్యమైన మౌలిక సౌకర్యాలను అభివృద్ధి చేయనుంది. సౌకర్యాల కల్పనలో రాజీపడం పర్యాటకుల అభిరుచులకు తగ్గట్టుగా సేవలందించేందుకు చర్యలు చేపడుతున్నాం. తొలుత హరిత హోటళ్లను అప్గ్రేడ్ చేస్తున్నాం. అత్యధిక పర్యాటకులు వచ్చే హోటళ్లను ఎంపిక చేసి పనులు ప్రారంభిస్తున్నాం. దశల వారీ అన్ని హోటళ్లలో మార్పులు చేస్తాం. నాణ్యమైన సౌకర్యాల కల్పనలో ఎక్కడా రాజీ పడే ప్రసక్తి లేదు. స్టార్ హోటళ్లకు దీటుగానే మా రిసార్టులు, హోటళ్లను తీర్చిదిద్దుతాం – కె.కన్నబాబు, ఎండీ, పర్యాటకాభివృద్ధి సంస్థ నిర్ణీత కాల వ్యవధిలో.. హోటళ్ల ఆధునికీకరణలో భాగంగా ఈ–టెండర్ల ద్వారా ఎంపిక చేసిన కాంట్రాక్టర్లు, అనుభవం కలిగిన ఆర్కిటెక్చర్ల సమన్వయంతో పని చేస్తున్నాం. సుదీర్ఘ అధ్యయనం తర్వాతే ప్రణాళిక ప్రకారం పనులు చేపట్టాం. పర్యాటక సీజన్ ప్రారంభమయ్యే లోగా పనులు పూర్తి చేసేలా కసరత్తు చేస్తున్నాం. అనుకున్న కాల వ్యవధిలో పూర్తి స్థాయిలో హోటళ్లను అప్గ్రేడ్ చేసేలా పర్యవేక్షిస్తున్నాం. – మల్రెడ్డి, ఈడీ (ప్రాజెక్ట్స్), పర్యాటకాభివృద్ధి సంస్థ -
రీట్, ఇన్విట్.. పెరుగుతున్న ఆకర్షణ
న్యూఢిల్లీ: రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్ (రీట్), ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్ (ఇన్విట్) పట్ల ఇన్వెస్టర్లలో అవగాహన పెరుగుతున్న కొద్దీ.. వీటిల్లోకి మరిన్ని పెట్టుబడులు తరలివస్తున్నాయి. ఇందుకు గతేడాది గణాంకాలే నిదర్శనం. 2023లో రీట్, ఇన్విట్లలోకి రూ.11,474 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. 2022లో వచి్చన రూ.1,166 కోట్లతో పోలిస్తే పది రెట్ల వృద్ధి గతేడాది నమోదైనట్టు తెలుస్తోంది. సెబీ తీసుకున్న చర్యలు, ఆకర్షణీయమైన రాబడులు ఈ సాధనాల దిశగా ఇన్వెస్టర్లను ఆలోచింపజేస్తున్నట్టు విశ్లేషకులు చెబుతున్నారు. ఈ ఏడాది కూడా ఈ సాధనాలు భారీగా పెట్టుబడులను ఆకర్షించొచ్చన్న అంచనాను వ్యక్తం చేస్తున్నారు. వడ్డీ రేట్ల కోత అంచనా, విధానాల్లో వచి్చన మార్పులను ప్రస్తావిస్తున్నారు. ‘‘ఈ ఏడాది మొదటి ఆరు నెలల్లో వడ్డీ రేట్లను తగ్గించే చర్యలు చేపట్టొచ్చు. దీర్ఘకాలం కోసం ఇన్వెస్ట్ చేసే వారికి రీట్, ఇన్విట్లు ఆకర్షణీయంగా మారతాయి’’అని క్లారావెస్ట్ టెక్నాలజీస్ సహ వ్యవస్థాపకుడు మనకి పరులేకర్ పేర్కొన్నారు. రీట్, ఇన్విట్ సాధనాల్లోకి భారీగా 2020లో రూ.29,715 కోట్ల పెట్టుబడులు రావడం గమనార్హం. 2021లో రూ.17,641 కోట్లు వచ్చాయి. రీట్,ఇన్విట్లను ఏడెనిమిదేళ్ల క్రితం ప్రవేశపెట్టారు. ప్రస్తుతం దేశంలో 23 రిజిస్టర్డ్ ఇన్విట్లు, ఐదు రీట్లు ఉన్నాయి. వీటి నిర్వహణలో మొత్తం రూ.30,000 కోట్ల పెట్టుబడులు ఉన్నాయి. రీట్ల ద్వారా వాణిజ్య రియల్ ఎస్టేట్ ప్రాజెక్టుల్లో, ఇన్విట్ల ద్వారా ఇన్ఫ్రా ప్రాజెక్టుల్లో పెట్టుబడుల అవకాశాలను సొంతం చేసుకోవచ్చు. -
మెరుగైన సదుపాయాలు కల్పించండి
న్యూఢిల్లీ: దేశీ స్టార్టప్లు మరింతగా రాణించేందుకు సరఫరా వ్యవస్థను, మౌలిక సదుపాయాలను మెరుగుపర్చాలని గ్రామీణ ప్రాంతాల అంకుర సంస్థలు కేంద్రాన్ని కోరాయి. అలాగే నిధుల లభ్యత పెరిగేలా తగు చర్యలు తీసుకోవాలని బడ్జెట్ కోర్కెల చిట్టాలో విజ్ఞప్తి చేశాయి. దీనితో పరిశోధనలు, కొత్త ఆవిష్కరణలకు ఊతం లభించగలదని పేర్కొన్నాయి. ఈ ఏడాది సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో వచ్చే నెలలో కేంద్రం ఓటాన్ అకౌంట్ను ప్రవేశపెట్టనుండగా, ఎన్నికల అనంతరం కొత్త ప్రభుత్వం పూర్తి స్థాయి బడ్జెట్ను ప్రవేశపెట్టనున్న సంగతి తెలిసిందే. పాతబడిన పరికరాలు, బలహీన సరఫరా వ్యవస్థలు, మౌలిక సదుపాయాల లేమి, నిధుల కొరత వంటి సమస్యలతో దేశీ ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమ సతమతమవుతోందని క్రిని స్పైసెస్ వ్యవస్థాపకుడు ప్రదీప్ కుమార్ యాదవ్ తెలిపారు. ప్రపంచ మార్కెట్లకు ఎగుమతి చేయగలిగేలా అంతర్జాతీయ సరఫరా వ్యవస్థలకు అనుసంధానం అవడంలో ప్రభుత్వం తమకు తోడ్పాటు కలి్పంచాలని ఆయన కోరారు. వ్యవసాయ ఆధారిత స్టార్టప్లను ప్రారంభించే గ్రామీణ ఎంట్రప్రెన్యూర్లను ప్రోత్సహించేందుకు ఉద్దేశించిన అగ్రికల్చర్ యాక్సిలరేటర్ ఫండ్ (ఏఏఎఫ్)కి రాబోయే బడ్జెట్లో కేంద్రం అదనంగా మరిన్ని నిధులు కేటాయించగలదని ఆశిస్తున్నట్లు యాదవ్ చెప్పారు. 2017లో ఏర్పాటైన క్రిని స్పైసెస్ ప్రత్యక్షంగా 22 మందికి, పరోక్షంగా 100 మందికి ఉపాధి కలి్పస్తోంది. 2022–23లో రూ. 4 కోట్ల పైచిలుకు ఆదాయం నమోదు చేసింది. ఎగుమతి నిబంధనలు సడలించాలి.. ఎగుమతి నిబంధనలను సడలించాలంటూ ప్రభుత్వాన్ని పలు అంకుర సంస్థలు కోరుతున్నాయి. ముడి వస్తువుల దిగుమతి, ఫినిష్డ్ ఉత్పత్తుల ఎగుమతి సులభతరమయ్యేలా అంతర్జాతీయ సరఫరా, సేల్స్ వ్యవస్థకు అంకుర సంస్థలు అనుసంధానమయ్యేందుకు కేంద్రం సహాయం అందించాలని ఐరిస్ పాలిమర్స్ వ్యవస్థాపకుడు ఎ. అరుణ్ కోరారు. అంతర్జాతీయంగా 3.82 బిలియన్ డాలర్ల స్థాయిలో ఉన్న మల్చింగ్ మెటీరియల్స్ మార్కెట్ ఏటా 7.6 శాతం వృద్ధితో 2032 నాటికి 7.96 బిలియన్ డాలర్లకు పెరగవచ్చనే అంచనాలు ఉన్నట్లు ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వం గనుక ఎగుమతి వ్యవస్థను సరళతరం చేస్తే ఈ విభాగంలో భారత్ భారీ తయారీ హబ్గా ఎదిగేందుకు అవకాశాలు ఉన్నట్లు చెప్పారు. వ్యవసాయ ఫిల్మ్లు, పారిశ్రామిక ప్యాకేజింగ్ ఫిల్మ్లు తయారు చేసే పుణె కంపెనీ ఐరిస్ పాలిమర్స్.. ప్రత్యక్షంగా 53 మందికి, పరోక్షంగా 200 మందికి ఉపాధి కలి్పస్తోంది. 2022–23 ఆర్థిక సంవత్సరంలో రూ. 34 కోట్ల ఆదాయం నమోదు చేసింది. మరిన్ని సబ్సిడీలు కావాలి.. మరోవైపు, అంకుర సంస్థల లాభార్జనకే కాకుండా వాటి ప్రయోజనాలు రైతులకు కూడా అందేలా చూసేందుకు నిర్దిష్ట రంగాలకు ప్రభుత్వ సబ్సిడీలు మరింతగా అవసరమని నియో ఫార్మ్టెక్ వ్యవస్థాపకుడు యోగేష్ గవాండే చెప్పారు. ‘మాది ఒక అంకుర సంస్థ. మేము దేశ, విదేశ దిగ్గజాలతో పోటీపడుతున్నాం. ప్రభుత్వం గానీ మా ఉత్పత్తికి సబ్సిడీలు ఇస్తే.. మేము మా లాభాలను తగ్గించుకుని, ఆ ప్రయోజనాలను రైతులకు బదలాయించగలుగుతాము‘ అని గవాండే చెప్పారు. దేశవ్యాప్తంగా 14 రాష్ట్రాల్లో 12,000 మంది రైతులకు తాము స్ప్రే పంపులను సరఫరా చేసినట్లు ఆయన పేర్కొన్నారు. అంతర్జాతీయ సరఫరా, సేల్స్ వ్యవస్థకు అనుసంధానమవడం అనేది అతి పెద్ద సవాలుగా ఉంటోందని గవాండే చెప్పారు. వ్యవసాయ స్ప్రే పంపులను తయారు చేసే నియో ఫార్మ్టెక్తో ప్రత్యక్షంగా, పరోక్షంగా 100 మంది ఉపాధి పొందుతున్నారు. గత ఆర్థిక సంవత్సరం రూ. 1.12 కోట్ల ఆదాయం నమోదు చేసింది. వ్యవసాయ రంగంలో ఆధునీకరణను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం అంకుర సంస్థలకు ఆర్థిక తోడ్పాటు అందిస్తోందని భారతీయ యువ శక్తి ట్రస్టు (బీవైఎస్టీ) వ్యవస్థాపకురాలు లక్ష్మీ వెంకటరామన్ వెంకటేశన్ తెలిపారు. ఏఏఎఫ్ ద్వారా వ్యవసాయ, అనుబంధ రంగాల్లోని అంకురాలకు ఆర్థిక సహాయం అందుతోందని వివరించారు. లక్షల కొద్దీ గ్రామీణ స్టార్టప్లు మరింతగా విస్తరించేందుకు, యూనికార్న్లుగా (1 బిలియన్ డాలర్ల వేల్యుయేషన్ గల సంస్థలు) ఎదిగేందుకు కూడా అవకాశం ఉందని లక్ష్మి చెప్పారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని ఎంట్రప్రెన్యూర్లకు బీవైఎస్టీ గత మూడు దశాబ్దాలుగా సలహాలు, సూచనలు అందిస్తున్నట్లు ఆమె పేర్కొన్నారు. ఇప్పటివరకు పది లక్షల పైచిలుకు యువతకు కౌన్సిలింగ్ చేశామని, వారు 48,000 పైగా అంకుర సంస్థలను ఏర్పాటు చేయడంలో సహాయపడ్డామని చెప్పారు. ఈ సంస్థలు రూ. 6,000 కోట్ల ఆదాయాన్ని నమోదు చేశాయని, ప్రత్యక్షంగా.. పరోక్షంగా 3,50,000 మందికి ఉపాధి కలి్పస్తన్నాయని ఆమె పేర్కొన్నారు. -
పొలం నుంచి మార్కెట్కు..
