-
ఐఫోన్పై రూ.26వేలు డిస్కౌంట్.. ఎక్కడంటే..
యాపిల్ కంపెనీ చైనాలోని తన ఉత్పత్తులపై భారీ తగ్గింపును అందిస్తుంది. చైనాలోని ఆన్లైన్ రిటైల్ ప్లాట్ఫామ్ ‘ట్మాల్’ వెబ్సైట్లో యాపిల్ ఐఫోన్ ధరలు తగ్గిస్తున్నట్లు ప్రచారాన్ని ప్రారంభించింది.ఎంపిక చేసిన ఐఫోన్ మోడళ్లపై 2,300 యువాన్ల (సుమారు రూ.26వేలు) వరకు డిస్కౌంట్ ఇస్తున్నట్లు వెబ్సైట్లో ప్రకటనలు వెలిశాయి. ఈ ఆఫర్ మే 20 నుంచి 28 వరకు మాత్రమే ఉంటుందని ప్రచారం సాగుతోంది. హువాయ్ వంటి స్థానిక బ్రాండ్ల నుంచి యాపిల్కు గట్టిపోటీ ఉండడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు కొన్ని వార్తా సంస్థలు కథనాల వెలువరించాయి. దాంతోపాటు యాపిల్ కొత్త మోడల్ లాంచ్ చేస్తుందనే వార్తలు వస్తున్న నేపథ్యంలో ఉన్నవాటికి ధర తగ్గిస్తుందనే వాదనలున్నాయి. ప్రస్తుతం యాపిల్ ఇస్తున్న డిస్కౌంట్ ఫిబ్రవరిలో ప్రకటించిన తగ్గింపు కంటే ఎక్కువగా ఉంది. అప్పుడు అత్యధికంగా 1,150 యువాన్లు మాత్రమే డిస్కౌంట్ ఇచ్చారు.చైనాలో ప్రముఖ హైఎండ్ స్మార్ట్ఫోన్ తయారీ సంస్థ హువాయ్ గత నెలలో ‘పురా 70’ అనే మోడల్ను మార్కెట్లోకి తీసుకొచ్చింది. ఇటీవల యాపిల్ ఐఫోన్ అమ్మకాలు తగ్గుతున్నాయి. చైనా అకాడమీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్స్ టెక్నాలజీ (సీఏఐసీటీ) డేటా ఆధారంగా మార్చిలో యాపిల్ ఎగుమతులు 12% పెరిగాయి. అయితే అమ్మకాలు మాత్రం 37% తగ్గాయి. దాంతో కంపెనీ భారీ రాయితీలు ఇస్తున్నట్లు మార్కెట్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. -
భారత్లో ఐఫోన్ తయారీ.. ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన ప్రధాని మోదీ
ప్రపంచ నం.1 కంపెనీ యాపిల్ ఐఫోన్ ఉత్పత్తుల్లో ప్రతి ఏడింటిలో ఒకటి భారత్లోనే తయారవుతోందని ప్రధానిమోదీ అన్నారు. ఇందుకోసం ప్రభుత్వం అందిస్తున్న ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహకాలు(పీఎల్ఐ) ఎంతో ఉపయోగపడుతున్నాయని ఆయన ఓ ఇంటర్వ్యూలో చెప్పారు.ప్రముఖ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మోదీ మాట్లాడుతూ..‘ప్రపంచంలోనే భారత్ రెండో అతిపెద్ద మొబైల్ ఫోన్ తయారీదారుగా ఎదిగింది. గ్లోబల్గా తయారువుతున్న ఏడు ఐఫోన్లలో ఒకటి ఇండియాలోనే తయారుచేస్తున్నారు. ఐఫోన్తోపాటు యాపిల్ ఉత్పత్తులను కూడా భారత్ రికార్డు సంఖ్యలో ఎగుమతి చేస్తోంది. ప్రభుత్వం అందిస్తున్న ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ (పీఎల్ఐ) పథకం ద్వారానే ఇది సాధ్యమైంది’ అని అన్నారు.2028 నాటికి మొత్తం ఐఫోన్లలో 25 శాతం భారత్లోనే తయారవుతాయని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. మొదటి త్రైమాసికానికి సంబంధించి యాపిల్ ఉత్పత్తుల షిప్మెంట్లో దేశం రికార్డు స్థాయిని చేరుకుంది. దేశంలోని యాపిల్ ఉత్పత్తుల్లో ఏడాదివారీగా 19 శాతం వృద్ధి నమోదైనట్లు కంపెనీ తెలిపింది.యాపిల్ సంస్థ ముంబై, దిల్లీలో రెండు అవుట్లెట్లను ప్రారంభించిన విషయం తెలిసిందే. వీటిలో యాపిల్ అమ్మకాలు రోజురోజుకు పెరుగుతున్నట్లు తెలిసింది. ఈ స్టోర్లు ప్రారంభించిన నాటినుంచి నెలవారీ సగటు అమ్మకాలు స్థిరంగా రూ.16 కోట్లు-రూ.17 కోట్లుగా నమోదవుతున్నాయని కంపెనీ తెలిపింది.ముంబై స్టోర్ యాపిల్ బీకేసీ ఆదాయం దిల్లీ స్టోర్ యాపిల్ సాకెట్ కంటే కొంచెం అధికంగా నమోదవుతోందని కంపెనీ విడుదల చేసిన ప్రకటనల ద్వారా తెలిసింది. త్వరలో భారత్లో మరో మూడు స్టోర్లను ప్రారంభించే యోచనలో ఉన్నట్లు కంపెనీ వర్గాలు తెలిపాయి. పుణె, బెంగళూరుతోపాటు దిల్లీ-ఎన్సీఆర్ ప్రాంతంలో ఈ అవుట్లెట్లను ఏర్పాటు చేయడానికి చర్చలు జరుపుతున్నట్లు తెలిసింది. అయితే గతేడాది జూన్లో వెలువడిన బ్లూమ్బెర్గ్ నివేదిక ప్రకారం.. యాపిల్ తన స్టోర్లను విస్తరించే ఆలోచన లేదని కథనాలు వెలువడ్డాయి. కానీ 2024లో సమకూరిన ఆదాయాల నేపథ్యంలో భారత్లో మరిన్ని స్టోర్లను విస్తరించాలని భావిస్తున్నట్లు తెలిసింది. -
ఐఫోన్ ఫింగర్ అంటే ఏంటీ? ఇది ప్రమాదకరమా..?
స్మార్ట్ ఫోన్ అడిక్షన్తో పలు సమస్యలు వస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా పిల్లలను వాటికి అడిక్ట్ అవ్వకుండా జాగ్రత్త పడాలని సూచించారు కూడా. కానీ ఇప్పుడు ఏకంగా వాటి వాడకం వల్లే వేళ్ల సంబంధ సమస్యలొస్తున్నాయంటూ పలువురు ఊదరగొడుతున్నారు. నిపుణులు మాత్రం అది సాధారణ సమస్య అని కొట్టిపారేస్తున్నారు. ఈస్మార్ట్ ఫోన్లను అలా ఉపయోగిస్తేనే సమస్యలు వస్తాయంటూ పలు ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చారు వైద్యులు. మరీ ఇంతకీ ఏంటీ ఐఫోన్ ఫింగర్..ఐఫోన్ ఫింగర్ అంటే..ఐఫోన్ ఫింగర్"ని "స్మార్ట్ఫోన్ పింకీ" అని కూడా అంటారు. ప్రస్తుతం స్మార్ట్ ఫోన్లు పెద్దపెద్ద సైజుల్లో వస్తున్నాయి. వాటిని అరచేతిలో పట్టుకునేటప్పుడు ఫోన్ కింద చిటికెన వేలుతో నొక్కి పట్టుకోవడం సహజం. కానీ అలా గంటల తరబడి చిటికెన వేలు మీద భారం పడటం వల్ల, వేలు వంకరపోతోందని ఆందోళన చేస్తున్నారు కొందరూ. దీన్నే 'స్మార్ట్ ఫోన్ పింకీ' లేదా 'ఐఫోన్ ఫింగర్' అని అంటారు. ఈ ఆపిల్ ఫోన్లు, స్మార్ట్ ఫోన్లు వినియోగిస్తున్నప్పుడు భారం చిటికెన వేలుపై పడటంతో ఉంగరం వేలుకి దీనికి గ్యాప్ రావడం లేదా వంకరపోవడం వంటివి జరుగుతున్నాయని పలువురు టెక్ ఔత్సా హికులు భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు. అయితే వైద్యులు మాత్రం ఇది సాధారణ సమస్యే అని కొట్టిపారేస్తున్నారు. క్లీవ్ల్యాండ్ క్లినిక్కి చెందిన ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ పీటర్ ఎవాన్స్ చిటికెన వేళ్ల మధ్య గ్యాప్లు, వంకరపోవడానికి అదే కారణమని చెప్పలేమని అన్నారు. దీన్ని సాధారణ పింకీ అనాటమీ(చిటికెన వేలు సమస్య)గా చెబుతున్నారు. అలాగే ఆక్యుపేషనల్ థెరపిస్ట్ ఏప్రిల్ హిబ్బెలర్, రోలినాకు చెందిన హ్యాండ్ సర్జన్ డాక్టర్లిద్దరు సదరు సర్జన్ డాక్టర్ ఎవాన్స్ మాటలతో ఏకీభవించారు. ఐఫోన్, స్మార్ట్ పోన్ల వల్లే ఇది వస్తుందని అధికారిక నిర్థారణ కాలేదని అన్నారు. కానీ వారంతా ఫోన్కు సంబంధించిన కొన్ని అనారోగ్య పరిస్థితుల గురించి హెచ్చరించారు. అవేంటంటే..ఫోన్ సంబంధిత వైద్య పరిస్థితులుస్మార్ట్ వాడకం వల్ల "స్మార్ట్ఫోన్ ఎల్బో" వస్తుందని అన్నారు. వైద్యపరంగా దీన్ని క్యూబిటల్ టన్నెల్ సిండ్రోమ్ అని పిలుస్తారు. టక్స్ట్ టైప్ చేయడానికి ఎక్కువ వ్యవధిలో మోచేతిని 90 డిగ్రీలకు మించి వంచితే ఇది వస్తుందని వివరించారు. బహుశా ఇదే చిటికెన వేలుపై వస్తున్న మార్పులకు సంకేతాలు కూడా కాడొచ్చని అన్నారు. అందువల్లే నరాలు దెబ్బ తిని ఇలా చిటికెన వేలు వంకరపోవడం లేదా గ్యాప్ రావడం జరగుతుండవచ్చు అని అన్నారు. విపరీతంగా బొటనవేలుతో టెక్స్టింగ్ చేసేవాళ్లు మెడ విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలని స్మార్ట్ ఫోన్ వినియోగదారులను కోరారు. రోజంతా బొటనవేలుతో స్వైపింగ్, టైప్ చేయడం వంటివి చేస్తే ఈ సమస్యలు అధికమవుతాయని, పైగా అంతర్గతంగా ఆర్థరైటిస్ వంటి సమస్యలను తీవ్రతరం చేసి బొటనవేలు స్నాయువులలో కొత్త సమస్యలను కలిగిస్తుందని తెలిపారు. ఇక్కడ మనిషి తల బరువు కనీసం 10 నుంచి 12 పౌండ్లు వరకు ఉంటుంది. స్మార్ట్ఫోన్ చూసేందుకు ఎప్పుడైతే తలను వంచుతామో అప్పుడు ఆ భారం అంతా మెడ కండరాలపై పడుతుంది. ఈ అదనపు ఒత్తిడి కండరాల నొప్పికి దారితీసి ఆర్థరైటీస్ వంటి సమస్యల్లో పెడుతుందని వివరించారు సర్జన్ ఎవాన్స్. (చదవండి: ఆశకు స్ఫూర్తి ఆమె'!..ఏకంగా 33 వేల అడుగుల ఎత్తు నుంచి విమానం కూలినా..!) -