సాక్షి, అమరావతి: పండించిన పంట ఉత్పత్తులను మార్కెట్కు తరలించేందుకు రైతన్నలు పడుతున్న వెతలకు చెక్ పెట్టే లక్ష్యంతో వ్యవసాయ మార్కెట్ కమిటీ (ఏఎంసీ)ల పరిధిలో పెద్ద ఎత్తున మౌలిక సదుపాయాలు కల్పించాలని ప్రభుత్వం సంకల్పించింది. మార్కెట్ ఫీజుల ద్వారా వచ్చే ఆదాయంలో ఏఏంసీల నిర్వహణ, సిబ్బంది జీతభత్యాల కోసం ఖర్చుచేయగా.. మిగిలిన కొద్దిపాటి సొమ్ములను మౌలిక సదుపాయాల కోసం ఖర్చు చేసే వారు. దీంతో ఏళ్ల తరబడి నిర్లక్ష్యానికి గురైన ఏఎంసీలకు కొత్తరూపునివ్వడంతో పాటు.. రైతు క్షేత్రాల నుంచి మార్కెట్లకు అనుసంధానించే రోడ్లను నిర్మించాలని సంకల్పించింది. ఇదే లక్ష్యంతో మార్కెటింగ్ సెస్ను కాస్త సవరిస్తూ ధాన్యంపై 2శాతం, రొయ్యలపై 1 శాతం, చేపలపై రూ.0.50 శాతం, మిగిలిన అన్నిరకాల నోటిఫైడ్ వ్యవసాయ, లైవ్స్టాక్ ఉత్పత్తులపై ఒక శాతం చొప్పున సెస్ పెంపును ప్రతిపాదించింది. ధాన్యం మినహా ఇతర ఉత్పత్తులపై ప్రతిపాదించిన సెస్ వసూలుకు హైకోర్టు అభ్యంతరం వ్యక్తం చేసింది. అంతర్గత రహదారులకు పెద్దపీట మరోవైపు వ్యవసాయ, ఉద్యాన, ఆక్వా ఉత్పత్తులను యార్డులు, మార్కెట్లకు తరలించుకునేందుకు వీలుగా రైతు క్షేత్రాల నుంచి ఏఏంసీలకు, ఏఎంసీల నుంచి మండల, నియోజకవర్గ కేంద్రాలను అనుసంధానిస్తూ అనుబంధ రహదారుల నిర్మాణం, ఏఎంసీలు, యార్డులు, మార్కెట్లు, చెక్ పోస్టులు, యార్డులు, రైతు బజార్లను ఆధునికీకరించడం, కొత్తగా ఏర్పడిన ఏఎంసీలకు భవనాలతో పాటు కొత్త జిల్లాలకు అనుగుణంగా కార్యాలయ భవనాలు నిర్మించాలని సంకల్పించారు. ఈ మేరకు ఏపీ మార్కెటింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ప్రాజెక్టు(ఏపీఎంఐడీపీ)లో భాగంగా రూ.1072.93 కోట్లతో 11,088 కి.మీ. మేర అంతర్గత రహదారుల నిర్మాణం, మరో 9,123 కి.మీ.మేర రహదారుల మరమ్మతులు, రూ.527 కోట్లతో ఏఎంసీలు, యార్డులు, రైతు బజార్లలో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రతిపాదనలు సిద్ధం చేయగా, ప్రభుత్వం పరిపాలనామోదం ఇచ్చింది. నాబార్డు ద్వారా రూ.1,003.94 కోట్ల రుణం మార్కెట్ సెస్ రూపంలో ఏటా రూ.550 కోట్ల ఆదాయం వస్తుండగా, ధాన్యంపై సెస్ పెంపు వల్ల గతేడాది రూ.648 కోట్ల ఆదాయం వచ్చింది. ఈ ఏడాది రూ.708 కోట్లు వసూలు లక్ష్యం కాగా, ఇప్పటి వరకు రూ.400 కోట్లకు పైగా ఆదాయం వచ్చింది. ఈ మొత్తం ఏమాత్రం సరిపోదన్న ఆలోచనతో ఆర్థిక సంస్థల నుంచి రుణం పొందాలని నిర్ణయించింది. ఆ బా«ధ్యతలను నోడల్ ఏజెన్సీగా రాష్ట్ర గిడ్డంగుల సంస్థకు అప్పగించింది. ఇటీవలే ఈ ప్రాజెక్టు కోసం గిడ్డంగుల సంస్థకు నాబార్డు రూ.1,003.94 కోట్ల రుణం మంజూరు చేసింది. ఈ మొత్తంలో రూ.861.53 కోట్లతో అనుబంధ రహదారుల నిర్మాణం, రూ.197.76 కోట్లతో మౌలిక వసతుల కల్పనకు ప్రతిపాదించారు. ఈ ప్రాజెక్టు కింద 2024–24 ఆర్థిక సంవత్సరంలో రూ.446.20 కోట్లు, 2025–26లో రూ.669.29 కోట్లతో చేపట్టనున్న ఈ పనులు పంచాయతీ రాజ్ శాఖకు అప్పగించారు. రైతు సంక్షేమం కోసమే.. పండించిన వ్యవసాయ, ఉద్యాన ఉత్పత్తులను కల్లాల నుంచి మార్కెట్లకు తరలించేందుకు అనువైన రహదారుల నిర్మాణంతో పాటు మార్కెట్ కమిటీల్లో పెద్ద ఎత్తున మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నాం. ఇందుకోసం రూ.1599.92 కోట్ల అంచనాలకు ప్రతిపాదనలు సిద్ధం చేయగా, ఇటీవలే నాబార్డు రూ.1003.94 కోట్ల రుణం మంజూరైంది. ఈ నిధులతో 2024–26 ఆర్థిక సంవత్సరాల్లో చేపట్టనున్న పనులకు పరిపాలనామోదం ఇచ్చాం. త్వరలో టెండర్లు పిలిచి పనులు చేపట్టనున్నాం. మౌలిక వసతుల కల్పన కోసం రుణం తీసుకుంటున్నామే తప్ప, ఈ రుణం కోసం రైతులపై పన్నుల భారం మోపుతున్నామన్న ఆరోపణల్లో వాస్తవం లేదు. – రాహుల్ పాండే, కమిషనర్, మార్కెటింగ్ శాఖ -
నవంబర్లో ‘మౌలికం’ పురోగతి 7.8 %
న్యూఢిల్లీ: ఎనిమిది పరిశ్రమల మౌలిక రంగం గ్రూప్ నవంబర్లో 7.8 శాతం పురోగతి సాధించింది. అధికారిక గణాంకాల ప్రకారం క్రూడ్ ఆయిల్, సిమెంట్ రంగాలు మినహా మిగిలిన అన్ని రంగాలు మంచి పనితీరును కనబరిచాయి. బొగ్గు, సహజ వాయువు, రిఫైనరీ ప్రొడక్టులు, ఎరువులు, స్టీల్, ఎలక్ట్రిసిటీ రంగాలూ ఈ గ్రూప్లో భాగంగా ఉన్నాయి. ఇక 2023–24 ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ నుంచి నవంబర్ ఎనిమిది నెలల కాలంలో ఎనిమిది రంగాల పురోగతి 8.6 శాతం. గత ఏడాది ఇదే కాలంలో ఈ రేటు 8.1%. మొత్తం పారిశ్రామిక ఉత్పత్తిలో ఈ గ్రూప్ వాటా దాదాపు 42 శాతం. -
2 బిలియన్ డాలర్లపై బ్లాక్ బాక్స్ గురి
న్యూఢిల్లీ: ఐటీ సేవల కంపెనీ బ్లాక్ బాక్స్ వచ్చే మూడేళ్లలో ఆదాయాన్ని మూడింతలు పెంచుకోవాలని నిర్దేశించుకుంది. 2 బిలియన్ డాలర్లకు చేరుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది. కీలకమైన టెక్నాలజీ మౌలిక సదుపాయాలకు డిమాండ్ పెరుగుతుండటం ఇందుకు దోహదపడగలదని సంస్థ ప్రెసిడెంట్ సంజీవ్ వర్మ తెలిపారు. డిజిటల్ ఇన్ఫ్రా, కనెక్టివిటీ, నెట్వర్కింగ్, సైబర్సెక్యూరిటీ మొదలైన వాటిపై ప్రధానంగా దృష్టి పెడుతున్నట్లు ఆయన వివరించారు. అమెజాన్, గూగుల్, మెటా, మైక్రోసాఫ్ట్ వంటి దిగ్గజ టెక్ కంపెనీలు డేటా సెంటర్లను ఏర్పాటు చేసేందుకు బ్లాక్ బాక్స్ సేవలు అందిస్తోంది. కంపెనీ గత ఆర్థిక సంవత్సరంలో రూ. 6,233 కోట్ల ఆదాయం నమోదు చేసింది. బ్లాక్ బాక్స్ ఆదాయంలో 70 శాతం వాటా అమెరికాది కాగా యూరప్ వాటా 15 శాతంగా ఉంది. 4,000 మంది పైచిలుకు ఉద్యోగులు ఉన్నారు. 2 బిలియన్ డాలర్ల లక్ష్యానికి చేరుకునే క్రమంలో ఉద్యోగుల సంఖ్య 7,000–8,000కు చేరే అవకాశం ఉందని, అత్యధికంగా హైరింగ్ భారత్లోనే ఉంటుందని వర్మ వివరించారు. -
డేటా సెంటర్లపై 21 బిలియన్ డాలర్ల పెట్టుబడులు
న్యూఢిల్లీ: ఈ ఏడాది ప్రథమార్ధంలో (జనవరి–జూన్) దేశీ డేటా సెంటర్ (డీసీ) మార్కెట్లోకి 21.4 బిలియన్ డాలర్ల పెట్టుబడుల ప్రతిపాదనలు వచి్చనట్లు రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్ సీబీఆర్ఈ ఒక నివేదికలో తెలిపింది. డిజిటలీకరణ వేగవంతం అవు తుండటం, టెక్నాలజీ మౌలిక సదుపాయాలు మెరుగుపడుతుండటం, 5జీ..కృత్రిమ మేథ.. బ్లాక్చెయిన్, క్లౌడ్ కంప్యూటింగ్ వంటి అధునాతన టెక్నాలజీల వినియోగం పెరుగుతుండటం తదితర అంశాల కారణంగా భారత్లో డేటా సెంటర్ల పరిశ్రమ పురోగమనం కొనసాగుతోందని వివరించింది. డిజిటల్ మౌలిక సదుపాయాలు మెరుగుపడుతుండటం, టెక్నాలజీ వినియోగం పెరుగుతుండటంతో పాటు నియంత్రణపరమైన తోడ్పాటు వంటి అంశాల కారణంగా భారత్లోని డేటా సెంటర్లు పెట్టుబడులకు ఆకర్షణీయంగా మారాయని తెలిపింది. 2020 –2023 మధ్య కాలంలో భారతీయ డీసీ సామర్ధ్యం రెట్టింపయ్యిందని, ఈ ఏడాది ప్రథమార్ధంలో 880 మెగావాట్లకు చేరిందని పేర్కొంది. 2023 ఆఖరు నాటికి ఇది 1,048 మెగావాట్లకు చేరగలదని సీబీఆర్ఈ నివేదిక వివరించింది. 2018 – 2023 ప్రథమార్ధం మధ్యకాలంలో భారత డీసీ మార్కెట్లోకి మొత్తం 35 బిలియన్ డాలర్ల విలువ చేసే పెట్టుబడుల ప్రతిపాదనలు వచి్చనట్లు పేర్కొంది. ఇందులో హైపర్స్కేల్ డీసీల వాటా 89 శాతంగా ఉండగా, కో–లొకేషన్ డీసీల వాటా 11% ఉంది. రాష్ట్రాలవారీగా చూస్తే అత్యధికంగా మహారాష్ట్ర, తమిళనాడు, పశ్చిమ బెంగాల్, ఉత్తర్ ప్రదేశ్కి పెట్టుబడుల ప్రతిపాదనలు వచ్చాయి. -
రేపటి నగరాలను నిర్మించేదెలా?