మరికొన్ని గంటల్లో యాపిల్ ‘లెట్ లూస్ ఈవెంట్’
టెక్ లవర్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తోన్న ప్రముఖ టెక్ దిగ్గజం యాపిల్ ఈవెంట్ మరికొన్ని గంటల్లో ప్రారంభం కానుంది.ఈ ఏడాది తొలిసారి యాపిల్ సంస్థ ఏప్రిల్ 7న ‘లెట్ లూస్’ ఈవెంట్లో కొత్త ఐపాడ్లపై ప్రకటన చేయనున్నట్లు తెలుస్తోంది. పలు నివేదికల ప్రకారం.. ఓల్ఈడీ ఐపాడ్ ప్రో, ఐపాడ్ ఎయిర్స్ను లాంచ్ చేయనుందని సమాచారం. టెక్ దిగ్గజం లాంచ్ చేయనున్న కొత్త ఐపాడ్ ప్రో తరహాలో మాక్ బుక్ ప్రో సైతం మరింత పవర్ఫుల్గా ఉండనుంది.యాపిల్ లెట్ లూస్ ఈవెంట్లో ప్రత్యేకతలు లెట్ లూస్ ఈవెంట్లో యాపిల్ సంస్థ విడుదల చేయనున్న ఐపాడ్ ప్రోలో ఓఎల్ఈడీ స్క్రీన్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోందని బ్లూమ్బెర్గ్ నివేదిక చెబుతోంది. అంతేకాదు బెటర్ బ్రైట్నెస్, కాంట్రాస్ట్, కలర్ ఆక్యురెన్స్ సైతం అప్గ్రేడ్ వెర్షన్ యూజర్లకు వినియోగం మరింత సులభం కానుందనే నివేదిక హైలెట్ చేసింది. స్క్రీన్ అప్గ్రేడ్తో పాటు కొత్త ఐపాడ్ ప్రో మోడల్లు ఓల్డ్ మోడళ్ల కంటే సన్నగా ఉండనుందని అంచనా. 12.9 అంగుళాల మోడల్కు 20 శాతం, 11 అంగుళాల మోడల్కు 15 శాతం వరకు సైజ్ తగ్గుతుంది. ఐపాడ్ ప్రోలో ఎం4 చిప్యాపిల్ నెక్ట్స్ జనరేషన్ ఎం4 చిప్ని ఐపాడ్ ప్రోలో అప్డేట్ చేయనుందని ఊహాగానాలు ఊపందుకున్నాయి. దీంతో ప్రస్తుత ఎం3 చిప్ కంటే గణనీయమైన పనితీరు, సామర్థ్యం సైతం పెరగనుందని టెక్ లవర్స్ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మరి ఈ ఊహానాల్లో నిజమెంతో తెలియాలంటే మరికొన్ని గంటల్లో ప్రారంభం కానున్న యాపిల్ లెట్ లూస్ ఈవెంట్లో స్పష్టత రానుంది. యాపిల్ లెట్ లూస్ ఐప్యాడ్ లాంచ్ను ఎలా చూడాలిఇక మే 7న యాపిల్ లెట్ లూస్ ఈవెంట్ భారత కాలమానం ప్రకారం.. సాయంత్రం 7.30 గంటలకు ప్రారంభం కానుంది. ఈ ఈవెంట్ను యూట్యూబ్, యాపిల్.కామ్, యాపిల్ టీవీలో వీక్షించవచ్చు. -
ముంబై ఎయిర్పోర్టులో 12 కోట్ల విలువైన బంగారం, ఐఫోన్లు సీజ్
ముంబై: లోక్సభ ఎన్నికల వేళ మహారాష్ట్ర రాజధాని ముంబైలోని అంతర్జాతీయ విమానాశ్రయంలో భారీగా బంగారం పట్టుబడింది. మొత్తం 20 కేసుల్లో 12.74 కిలోల బంగారాన్ని ముంబై కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. బంగారంతోపాటు ఖరీదైన నాలుగు ఐఫోన్లను (15 ప్రో ఫోన్లను) కూడా స్వాధీనం చేసుకున్నారు. బంగారాన్ని లోదుస్తులు, వాటర్ బాటిల్స్, బట్టలు, ముడి అభరణాలు, బంగారు కడ్డీలు, శరీరంపై దొంగచాటుగా దాచి తరలిస్తున్నట్లు గుర్తించి పట్టుకున్నట్లు అధికారులు తెలిపారు. పట్టుబడిన బంగారం, ఐఫోన్ల విలువ సుమారు రూ.8.37 కోట్లకుపైమాటే ఉంటుందని పేర్కొన్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసిన కస్టమ్స్ అధికారులు.. ఐదుగురు ప్రయాణికుల్ని అరెస్ట్ చేసినట్లు వెల్లడించారు.Officials of Mumbai Customs at Chhatrapati Shivaji Maharaj International Airport have seized goods worth a total of Rs 8.37 crores including 12.74 Kg Gold across 20 cases. Gold was found concealed in various forms like gold dust in wax and gold layered cloths, crude jewellery and… pic.twitter.com/4OQlYsATIE— ANI (@ANI) May 4, 2024 -
తగ్గిన ప్రపంచ నం1 కంపెనీ విక్రయాలు.. భారత్లో మాత్రం..
ప్రపంచ నం.1 కంపెనీ యాపిల్ ఐఫోన్ విక్రయాలు తగ్గుతున్నట్లు తెలిసింది. మార్చి 2024తో ముగిసిన త్రైమాసికంలో యాపిల్ ఐఫోన్ విక్రయాలు 10 శాతం తగ్గినట్లు కంపెనీ చెప్పింది. దాంతో కంపెనీ ఆదాయం 4 శాతం క్షీణించిందని చీఫ్ ఎగ్జిక్యూటివ్ టిమ్ కుక్ తెలిపారు.గడిచిన త్రైమాసికంలో ప్రపంచవ్యాప్తంగా ఐఫోన్ విక్రయాలు తగ్గుతుంటే ఇండియాలో మాత్రం వీటికి ఆదరణ పెరుగుతుందని చెప్పారు. ఇండియాలో రికార్డు స్థాయిలో విక్రయాలు పెరిగినట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘ఇండియాలో యాపిల్ ఉత్పత్తులకు అద్భుతమైన మార్కెట్ ఉంది. భారత్లో స్థిరంగా రెండంకెల వృద్ధి నమోదవుతోంది. ఇక్కడ రికార్డుస్థాయిలో విక్రయాలు జరుగుతున్నాయి. ముందుగా కంపెనీ ఆశించినమేరకు అంచనాలను అధిగమిస్తున్నాం’ అని అన్నారు.యాపిల్ సంస్థ ముంబై, దిల్లీలో రెండు అవుట్లెట్లను ప్రారంభించిన విషయం తెలిసిందే. వీటిలో యాపిల్ అమ్మకాలు రోజురోజుకు పెరుగుతున్నట్లు తెలిసింది. ఈ స్టోర్లు ప్రారంభించిన నాటినుంచి నెలవారీ సగటు అమ్మకాలు స్థిరంగా రూ.16 కోట్లు-రూ.17 కోట్లుగా నమోదవుతున్నాయని కంపెనీ తెలిపింది.ఇదీ చదవండి: దిగ్గజ కంపెనీల మధ్య రూ.1.66లక్షల కోట్ల ఒప్పందం.. ఎందుకంటే..ముంబై స్టోర్ యాపిల్ బీకేసీ ఆదాయం దిల్లీ స్టోర్ యాపిల్ సాకెట్ కంటే కొంచెం అధికంగా నమోదవుతోంది. త్వరలో భారత్లో మరో మూడు స్టోర్లను ప్రారంభించే యోచనలో ఉన్నట్లు కంపెనీ వర్గాలు తెలిపాయి. పుణె, బెంగళూరుతోపాటు దిల్లీ-ఎన్సీఆర్ ప్రాంతంలో ఈ అవుట్లెట్లను ఏర్పాటు చేయడానికి చర్చలు జరుపుతున్నట్లు తెలిసింది. అయితే గతేడాది జూన్లో వెలువడిన బ్లూమ్బెర్గ్ నివేదిక ప్రకారం.. యాపిల్ తన స్టోర్లను విస్తరించే ఆలోచన లేదని కథనాలు వెలువడ్డాయి. కానీ 2024లో సమకూరిన ఆదాయాల నేపథ్యంలో భారత్లో మరిన్ని స్టోర్లను విస్తరించాలని భావిస్తున్నట్లు తెలిసింది. -
యాపిల్కు ఆదాయం సమకూర్చడంలో భారత్ టాప్
యాపిల్ భారత్లో తన ఆదాయాన్ని పెంచుకుంటుంది. కేవలం రెండు అవుట్లెట్ల ద్వారా 2024 ఆర్థిక సంవత్సరానికిగాను ఏకంగా రూ.190-రూ.210 కోట్ల ఆదాయం సమకూరినట్లు తెలిసింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అవుట్లెట్ల్లో ఇదే రికార్డు ఆదాయమని కంపెనీ తెలిపింది. ముంబై, దిల్లీలో రెండు యాపిల్ స్టోర్లు ప్రారంభించిన విషయం తెలిసిందే. వీటిలో యాపిల్ అమ్మకాలు రోజురోజుకు పెరుగుతున్నాయి. ఈ స్టోర్లు ప్రారంభించిన నాటినుంచి నెలవారీ సగటు అమ్మకాలు స్థిరంగా రూ.16 కోట్లు-రూ.17 కోట్లుగా నమోదవుతున్నాయని కంపెనీ తెలిపింది. ఇదీ చదవండి: కొత్త సౌండ్బాక్స్లు ప్రారంభించిన పేటీఎం.. ప్రత్యేకతలివే.. ముంబై స్టోర్ యాపిల్ బీకేసీ ఆదాయం దిల్లీ స్టోర్ యాపిల్ సాకెట్ కంటే కొంచెం అధికంగా నమోదైంది. త్వరలో భారత్లో మరో మూడు స్టోర్లను ప్రారంభించే యోచనలో ఉన్నట్లు కంపెనీ వర్గాలు తెలిపాయి. పుణె, బెంగళూరుతోపాటు దిల్లీ-ఎన్సీఆర్ ప్రాంతంలో ఈ అవుట్లెట్లను ఏర్పాటు చేయడానికి యాపిల్ చర్చలు జరుపుతోందని తెలిసింది. అయితే గతేడాది జూన్లో బ్లూమ్బెర్గ్ నివేదిక ప్రకారం.. యాపిల్ తన స్టోర్లను విస్తరించే ఆలోచన లేదని కథనాలు వెలువడ్డాయి. కానీ 2024లో సమకూరిన ఆదాయాల నేపథ్యంలో భారత్లో మరిన్ని స్టోర్లను విస్తరించాలని అనుకుంటున్నట్లు తెలిసింది. -
భారత కంపెనీలతో యాపిల్ ఒప్పందం.. ఎందుకంటే..
ప్రపంచ నం.1 కంపెనీ అయిన యాపిల్ భారత్లో కార్యకలాపాలపై ఆసక్తిగా ఉందని తెలుస్తుంది. తాజాగా ఐఫోన్ కెమెరా మాడ్యుల్స్ సరఫరా చేసేందుకు భారత కంపెనీలతో యాపిల్ ఒప్పందం కుదుర్చుకోనున్నట్లు తెలిసింది. ఈమేరకు కొన్ని మీడియా సంస్థలు వార్తాకథనాలు ప్రచురించాయి. ఐఫోన్ కెమెరా మాడ్యుల్స్ తయారీకి టాటా గ్రూప్నకు చెందిన టైటాన్ కంపెనీతో, మురుగప్ప గ్రూప్తో యాపిల్ చర్చలు జరుపుతున్నట్లు కంపెనీ వర్గాలు తెలిపాయి. ఒకవేళ ఈ ఒప్పందం కుదిరితే కుపెర్టినో కంపెనీ తన కార్యకలాపాలను చైనాతోపాటు భారత్లో విస్తరించే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఈ కుపెర్టినో కంపెనీ చైనాలో ఐఫోన్ కెమెరాలను తయారుచేస్తోంది. ఈ ఒప్పందానికి సంబంధించి మరో 5-6 నెలల్లో స్పష్టత వచ్చే అవకాశం ఉన్నట్లు ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న వర్గాలు తెలిపాయి. టైటాన్ గడియారాలు, ఇతర ఆభరణాల తయారీలో ప్రత్యేకత చాటుకుంటోంది. చెన్నై ప్రధాన కార్యాలయంగా ఉన్న మురుగప్ప గ్రూప్నకు ఇంజినీరింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్, కెమికల్స్ రంగంలో 100 ఏళ్ల అనుభవం ఉంది. ఈనేపథ్యంలో ఈ కంపెనీతో ఒప్పందం ఖరారు చేసుకోవచ్చని పరిశ్రమ వర్గాల ద్వారా తెలిసింది. ఎలక్ట్రానిక్స్, కాంపోనెంట్స్ రంగంలో తన వ్యాపారాన్ని విస్తరించాలని నోయిడాకు చెందిన కెమెరా మాడ్యూల్ తయారీ సంస్థ మోషిన్ ఎలక్ట్రానిక్స్లో మురుగప్ప గ్రూప్ 76% వాటాను కొనుగోలు చేసింది. బెంగళూరు ప్రధాన కార్యాలయంగా ఉన్న టైటాన్ కంపెనీ ఇంజినీరింగ్, ఆటోమేషన్లో సేవలందిస్తోంది. హై ప్రెసిషన్ కాంపోనెంట్ తయారీ, ఇంజినీరింగ్ డిజైన్ సర్వీస్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. రక్షణ, ఏరోస్పేస్ వంటి పరిశ్రమల్లోను సేవలందిస్తోంది. యాపిల్ జనవరి నివేదిక ప్రకారం.. 2024-25 ఆర్థిక సంవత్సరం చివరి నాటికి భారత్లో దాదాపు రూ.1 లక్ష కోట్ల విలువైన ఐఫోన్లను తయారుచేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. దాంతో స్థానికంగా ఆ కంపెనీతో భాగస్వామ్యం కుదుర్చుకున్న కంపెనీల ఉత్పత్తి సామర్థ్యం పెరిగింది. ఇండియాలో తయారవుతున్న దాదాపు 70 శాతం ఐఫోన్లు ఇతర దేశాలకు ఎగుమతి చేస్తున్నట్లు కంపెనీ వర్గాలు తెలిపాయి. ఇది మరింత పెరిగి అవకాశం ఉన్నట్లు తెలిసింది. ఇదీ చదవండి: ప్రపంచంలోని రద్దీ ఎయిర్పోర్ట్ల్లో భారత విమానాశ్రయం కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ (పీఎల్ఐ) పథకంలో భాగంగా యాపిల్ భారత్లో తయారీకి ముందుకు వచ్చింది. అందులో భాగంగా ఇప్పటికే ఫాక్స్కాన్, పెగాట్రాన్, విస్ట్రాన్ వంటి ఎలక్ట్రానిక్స్ కంపెనీలతో కలిసి పనిచేస్తోంది. -
ఐఫోన్ అప్డేట్ కూడా తెలియదా..పరువు పోగొట్టుకున్న లోకేష్
-
Apple: స్పైవేర్ దాడులు జరగొచ్చు
న్యూఢిల్లీ: ప్రభుత్వ మద్దతున్న సైబర్ నేరగాళ్లు మీ ఐఫోన్ తదితర యాపిల్ ఉత్పత్తులపై సైబర్దాడులు చేయొచ్చని గతంలో హెచ్చరించి తీవ్ర చర్చకు తెరలేపిన యాపిల్ సంస్థ తాజాగా మరోమారు అలాంటి హెచ్చరికనే చేసింది. పెగాసస్ తరహా అత్యంత అధునాతనమైన స్పైవేర్ దాడులు కీలకమైన పాత్రికేయులు, కార్యకర్తలు, రాజకీయవేత్తలు, దౌత్యవేత్తలను లక్ష్యంగా చేసుకుని జరగొచ్చని యాపిల్ ఏప్రిల్ పదో తేదీ ఒక ‘థ్రెట్’ నోటిఫికేషన్లో పేర్కొంది. ‘‘కొనుగోలుచేసిన అధునాతన స్పైవేర్తో సైబర్ దాడులు జరిగే అవకాశాలను ముందే పసిగట్టి యూజర్లకు సమాచారం ఇవ్వడం, వారిని అప్రమత్తం చేయడం కోసం థ్రెట్ నోటిఫికేషన్లను రూపొందించాం. సాధారణ సైబర్నేరాల కంటే ఈ దాడులు చాలా సంక్షిష్టమైనవి. అత్యంత తక్కువ మందినే లక్ష్యంగా చేసుకుంటారు కాబట్టి ఎవరిపై, ఎందుకు దాడి చేస్తారో చెప్పడం కష్టం. అయితే దాడి జరిగే అవకాశాన్ని మాత్రం ఖచ్చితంగా అంచనావేసి ముందే యూజర్లను అప్రమత్తం చేస్తాం’’ అని థ్రెట్ నోటిఫికేషన్లో యాపిల్ హెచ్చరించింది. సార్వత్రిక ఎన్నికలకు సంసిద్ధమవుతున్న భారత్సహా 60 దేశాల్లోని యూజర్లకు యాపిల్ ఈ నోటిఫికేషన్లు పంపించింది. ఇజ్రాయెల్ తయారీ పెగాసస్ స్పైవేర్ సాయంతో మొబైల్ ఫోన్కు వాట్సాప్ ద్వారా మిస్డ్కాల్ ఇచ్చి కూడా ఆ ఫోన్ను సైబర్నేరగాళ్లు తమ నియంత్రణలోకి తెచ్చుకోవచ్చు. ‘‘ఎవరైనా యూజర్ను సైబర్నేరగాళ్లు లక్ష్యంగా చేసుకుంటే ముందే గుర్తించి ఆ యూజర్ను హెచ్చరిస్తాం. ఐఫోన్ను సైబర్భూతం నుంచి కాపాడాలంటే దానిని లాక్డౌన్ మోడ్లో పెట్టుకోవచ్చు. అప్పుడు ఆ ఫోన్లో ఫింగర్ఫ్రింట్ సెన్సార్, ఫేఫియల్ రికగ్నీషన్, వాయిస్ రిగ్నీషన్ ఏవీ పనిచేయవు. ఒకవేళ మనమే మళ్లీ వాడుకోవాలంటే పిన్ లేదా పాస్కోడ్ లేదా ప్యాట్రన్ సాయంతోనే మళ్లీ ఫోన్ను పనిచేసేలా చేయొచ్చు’’ అని యాపిల్ సూచించింది. ఒక సర్వే ప్రకారం ప్రపంచవ్యాప్తంగా 49 శాతం సంస్థలు తమ ఉద్యోగుల డివైజ్లపై సైబర్ దాడులు/ ఉల్లంఘన ఉదంతాలను పసిగట్ట లేకపోతు న్నాయి. భారత్లో లెక్కిస్తే మొబైల్ మాల్వే ర్ సాయంతో సగటు వారానికి 4.3 శాతం సంస్థలపై సైబర్ దాడులు జరుగుతు న్నాయి. అదే ఆసియాపసిఫిక్ ప్రాంతంలో అయితే గత ఆరు నెలల్లో సగటును 2.6 శాతం సంస్థలపై సైబర్ దాడులు చోటుచేసుకున్నాయి. -