ప్రపంచవ్యాప్తంగా జీడీపీలో దాదాపు 80 శాతం వాటా సమకూరుస్తూ నగరాలు ప్రధాన ఆదాయ సముపార్జన కేంద్రాలుగా మారుతున్నాయి. భారతదేశంలో కూడా ఇందుకు భిన్నమైన పరిస్థితులు లేవు. దేశంలోని ముంబై, ఢిల్లీ వంటి నగరాలు ప్రపంచంలోని కొన్ని దేశాల కంటే అధికంగా జీడీపీని సమకూరుస్తున్నాయి. మన నగరాలను అభివృద్ధి పథంలో నిలపడానికి కొత్తగా మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేయడంతోపాటు ఇప్పటికే ఉన్న సదుపాయాలను మరింత మెరుగుపరచాల్సిన అవసరం ఉంది. పట్టణ మౌలిక సదుపాయాలకు నిధులు సమకూర్చడంలో ప్రభుత్వాలకున్న పరిమితుల దృష్ట్యా ప్రైవేటు పెట్టుబడులను సమీకరించడం నేడు అనివార్యంగా మారింది. విశాఖపట్నం లాంటి నగరాలు మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేసుకోవడానికి వినూత్న ఆదాయ నమూనాలను విజయవంతంగా వినియోగించుకుంటున్నాయి. 2036 నాటికి భారతదేశంలోని నగరాల్లో నివసించే జనాభా 60 కోట్లకు చేరుకుంటుందని ఒక అంచనా. ఈ స్థాయిలో జనాభా పెరుగుదల మంచి అవకాశాలను సృష్టించడంతో పాటు లక్షలాది మంది జనాభాకు అనుగుణంగా పౌర సేవలు విస్తరించడం, పౌరులకు మెరుగైన జీవనానికి అనువైన పరిస్థితులను కల్పించడం ప్రభుత్వానికి ఒక సవాలు కానుంది. అందువల్ల భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా పట్టణ మౌలిక సదుపాయాలను సిద్ధం చేయడానికి మనం గణనీయంగా వనరులను కేటాయించాల్సిన అవసరం ఉంది. ఈ అవసరాన్ని గుర్తించిన భారత జీ20 అధ్యక్షత ‘ఫైనాన్సింగ్ సిటీస్ టుమారో: సస్టెయినబుల్, ఇంక్లూజివ్ అండ్ రజిలెంట్’ అనే థీమ్ను ఎంపిక చేసుకుంది. అందుకనుగుణంగా నగరాల్లో స్థిరమైన మౌలిక సదుపాయాల పెట్టుబడులకు అనువైన వాతావరణాన్ని ఏర్పాటు చేయడంలో అభివృద్ధి చెందిన, అభివృద్ధి చెందుతున్న దేశాల మధ్య పరస్పర అవగాహనను పెంపొందించడానికి న్యూఢిల్లీ లీడర్స్ డిక్లరేషన్ పేరుతో ‘ఫైనాన్సింగ్ సిటీస్ ఆఫ్ టుమారో’ ఆవిర్భావానికి కొన్ని సూత్రాలను ఆమోదించారు. పట్టణ మౌలిక సదుపాయాలకు నిధులు సమకూర్చడంలో ప్రభు త్వాలకున్న పరిమితుల దృష్ట్యా ప్రైవేటు పెట్టుబడులను సమీకరించడం నేడు అనివార్యంగా మారింది. ఇందుకనుగుణంగా స్థిరమైన, సమ్మిళిత మౌలిక సదుపాయాలకు నిధులు సమకూర్చు కోవడానికి నగరాలకు మార్గనిర్దేశం చేసే విధంగా భారత్ అధ్యక్షతన జరిగిన జీ20 కొన్ని నివేదికలను ప్రకటించింది. ఈ వ్యూహంలో పట్టణ ప్రణాళిక సంస్కరణలు, సొంత ఆదాయ వనరులను పెంచుకోవడం, పెట్టు బడి సామర్థ్యాన్ని పెంపొందించుకోవడం, నగరాల రుణ సామర్థ్యాన్ని మెరుగుపరుచుకోవడం, గ్రీన్, సోషల్ మరియు సస్టెయినబుల్ బాండ్లు వంటి వినూత్న ఫైనాన్సింగ్ సాధనాలను ఉపయోగించుకుని స్థిరమైన పెట్టుబడి ప్రాజెక్టులను నిర్విరామంగా సాధించడం, నియంత్రణా వాతావరణాన్ని అందుబాటులో ఉంచడం, ఏఐ, సామర్థ్యాల పెంపు, సంస్థాగత సంసిద్ధత వంటి సాధనాలను ఉపయోగించు కోవడం వంటివి ప్రధానాంశాలుగా ఉన్నాయి. భారతదేశంలోని అనేక నగరాలు వినూత్న ఆదాయ వనరుల సృష్టి, పెట్టుబడి అవకాశాలు సుసాధ్యమని నిరూపించాయి. మధ్య ప్రదేశ్లోని రేవా మునిసిపల్ కార్పొరేషన్ (ఆర్ఎంసీ) మౌలిక సదు పాయాల కోసం సగటున ఏటా రూ. 350 కోట్లు ఖర్చు చేస్తోంది. ఇందులో కేవలం 34 శాతం మాత్రమే మున్సిపాలిటీ సొంత ఆదాయ వనరుల నుండి వస్తుంటే, మిగిలినది కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుండి వివిధ పథకాలు మరియు గ్రాంట్ల ద్వారా సమకూరుతోంది. మౌలిక వసతులకు సొంత ఆదాయం నుండి ఇంత తక్కువ మొత్తంలో ఖర్చు చేస్తున్నప్పటికీ, పట్టణ భూభాగపు రీ–డెన్సిఫికేషన్ ఆధారంగా వ్యూహ్మాత్మక పట్టణ ప్రణాళికతో న్యూ రేవా బస్ స్టాండ్ వంటి మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను పీపీపీ(ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యం) విధానం ద్వారా విజయవంతంగా అమలు చేసింది. న్యూ రేవా బస్ స్టాండ్ ప్రాజెక్టులో 3.5 ఎకరాల ఖాళీ ప్రదేశాన్ని వాణిజ్య సము దాయంతో కూడిన బస్ స్టాండ్గా తీర్చిదిద్దడం ద్వారా, మున్సిపా లిటీకి రూ. 10.5 కోట్ల ప్రీమియంతో పాటు, ఏడాదికి రూ. 35 లక్షల అద్దె లభిస్తోంది. భారతదేశంలోని ఇతర నగరాలు కూడా పట్టణ మౌలిక సదు పాయాలను అభివృద్ధి చేసుకోవడానికి వినూత్న ఆదాయ నమూనా లను విజయవంతంగా వినియోగించుకుంటున్నాయి. గ్రేటర్ విశాఖ పట్నం మున్సిసిపల్ కార్పొరేషన్ (జీవీఎంసీ) వ్యర్థ జలాలను శుద్ధి చేసి ప్రైవేట్ రంగ భాగస్వామ్యంతో పరిశ్రమల వినియోగానికి నీటిని సరఫరా చేయడం ద్వారా ఏటా సుమారు రూ. 30 కోట్ల అదనపు ఆదాయాన్ని ఆర్జిస్తోంది. ప్రాజెక్టు నిధుల కోసం జీవీఎంసీ పన్నుల వసూళ్లు, సేవా పంపిణీ ప్రమాణాలను స్థిరంగా ప్రదర్శించడం ద్వారా రుణ అర్హతలను మెరుగుపరుచుకుని ‘ఏఏ’ క్రెడిట్ రేటింగ్ను సాధించింది. అదే విధంగా సూరత్ నగరం కూడా పారిశ్రామిక పునర్వి నియోగం కోసం శుద్ధి చేసిన వ్యర్థ నీటిని విక్రయించడం ద్వారా 2022 ఆర్థిక సంవత్సరంలో రూ.140 కోట్ల కొత్త ఆదాయ వనరులను సృష్టించుకుంది. స్థిరమైన ఆర్థిక వనరుల సేకరణలో పేరుగాంచిన ఘజియాబాద్ భారతదేశంలో రూ. 150 కోట్ల మున్సిపల్ గ్రీన్ బాండ్లను విడుదల చేసిన మొదటి యూఎల్బీ (అర్బన్ లోకల్ బాడీ)గా నిలిచింది. మెరుగైన పట్టణ ప్రణాళిక, వినూత్న ఆర్థిక నమూనాల ద్వారా మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేసుకుని తమ పౌరుల జీవితాలను మెరుగుపరచడానికి చిన్న నగరాలు కూడా ప్రైవేటు పెట్టుబడిదారులను ఆకర్షించ గలవని పైన పేర్కొన్నవి ఉదాహరణగా నిలుస్తున్నాయి. జీ20 వెలువరించిన పత్రాలు నాణ్య మైన మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేసుకోవడానికి మన నగరాలకు మార్గ దర్శకంగా ఉపయోగపడుతుంటే, భారత దేశ అనుభవాలు ప్రపంచ మౌలిక సదు పాయాల ఎజెండాను నిర్దేశించడానికి ఇతోధికంగా దోహదపడుతున్నాయి. అటల్ మిషన్ ఫర్ రీజువనేషన్ అండ్ అర్బన్ ట్రాన్స్ఫార్మేషన్ (అమృత్), స్మార్ట్ సిటీస్ మిషన్, హౌసింగ్ ఫర్ ఆల్ (పీఎంఎవై), మెట్రో రైల్ ప్రాజెక్టులు, ట్రాన్సిట్ ఓరియెంటెడ్ డెవలప్మెంట్, స్మార్ట్ సిటీ మిషన్ లో ఇంటిగ్రేటెడ్ కంట్రోల్ అండ్ కమాండ్ సెంటర్లు, వివిధ నగరాలు జారీ చేసిన మునిసిపల్ బాండ్లు, 2018లో రూపొందించిన భారతదేశ నేషనల్ అర్బన్ పాలసీ ఫ్రేమ్వర్క్ (ఎన్యూపీఎఫ్) అమలు నుండి నేర్చుకున్న పాఠాలు... గ్రూపు ఆలోచనలను సుసంపన్నం చేశాయి. అలాగే వాటిని పరస్పరం పంచుకోవడం వివిధ దశలలో అభివృద్ధిలో ఉన్న నగరాల ఆకాంక్షలకు అనుగుణంగా సుస్థిర ఆర్థిక వనరుల సమీకరణకు ఇతర మార్గాలను ఉపయోగించుకునేందుకు మార్గదర్శకంగా నిలిచాయి. సుస్థిర ఆర్థిక వనరుల సమీకరణకు ఇతర మార్గాలను ఉపయోగించుకునే దిశగా ముందుకు వెళ్లడానికి భారతీయ నగరాలు తమ సంస్థాగత సామర్థ్యాన్ని పెంపొందించుకోవడం, డిజిటైజ్డ్ అకౌంటింగ్ వ్యవస్థను అవలంబించడం, పెట్టుబడి పెట్టదగిన ప్రాజెక్టుల పైప్ లైన్ను కలిగి ఉండటం, వాటి విశ్వసనీయత, ఆదాయ సేకరణ సామర్థ్యాన్ని మెరుగుపరుచుకోవడం అత్యవసరం. పట్టణ మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల వైపు ప్రైవేట్ మూలధనాన్ని ఆకర్షించడానికి అనుకూలమైన వాతావరణాన్ని సృష్టించడం, పట్టణ మౌలిక సదుపాయాల అభివృద్ధిని వేగవంతం చేయడంలో ఈ పరివర్తన కీలకం. సోలమన్ ఆరోక్యరాజ్ వ్యాసకర్త జాయింట్ సెక్రటరీ, కేంద్ర ఆర్థిక శాఖ, భారత ప్రభుత్వం (వ్యాసంలోని అభిప్రాయాలు రచయిత వ్యక్తిగతం) -
Chhattisgarh elections 2023: సంక్షేమం X మౌలికం
ఛత్తీస్గఢ్లో ఈసారి అసెంబ్లీ ఎన్నికలను పాలక కాంగ్రెస్ సంక్షేమ పథకాలకు, బీజేపీ మౌలిక సదుపాయాల వాగ్దానాలకు మధ్య పోరుగా భావిస్తున్నారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో దాదాపుగా స్వీప్ చేసిన కాంగ్రెస్, మళ్లీ అదే ఫలితాన్ని పునరావృతం చేయాలని పట్టుదలగా ఉంది. దక్షిణాదిలో కీలకమైన కర్ణాటకలో ఇటీవలే బీజేపీ నుంచి అధికారాన్ని కాంగ్రెస్ చేజిక్కించుకోవడం తెలిసిందే. ప్రస్తుతం ఎన్నికలు జరుగుతున్న ఐదు రాష్ట్రాల్లో ఛత్తీస్గడ్తో పాటు రాజస్తాన్లో కూడా ఆ పార్టీ అధికారంలో ఉంది. అక్కడ కాస్త కష్టమేనన్న అంచనాల నేపథ్యంలో ఛత్తీస్గఢ్ను ఎలాగైనా నిలుపుకోవాలని పట్టుదలగా ఉంది. అందుకే ఇప్పటికే అమల్లో ఉన్నవాటికి తోడుగా మరెన్నో సంక్షేమ పథకాలను సీఎం భూపేశ్ భగేల్ ప్రకటిస్తున్నారు. మరోవైపు చిరకాలం పాటు తమ పాలనలో ఉన్న రాష్ట్రాన్ని గత ఎన్నికల్లో కాంగ్రెస్కు కోల్పోయిన నేపథ్యంలో ఈసారి ఎలాగైనా సత్తా చాటాలని బీజేపీ పట్టుదలగా ఉంది. అందుకే ప్రధాని నరేంద్ర మోదీ కొంతకాలంగా తరచూ రాష్ట్రంలో పర్యటిస్తున్నారు. పుంఖానుపుంఖాలుగా మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను ప్రకటిస్తున్నారు. వాటితో రాష్ట్ర భాగ్యరేఖలే మారతాయని, యువతకు భారీగా ఉపాధి దొరుకుతుందని చెబుతూ ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఈ రెండు పారీ్టల ప్రచారంలో ఓటరు దేనికి జై కొడతాడో చూడాలి... బీజేపీ బలాలు... ► ఇతర అంశాలు ఎన్నున్నా అన్నింటి కంటే ప్రధానమైనది ఎప్పట్లాగే హిందుత్వ కార్డే. కాకుంటే ఈ విషయంలో గ్రామీణ ఓట్లను ఈ మేరకు సంఘటితం చేస్తుందన్నది ఈసారి కీలకం కానుంది. ► 15 ఏళ్ల వరుస పాలనలో చేసిన అభివృద్ధిని కూడా కమలదళం బాగానే ప్రచారం చేస్తోంది. ► కాంగ్రెస్ ఐదేళ్ల పాలనలో అవినీతిలో కూరుకుపోయిందని గట్టిగా ప్రచారం చేస్తోంది. ► అయితే గతంలో రమణ్సింగ్లా ఈసారి బీజేపీ సీఎం అభ్యరి్థగా ఎవరినీ ప్రచారం చేయడం లేదు. ఇది కాస్త ప్రభావం చూపే అంశమేనని అంటున్నారు. అభివృద్ధే కాంగ్రెస్ మంత్రం ► బీజేపీ హిందూత్వ వాదానికి కౌంటర్గా రాష్ట్ర కాంగ్రెస్ కొంతకాలంగా ఉదారవాద హిందూత్వ గళం వినిపిస్తోంది. ఇది కొంతవరకు కలిసొస్తుందని భావిస్తోంది. ► సీఎం భగేల్ ఓబీసీ నేత కావడం ఆ సామాజికవర్గంలో తమ ఓట్లను మరింత సంఘటితపరుస్తుందని ఆశిస్తోంది. ► పేదలకు, రైతులకు అనుకూలంగా అమలు చేస్తున్న పలు పథకాలు ఈసారి కచి్చతంగా గట్టెక్కిస్తాయని భగేల్ నమ్ముతున్నారు. ► వీటికి తోడు ఛత్తీస్గఢ్ ఆత్మగౌరవాన్ని ఇటీవలి కాలంలో పదేపదే తెరపైకి తెస్తున్నారు. తద్వారా ఓటర్లను ఆకట్టుకోజూస్తున్నారు. ► అయితే అవినీతి ప్రచారం, ఎమ్మెల్యేలపై వ్యతిరేకత కాంగ్రెస్కు ప్రతికూలంగా మారేలా కనిపిస్తున్నాయి. బరిలోకి గిరిజన పార్టీ ఛత్తీస్గఢ్లో ఆదివాసీ సంఘాల సమాహారమైన సర్వ ఆదివాసీ సమాజ్ ఇటీవలే హమార్ రాజ్ పేరుతో రాజకీయ పారీ్టగా మారింది. ఒకనాటి కాంగ్రెస్ నేత అరవింద్ నేతం సారథ్యంలో ఎన్నికల బరిలో దిగుతోంది. ఫక్తు గిరిజన ఆచార వ్యవహారాలకు కట్టుబడి పని చేస్తామనే హామీతో దూసుకెళ్తోంది. రాష్ట్రంలో సంఖ్యాధికులైన గిరిజనుల్లో ఇది గట్టిగా ప్రభావం చూపితే అది బీజేపీ, కాంగ్రెస్ల్లో దేన్ని దెబ్బ తీస్తుందన్నది ఆసక్తికరం. కీలకాంశాలు ► వరికి సరైన మద్దతు ధర కావాలని రైతులు ఎంతోకాలంగా డిమాండ్ చేస్తున్నారు. క్వింటాలుకు రూ.2,500 మద్దతు ధర చెల్లిస్తామన్న 2018 నాటి హామీని భగేల్ సర్కారు నెరవేర్చలేదని ఆగ్రహంగా ఉన్నారు. ► కాంగ్రెస్ తరఫున సీఎం భగేల్ అన్నీ తానై నడిపిస్తున్నారు. అయితే పారీ్టలో అసమ్మతులు ఆయనకు తలనొప్పిగా మారారు. ► డిప్యూటీ సీఎం కేపీ సింగ్దేవ్ రూపంలో భగేల్కు సొంత పారీ్టలోనే గట్టి ప్రత్యర్థి పొంచి ఉన్నారు. ► ఇక బీజేపీకి ఇప్పటికీ మాజీ సీఎం రమణ్ సింగే రాష్ట్రంలో ఏకైక పెద్ద దిక్కు. 15 ఏళ్లు పాలించిన నేతగా ఈసారి తన అనుభవాన్నంతా రంగరిస్తున్నారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
‘నిర్మాణ పరికరాల’ ఆదాయం 15 శాతం అప్
న్యూఢిల్లీ: దేశీయంగా నిర్మాణ పరికరాల రంగం ఆదాయం 2023–24 ఆర్థిక సంవత్సరంలో 14–15 శాతం మేర వృద్ధి చెందనుంది. మౌలికరంగంపై కేంద్ర ప్రభుత్వం ప్రధానంగా దృష్టి పెడుతుండటం ఇందుకు దోహదపడనుంది. అలాగే, రియల్ ఎస్టేట్, మైనింగ్ రంగాల్లో కార్యకలాపాలు పుంజుకోవడం కూడా తోడ్పాటు అందించనుంది. క్రిసిల్ రేటింగ్స్ ఒక నివేదికలో ఈ మేరకు అంచనా వేసింది. ‘‘గత ఆర్థిక సంవత్సరంలో అధిక బేస్ (29 శాతం) ప్రాతిపదికన ఈ ఆర్థిక సంవత్సరంలో దేశీ నిర్మాణ పరికరాల రంగం ఆదాయం 14–15 శాతం మేర వృద్ధి చెందవచ్చు. నేషనల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైప్లైన్ (ఎన్ఐపీ)తో పాటు రహదారులు, మెట్రోలు, రైల్వేలు మొదలైన మౌలిక సదుపాయాల కల్పనపై ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి పెట్టడం ఇందుకు దోహదపడనుంది’’ అని క్రిసిల్ రేటింగ్స్ పేర్కొంది. సాధారణంగా నిర్మాణ పరికరాల వినియోగంలో రహదారుల వాటా 40 శాతం వరకు ఉంటుంది. రోడ్ల నిర్మాణం పనులు వేగవంతం అవుతుండటం పరిశ్రమ వృద్ధికి సహాయకరంగా ఉండనుంది. వంతెనలు.. విమానాశ్రయాలూ.. రియల్ ఎస్టేట్, మైనింగ్ రంగాలతో పాటు వంతెనలు, విమానాశ్రయాలు, మెట్రో కారిడార్లు మొదలైన వాటి కాంట్రాక్టర్ల నుంచి తయారీ సంస్థలకు ఆర్డర్లు బాగా ఉంటున్నాయని క్రిసిల్ రేటింగ్స్ డైరెక్టర్ పూనమ్ ఉపాధ్యాయ్ తెలిపారు. 2024 ఏప్రిల్ 1 నుంచి పరిశ్రమ స్టేజ్–వీ2 ఉద్గార ప్రమాణాలకు మళ్లనుండటం వల్ల పరికరాల ధరలు పెరగనుండటంతో ఈ ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో పరికరాలను ముందుగానే కొంత కొని పెట్టుకునే ధోరణులు కూడా కనిపించవచ్చని వివరించారు. పరిమాణంపరంగా చూస్తే గత ఆర్థిక సంవత్సరంలో 1.1 లక్షల యూనిట్ల అమ్మకాలు నమోదు కాగా .. ఈ ఆర్థిక సంవత్సరం ఆల్ టైమ్ గరిష్టంగా 1.2 లక్షల యూనిట్ల స్థాయిలో విక్రయాలు నమోదు కావచ్చని అంచనా వేస్తున్నట్లు నివేదిక పేర్కొంది. గత ఆర్థిక సంవత్సరంలో మొత్తం అమ్మకాల పరిమాణంలో ఎర్త్మూవింగ్ పరికరాల వాటా 70 శాతంగా, కాంక్రీట్ పరికరాల వాటా 22 శాతంగా ఉండగా.. మిగతాది మెటీరియల్ ప్రాసెసింగ్ పరికరాలది ఉన్నట్లు వివరించింది. -
రూ.1,712.21 కోట్ల ప్రాధాన్యత పనులు మంజూరు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా గ్రామ, వార్డు సచివాలయాల పరిధిలో మంత్రులు, ఎమ్మెల్యేలు గుర్తించిన ప్రాధాన్యత పనుల్లో ఇప్పటికే రూ.537.77 కోట్ల విలువైన పనులు పూర్తయ్యాయి. రాష్ట్రంలో 175 నియోజకవర్గాల్లోని 15,004 సచివాలయాల పరిధిలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో మౌలిక సదుపాయాల అంతరాలను గుర్తించి ప్రాధాన్య పనులుగా చేపడుతున్నారు. మంత్రులు, ప్రజాప్రతినిధులు తమ తమ నియోజకవర్గ పరిధిలోని సచివాలయాలను సందర్శిస్తున్న సందర్భంగా ఒక్కో సచివాలయ పరిధిలో అత్యంత ప్రాధాన్యత గల పనుల కోసం రూ.20 లక్షల చొప్పున రూ.3000 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసింది. పూర్తయిన పనులకు బిల్లులూ చెల్లిస్తోంది. ఇప్పటి వరకు 9,381 సచివాలయాల పరిధిలో గుర్తించిన రూ.1,876.20 కోట్ల విలువైన 50,117 పనులను పోర్టల్లో అప్లోడ్ చేశారు. ఇందులో ఇప్పటికే 8,562 సచివాలయాల పరిధిలో రూ.1,712.21 కోట్ల విలువైన 43,685 ప్రాధాన్యత పనులు మంజూరు చేయగా.. 7,702 సచివాలయాల పరిధిలో 39,089 పనులను ప్రారంభించారు. పనులను పోర్టల్లో అప్లోడ్ చేయడం, వాటిని వెంటనే మంజూరు చేయడం, అనంతరం వాటిని ప్రారంభించడం నిరంతర ప్రక్రియగా కొనసాగుతోంది. ఈ విషయంలో వెనుకబడిన జిల్లాల్లో కలెక్టర్లు సమీక్షించి త్వరగా పనులు మంజూరు చేయించి, ప్రారంభింపజేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.కేఎస్ జవహర్రెడ్డి ఆదేశించారు. అత్యంత ప్రాధాన్యత పనుల పురోగతిపై ఎప్పటికప్పుడు పోర్టల్లో అప్లోడ్ చేయాలని ఇంజనీరింగ్ అసిస్టెంట్లు, ఎంపీడీవోలను రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. -
ఏపీ బాటలో కేంద్రం..
సాక్షి, అమరావతి: ఏపీలో మాదిరిగానే గ్రామస్థాయిలో మౌలిక సదుపాయాల కల్పనకు కేంద్రం కూడా నడుంబిగించింది. ఆర్బీకేలకు అనుబంధంగా గోదాములతో పాటు పెద్దఎత్తున మౌలిక సదుపాయాలను రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తున్నట్లుగానే కేంద్రం కూడా ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాల (పీఏసీఎస్)కు అనుబంధంగా వసతుల కల్పనకు కార్యాచరణ సిద్ధంచేసింది. ఇందులో భాగంగా సహకార రంగంలో ప్రపంచంలోనే అతిపెద్ద ఆహార ధాన్యాల నిల్వ, మౌలిక వసతుల కల్పన ప్రాజెక్టు (వరల్డ్స్ లార్జెస్ట్ గ్రెయిన్ స్టోరేజ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టు)కు శ్రీకారం చుట్టింది. ఈ ప్రాజెక్టు కింద తొలిదశలో దేశవ్యాప్తంగా 12 రాష్ట్రాల్లో 12 ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాల (పీఏసీఎస్)ను ఎంపిక చేసింది. ఈ ప్రాజెక్టు కింద పీఏసీఎస్ స్థాయిలో గోదాముతో పాటు అత్యాధునిక రైస్మిల్లు, ఇతర మౌలిక సదుపాయాలు కల్పించనుంది. ఇందుకోసం రాష్ట్రంలో పశ్చిమగోదావరి జిల్లా ఆచంటలోని మృత్యుంజయ సహకార సమితి పీఏసీఎస్ను ఎంపిక చేశారు. సొసైటీ ఆదాయ, వ్యయాల ఆధారంగా ఈ పీఏసీఎస్కు అన్ని విధాలుగా వయబులిటీ ఉందని గుర్తించి దీనిని ఎంపిక చేశారు. డీపీఆర్ తయారీ.. ఇక జాతీయస్థాయిలో ఇంప్లిమెంటింగ్ ఏజెన్సీగా వ్యవహరిస్తున్న నాబ్స్కాన్ ఈ ప్రాజెక్టు కోసం డిటైల్డ్ ప్రాజెక్టు రిపోర్టు (డీపీఆర్) తయారుచేసింది. ఈ బృందం ఇటీవలే ఆచంట పీఏసీఎస్ను సందర్శించి సంతృప్తి కూడా వ్యక్తంచేసింది. ప్రాజెక్టు కోసం ఎంపిక చేసిన రెండెకరాల భూమిలో సాయిల్ టెస్టింగ్ చేశారు. ఇక ఈ ప్రాజెక్టు కింద.. ► రూ.2.14 కోట్ల అంచనాతో ఆహార ధాన్యాల నిల్వకోసం అత్యాధునిక మౌలిక సదుపాయాలను కల్పించబోతున్నారు. ► రూ.86.20 లక్షల అంచనా వ్యయంతో.. 500 మెట్రిక్ టన్నుల సామర్థ్యంతో అత్యాధునిక సౌకర్యాలతో కూడిన గోదాము నిర్మిస్తారు. ► రూ.1,12,86,000 అంచనా వ్యయంతో గంటకు రెండు టన్నుల సామర్థ్యంతో కూడిన అత్యాధునిక కలర్ సార్టెక్స్ రైస్మిల్ను నిర్మిస్తారు. ► ఏన్సలరీ, సపోర్టింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కింద రూ.14.06 లక్షల అంచనాతో విద్యుత్, అగ్నిమాపక సౌకర్యాలు కల్పిస్తారు. ► అంతేకాక.. పీఏసీఎస్కు ప్రత్యేకంగా కస్టమ్ హైరింగ్ సెంటర్ కింద రూ.1.18 లక్షల అంచనాతో డ్రోన్ను కూడా సమకూరుస్తారు. ► ఈ ప్రాజెక్టు కింద చేపట్టే వ్యయంలో 20% (రూ.42.86 లక్షలు) సొసైటీ సమకూర్చుకుంటే, మిగిలిన 80% (రూ.171.44 లక్షలు) ఆప్కాబ్ ద్వారా ప్రభుత్వం రుణం సమకూరుస్తుంది. ► ఈ ప్రాజెక్టుకు ఆగస్టు మూడో వారంలో శంకుస్థాపన చేస్తారు. నవంబరు నెలాఖరుకల్లా పూర్తిచేయాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నారు. ఏపీ బాటలోనే.. ఏపీ బాటలోనే పీఏసీఎస్ స్థాయిలో పెద్ద ఎత్తున మౌలిక సదుపాయాలు కల్పించాలన్న సంకల్పంతో కేంద్రం ఈ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టింది. దీనికి∙ఆచంట పీఏసీఎస్ను ఎంపిక చేసింది. ఇక్కడ రూ.2.14 కోట్లతో గోదాము, రైసుమిల్లు, ఇతర వసతులు కల్పిస్తారు. – అహ్మద్ బాబు, కమిషనర్, సహకార శాఖ -
డిజిటల్ పత్రాలకు కొత్త ప్లాట్ఫామ్ ‘ఈక్వల్’.. ఆవిష్కరించిన జీవీకే
న్యూఢిల్లీ: వ్యాపార దిగ్గజం జీవీకే గ్రూప్ వైస్ చైర్మన్ సంజయ్ రెడ్డి కుమారుడు కేశవ్ రెడ్డి కొత్తగా ఈక్వల్ పేరిట ప్రత్యేక ప్లాట్ఫామ్ను ఆవిష్కరించారు. కేంద్ర ప్రభుత్వానికి చెందిన డిజిలాకర్, పబ్లిక్ డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇండియా స్టాక్ భాగస్వామ్యంతో దీన్ని రూపొందించారు. యూజర్లు తమ డిజిటల్ పత్రాలను భద్రపర్చుకునేందుకు, ఒక్క క్లిక్తో సురక్షితంగా, నిరాటంకంగా షేర్ చేసేందుకు ఇది ఉపయోగపడుతుంది. ఇందులో సుమారు 10 లక్షల బీటా యూజర్లు ఉన్నారని కేశవ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. రెడ్డి వెంచర్స్, అరాజెన్ లైఫ్ సైన్సెస్, హెల్త్కేర్ ఫౌండేషన్ జీవీకే ఏఎంఆర్ఐ బోర్డుల్లో ఆయన సభ్యుడిగా ఉన్నారు. -
ఇక్రా రేటింగ్స్ ఫలితాలు ఆకర్షణీయం
ముంబై: దేశీయంగా రెండో అతిపెద్ద రేటింగ్ ఏజెన్సీ ‘ఇక్రా రేటింగ్స్’ జూన్తో ముగిసిన త్రైమాసికానికి సంబంధించి ఆకర్షణీయమైన ఫలితాలను ప్రకటించింది. నికర లాభం క్రితం ఏడాది ఇదే కాలంతో పోలిస్తే 88 శాతం వృద్ధితో రూ.40.6 కోట్లకు చేరుకుంది. ఆదాయం 11 శాతం వృద్ధితో రూ.103 కోట్లకు చేరింది. రేటింగ్ ఆదాయం 16 శాతం పెరిగింది. అనలైటిక్స్ విభాగంలో ఆదాయ వృద్ధి 4.4 శాతంగా ఉంది. క్రెడిట్ మార్కెట్లో సందడి నెలకొందని, బాండ్ల ఇష్యూలు, బ్యాంక్ క్రెడిట్ విభాగాల్లో మంచి వృద్ధి కనిపించినట్టు ఇక్రా రేటింగ్స్ తెలిపింది. గతేడాది ఇదే త్రైమాసికంలో లోబేస్ (క్షీణత) ఉండడం, ఈల్డ్ మోస్తరుగా ఉండడం బలమైన పనితీరుకు దోహదపడినట్టు వివరించింది. సవాళ్లతో కూడిన వాతావరణంలోనూ అనలైటిక్స్ వ్యాపారం వృద్ధి సాధించిందని, ఈ విభాగంపై తాము ప్రధానంగా దృష్టి సారిస్తున్నట్టు ఇక్రా రేటింగ్స్ ఎండీ రామ్నాథ్ కృష్ణన్ పేర్కొన్నారు. జూన్ త్రైమాసికంలో పరిశోధను విస్తరించామని, మౌలిక సదుపాయాలు, రోడ్లు, జాతీయ రహదారులు, స్టీల్, బ్యాంకింగ్ రంగాలపై ప్రధానంగా దృష్టి సారించినట్టు తెలిపారు. -
రూ 650 కోట్లతో కడప స్టీల్ ప్లాంట్ కు మౌలిక వసతులు
-
రూ.650 కోట్లతో కడప స్టీల్కు మౌలిక వసతులు
సాక్షి, అమరావతి: రాయలసీమ రూపు రేఖలను మార్చే కడప స్టీల్ ప్లాంట్కు రాష్ట్ర ప్రభుత్వం రూ.650 కోట్లతో కీలక మౌలిక వసతులు కల్పిస్తోంది. వైఎస్సార్ జిల్లా సున్నపురాళ్లపల్లి వద్ద రూ.8,800 కోట్లతో జేఎస్డబ్ల్యూ ఏర్పాటు చేయనున్న ఈ స్టీల్ ప్లాంట్లో వాణిజ్య ఉత్పత్తిని ప్రారంభించేలోగా.. రహదారులు, రైల్వే, విద్యుత్, నీటి సరఫరా తదితర కీలక మౌలిక వసతులను ప్రభుత్వం అందుబాటులోకి తీసుకురానుంది. ప్లాంట్ను ఎన్హెచ్67కు అనుసంధానిస్తూ సుమారు రూ.90 కోట్లతో నాలుగు లేన్ల రహదారిని ఏర్పాటు చేస్తోంది. తొలి దశలో రెండు లేన్ల రహదారిగా నిర్మించి రెండో దశ నాటికి నాలుగు లేన్ల రహదారిగా అభివృద్ధి చేయనుంది. ఇప్పటికే రెండు లేన్ల రహదారి నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయి. ఈ ఏడాది చివరి నాటికి దీన్ని అందుబాటులోకి తీసుకురావాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు. అలాగే ఎర్రగుంట్ల–నంద్యాల ప్రధాన రైల్వే లైన్కు ప్లాంట్ను అనుసంధానిస్తూ రూ.324 కోట్ల వ్యయంతో రైల్వే లైన్ నిర్మించనున్నారు. దీనికి సంబంధించిన నివేదికను ఇప్పటికే రైల్వే శాఖకు అందించగా.. ఆ శాఖకు చెందిన అధికారులు వచ్చి సర్వే పూర్తి చేశారు. ఈ రైల్వే లైన్ నిర్మాణానికి ఈ నెలలో సూత్రప్రాయ ఆమోదం లభిస్తుందని అధికారులు భావిస్తున్నారు. అలాగే ప్లాంట్కు విద్యుత్ సరఫరా కోసం రూ.64.56 కోట్లతో 400 కేవీ/200 కేవీ సబ్స్టేషన్ను ఏర్పాటు చేయనున్నారు. ప్లాంట్కు అవసరమైన రెండు టీఎంసీల నీటిని ఆర్టీపీపీ నుంచి పైప్లైన్ ద్వారా తీసుకెళ్లడానికి రూ.127 కోట్ల వ్యయం అవుతుందని అంచనా వేశారు. అనుమతి రాగానే నిర్మాణ పనులు ప్రారంభం జేఎస్డబ్ల్యూ ప్లాంట్ నిర్మాణానికి సీఎం వైఎస్ జగన్ ఫిబ్రవరి 15న శంకుస్థాపన చేశారు. ప్లాంట్ నిర్మాణ పనులను ప్రారంభించడానికి అవసరమైన కేంద్ర పర్యావరణ అనుమతులు కోసం జేఎస్డబ్ల్యూ ఎదురుచూస్తోంది. గతంలో వైఎస్సార్ స్టీల్ కార్పొరేషన్ లిమిటెడ్ పేరు మీద జారీ చేసిన ఉత్తర్వులను.. ఈ ప్లాంట్ కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక కంపెనీ జేఎస్డబ్ల్యూఏపీఎస్ఎల్ పేరు మీదకు మార్చాలంటూ కేంద్ర పర్యావరణ శాఖకు లేఖ రాశామని అధికారులు చెప్పారు. ఆ పని పూర్తవ్వగానే నిర్మాణ పనులు ప్రారంభమవుతాయని అధికారులు తెలిపారు. అలాగే గ్రీన్ హైడ్రోజన్ ఆధారంగా 2.5 మిలియన్ టన్నుల కెపాసిటీతో డైరెక్ట్ రెడ్యూస్డ్ ఐరన్ ప్లాంట్, ఏడాదికి 4 మిలియన్ టన్నుల కెపాసిటీతో పెల్లెట్ ప్లాంట్, 1,000 మెగావాట్ల ఎలక్ట్రోలైజర్ ప్లాంట్ ఫర్ డీఆర్ఐ ప్లాంట్, 3,000 మెగావాట్ల పునరుత్పాదక ఇంధన ఉత్పత్తి యూనిట్ల ఏర్పాటుకు జేఎస్డబ్ల్యూ ఆసక్తి వ్యక్తం చేసింది. వీటికి సంబంధించిన సమగ్ర ప్రాజెక్టు నివేదికలు రాగానే వీటిపై కూడా తగు నిర్ణయం తీసుకుంటామని పరిశ్రమల శాఖ అధికారులు వెల్లడించారు. -
రూపు మారిన పురాలు
సాక్షి, హైదరాబాద్: తొమ్మిదేళ్లలో తెలంగాణలోని పట్టణాల అభివృద్ధిలో గణనీయమైన మార్పు వచ్చిందని రాష్ట్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కె.తారక రామారావు చెప్పారు. పురపాలక శాఖ ద్వారా రూ.1.21 లక్షల కోట్లు ఖర్చు చేసినట్లు తెలిపారు. రాష్ట్రానికి వస్తున్న ఆదాయంలో 70% పట్టణాల నుంచేనని, ఈ నేపథ్యంలో పట్టణాల్లో మౌలిక వసతుల కల్పన కోసం అప్పులు తెచ్చినట్లు తెలిపారు. మౌలిక వసతుల కోసం తెచ్చే అప్పులు భవి ష్యత్తు పెట్టుబడేనని ఆయన పేర్కొన్నారు. బుధవారం మెట్రోరైల్ భవన్లో జరిగిన కార్యక్రమంలో తొమ్మిదేళ్లలో పురపాలక శాఖ అభివృద్ధి నివేదిక, ఎంఏయూడీ వార్షిక నివేదికను మంత్రి విడుదల చేశారు. పట్టణాల అభివృద్ధిపై 2014 మొదలుకుని ప్రతి ఏటా ప్రగతి నివేదికను విడుదల చేస్తున్నామని, ఈసారి దశాబ్ది నివేదిక పేరిట 2014 నుంచి సాధించిన ప్రగతిని అందులో పొందుపరిచినట్లు తెలిపారు. గత పదేళ్లలో 462 శాతం ఎక్కువ వ్యయం 2004 నుంచి 2014 వరకు పట్టణాల్లో మౌలిక వసతుల కోసం చేసిన రూ.26,211.50 కోట్ల ఖర్చుతో పోలిస్తే.. గత పదేళ్లలో 462 శాతం ఎక్కువ వెచ్చించామన్నారు. ప్రభుత్వం ఖర్చు చేసిన రూ.1,21,294 కోట్లలో రూ. 1,11,360 కోట్లు రాష్ట్ర ప్రభుత్వ నిధులు కాగా, కేవలం రూ.9,934 కోట్లు మాత్రమే కేంద్ర ప్రభుత్వ నిధులని తెలిపారు. అన్ని రంగాలలో గతంలో కంటే అనేక రెట్లు ఎక్కువ ఖర్చు చేశామని, మౌలిక వసతుల కల్పనలో గణనీయమైన వృద్ధి సాధించామని, ఇందులో భాగంగానే 26 మున్సిపాలిటీలకు కేంద్రం అవార్డులు ఇచ్చిందని చెప్పారు. అధిక శాతం జీహెచ్ఎంసీ పరిధిలోనే.. పదేళ్లలో పట్టణాల్లో మౌలిక సదుపాయాల కోసం చేసిన వేల కోట్ల వ్యయంలో అధిక భాగం జీహెచ్ఎంసీ పరిధిలోనే జరిగిందని కేటీఆర్ వివరించారు. 2004–14 కాలంలో రూ.4,636.38 కోట్లు వెచ్చిస్తే, 2014–23 మధ్య కాలంలో రూ.44,021.99 కోట్లు వెచ్చించామని, ఇది దాదాపు 850 శాతం అధికమని అన్నారు. ౖఈ మధ్య కాలంలో జీహెచ్ఎంసీ ఎస్ఆర్డీపీ, సీఆర్ఎంపీ, హెచ్ఆర్డీసీ, ఎస్ఎన్డీపీ వంటి ప్రత్యేక వ్యవస్థలను ఏర్పాటు చేసి ప్రణాళికా బద్ధంగా మౌలిక సదుపాయాల అభివృద్ధికి కృషి చేస్తోందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం నిధులు ఇవ్వడం వల్లనే ఇది సాధ్యమైందని చెప్పారు. ఎస్ఆర్డీపీ ద్వారా సుమారు 35 ఫ్లై ఓవర్లు నిర్మించామని, కానీ ఉప్పల్, అంబర్పేట ఫ్లై ఓవర్లను నేషనల్ హైవే అథారిటీ పూర్తి చేయలేక పోతోందని అన్నారు. మున్సిపాలిటీల్లో రూ.238 కోట్లతో పనులు హైదరాబాద్ చుట్టూ ఉన్న మున్సిపాలిటీల్లో రూ.238 కోట్లతో 19 పనులు చేపట్టామని, అందులో ఏడు పనులు పూర్తి కాగా, మిగతావి కూడా వేగంగా జరిగేలా ఆదేశాలిచ్చినట్లు కేటీఆర్ తెలిపారు. నగరంలో ప్రధాన రహదారుల నాణ్యత పెరిగిందని, వరద ఇబ్బందులను తగ్గించేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. చెరువుల సుందరీకరణను పెద్ద ఎత్తున చేపట్టామని, ఎస్ఎన్డీపీ కింద నాలాలను అభివృద్ధి చేస్తున్నామని అన్నారు. గతంలో ముంపు వల్ల 150 కాలనీలు ఇబ్బంది పడేవని, ఎస్ఎన్డీపీ వల్ల ఈ బాధ తప్పిందని పేర్కొన్నారు. 2050 నాటికి నగరంలో తాగునీటి సమస్య లేకుండా ఏర్పాట్లు చేస్తున్నట్లు వివరించారు. ప్రజారవాణాను మెరుగుపర్చడంలో భాగంగా మెట్రో విస్తరణ, బస్సుల ఎలక్ట్రిఫికేషన్, పాతబస్తికీ మెట్రో కనెక్టివిటీ, భవిష్యత్తులో నిరంతర నీటి సరఫరా, నాలాల మరమ్మతు లాంటి కార్యక్రమాలు చేపట్టాల్సిన అవసరం ఉందని, ఈ దిశగా చర్యలు చేపట్టినట్లు వివరించారు. శామీర్పేట్, మేడ్చల్ వైపు డబుల్ డెక్కర్ స్కైవేలు కట్టనున్నట్లు చెప్పారు. మెట్రో రైళ్లలో రద్దీ పెరుగుతున్న నేపథ్యంలో కోచ్ల సంఖ్యను పెంచేందుకు ప్రయత్నం చేస్తున్నామన్నారు. -