యాపిల్ ఐఫోన్ల తయారీ.. టాటా గ్రూప్ మరో కీలక నిర్ణయం
ప్రముఖ డైవర్సిఫైడ్ దిగ్గజం టాటా గ్రూప్ కీలక నిర్ణయం తీసుకుంది. ఐఫోన్ల తయారి కంపెనీ పెగట్రాన్తో చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఐఫోన్ల తయారీ కోసం బెంగళూరులోని విస్ట్రాన్ ప్లాంట్ను కొనుగోలు చేసిన టాటా ఎలక్ట్రానిక్స్.. తాజా పెగట్రాన్తో సంప్రదింపులు జరగడం ఆసక్తికరంగా మారింది. అయితే టాటా ఎలక్ట్రానిక్ పెగట్రాన్లో మెజారిటీ వాటాను కొనుగోలు చేయనుందని, ఇందుకోసం ఆ సంస్థతో చర్చలు జరుపుతున్నట్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. ఎన్నికలు పూర్తయిన తర్వాత డీల్ ఓ కొలిక్కి వచ్చే అవకాశం ఉందని సమాచారం. కాగా, దీనిపై పెగట్రాన్ గానీ, టాటా ఎలక్ట్రానిక్స్ గానీ స్పందించేందుకు నిరాకరించాయి. -
Apple Security Alert: యాపిల్ యూజర్లకు కేంద్రం హెచ్చరికలు
యాపిల్ యూజర్లకు భారత ప్రభుత్వ సైబర్ సెక్యూరిటీ ఏజెన్సీ సీఈఆర్టీ-ఇన్ కీలక సూచన చేసింది. యాపిల్ ఉత్పత్తులైన ఐఫోన్, మాక్బుక్స్,ఐపాడ్స్, విజన్ ప్రో హెడ్సెట్లు వినియోగిస్తున్న యూజర్లకు హై-రిస్క్లో ఉన్నారని హెచ్చరించింది. నేరస్తులు సైబర్ దాడులు చేసేందుకు వినియోగించే ఆర్బిటరీ కోడ్ యాపిల్ ఉత్పత్తుల్లో గుర్తించినట్లు సీఈఆర్టీ తెలిపింది. సైబర్ నేరస్తులు వినియోగించే ఈ ఆర్బిటరీ కోడ్ కారణంగా యాపిల్ సాఫ్ట్వేర్, హార్డ్వేర్లకు తీవ్రనష్టం వాటిల్లే అవకాశం ఉందని వెల్లడించింది. ముఖ్యంగా యాపిల్ సఫారీ వెర్షన్ ప్రైయర్ టూ 17.4.1, యాపిల్ మాక్ఓఎస్ వెంచురా వెర్షన్ ప్రైవర్ టూ 13.6.6, యాపిల్ మాక్ ఓస్ సోనోమా వెర్షన్ ప్రైవర్ టూ 14.4.1, యాపిల్ ఓఎస్ వెర్షన్ ప్రైయర్ టూ 1.1.1, యాపిల్ ఐఓఎస్ అండ్ ఐపాడ్ ఓస్ వెర్షన్ ప్రైయర్ టూ17.4.1, యాపిల్ ఐఓఎస్ అండ్ ఐపాడ్ ఎస్ వెర్షన్ ప్రైయర్ టూ 16.7.7లపై ప్రతి కూల ప్రభావం ఎక్కువ ఉందని సూచించింది. టెక్ నిపుణుల అభిప్రాయం మేరకు ఐఫోన్ ఎక్స్ఎస్, ఐపాడ్ ప్రో 12.9 అంగుళాలు, ఐపాడ్ ప్రో 10.5 అంగుళాలు, ఐపాడ్ ప్రో 11 అంగుళాలు, ఐపాడ్ ఎయిర్, ఐపాడ్ మినీ వినియోగదారులు 17.4కి ముందు ఐఓఎస్, ఐపాడ్ఓస్ వెర్షన్లను వినియోగిస్తుంటే వాటిపై సైబర్ దాడుల ప్రభావం ఎక్కువగా ఉండనున్నట్లు సమాచారం. అదనంగా, ఐఫోన్ 8, ఐఫోన్ 8 ప్లస్, ఐఫోన్ ఎక్స్, ఐఫాడ్ 5, ఐపాడ్ ప్రో 9.7-అంగుళాల,12.9-అంగుళాల 1వ తరం ఐపాడ్ ప్రోలను వినియోగిస్తున్న యూజర్లు తమ పరికరాలను ఐఓఎస్, ఐపాడ్ఓస్ వెర్షన్లు 16.7.7 లేదా తర్వాతి వెర్షన్లకు అప్డేట్ చేయకపోతే ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందని టెక్నాలజీ నిపుణులు చెబుతున్నారు. -
యాపిల్ కొత్త ఆవిష్కరణల గురించి తెలుసుకోవాలా..?
ప్రపంచ టెక్ దిగ్గజ కంపెనీ యాపిల్ కొత్త ఆవిష్కరణలు తీసుకురావడానికి సిద్ధమైంది. ఏటా ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించే యాపిల్ వరల్డ్వైడ్ డెవలపర్స్ కాన్ఫరెన్స్(WWDC) తేదీలను ప్రకటించింది. ఈ కార్యక్రమంలో వచ్చే ఆర్థిక సంవత్సరంలో కంపెనీ తీసుకురానున్న కొత్త సాఫ్ట్వేర్ ఫీచర్లు, ఉత్పత్తుల గురించి యూజర్లకు పరిచయం చేస్తుంటుంది. ఈ ఏడాది కాన్ఫరెన్స్ను వర్చువల్ వేదికగా జూన్ 10 నుంచి జూన్14 వరకు నిర్వహించనున్నట్లు కంపెనీ తెలిపింది. ప్రస్తుత టెక్ ప్రపంచంలో ఏఐ హవా అంతాఇంతా కాదు. ఈ నేపథ్యంలో యాపిల్ తీసుకురానున్న సాఫ్ట్వేర్ అప్డేట్లలో ఏఐ ఫీచర్లను జోడించే అవకాశం ఉందని టెక్ నిపుణులు అంచనా వేస్తున్నారు. క్లౌడ్ ఆధారిత జనరేటివ్ ఏఐ ఫీచర్ను తీసుకొచ్చేందుకు గూగుల్, బైదూ.. వంటి ఏఐ సంస్థలతో భాగస్వామ్యం గురించి సమాచారం అందొచ్చని కొన్ని నివేదికలు తెలుపుతున్నాయి. ఇక iOS 18, iPadOS 18, macOS 15, watchOS 11, tvOS 18లో కొత్త ఆపరేటింగ్ సిస్టమ్స్ (OS) వివరాలను పరిచయం చేస్తారని తెలిసింది. ఐపాడ్ ఎయిర్, ఓఎల్ఈడీ ఐపాడ్ ప్రోలో కొత్త మోడల్స్ను లాంచ్ చేసే అవకాశం ఉందని అంచనా. యాపిల్ నిర్వహించనున్న కాన్ఫరెన్స్ ఆన్లైన్ అయినప్పటికీ మొదటి రోజు వ్యక్తిగతంగా వెళ్లి హాజరయ్యే అవకాశం ఉందని సంస్థ తెలిపింది. ఆసక్తి ఉన్న వాళ్లు యాపిల్ డెవలపర్ యాప్, కంపెనీ వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొంది. ఇదీ చదవండి: ఐటీ చెల్లింపులపై క్లారిటీ ఇచ్చిన కేంద్రం -
లిక్కర్ స్కాం కేసులో ఈడీ దూకుడు..
ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దూకుడు పెంచింది. మద్యం పాలసీ కేసుకు సంబంధించి మరిన్ని ఆధారాల్ని సేకరించేందుకు సిద్ధమైంది. ఇందులో భాగంగా సీఎం కేజ్రీవాల్ ఉపయోగించిన ఐఫోన్ను పరిశీలించనుంది. ఇందుకోసం ఐఫోన్ లాక్ను ఓపెన్ చేయించుందుకు ఈడీ అధికారులు ఐఫోన్ తయారీ సంస్థ యాపిల్ కంపెనీని ఆశ్రయించనున్నారు. పలు నివేదికల ప్రకారం.. లిక్కర్ కేసు విచారణ నిమిత్తం ఈడీ అధికారులు సీఎం కేజ్రీవాల్ వ్యక్తిగత ల్యాప్ట్యాప్, డెస్క్ట్యాప్లను స్వాధీనం చేసుకున్నారు. వాటితో పాటు మరో నాలుగు ఫోన్లను జప్తు చేశారు. ఆ సమయంలో ఫోన్లు స్విచ్ఛాప్ చేసి ఉన్నాయి. అయితే విచారణ సమయంలో ఆ ఫోన్ల పాస్వర్డ్లను చెప్పేందుకు కేజ్రీవాల్ ఒప్పుకోలేదు. దీంతో ఈడీ అధికారులు కేజ్రీవాల్ ఫోన్ లాక్లను ఓపెన్ చేయించేందుకు యాపిల్ సంస్థను సంప్రదించనున్నట్లు సమాచారం. విచారణకు సహకరించని కేజ్రీవాల్ గత గురువారం కేజ్రీవాల్ కస్టడీని పొడిగించాలని ఈడీ ఢిల్లీ రూస్ అవెన్యూ కోర్టును కోరింది. తమ రిమాండ్లో ఉన్న కేజ్రీవాల్ విచారణకు సహకరించడం లేదని కోర్టుకు తెలిపింది. ‘కేజ్రీవాల్ నుండి రికవరీ చేసిన మొబైల్ ఫోన్ పాస్వర్డ్ను వెల్లడించలేదు. అతను సహకరించకపోతే, మేం ఆ ఫోన్లను (సాంకేతికంగా) తెరవాల్సి ఉంటుంది. మేం అడిగిన ప్రశ్నలకు నేరుగా సమాధానం ఇవ్వడం లేదు. కాబట్టి, కేజ్రీవాల్ రిమాండ్ పొడిగించాలని కోర్టును కోరింది. దీంతో కోర్టు ఏప్రిల్ 1వరకు పొడిగించింది. రేపటితో కేజ్రీవాల్ ఈడీ రిమాండ్ ముగియనుంది. కేజ్రీవాల్ ఐఫోన్ చుట్టూ దర్యాప్తు ఈలోపే కేజ్రీవాల్ మద్యం పాలసీ కేసుకు సంబంధించి ఆధారాల్ని సేకరించేందుకు ఈడీ సిద్ధమైంది. కేజ్రీవాల్ ఐఫోన్ పాస్వర్డ్లను ఓపెన్ చేసి ఆధారాల్ని సేకరించేందుకు యాపిల్ సంస్థను ఆశ్రయించింది. ఫోన్లో ఆప్ ‘ఎన్నికల వ్యూహం’ ఎన్నికలకు ముందు పొత్తుల వివరాలను ఈడీ గోప్యంగా ఉంచనుంది. -
ఉద్యోగులను తొలగించనున్న ప్రపంచ నం1 కంపెనీ.. కారణం..
ప్రపంచ నంబర్1 కంపెనీ యాపిల్ తయారుచేస్తున్న ఐఫోన్లు, వాచ్లకు ఉన్న క్రేజ్ తెలిసిందే. అలాంటి విలువైన కంపెనీలో ఉద్యోగం అంటే ఇక వేరే చెప్పనక్కర్లేదు. కానీ, యాపిల్ తన ఖర్చులు తగ్గించుకునేందుకు ఉద్యోగులను తొలగిస్తోందని వార్తలొస్తున్నాయి. యాపిల్ సుదీర్ఘకాలంగా కొనసాగుతున్న ఒక ప్రతిష్టాత్మక ప్రాజెక్టును మూసేయాలని నిర్ణయానికి వచ్చినట్లు కొన్ని మీడియా కథనాల ద్వారా తెలిసింది. మీడియా కథనాల ప్రకారం.. యాపిల్ స్మార్ట్ వాచ్ డిస్ప్లే డిజైనింగ్ అండ్ డెవలపింగ్ ప్రాజెక్టును మూసేయనుంది. దాంతో కంపెనీ ఆ ప్రాజెక్టులో పని చేస్తున్న ఉద్యోగులకు లేఆఫ్లు ఇవ్వబోతుంది. కొంత కాలం క్రితమే మైక్రో ఎల్ఈడీ టెక్నాలజీతో కూడిన స్క్రీన్ల తయారీని కంపెనీ నిలిపేసింది. మైక్రో ఎల్ఈడీ టెక్నాలజీతో కూడిన స్క్రీన్లు, విజువల్స్ ఎంతో మెరుగ్గా ఉండటంతో అందరూ ‘యాపిల్ వాచ్’ కొనుగోలు చేస్తున్నారు. అయితే, డిస్ ప్లే తయారీ ఖర్చు ఎక్కువ కావడంతో యాపిల్ తన డిస్ ప్లే ఇంజినీరింగ్ టీంలో మార్పులు చేయనుందని సమాచారం. ఈ నేపథ్యంలో అమెరికా, ఆసియా ఖండాల్లోని ఆపిల్ యూనిట్లలో డజన్ల కొద్దీ ఉద్యోగులను తొలగించనుంది. అయితే సరిగ్గా ఎంతమంది ఉద్యోగులను తొలగిస్తున్నారనే దానిపై కంపెనీ ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు. డిస్ప్లే డెవలప్మెంట్ ప్రాజెక్టును మూసేయడానికి ముందే ఉద్యోగులను ఇతర ప్రాజెక్టులు, కంపెనీల్లో తమకు వీలైన కొలువు వెతుక్కునేందుకు సంస్థ అనుమతి ఇచ్చినట్లు తెలిసింది. కానీ అందరికీ ఆ అవకాశం ఉండదు కాబట్టి మిగతా వారిని ఇంటికి సాగనంపేందుకు కంపెనీ సిద్ధమైనట్లు మీడియా కథనాల సారాంశం. ‘టైటన్’ను పక్కన పెట్టిన యాపిల్ యాపిల్ తన ప్రతిష్టాత్మకమైన కారు ప్రాజెక్టును ఎట్టకేలకు రద్దు చేస్తున్నట్లు ప్రకటించిందని ఇటీవలే కథనాలు వెలువడ్డాయి. అటానమస్ డ్రైవింగ్ సామర్థ్యం కలిగిన కారు విడుదల ప్రణాళికలను యాపిల్ పక్కన పెట్టింది. ఈ మేరకు గత దశాబ్దకాలంగా ‘టైటన్’ పేరిట పనిచేస్తున్న రహస్య ప్రాజెక్టుకు స్వస్తి పలికినట్లైంది. ఇదీ చదవండి: భారత్లో భారీ నిక్షేపాలు.. తేలిగ్గా, దృఢంగా మార్చే ధాతువు గతేడాది భారీగా లేఆఫ్స్ లు ప్రకటించిన టెక్ కంపెనీలు..2024లో కూడా అదే పరంపర కొనసాగిస్తున్నాయి. ఈ ఏడాదిలో ఇప్పటికే 50 వేల మంది ఉద్యోగులను తొలగించాయి. కంపెనీ పునర్వవస్థీకరణ, ఖర్చుల తగ్గింపు, అప్డేటెడ్ టెక్నాలజీ వినియోగం, కొత్త వ్యాపారంలోకి ప్రవేశించడం వంటి కారణాలతో ప్రపంచవ్యాప్తంగా సాఫ్ట్ వేర్, హెల్త్ రంగంలోని కంపెనీలు ఉద్యోగులపై వేటువేస్తున్నాయి. -
మరీ ఇంత మోసమా? ఐఫోన్ ఆర్డర్ చేసిన వ్యక్తికి షాక్..
ఆన్లైన్లో కొనుగోలు చేసే వస్తువులు కొన్ని సందర్భాల్లో మారిపోతూ ఉంటాయి. ఒక వస్తువు బుక్ చేస్తే.. మరో వస్తువు డెలివరీ అయిన సందర్భాలు చాలానే వున్నాయి. ఇటీవల కూడా ఇలాంటి సంఘటనే ఒకటి వెలుగులోకి వచ్చింది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న సమాచారం ప్రకారం, గబ్బర్ సింగ్ అనే వ్యక్తి అమెజాన్లో ఒక ఐఫోన్ 15 ఆర్డర్ చేశారు. అయితే అతనికి డెలివరీ అయిన ఫోన్ను చూసి ఒక్కసారిగా నిర్ఘాంతపోయాడు. ఎందుకంటే అతనికి వచ్చిన ఫోన్ నకిలీది. దీనికి సంబంధించిన ఫోటోలను తన ఎక్స్ (ట్విటర్) ఖాతా ద్వారా వెల్లడించారు. వావ్ అమెజాన్ ఇన్.. ఒక నకిలీ ఐఫోన్ 15ని డెలివరీ చేసింది. బాక్స్లో కేబుల్ కూడా లేదు. మొత్తం డబ్బా, ఇలాంటి సమస్యను ఎవరైనా ఎదుర్కొన్నారా? అంటూ ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట్లో వైరల్ అవుతోంది. పలువురు నెటిజన్లు తమదైన రీతిలో కామెంట్స్ చేస్తూ రెస్పాండ్ అవుతున్నారు. ఈ సంఘటనపైన అమెజాన్ స్పందించి ఇలా జరిగినందుకు మమ్మల్ని క్షమించండి, ఆర్డర్ వివరాలను తెలియజేస్తే.. 6 నుంచి 12 గంటల్లో మీకు తప్పకుండా సహాయం చేస్తామని వెల్లడించింది. ఐఫోన్ కోసం వెచ్చించిన మొత్తాన్ని రీఫండ్ చేయమని బాధితుడు అమెజాన్ను కోరారు. ఇదీ చదవండి: కోట్లు సంపాదిస్తున్న సానియా మీర్జా చెల్లెలు.. ఆస్తి ఎంతంటే? Waah @amazonIN delivered a Fake iPhone 15. Seller is Appario. Tagged with “Amazon choice” No cable in the box. Total Dabba. Has anyone faced similar issue? pic.twitter.com/QjUqR7dKSU — Gabbar (@GabbbarSingh) February 23, 2024 -
ఐఫోన్ పోగొట్టుకున్నారా? ..సుప్రీం కోర్టు కీలక తీర్పు!