పదేళ్లలో రూ. 20 వేల కోట్ల పెట్టుబడులు
న్యూఢిల్లీ: అదానీ టోటల్ గ్యాస్ (ఏజీటీఎల్) భారీ స్థాయిలో కార్యకలాపాలను విస్తరించనుంది. ఇందుకోసం వచ్చే 8–10 ఏళ్లలో రూ. 18,000 – రూ. 20,000 కోట్లు వెచ్చించనుంది. తద్వారా వాహనాలకు సీఎన్జీ, గృహాలు .. పరిశ్రమలకు పైపింగ్ గ్యాస్ సరఫరాకు అవసరమైన మౌలిక సదుపాయాలను పెంచుకోనుంది. కంపెనీ సీఎఫ్వో పరాగ్ పారిఖ్ ఈ విషయాలు తెలిపారు. సంస్థ వార్షిక నివేదికలో 2022–23 ఆర్థిక సంవత్సరంలో అదనంగా మౌలిక సదుపాయాల కల్పన కోసం రూ. 1,150 కోట్లు ఇన్వెస్ట్ చేసినట్లు ఆయన వివరించారు. దీర్ఘకాలిక దృష్టి కోణం నుంచి చూస్తే పర్యావరణ అనుకూల ఇంధనంగా గ్యాస్కు డిమాండ్ సానుకూలంగా ఉన్న నేపథ్యంలో మరింతగా పెట్టుబడులు పెట్టనున్నట్లు పారిఖ్ పేర్కొన్నారు. అదానీ గ్రూప్, ఫ్రెంచ్ సంస్థ టోటల్ఎనర్జీస్ కలిసి జాయింట్ వెంచర్గా అదానీ–టోటల్ను ఏర్పాటు చేశాయి. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 124 జిల్లాల్లో కంపెనీ కార్యకలాపాలు సాగిస్తోంది. 460 పైచిలుకు సీఎన్జీ స్టేషన్లు, 7 లక్షలకు పైగా పైప్డ్ కుకింగ్ గ్యాస్ కస్టమర్లు ఉన్నారు. 1,800 సీఎన్జీ స్టేషన్ల ఏర్పాటు.. వచ్చే 7–10 సంవత్సరాల్లో 1,800 పైచిలుకు సీఎన్జీ స్టేషన్లను ఏర్పాటు చేయనున్నట్లు ఏజీటీఎల్ సీఈవో సురేష్ పి.మంగ్లానీ తెలిపారు. మరి న్ని గృహాలకు పైప్డ్గ్యాస్ను అందించడంపై దృష్టి పెడుతున్నట్లు పేర్కొన్నారు. ప్రధానమైన గ్యాస్ సరఫరా వ్యాపారాన్ని పెంచుకోవడంతో పాటు .. బయోగ్యాస్, ఈవీ చార్జింగ్ తదితర విభాగాలను కూడా మరింతగా విస్తరించనున్నట్లు వివరించారు. ఈ–మొబిలిటీ కోసం అదానీ టోటల్ఎనర్జీస్ ఈ–మొబిలిటీ పేరిట అనుబంధ సంస్థను నెలకొలి్పనట్లు, ఇది ద్విచక్ర, త్రిచక్ర వాహనాలతో పాటు కార్లు, బస్సులు మొదలైన వాటి కోసం ఎలక్ట్రిక్ చార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేస్తున్నట్లు మంగ్లానీ చెప్పారు. ఇప్పటికే తమకు 26 ప్రాంతాల్లో 104 చార్జింగ్ పాయింట్లు ఉండగా, వీటిని 3,000కు పెంచుకోనున్నట్లు తెలిపారు. అటు మరో అనుబంధ సంస్థ అదానీ టోటల్ఎనర్జీస్ బయోమాస్ (ఏటీబీఎల్) దేశంలోనే అతి పెద్ద కంప్రెస్డ్ బయోగ్యాస్ (సీబీజీ) ప్లాంటును ఉత్తర్ప్రదేశ్ మథుర దగ్గర్లోని బర్సానాలో నెలకొల్పుతున్నట్లు మంగ్లానీ చెప్పారు. -
ఈ–టూవీలర్ల విస్తరణపై మరింత దృష్టి
న్యూఢిల్లీ: వాహనాల తయారీ దిగ్గజం హీరో మోటోకార్ప్ తమ ఎలక్ట్రిక్ టూవీలర్ల పోర్ట్ఫోలియోను మరింత విస్తరించడంపై దృష్టి పెట్టనుంది. అలాగే, తమ ప్రస్తుత సేల్స్ మౌలిక సదుపాయాలను మెరుగుపర్చుకోనుంది. కొత్త సీఈవోగా నియమితులైన నిరంజన్ గుప్తా కంపెనీ భవిష్యత్ ప్రణాళికలను ఈ మేరకు వివరించారు. ప్రీమియం సెగ్మెంట్లో (160–450 సీసీ) స్థానాన్ని పటిష్టం చేసుకోవడం, ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల విభాగంలో అగ్ర స్థానాన్ని దక్కించుకోవడంపై ప్రధానంగా దృష్టి పెట్టనున్నట్లు తెలిపారు. కంపెనీ చరిత్రలో ఎన్నడూ లేనంతగా ఈ ఏడాది పెద్ద సంఖ్యలో కొత్త ప్రీమియం వాహనాలను ప్రవేశపెట్టనున్నట్లు గుప్తా వివరించారు. మరింత మంది కస్టమర్లకు చేరువయ్యే దిశగా ఈ–టూవీలర్ల కేటగిరీలో కొత్తగా ఎంట్రీ–లెవెల్ మోడల్స్ను ప్రవేశపెట్టనున్నట్లు చెప్పారు. నియంత్రణపరమైన మార్పులతో (ఫేమ్ స్కీము కింద సబ్సిడీలను తగ్గించడంలాంటివి) ఈవీ స్టార్టప్ విభాగంలో కన్సాలిడేషన్కు అవకాశం ఉందని గుప్తా చెప్పారు. అటు 1,000 ప్రధాన డీలర్షిప్లలో 35–40 శాతం డీలర్షిప్లను దశలవారీగా అప్గ్రేడ్ చేసే యోచనలో ఉన్నట్లు ఆయన తెలిపారు. అంతర్జాతీయంగా మెక్సికో, నైజీరియా, బంగ్లాదేశ్, కొలంబియా వంటి 8–10 మార్కెట్లలో వ్యాపారాన్ని పటిష్టం చేసుకునేందుకు కసరత్తు చేయనున్నట్లు గుప్తా చెప్పారు. -
మందగించిన మౌలిక రంగాల వృద్ధి..
న్యూఢిల్లీ: క్రూడాయిల్, సహజ వాయువు, రిఫైనరీ ఉత్పత్తులు, విద్యుత్ ఉత్పత్తి క్షీణించడంతో ఎనిమిది కీలక మౌలిక రంగాల వృద్ధి ఏప్రిల్లో 3.5 శాతానికి పరిమితమైంది. ఇది ఆరు నెలల కనిష్టం. 2022 అక్టోబర్లో చివరిసారిగా ఇన్ఫ్రా వృద్ధి 0.7 శాతంగా నమోదైంది. 2022 ఏప్రిల్లో మౌలిక రంగాల వృద్ధి 9.5 శాతంగా ఉండగా, ఈ ఏడాది మార్చిలో 3.6 శాతంగా ఉంది. పారిశ్రామికోత్పత్తి సూచీలో ఎనిమిది మౌలిక రంగాల గ్రూప్నకు 40.27 శాతం వెయిటేజీ ఉంటుంది. -
మౌలిక సదుపాయాలే కీలకం: నీతి ఆయోగ్ భేటీలో సీఎం జగన్
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో ఆరోగ్యకరమైన పెట్టుబడుల ద్వారా మౌలిక సదుపాయాలను బలోపేతం చేస్తేనే ఆర్థిక వ్యవస్థ శీఘ్రగతిన పురోగమిస్తుందని ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి అభిప్రాయపడ్డారు. దేశ జీడీపీలో తయారీ, సేవల రంగం వాటా 85 శాతం దాటినప్పుడే ‘వికసిత్ భారత్’ లక్ష్యం నెరవేరుతుందని స్పష్టం చేశారు. రెండు రంగాల ప్రపంచ సగటు వాటా 91.5 శాతంగా ఉందని, ఈ లక్ష్యాన్ని సాధించడానికి వ్యవసాయం, పెట్టుబడులు.. రెండింటికీ సంబంధించిన అంశాలపై ప్రధానంగా దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని చెప్పారు. ఆహార రంగంలో స్వయం సమృద్ధిని సాధించడంతోపాటు, వ్యవసాయ ఉత్పాదకతను పెంపొందించడానికి కొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని ప్రోత్సహించాల్సిన అవసరం ఉందన్నారు. అన్ని రాష్ట్రాలూ ఒక జట్టుగా పని చేయాలని, ప్రతి రాష్ట్రం శ్రేయస్సు మొత్తం దేశంతో ముడి పడి ఉంటుందని చెప్పారు. శనివారం న్యూఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన జరిగిన నీతి ఆయోగ్ ఎనిమిదవ పాలక మండలి సమావేశంలో ఆయన మాట్లాడారు. నీతి ఆయోగ్ చర్చించే వివిధ అంశాల్లో రాష్ట్రం సాధించిన ప్రగతిని వివరిస్తూ ఒక నోట్ సమర్పించారు. ఈ సందర్భంగా పలు కీలక అంశాలను ప్రస్తావించారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి. పోర్డు ఆధారిత అభివృద్ధికి ఏపీ ప్రాధాన్యం ► దేశంలో లాజిస్టిక్స్ కోసం పెడుతున్న ఖర్చు జీడీపీలో 14 శాతంగా ఉంది. భారతీయ ఉత్పత్తులు ప్రపంచ స్థాయిలో పోటీ పడేందుకు ఇది ప్రతిబంధకంగా మారింది. అమెరికాలో లాజిస్టిక్స్ ఖర్చు కేవలం 7.5 శాతానికే పరిమితమైంది. గత తొమ్మిదేళ్లలో సరకు రవాణా కారిడార్లు, జాతీయ రహదారులపై ప్రభుత్వం ప్రశంసనీయ రీతిలో వ్యయం చేస్తోంది. ఆశించిన ఫలితాలను సాధించడానికి దీన్ని కొనసాగించడం చాలా అవసరం. ► ఇందులో భాగంగానే ఏపీ ప్రభుత్వం పోర్టు ఆధారిత అభివృద్ధికి అత్యంత ప్రాధాన్యత ఇస్తోంది. రాష్ట్రంలో కొత్తగా 4 కొత్త పోర్టులు, 10 ఫిషింగ్ హార్బర్లు ఏర్పాటవుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం కర్నూలులోని ఓర్వకల్ విమానాశ్రయాన్ని అభివృద్ధి చేసింది. విశాఖపట్నంలో అంతర్జాతీయ విమానాశ్రయాన్ని పీపీపీ పద్ధతిలో నిరి్మస్తోంది. రూ.13 లక్షల కోట్ల పెట్టుబడులు.. 6 లక్షల మందికి ఉపాధి ► తయారీ, సేవల రంగాల వాటా పెరుగుదలను సాధించడానికి పెట్టుబడులు చాలా అవసరం. దీనికి అనుకూలమైన వ్యాపార వాతావరణం తప్పనిసరి. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో ఏపీ గత మూడేళ్లుగా వరుసగా దేశంలోనే మొదటి స్థానంలో నిలిచింది. ► ప్రభుత్వం వ్యాపారస్తులకు అత్యంత అనుకూలంగా అనుమతులు సహా తదితర విధానాలను సరళీకృతం చేసింది. వాడుకలో లేని చట్టపరమైన నిబంధనలను సవరించడంతో పాటు కొన్నింటిని రద్దు చేసింది. ► విశాఖపట్నంలో నిర్వహించిన గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్–2023కు అద్భుత స్పందన లభించించింది. రూ. రూ.13 లక్షల కోట్ల భారీ పెట్టుబడులతో వివిధ సంస్థలు, కంపెనీలు ముందుకు వచ్చాయి. దీనివల్ల దాదాపు 6 లక్షల మందికి ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. ప్రజారోగ్యం బలోపేతం ► ప్రజారోగ్యం, పౌష్టికాహారం కూడా చాలా ముఖ్యమైన అంశాలు. పెరుగుతున్న ఆరోగ్య సంరక్షణ ఖర్చులు, పెరుగుతున్న సంక్రమించని దీర్ఘకాలిక వ్యాధులైన హృదయ సంబంధ వ్యాధులు, మధుమేహం వంటి అనారోగ్యాలకు సమయానికి చికిత్స అందించకపోతే తీవ్ర సమస్యలకు దారితీస్తుంది. టెరిటరీ హెల్త్కేర్ పేరిట అతిపెద్ద భారానికి దారితీస్తుంది. అందుకనే దీనిపై ఎక్కువగా శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఉంది. హెల్త్కేర్ మేనేజ్మెంట్, పౌష్టికాహారంపై అత్యంత దృష్టి పెట్టాలి. ► ఏపీ ప్రభుత్వం 10,592 గ్రామ, వార్డు క్లినిక్లను ఏర్పాటు చేసి, ఇందులో ఒక మిడ్ లెవల్ హెల్త్ ప్రొవైడర్, ఒక ఏఎన్ఎం, ఆశావర్కర్లను అందుబాటులో ఉంచింది. ప్రతి విలేజ్, వార్డు క్లినిక్లో 105 రకాల అవసరమైన మందులు, 14 రకాల డయాగ్నస్టిక్స్ అందుబాటులో ఉన్నాయి. ► రెండున్నరేళ్లలో రాష్ట్రంలో 48,639 మంది వైద్యులు, ఆరోగ్య సిబ్బందిని నియమించింది. విలేజ్ క్లినిక్ల నుండి బోధనాస్పత్రుల వరకు అవసరమైన సంఖ్యలో వైద్యులు, నర్సులు, పారామెడిక్స్ ఉన్నారు. ► విలేజ్ క్లినిక్ కాన్సెప్్టను పూర్తి సామర్థ్యంతో అమలు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ఫ్యామిలీ డాక్టర్ ప్రోగ్రామ్ను ప్రారంభించింది. ఇందులో పీహెచ్సీల నుండి వైద్యులు కనీసం నెలకు రెండుసార్లు వారికి నిర్దేశించిన గ్రామాన్ని సందర్శిస్తారు. విలేజ్, వార్డు క్లినిక్ల సౌకర్యాన్ని ప్రజలు పూర్తి స్థాయిలో వినియోగించుకోవడానికి ముందుగా పేర్కొన్న తేదీల్లో వైద్యులు ఆయా గ్రామాలను సందర్శిస్తారు. ► జీవనశైలిలో వచ్చిన మార్పుల కారణంగా వచ్చే వ్యాధుల సమస్యలను సమర్థవంతంగా స్క్రీనింగ్ చేయడం, గుర్తించడం, నిర్ధారించడం, ట్రాక్ చేయడం, చికిత్స చేయడం ద్వారా విజయవంతంగా వాటిని నివారించవచ్చని ప్రగాఢంగా నమ్ముతున్నాం. డైనమిక్గా పాఠ్య ప్రణాళిక ► నైపుణ్యాభివృద్ధి అన్నది మరో కీలక అంశం. జర్మనీ వంటి అనేక అభివృద్ధి చెందిన దేశాలు ఈ అంశంలో క్లిష్ట పరిస్థితిని ఎదుర్కొంటున్నాయి. తగ్గుతున్న జననాల రేటు కారణంగా, ఆ దేశాలు చివరకు శ్రామికశక్తి కొరతను ఎదుర్కొంటాయి. పని చేసే వయసున్న జనాభా విషయంలో సమస్యను ఎదుర్కొంటున్నాయి. ► అదృష్టవశాత్తు మన దేశ జనాభాలో అధిక భాగం పనిచేసే వయసున్న వారే ఉన్నారు. ఇది దేశానికి అత్యంత ప్రయోజనకరం. అయితే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మిషన్ లెర్నింగ్, లార్జ్ లాంగ్వేజ్ల ప్రవాహం ప్రపంచాన్ని శరవేగంగా మారుస్తోంది. ఈ సృజనాత్మక యుగంలో పాతవాటి విధ్వంసం, కొత్త ఆవిష్కరణలు.. ఇప్పటికే ఉన్న వ్యాపార పద్ధతులు, ప్రక్రియలు, సాంకేతికతలను సమూలంగా మార్చేస్తున్నాయి. దీన్ని ఎదుర్కోవడానికి వీలుగా మనం పాఠ్యాంశాల్లోనే అర్థవంతమైన, డైనమిక్ నైపుణ్యాలను నేర్చుకునేలా కొత్తవాటిని ప్రవేశపెట్టాలి. పాఠ్య ప్రణాళికను డైనమిక్గా తీర్చిదిద్దాలి. మహిళలకు చేయూత ► సమ్మిళిత వృద్ధి లక్ష్యాన్ని సాధించడానికి మహిళా సాధికారత చాలా కీలకం. మహిళలకు ఆర్థిక వనరులు, అవకాశాలను పెంపొందించడానికి, ఏపీ ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపట్టింది. ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం చేయూత, ఆసరా వంటి అనేక పథకాలను అమలు చేస్తోంది. దీని కింద వెనుకబడిన, ఆరి్థకంగా వెనుకబడిన వర్గాలకు చెందిన మహిళలకు నాలుగేళ్లుగా స్థిరంగా ఆర్థిక సహాయం అందిస్తున్నాం. ► మహిళా స్వయం సహాయక సంఘాలపై అధిక అప్పుల భారం.. ఆదాయాన్ని సమకూర్చే కార్యక్రమాల్లో వారి పెట్టుబడి సామర్థ్యాన్ని దెబ్బతీస్తుందని ప్రభుత్వం గుర్తించింది. ఈ పోటీ ప్రపంచంలో వారు నిలదొక్కుకోవడం చాలా కష్టమవుతున్నందున, సున్నా వడ్డీ కార్యక్రమం ద్వారా, సకాలంలో తిరిగి చెల్లించే షరతుపై ఎస్హెచ్జీలు పొందే రుణాలపై వడ్డీ రాయితీని ప్రభుత్వం గణనీయంగా అందిస్తోంది. ► కేవలం నిధులను మహిళల చేతుల్లో పెట్టడంతోనే ప్రభుత్వాల పాత్ర ముగిసిపోకూడదు. పెట్టుబడి పెట్టడానికి, తీవ్రమైన పోటీని తట్టుకునేలా ఆయా కార్యక్రమాల్లో కొనసాగడానికి మహిళలకు పరిమిత సామర్థ్యం ఉందని ప్రభుత్వాలు గుర్తించాలి. వారి ఉత్పత్తులకు మార్కెటింగ్ అనుసంధానాలను పొందడంలో మహిళలకు చేయూతనిచ్చి నడిపించే ప్రగతిశీల విధానాన్ని ప్రభుత్వాలు అవలంబించాలి. -
అమెజాన్ దిమ్మతిరిగే పెట్టుబడులు: ఏడాదికి లక్షల ఉద్యోగాలు
న్యూఢిల్లీ: టెక్ దిగ్గజం అమెజాన్ సంస్థ ఇండియాలో భారీ పెట్టుబడులు పెట్టనుంది. 2030 నాటికి భారతదేశంలో క్లౌడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో12.7 బిలియన్ల డాలర్లను పెట్టుబడి పెట్టాలని భావిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా అమెజాన్ సహా దిగ్గజ టెక్ కంపెనీలు వేలాది ఉద్యోగాలకు ఉద్వాసన పలుకుతున్న వేళ తాజా గుడ్ న్యూస్ వెల్లడించడం విశేషం. (మెగా బోనస్: 8 నెలల జీతం, ఎయిర్లెన్స్ ఉద్యోగుల సంబరాలు) అమెజాన్ క్లౌడ్ కంప్యూటింగ్ యూనిట్, అమెజాన్ వెబ్ సర్వీసెస్ (AWS) క్లౌడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో 2030 నాటికి రూ. 1,05,600 కోట్లు పెట్టుబడి పెట్టనున్నట్లు గురువారం (మే 18) ప్రకటించింది. దీంతో తమ దీర్ఘకాలిక పెట్టుబడులు 2030 నాటికి రూ. 1,36,500 కోట్లకు ( 16.4 బిలియన్డాలర్లు) చేరుతుందని పేర్కొంది. దేశంలో క్లౌడ్ సేవలకు పెరుగుతున్న డిమాండ్ను తీర్చే లక్ష్యంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపింది. ఈ పెట్టుబడి ద్వారా ఏడాదికి సగటున 131,700 ఫుల్ టైం ఉద్యోగాలను సృష్టించనుందని అంచనా. అంతేకాదు 2030 నాటికి భారతదేశ మొత్తం స్థూల జాతీయోత్పత్తికి రూ.1,94,700 కోట్లు (23.3 బిలియన్ల డాలర్లను) అందజేస్తుంది కాగా 2016-22 మధ్య కాలంలో కంపెనీ మనదేశంలో దాదాపు 3 బిలియన్ డాలర్లకు పైగా పెట్టుబడులను పెట్టింది. (గూగుల్ సీఈవో ప్రైమరీ ఫోన్ ఏదో తెలుసా, ఏఐపై కీలక వ్యాఖ్యలు) ప్రధానమంత్రి నరేంద్ర మోదీ డిజిటల్ ఇండియా విజన్ భారతదేశంలో క్లౌడ్ అండ్ డేటా సెంటర్ల విస్తరణకు దారితీస్తోందని కేంద్ర ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, స్కిల్ డెవలప్మెంట్, ఎంటర్ప్రెన్యూర్షిప్ శాఖ సహాయమంత్రి రాజీవ్ చంద్రశేఖర్ అన్నారు. ఇది ఖచ్చితంగా భారతదేశ డిజిటల్ ఏకానమీకి ఊతమిస్తుందంటూ అమెజాన్ పెట్టుబడులు స్వాగతించారు. (ఈ పిక్స్ చూశారా? గుండెలు బాదుకుంటున్న కృతి సనన్ ఫ్యాన్స్) 2016 నుంచి తాము ఇండియా క్లౌడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో బిలియన్ల డాలర్ల పెట్టుబడులు పెట్టామని, అమెజాన్ వెబ్ సర్వీసెస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ పునీత్ చందోక్ అన్నారు ఇండియా డిజిటల్ పవర్హౌస్గా గణనీయమైన వృద్ధిని సాధిస్తోందని సీఈవో ఆడమ్ సెలిప్స్కీ వెల్లడించారు. .@awscloud has long been vested in India’s growth as a digital powerhouse, and I’m inspired to see how our infrastructure presence since 2016 has driven such tremendous progress. Today we’re announcing additional planned investment of $12.7 billion for cloud infrastructure in… pic.twitter.com/6Ml9DtpRWD — Adam Selipsky (@aselipsky) May 18, 2023 -
‘హౌస్’ ఫుల్
దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా ఆంధ్రప్రదేశ్లో పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీ జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం చక్కటి ప్రణాళికతో ఇళ్ల నిర్మాణం చేపట్టింది. ఆయా కాలనీల్లో అవసరమైన రోడ్లు, కాలువలు, నీరు, విద్యుత్, ఇతర మౌలిక సదుపాయాల కల్పనపై ప్రత్యేకంగా దృష్టి సారించింది. లబ్ధిదారులకు ఎక్కడా ఇబ్బందులు తలెత్తకుండా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ, సమీక్షిస్తూ ముందుకు సాగుతోంది. – కేంద్ర హౌసింగ్, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ సాక్షి, అమరావతి: పేదలకు పక్కా ఇళ్లు నిర్మించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విశేషంగా కృషి చేస్తోందని కేంద్ర గృహ నిర్మాణ–పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రశంసించింది. ఇందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా అర్హులైన 30 లక్షల మందికిపైగా పేదలకు ఇళ్ల స్థలాల కోసం ప్రభుత్వ, ప్రైవేట్ భూములను సేకరించి.. ఏకంగా 68,677 ఎకరాలు పంపిణీ చేసిందని కొనియాడింది. ఇళ్ల స్థలాల పట్టాలన్నీ మహిళల పేరుపై మంజూరు చేయడం ద్వారా వారి సాధికారతకు తోడ్పడుతోందని మెచ్చుకుంది. అర్హులైన పేదలందరికీ ఇళ్ల స్థలాలు పంపిణీ చేయాలన్న బృహత్తర లక్ష్య సాధన కోసం ప్రత్యేక డ్రైవ్ చేపట్టి, విజయవంతంగా పూర్తి చేసిందని తెలిపింది. దేశంలోని మరే ఇతర రాష్ట్రాల్లోనూ ఇంత పెద్ద ఎత్తున పేదలకు ఇళ్ల స్థలాల పంపిణీ జరగలేదని, వారందరికీ ఇళ్ల నిర్మాణం కోసం కొత్తగా ఏకంగా 17,005 జగనన్న కాలనీలను నిర్మిస్తోందని వివరించింది. దేశంలోని ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, కేరళ, జార్ఖండ్, ఒడిశా, ఛత్తీస్గఢ్, గుజరాత్, తమిళనాడు రాష్ట్రాల్లో ‘సరసమైన గృహాలు–ఉత్తమ పద్ధతులు’ అంశంపై అధ్యయనం చేసిన కేంద్ర గృహ నిర్మాణ – పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ.. ఇటీవల నివేదికను విడుదల చేసింది. దీనిని హౌసింగ్– పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖకు చెందిన హౌసింగ్ మిషన్ డైరెక్టరేట్ ఇతర రాష్ట్రాలకు అందజేసింది. ఆంధ్రప్రదేశ్లో గృహ నిర్మాణ కార్యక్రమాలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పథకాలను అనుసంధానం