దొంగతనాలకు గురైన ఐఫోన్లకు సంబంధించి భారత సుప్రీంకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. ఈ తీర్పులో కస్టమర్లు పోగొట్టుకున్న ఐఫోన్లను కనుగొనడంలో యాపిల్ ఇండియా బాధ్యతకు సంబంధించిన కీలక సమస్యను దేశ అత్యున్నత న్యాయస్థానం ప్రస్తావించింది. యాపిల్ సంస్థకు వ్యతిరేకంగా ఒడిశా స్టేట్ కన్స్యూమర్ కమిషన్ ఇచ్చిన ఆదేశాలను రద్దు చేస్తూ తస్కరణకు గురైన ఐఫోన్లను ప్రత్యేక గుర్తింపు సంఖ్యలతో ట్రేస్ చేసే బాధ్యత యాపిల్ కంపెనీకి లేదని అత్యున్నత న్యాయస్థానం పేర్కొందని లైవ్ లా అనే వార్తా సంస్థ నివేదించింది. వినియోగదారుల కమిషన్ ఆదేశాలపై యాపిల్ ఇండియా దాఖలు చేసిన అప్పీల్ను న్యాయమూర్తులు విక్రమ్ నాథ్, సతీష్ చంద్ర శర్మలతో కూడిన ధర్మాసనం విచారించింది. థెఫ్ట్ ఇన్సూరెన్స్తో ఐఫోన్ను కొనుగోలు చేసిన వినియోగదారుడు తన ఫోన్ చోరీకి గురైనట్లు పోలీసులకు, యాపిల్ ఇండియాకు ఫిర్యాదు చేయడంతో ఈ కేసు ప్రారంభమైంది. అయితే పోయిన ఐఫోన్ను ట్రాక్ చేయడానికి ఆపిల్ ఇండియా ఎటువంటి చర్య తీసుకోలేదు. దీంతో వినియోగదారుడు ఫిర్యాదు దాఖలు చేయడంతో జిల్లా వినియోగదారుల ఫోరమ్ బాధితుడికి అనుకూలంగా తీర్పునిచ్చింది. ఈ నిర్ణయంపై యాపిల్ ఇండియా ఒడిశా స్టేట్ కన్స్యూమర్ కమిషన్కు అప్పీల్ చేసింది. దొంగతనానికి గురైన ఫోన్ను ప్రత్యేక గుర్తింపు సంఖ్యలతో ట్రేస్ చేయాల్సిన బాధ్యత ఐఫోన్ తయారీదారుగా యాపిల్ ఇండియాకు ఉందని ఒడిశా స్టేట్ కన్స్యూమర్ కమిషన్ తీర్పు పేర్కొంది. ఈ తీర్పుపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ యాపిల్ ఇండియా సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఇరుపక్షాల వాదనలు విన్న సుప్రీంకోర్టు ఒడిశా రాష్ట్ర వినియోగదారుల కమిషన్ ఆదేశాన్ని అన్యాయమని పేర్కొంటూ దానిని తోసిపుచ్చింది. అయితే బాధితుడికి యాపిల్ ఇండియా పరిహారాన్ని పరిగణనలోకి తీసుకుంటూనే దొంగతనానికి గురై ఫోన్లను కనుగొనవలసిందిగా ఆపిల్ ఇండియాను కోరడం అసమంజసమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. -
ఐఫోన్ నీళ్లలో పడిందా.. ఈ ఒక్కటి చేయండి - యాపిల్ సలహా
మనం రోజు ఉపయోగించే స్మార్ట్ఫోన్ నీటిలో పడినప్పుడు చాలామంది చేసేపని దాన్ని తీసి వెంటనే తుడిచి ఓ బియ్యం సంచిలోనో లేక డబ్బాలోనో ఉంచి, కొంత సమయం వేచి ఉన్న తరువాత దానికి మళ్ళీ ఛార్జింగ్ పెడతారు. అయితే ఈ విధానం 'ఐఫోన్'ల విషయంలో అమలు చేయకూడదని యాపిల్ కంపెనీ పేర్కొంది. ఐఫోన్ నీళ్లలో పడితే దాన్ని బియ్యం సంచిలో ఉంచకూడదని, అలా చేస్తే బియ్యంలో ఉండే సూక్ష్మ రేణువులు ఫోన్లోకి చేసే అవకాశం ఉంది, తద్వారా ఫోన్ పాడయ్యే అవకాశం ఉంటుందని యాపిల్ కంపెనీ పేర్కొంది. నీళ్లలో ఐఫోన్ పడితే దాన్ని దానిలోకి చేరిన నీటిని మెల్లగా బయటకు తీయడానికి కిందివైపు ఉన్న డివైజును నెమ్మదిగా/సున్నితంగా కొట్టాలి. ఆ తరువాత గాలి వీచే ప్రదేశంలో ఉంచాలి. ఓ అరగంట తరువాత కేబుల్తో ఛార్జ్ చేయాలి. ఇదీ చదవండి: కంటెంట్ క్రియేటర్ల కోసం బెస్ట్ ల్యాప్టాప్స్ ఇవే! ధరలు ఎలా ఉన్నాయంటే? నిజానికి ఫోన్లోకి చేరిన నీరు బయటకు రావడానికి ఒక రోజు సమయం కూడా పట్టొచ్చు. దీనిని లిక్విడ్ డిటెక్షన్ అలర్ట్ సాయంతో ఫోన్ పరిస్థితిని తెలుసుకోవచ్చు. ఇంకా ఏదైనా అనుమానం ఉంటే దాన్ని యాపిల్ అధీకృత సర్వీస్ ప్రొవైడర్ వద్దకు తీసుకెళ్లాలని సంస్థ సూచించింది. -
లాంచ్కు ముందే ఐఫోన్ 16 వివరాలు లీక్!
యాపిల్ కంపెనీ ఎప్పటికప్పుడు మార్కెట్లో కొత్త ఉత్పత్తులను లాంచ్ చేస్తూనే ఉంది. ఇందులో భాగంగానే కంపెనీ త్వరలో ఐఫోన్ 16 సిరీస్ లాంచ్ చేయడానికి సిద్ధమవుతోంది. ఈ ఫోన్ లాంచ్ కావడానికి ముందే.. దీనికి సంబంధించిన కొన్ని వివరాలు లీక్ అయ్యాయి. ఇప్పటి వరకు లీక్ అయిన వివరాల ప్రకారం, ఐఫోన్ 16 సిరీస్ మొత్తం 5 వేరియంట్లలో లాంచ్ అయ్యే అవకాశం ఉందని సమాచారం. వీటి ధరలు రూ.58 వేలు నుంచి రూ.91 వరకు ఉండవచ్చని తెలుస్తోంది. ఇవి ఖచ్చితమైన ధరలు కాదు, కంపెనీ ఈ ఐఫోన్ 16 లాంచ్ చేసే సమయంలో అధికారిక ధరలను వెల్లడిస్తుంది. ఐఫోన్ 16 సిరీస్ ఇప్పటి వరకు ఉన్న ఇతర మోడల్స్ కంటే కూడా ఎక్కువ అప్డేట్స్ పొందుతుందని, కొత్త వేరియంట్స్ కూడా అందుబాటులో వచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు. వీటిలో 6.1 ఇంచెస్, 6.7 ఇంచెస్ డిస్ప్లేలు ఉంటాయని సమాచారం. కొత్త ఐఫోన్ 16లో సింగిల్ పిల్ షేప్లో కెమెరా ఉండే అవకాశం ఉంది. ఇవన్నీ ఎంతవరకు వాస్తవమని విషయం తెలియాల్సి ఉంది. డిజైన్, ఫీచర్స్ అన్నీ కూడా దాని మునుపటి మోడల్స్ కంటే అద్భుతంగా ఉంటుందని భావించవచ్చు. అయితే ఇందులో ఎలాంటి ఫీచర్స్ ఉంటాయనేది అధికారికంగా తెలియాల్సి ఉంది. కంపెనీ ఈ ఐఫోన్ 16 సిరీస్ ఫోన్లను ఈ ఏడాది సెప్టెంబర్ నెలలో లాంచ్ చేసే అవకాశం ఉంది. -
‘నా జీవితాన్ని నాశనం చేయొద్దు నాన్న’!
ఐఫోన్! పరిచయం అక్కర్లేని పేరు. సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు యాపిల్ తయారు చేసిన ఐఫోన్లను అంటే మక్కువ. కానీ సెలబ్రిటీలు ఐఫోన్ను కొనుగోలు చేస్తున్నా దాని ధర కారణంగా సామాన్యులకు అందని ద్రాక్షలాగే మిగిలిపోతుంది. ఇప్పుడు అలాంటి కాస్ట్లీ ఐఫోన్ని కావాలని ఓ 11 ఏళ్ల అమ్మాయి మారం చేస్తోంది. అందుకు ఆ చిన్నారి తండ్రి ఏం చేశాడు. గత దశాబ్దకాలంగా లేటెస్ట్గా మార్కెట్లో విడుదలవుతున్న గాడ్జెట్లు ఎంత ఖరీదైనవి అయినప్పటికీ పిల్లలు సైతం వాటిని కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. వాటిల్లో యాపిల్ తయారు చేసిన ఐఫోన్తో పాటు ఇతర ఉత్పత్తులు ప్రత్యేకం. నాకు ఐఫోన్ 15 కావాలి తాజాగా, ఓ తండ్రిని తన 11 ఏళ్ల కుమార్తె ఐఫోన్ 15 కొనిపెట్టమని అడిగింది. అందుకు అతను సున్నితంగా తిరస్కరించాడు. అంత ధర పెట్టి ఫోన్ కొనుగోలు చేయకూడదని సర్ధి చెప్పే ప్రయత్నం చేశాడు. సరే కుమార్తె అడిగింది కదా.. పోనీలే అని కెమెరా పనితనం, బ్యాటరీ లైఫ్టైం బాగుందనే ఉద్దేశ్యంతో ఐఫోన్ 13 ఫోన్ని కొనుగోలు చేస్తానని మాటిచ్చాడు. ఐఫోన్ 13 కొనిస్తా నాన్న అందుకు కుమార్తె ససేమిరా అన్నది. ‘నాకు 11 ఏళ్ల కుమార్తె ఉంది. రెండేళ్ల క్రితం ఆమెకు నా పాత ఐఫోన్ 8ని ఇచ్చాను. ఆ ఫోన్తో తన స్నేహితులతో మాట్లాడుకునేందుకు, సోషల్ మీడియాను వాడుతుంది. ఇటీవల ఆమె స్నేహితులు కొత్త ఫోన్లను కొనుగోలు చేశారు. తనకి కూడా కొత్త ఫోన్ కావాలని మారం చేస్తోంది. నా ఫోన్ పాతది. నా స్నేహితులు కొత్త ఫోన్లు కొనుక్కున్నారు. నా క్కూడా కొత్త ఫోన్ కొనిపెట్టమని అడుగుతుంది. సరే నా కూతురు ఫోన్ అడిగిందని ఐఫోన్ 13ని కొనుగోలు చేసేందుకు సిద్ధపడ్డా. ఇతర లేటెస్ట్ ఐఫోన్ సిరీస్లు ఎలా ఉన్నాయో.. ఆ ఫోన్ కూడా అలాగే ఉంది. ధర కూడా 600 డాలర్లు. అయితే, ఆఫోన్ 120హెచ్జెడ్ డిస్ప్లే ఉందని, గేమ్స్ ఆడుకునేందుకు ఐఫోన్ 15 ప్రో మ్యాక్స్ని కోరుకుంటుంది. ఆ ఫోన్ కూడా అంతే 120 హెచ్జెడ్ డిస్ప్లేగా ఉందిగా. ఐఫోన్ 15 కొనడం డబ్బు వృధా అని భావించాను. కానీ నా నిర్ణయాన్ని నా 11 ఏళ్ల కుమార్తె విభేదించింది. మీరే నా జీవితాన్ని నాశనం చేస్తున్నారని అంటోంది. గడుగ్గాయ్.. చివరికి అనుకున్నది సాధించింది ‘నా కుమార్తె గేమర్. పాతది అయినందున తన ఫోన్ సరిగ్గా గేమ్ చేయడం లేదని ఎప్పుడూ ఫిర్యాదు చేస్తూ ఉంటుంది. ఆమె ఐఫోన్ 13ని కొనిస్తానని నేను ఇప్పటికే చెప్పాను. కానీ ఆమె ఐఫోన్ 15 ప్రో మ్యాక్స్ కావాలని మొండిగా ప్రవర్తిస్తుంది. ఏం చేయాలో పాలుపోవడం లేదంటూ సోషల్ మీడియాలో వాపోయాడు తండ్రి. చివరికి తన కుమార్తెకు ఐఫోన్ 15 మ్యాక్స్ ప్రోని కొనిచ్చి సంతోష పెట్టిందని అన్నాడు. ఈ పోస్ట్పై నెటిజన్లు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఇంత చిన్న వయస్సు అంత ఖరీదైన ఫోన్ కొనొద్దని, పిల్లలకు అతిగారాభం మంచిది కాదని సలహా ఇస్తున్నారు. -
ఇదేం ‘సేల్’ బాబోయ్.. అంతా మోసం! ఐఫోన్15 ఆర్డర్ చేస్తే..
ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ ఫ్లిప్కార్ట్ కస్టమర్లను బెంబేలెత్తిస్తోంది. ప్రత్యేక సేల్ పేరుతో భారీ తగ్గింపులు ఇస్తూ కస్టమర్లను ఆకట్టుకుంటోంది. దీంతో అత్యధికంగా ఉత్పత్తులు అమ్ముడుపోతున్నాయి. అయితే తమకు లోపాలతోకూడిన ఉత్పత్తులు డెలివరీ అవుతున్నాయని కస్టమర్ల నుంచి ఫిర్యాదులు వెల్లువెత్తున్నాయి. ఫ్లిప్కార్ట్ రిపబ్లిక్ డే సేల్ సందర్భంగా ఓ వ్యక్తి ఐఫోన్ 15 ఆర్డర్ చేయగా అది నకిలీ బ్యాటరీతో వచ్చింది. ఈ మేరకు తనకు వచ్చిన లోపభూయిష్టమైన ఐఫోన్ 15కు సంబంధించిన ఫోటోలు, వీడియోను సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ‘ఎక్స్’ (ట్విటర్)లో షేర్ చేశాడు. నలికీ బ్యాటరీతో వచ్చిన ఈ ఐఫోన్ 15ను రీప్లేస్ చేయడానికి ఫ్లిప్కార్ట్ నిరాకరించిందని వాపోయాడు. “నేను జనవరి 13న ఫ్లిప్కార్ట్ నుంచి iPhone 15ని ఆర్డర్ చేశాను. జనవరి 15న డెలివరీ వచ్చింది. కానీ Flipkart మోసం చేసింది. లోపభూయిష్టమైన ఐఫోన్ 15ని పంపించింది. బాక్స్ ప్యాకేజింగ్ కూడా నకిలీదే. ఇప్పుడు దీన్ని రీప్లేస్ చేయడం లేదు” అని అజయ్ రాజావత్ అనే యూజర్ ‘ఎక్స్’లో రాసుకొచ్చారు. దీనిపై యూజర్లు మిశ్రమంగా స్పందించారు. I ordered iPhone 15 from Flipkart on 13th Jan and I got it on 15th Jan but Flipkart has done fraud they have delivered defective iPhone15 and box packaging was also fake. Now they are not replacing OrderID-OD330202240897143100@flipkartsupport @jagograhakjago @stufflistings pic.twitter.com/dfLEh3FSnk — Ajay Rajawat (@1234ajaysmart) January 18, 2024 -
ఐఫోన్ల కోసం ఓ కీబోర్డ్.. అదెలా పనిచేస్తుందంటే?
స్మార్ట్ఫోన్లోని టచ్స్క్రీన్ కీబోర్డు మీద టైప్చేయడం చాలామందికి ఇబ్బందిగా ఉంటుంది. స్మార్ట్ఫోన్లకు భౌతికంగా కీబోర్డు లేకపోవడం లోపమే! ఈ లోపాన్ని భర్తీ చేయడానికే స్మార్ట్ఫోన్కు పనికొచ్చే భౌతికమైన కీబోర్డును అమెరికన్ కంపెనీ క్లిక్స్ టెక్నాలజీ రూపొందించింది. తొలిప్రయత్నంగా ఐఫోన్–15 మోడల్కు ఉపయోగపడే కీబోర్డును ‘క్లిక్స్’ పేరుతో నమూనాగా రూపొందించింది. సాధారణ టైప్రైటర్, డెస్క్టాప్, లాప్టాప్ కంప్యూటర్ల కీబోర్డు తరహాలోనే ఉన్న ఈ కీబోర్డు ద్వారా స్మార్ట్ఫోన్లో సులువుగా టైప్ చేయడానికి వీలవుతుంది. ఈ ఏడాది లాస్ వేగస్లో జరగనున్న సీఈఎస్–2024 షోలో ఈ కీబోర్డును క్లిక్స్ టెక్నాలజీ సంస్థ ప్రదర్శించనుంది. -
ఐఫోన్ 16 సిరీస్ డిజైన్లు.. తెరపైకి మరో రూమర్!
ప్రముఖ టెక్ దిగ్గజం యాపిల్ ప్రతి ఏడాది ఐఫోన్ సిరీస్ ఫోన్లను విడుదల చేస్తుంది. ఇప్పటికే గత ఏడాది ఐఫోన్ 15 సిరీస్ను విడుదల చేసిన యాపిల్ ఈ ఏడాది ఐఫోన్ 16 సిరీస్ను మార్కెట్కు పరిచయం చేయనుంది. అయితే, ఈ లేటెస్ట్ సిరీస్ ఫోన్ డిజైన్పై రూమర్లు సోషల్ మీడియాలో చక్కెర్లు కొడుతున్నాయి. ఐఫోన్ 16తో తీసుకునే ఫోటోలు, వీడియోల కోసం యాపిల్ సంస్థ కొత్త బటన్పై పనిచేస్తుందని, ప్రోటోటైప్లపై దాని వినియోగం ఎలా ఉందో పరిశీలిస్తున్నట్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. ఈ బటన్ను ఐఫోన్లపై అమర్చితే సింగిల్ క్లిక్తో ఫోటోలు, వీడియోలు తీసుకునే వెసులు బాటు కలగనుంది. నివేదిక ప్రకారం.. కెమెరా బటన్ ఫోన్కు కుడి దిగువన ఉండవచ్చని, అంటే ల్యాండ్స్కేప్ మోడ్లో ఫోటోలు ,వీడియోలను తీసేటప్పుడు అది నేరుగా చూపుడు వేలు కింద ఉంటుందని పేర్కొంది. ముఖ్యంగా, గత సంవత్సరం సెప్టెంబర్లో లాంచ్ చేసిన యాపిల్ ఐఫోన్ 15 సిరీస్ను పాత ఫోన్ సిరీస్ల కంటే భిన్నంగా మ్యూట్ బటన్ను భర్తీ చేస్తూ కొత్త యాక్షన్ బటన్తో వచ్చింది. మాక్ రూమర్స్ ప్రకారం.. ఐఫోన్ 16 సిరీస్లో ప్రాజెక్ట్ నోవా పేరుతో కొత్త కెమెరా బటన్ మెకానికల్కు బదులుగా కెపాసిటివ్ బటన్గా ఉంటుందని అంచనా వేయబడింది. ఐఫోన్ ఎస్ఈ లోని హోమ్ బటన్ను పోలి ఉండేలా కొత్త బటన్ ఉండవచ్చని తెలుస్తోంది. -
‘సంపాదన తగ్గింది’.. సీఈఓ టిమ్కుక్కు యాపిల్ భారీ షాక్!
ప్రముఖ టెక్ దిగ్గజం యాపిల్కు వచ్చే ఆదాయం తగ్గడంతో ఆ సంస్థ సీఈఓ టిమ్కుక్ సంపాదించే సంపాదన తగ్గించింది. 2022తో పోలిస్తే 2023లో ఆయన సంపాదన భారీగా తగ్గినట్లు యాపిల్ సంస్థ విడుదల చేసిన ఓ నివేదికలో తేలింది. ఆ నివేదిక ప్రకారం.. టిమ్కుక్ గత ఏడాది భారీ మొత్తంలో సంపాదించారని, కానీ అది 2022లో కంటే తక్కువగా ఉన్నట్లు తేలింది. 2022లో ఆయన సంపాదించిన మొత్తం 99.4 మిలియన్లు కాగా 2023లో 63.2 మిలియన్లగా ఉందని నివేదికలో పేర్కొంది. రిపోర్ట్లో ఏముందంటే? ఇటీవల యాపిల్ తన వార్షిక నివేదికను విడుదల చేసింది. అందులో టిమ్ కుక్కు అందించే పరిహారం, షేర్ హోల్డర్స్ సలహాలు, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్లో మార్పులు వంటి అంశాలను ప్రధానంగా చర్చించింది. అందులో యాపిల్ సీఈఓ సంపాదన తగ్గినట్లు హైలెట్ చేసింది. టిమ్కుక్ విమాన ఖర్చులు యాపిల్ 2022లో సీఈఓ కుక్కి అందించే శాలరీ, స్టాక్ అవార్డ్స్, నాన్ ఈక్విటీ బోనస్ (పరిహారం) 84 మిలియన్లగా నిర్దేశించింది. అయితే అతను అంచనాలను మించి 99.4 మిలియన్లను సంపాదించాడు. కానీ 2023కి కుక్ పరిహారం 40 శాతం తగ్గి 49 మిలియన్లకు పడిపోయింది. కుక్ అందించే పరిహారంలో 3 మిలియన్ల జీతం, స్టాక్ అవార్డులు మొత్తం 46,970,283 డాలర్లు, నాన్-ఈక్విటీ ఇన్సెంటివ్ ప్లాన్ పరిహారం మొత్తం 10,713,450 డాలర్లు, ఇతర పరిహారం 2,526,112 డాలర్ల వరకు పొందారు. 2023లో కుక్ కోసం యాపిల్ వ్యక్తిగత విమాన ప్రయాణ కోసం 1,621,468 డాలర్లు ఖర్చు చేసిందని, 2022లో వెచ్చించిన మొత్తం కంటే రెండింతలు ఎక్కువ అని నివేదిక వెల్లడించింది. కంపెనీ కుక్ కోసం వ్యక్తిగత భద్రత కోసం 820,309 డాలర్లు పెట్టుబడి పెట్టింది యాపిల్ సగటు ఉద్యోగి వేతనం ఎంతంటే? 2023లో తన సగటు ఉద్యోగికి సగటు వార్షిక మొత్తం పరిహారం 94,118 డాలర్లు అని యాపిల్ తెలిపింది. ఇక టిమ్కుక్తో పాటు మిగిలిన ఎగ్జిక్యూటీవ్లకు యాపిల్ భారీ మొత్తాన్ని అందించింది. వారిలో సీఎఫ్ఓ లూకా మాస్త్రి : 26,935,883 డాలర్లు జనరల్ కౌన్సెల్ అండ్ సెక్రటరీ కేట్ ఆడమ్స్ : 26,941,705 డాలర్లు రిటైల్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ ఓబ్రెయిన్ : 26,937,010 డాలర్లు సీఓఓ జెఫ్ విలియమ్స్ : 26,961,221 డాలర్లను అందిచినట్లు యాపిల్ తన నివేదికలో వెల్లడించింది. -
ఐఫోన్ యూజర్లకు శుభవార్త.. నష్టపరిహారం చెల్లిస్తున్న యాపిల్!
మీరు పాత ఐఫోన్లను వినియోగిస్తున్నారా? వాటిల్లో ఏమైనా బ్యాటరీ సంబంధిత సమస్యలు తలెత్తుతున్నాయా? ఈ తరహా ఇబ్బందులు తలెత్తుంటే ప్రముఖ టెక్ దిగ్గజం, ఐఫోన్ తయారీ సంస్థ యాపిల్ నష్టపరిహారం చెల్లిస్తుంది. సుమారు 8 ఏళ్ల క్రితం నమోదైన యాపిల్పై ‘బ్యాటరీగేట్’ క్లాస్-యాక్షన్ లాసూట్ నమోదైంది. ఈ కేసుకు సంబంధించిన ఐఫోన్లను వినియోగిస్తుంటే యాపిల్ నుంచి నష్టపరిహారం పొందవచ్చు. అసలేంటి యాపిల్ ‘బ్యాటరీగేట్’ వివాదం 2016లో యాపిల్ సంస్థకు చెందిన ఐఫోన్ 6, ఐఫోన్ 6 ఎస్, 7 సిరీస్తో పాటు ఎస్ఈ మోడల్ ఫోన్లపై అనేక ఫిర్యాదులు వెల్లువెత్తాయి. ఐఫోన్ సిరీస్ మోడళ్లు స్లో అవ్వడంతో వాటిని ఆపరేట్ చేయలేపోతున్నామంటూ అమెరికాకు చెందిన సుమారు 33 రాష్ట్రాల యూజర్లు మూకుమ్మడిగా సంబంధిత రాష్ట్రాల కోర్టులను ఆశ్రయించారు. యాపిల్ సంస్థ ధనార్జన కోసం కావాలనే తమ ఫోన్లలో కొత్త సాఫ్ట్వేర్ అప్డేట్ చేసిందని, తద్వారా మేం వినియోగించే ఫోన్లు పనిచేయడం మందగిస్తే.. కొత్త ఫోన్లు కొనుక్కోవాల్సిన అవసరం ఏర్పడుతుంది. అలా కొనుగోలు చేస్తే ఐఫోన్ల అమ్మకాలు జరిగి.. యాపిల్ సంస్థకు లబ్ధి చేకూరుతుందని ఆరోపించారు. యాపిల్ అనాలోచిత నిర్ణయం వల్లే వినియోగదారుల హక్కుల కోసం పోరాడే జస్టిన్ గుట్మాన్ సైతం యాపిల్కు వ్యతిరేకంగా కోర్టులో కేసు వేశారు. ఫోన్లో సాఫ్ట్వేర్ అప్డేట్లతో పాటు పవర్ మేనేజ్మెంట్ టూల్ వల్ల ఐఫోన్లు అకస్మాత్తుగా షట్డౌన్ అవ్వడం, బ్యాటరీ సంబంధిత సమస్యలు ఉత్పన్నమవుతున్నాయని పిటిషన్లో పేర్కొన్నారు. యాపిల్ నిర్ణయంతో ఐఫోన్ 6, 6ప్లస్, 6 ఎస్, 6ఎస్ ప్లస్, ఎస్ఈ,7, 7 ప్లస్, 8, 8 ప్లస్, ఐఫోన్ ఎక్స్ను వినియోగిస్తున్న యూకేలో 25 మిలియన్ల ఐఫోన్ యూజర్లకు నష్టం వాటిల్లిందని, ఆ మొత్తం విలువ 768 మిలియన్లని కోర్టుకు ఆధారాల్ని అందించారు. తెరపైకి బ్యాటరీగేట్ వివాదం ఈ వివాదాన్ని మరింత ఉదృతం చేసేలా.. యాపిల్ కంపెనీ ఐఫోన్లను ఉద్దేశపూర్వకంగా ప్రాసెసర్ పనితీరు మందగించేలా వ్యవహరించిందని తెలిపేలా ‘బ్యాటరీగేట్’ అనేపదాన్ని అనే పదాన్ని రూపొందించారు. ‘బ్యాటరీగేట్’ పేరును ట్రెండింగ్లోకి తెచ్చారు. బాధిత యూజర్లకు 92 డాలర్ల నష్టపరిహారం ఈ వివాదం చిలిచిలికి గాలివానలా మారింది. వినియోగదారుల ఫిర్యాదు దెబ్బకు యాపిల్ దిగొచ్చింది. 2020లో బాధిత యూజర్లకు 500 మిలియన్ల నష్టపరిహారం చెల్లిస్తామని అంగీకరించింది. ఒప్పందం ప్రకారం.. యాపిల్ ఇటీవల ప్రతి ఒక్క బాధిత యూజర్కు 92 డాలర్ల వరకు నష్టపరిహారం చెల్లిస్తున్నట్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి.
Pagination
మళ్లీ చరిత్ర సృష్టిస్తున్నాం
చేతులు కాలాక ఆకులు పట్టుకున్న ఈసీ
ఓటీటీలోకి వచ్చేసిన మిడిల్ క్లాస్ మూవీ.. స్ట్రీమింగ్ అందులోనే?
వరల్డ్కప్ జట్టులో నో ఛాన్స్: రోహిత్పై కేఎల్ రాహుల్ కామెంట్స్ వైరల్
ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు అలెర్ట్.. మారిన విత్ డ్రా నిబంధనలు
ఎన్ఆర్ఐతో విధి ఆడిన వింత నాటకం.. విషాదం
స్వాతి మలివాల్ డ్రామా.. బీజేపీ కుట్రే ఇదంతా: సంచలన వీడియో బయట పెట్టిన ఆప్
Heeramandi Jewellery ఎవరీ సినిమా నగల స్పెషలిస్ట్ జంట
పెళ్లి చేసి పల్లకిలో పంపాలనుకున్నాం.. కానీ : పుణే బాధితులు కన్నీరుమున్నీరు
తప్పక చదవండి
- బిస్కెట్ ప్యాకెట్ల బరువు తగ్గింది.. భారీ జరిమానా పడింది!
- సినిమాలకు దూరం : కానీ ఈ స్టార్కిడ్ నెట్వర్త్ తెలిస్తే ఆశ్చర్యపోతారు
- సన్రైజర్స్ కాదు..ఐపీఎల్ టైటిల్ కేకేఆర్దే: ఆసీస్ లెజెండ్
- మిగతా హీరోయిన్లకు నయనతారకు తేడా అదే.. అందుకే ఇన్నేళ్ల పాటు!
- Mangalagiri: రెండోసారి ఓటమికి సిద్ధమైన లోకేష్!
- డ్రగ్స్ కేసు: హేమతో పాటు వారందరికీ నోటీసులు జారీ
- హార్దిక్ పాండ్యా విడాకులు?.. భరణం కింద ఏకంగా అంత మొత్తమా?
- చిన్న కోడలికి నీతా అంబానీ వెడ్డింగ్ గిఫ్ట్: రూ.640 కోట్ల దుబాయ్ లగ్జరీ విల్లా
- TG: అకడమిక్ క్యాలెండర్ రిలీజ్.. దసరా, సంక్రాంతి సెలవులు ఎన్నంటే?
- బెంగళూరు రేవ్ పార్టీ కేసు: చిత్తూరు అరుణ్ కుమార్ అరెస్ట్
Advertisement