చేసి, లబ్ధిదారులకు ప్రయోజనాలు అందిస్తోందని ఆ నివేదికలో పేర్కొంది. ప్రధాన మంత్రి ఉజ్వల యోజనతో గృహాలకు ఎల్పీజీని, ప్రధానమంత్రి సహజ బిజిలీ హర్ ఘర్ యోజన కింద విద్యుత్, జలజీవన్ మిషన్ కింద తాగునీరు, జన్ ధన్ యోజన కింద బ్యాంకు ఖాతాలు ప్రారంభించడం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం లబ్ధిదారులకు అండగా నిలిచిందని వెల్లడించింది. వీటితో పాటు మహిళా సాధికారతలో భాగంగా అమ్మ ఒడి కార్యక్రమం ద్వారా ఆర్థిక సాయం చేస్తూ.. పిల్లలను చదివించేందుకు తల్లులకు అధికారం కల్పించే పథకాన్ని అమలు చేస్తోందని కేంద్ర మంత్రిత్వ శాఖ తెలిపింది. ఆ నివేదికలో ఇంకా ఏముందంటే.. భారీ ఉపాధి, ఆర్థిక ప్రగతికి దోహదం ► రెండు దశల్లో 30 లక్షలకు పైగా ఇళ్ల నిర్మాణాలు చేపట్టడంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే తొలి దశలో 15 లక్షలకు పైగా (ప్రస్తుతం టిడ్కోఇళ్లతో కలిపి 21.25 లక్షలకు పైగా) ఇళ్ల నిర్మాణాలు చేపట్టింది. ఇంత పెద్ద ఎత్తున గృహాల నిర్మాణంతో ఆర్థిక వ్యవస్థకు భారీ ప్రోత్సాహం ఇస్తోంది. ► తాపీ పని, వడ్రంగి వంటి 30 వృత్తిపరమైన వర్గాలకు చెందిన వ్యక్తులకు భారీగా ఉపాధి కలుగుతుంది. ప్లంబింగ్, ఇతర తక్కువ ఆదాయ వర్గాలు, రోజువారీ వేతనాలు, అనధికారిక రంగ వలస కార్మికులకు ఉపాధి లభిస్తుంది. ఉత్తమ విధానాలతో నిర్మాణంలో వేగం ► ఇళ్ల నిర్మాణం వేగంగా సాగడానికి ఏపీ ప్రభుత్వం ఉత్తమ విధానాలను అమలు చేస్తోంది. అర్హులైన లబ్ధిదారులందరికీ సబ్సిడీ ధరలపై స్టీలు, సిమెంట్ను సరఫరా చేయడంతో పాటు ఇసుకను ఉచితంగా అందజేస్తోంది. ► బ్యాంకులతో లబ్ధిదారులను అనుసంధానం చేయడం ద్వారా వారికి ఆర్థిక వెసులుబాటు కల్పించింది. పట్టణ ప్రాంతాల్లో 1 సెంటు, గ్రామీణ ప్రాంతాల్లో 1.5 సెంట్లు ఇచ్చేలా జగనన్న కాలనీల లే–అవుట్లను రూపొందించింది. ► ఇళ్ల లబ్ధిదారులకు అవసరమైన నాణ్యమైన గృహోపకరణాలను తయారీ దారుల నుంచి రాష్ట్ర ప్రభుత్వమే రివర్స్ టెండరింగ్ ద్వారా మార్కెట్ ధర కంటే తక్కువ ధరకు అందిస్తోంది. స్థానిక ప్రజాప్రతినిధుల నుంచి ఇళ్ల నిర్మాణాలకు పూర్తి సహకారం ఉండటంతో ఏపీలో ఇళ్ల నిర్మాణాలు వేగంగా సాగుతున్నాయి. ట్రాన్స్జెండర్లకు కూడా ఇళ్లు ► చిత్తూరు నగరంలో వీధి వ్యాపారాలు చేస్తున్న 17 మంది ట్రాన్స్జెండర్లకు గృహాలను మంజూరు చేసింది. తద్వారా వారి సామాజిక, ఆర్థిక స్థితిగతుల్లో ఇబ్బందిని అధిగమించేలా చేసి.. వివక్ష నుంచి విముక్తి కలిగించింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో అన్ని సౌకర్యాలతో వారు సొంత ఇళ్లు నిర్మించుకుంటున్నారు. ► సొంత ఇంటి రూపంలో ఆస్తి సమకూరడంతో స్వయం సహాయక సంఘాల్లోని సభ్యులు మరింత మెరుగైన జీవనోపాధి పొందేందుకు అవకాశం లభించింది. వీరిలో కొందరు ప్రభుత్వ సహాయంతో చిన్న చిన్న దుకాణాలు, టైలరింగ్ నిర్వహిస్తున్నారు. తాటి ఆకుల గుడిసెల్లో ఉండే వారికి పక్కా ఇళ్లు ► గుంటూరు జిల్లా భట్టిప్రోలు మండలం వెల్లటూరు పంచాయతీ ఎస్సీ, ఎస్టీ కాలనీలో 111 మందికి రాష్ట్ర ప్రభుత్వం పక్కా ఇళ్లు మంజూరు చేసింది. వీరందరూ మట్టి, వెదురు కర్రలు, తాటి ఆకులతో రూపొందించిన గుడిసె తరహా ఇళ్లలో నివసించే వారు. వారికి ఇళ్లు మంజూరు చేయడంతో కొత్త ఇంటి స్థలంలో ఇళ్లు నిర్మిస్తున్నారు. ► ఇళ్ల నిర్మాణ పనుల కోసం స్థానిక పంచాయతీ 15 నీటి కనెక్షన్లు ఇచ్చింది. కొత్త ఇళ్ల నిర్మాణం పూర్తయ్యాక శాశ్వత విద్యుత్ కనెక్షన్లతో పాటు వీధి లైట్ల ఏర్పాటుకు సర్వం సిద్ధం చేశారు. ► నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్లో తొలి దశలో 27,888 నివాస యూనిట్లు చేపట్టారు. ఇందులో వెంకటేశ్వరపురంలో 4,800 యూనిట్లు పూర్తయ్యాయి. 3,000 యూనిట్లను లబ్ధిదారులకు అందజేశారు. రెండవ దశ కింద 18,864 యూనిట్లతో 70 శాతం పూర్తయ్యాయి. కనీస మౌలిక సదుపాయాల పనులు ప్రారంభించారు. మూడవ దశ కింద 5,464 యూనిట్లు నిర్మిస్తున్నారు. -
ప్రభుత్వ విధుల్లో కోర్టుల జోక్యం తగదు
విశాఖ లీగల్: ప్రజలకు మౌలిక వసతులు కల్పించడం, ప్రాథమిక అవసరాలు తీర్చడం అనేది ప్రభుత్వం బాధ్యత అని, ఈ విషయంలో ఉన్నత న్యాయస్థానాలు జోక్యం చేసుకోవడం తగదని సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ లావు నాగేశ్వరరావు అన్నారు. న్యాయవ్యవస్థకు పరిధి ఉందని, అవసరమైనప్పుడు మాత్రమే న్యాయస్థానాలు స్పందించాలని ఆయన అభిప్రాయపడ్డారు. కొన్నిసార్లు సంబంధం లేని, సాధ్యం కాని పనులపై తప్పుడు తీర్పులు వస్తున్నాయని పేర్కొన్నారు. న్యాయకోవిదుడు, విశాఖపట్నం నగర మాజీ మేయర్ డీవీ సుబ్బారావు స్మారక ఉపన్యాస కార్యక్రమం శనివారం నగరంలోని ఒక హోటల్లో నిర్వహించారు. ప్రధాన వక్తగా హాజరైన జస్టిస్ లావు నాగేశ్వరరావు మాట్లాడుతూ డీవీ సుబ్బారావు దేశవ్యాప్తంగా చేసిన ప్రసంగాలు, న్యాయస్థానాల్లో ఆయన చూపిన చతురత అందరికీ ఆదర్శమన్నారు. ప్రజాస్వామ్యం అన్నిటికంటే ఉన్నతమైందని, దానికి విఘాతం కలిగితే న్యాయవ్యవస్థ స్వతంత్రంగా వ్యవహరించే అధికారం ఉందన్నారు. అయితే, పాలన వ్యవహారాలకు సంబంధించి అతి చిన్న అంశంపై కూడా ఉన్నత న్యాయస్థానాలు జోక్యం చేసుకోవడం తగదన్నారు. ఇలా చేయడం వల్ల ప్రభుత్వాలు సుపరిపాలన అందించడం సాధ్యం కాదని ఆయన స్పష్టంచేశారు. కార్యనిర్వాహక విభాగం వ్యవహారాల్లో పాలకుల జోక్యం తగదన్నారు. అదేవిధంగా కార్యనిర్వహణ విభాగంలో పొరపాట్లు జరిగినప్పుడు వాటిని సరిదిద్దుకునేలా న్యాయస్థానాలు సూచనలు చేయాలని పేర్కొన్నారు. ఇటీవల ఉన్నతాధికారులపై ఇస్తున్న కొన్ని తీర్పులు హాస్యాస్పదంగా ఉంటున్నాయన్నారు. న్యాయవ్యవస్థ అనేది సామాన్యుడికి, కార్యనిర్వాహక వర్గానికి మధ్య వారిధి అని చెప్పారు. పాలకులు పారదర్శకంగా వ్యవహరించాలని సూచించారు. బొగ్గు గనులు, మైన్స్లో పనిచేసే కార్మికులు వారి సంక్షేమం వంటివి ముఖ్యమన్నారు. వివిధ నేరాల్లో జైల్లో మగ్గుతున్న ఖైదీల హక్కుల పరిరక్షణ, వారి జీవన పరిస్థితులు, మానవ హక్కుల పరిరక్షణ వంటి విషయాల్లో ప్రభుత్వాలు తమ హద్దులు దాటకూడదన్నారు. వ్యక్తిగత గోప్యత కూడా ప్రాథమిక హక్కుల కిందకే వస్తుందని చెప్పారు. కాలుష్యం వల్ల 2050 నాటికి వాతావరణంలో తీవ్ర మార్పులు వచ్చే అవకాశం ఉందని, వాటి పట్ల అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. కోవిడ్ ప్రభావంతో దేశవ్యాప్తంగా లక్ష మందికి పైగా చిన్నారులు అనాథలుగా మారారని, వారికి అన్ని విధాల చేయూత ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు. ఈ విషయంలో ప్రభుత్వం బాధ్యతగా వ్యవహరించాలన్నారు. మౌలిక సదుపాయాలు, పర్యావరణ పరిరక్షణ, సుపరిపాలన... ప్రభుత్వ పనితీరుకు గీటురాయి అని చెప్పారు. డీవీ సుబ్బారావు కుమారుడు, హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ డీవీఎస్ఎస్ సోమయాజులు మాట్లాడుతూ తన తండ్రి ఒకవైపు న్యాయవాదిగా, మరోవైపు ప్రజానాయకుడిగా సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొని విస్తృతమైన సేవలందించారని కొనియాడారు. సెంటర్ ఫర్ పాలసీ డైరెక్టర్ ఆచార్య ఎ.ప్రసన్నకుమార్ మాట్లాడుతూ డీవీ సుబ్బారావు ఉత్తమ క్రికెటర్ అని తెలిపారు. ఇటీవల ప్రభుత్వం విశాఖ అభివృద్ధి కోసం చేపట్టిన చర్యలు అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ మానవేంద్రనాథ్ రాయ్, జస్టిస్ చీమలపాటి రవి, జస్టిస్ మాంధాత సీతారామమూర్తి, ఇతర న్యాయమూర్తులు, న్యాయాధికారులు, రాష్ట్ర ఉన్నత విద్య నియంత్రణ కమిటీ సభ్యుడు ఆచార్య పి.సోమరాజు, రాష్ట్ర బార్ కౌన్సిల్ సీనియర్ సభ్యుడు ఎస్.కృష్ణమోహన్ తదితరులు పాల్గొన్నారు.
Pagination
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
మిస్టర్ అండ్ మిసెస్ మహీ చిత్రంలో జాన్వీ.. ధోనిపై ఆసక్తికర కామెంట్స్ చేసిన భామ (ఫొటోలు)
దాక్షాయణి బర్త్ డే.. పుష్ప మేకర్స్ స్పెషల్ అప్డేట్!
దేవర బర్త్ డే ట్రీట్.. అప్డేట్ అదిరిపోయింది!
‘బీజేపీకి ఓటేస్తే నేను జైలుకే’.. కేజ్రీవాల్ ఆసక్తికర వ్యాఖ్యలు
కాంగ్రెస్ రైతు వ్యతిరేక చర్యలు.. రాష్ట్రవ్యాప్త నిరసనకు కేసీఆర్ పిలుపు
మాజీ గవర్నర్ కమలా బెనివాల్ కన్నుమూత
ఇండియా కూటమి గెలిస్తే మద్దతిస్తాం: మమతా బెనర్జీ
కేజ్రీవాల్కు మధ్యంతర బెయిల్.. సాధారణ తీర్పు కాదన్న అమిత్ షా
కాబోయేవాడు ఎలా ఉండాలంటే?.. జాన్వీ కపూర్ ఆసక్తికర కామెంట్స్!
స్లొవేకియా ప్రధానిపై కాల్పులు
తప్పక చదవండి
- ఇండియా కూటమి గెలిస్తే మద్దతిస్తాం: మమతా బెనర్జీ
- పనిమనిషి ఇంట్లో నోట్ల గుట్టలు.. జార్ఖండ్ మంత్రి అలంగిర్ అరెస్టు
- మెగాస్టార్ చిత్రంలో మరో సీనియర్ నటి.. ఆ కాంబో రిపీట్!
- స్టార్ క్రికెటర్ ప్రపోజ్.. హీరోయిన్ ఏమన్నారంటే!
- పంచాయత్ సీజన్ 3 ట్రైలర్ విడుదల
- వడదెబ్బ మరణాలు.. ఐదో వంతు భారత్లోనే !
- సచిన్ టెండూల్కర్ సెక్యూరిటీ గార్డు ఆత్మహత్య!
- అతడి కంటే చెత్త కెప్టెన్ ఎవరూ లేరు.. పైగా హార్దిక్ను అంటారా?
- పల్నాడు ప్రమాదంపై సీఎం జగన్ దిగ్భ్రాంతి
- BCCI: టీమిండియా హెడ్కోచ్గా వాళ్లిద్దరిలో ఒకరు?
Advertisement