-
'జాతిరత్నాలు' ఫేమ్ ఫరియా అబ్దుల్లా పెళ్లి.. వరుడు ఎవరంటే..?
తొలి సినిమా 'జాతిరత్నాలు'తో 'చిట్టి' పేరుతో యూత్ గుండెల్ని తాకింది ఫరియా అబ్దుల్లా. మొదట్లో ఆమెను చూసిన వారందరూ కూడా ఉత్తరాది అమ్మాయి అనుకున్నారు కానీ ఆమె అచ్చమైన హైదరాబాదీ. పుట్టింది, పెరిగింది, చదివింది... భాగ్యనగరంలోనే. జాతిరత్నాలు తర్వాత పలు సినిమాలతో పాటు వెబ్ సిరీస్లలో కనిపించిన ఈ బ్యూటీ త్వరలో పెళ్లికి రెడీ అయినట్లు వార్తలు వస్తున్నాయి. తన చిన్ననాటి స్నేహితుడితో ఫిరియా పెళ్లి జరగనున్నట్లు ఇండస్ట్రీలో ప్రచారం జరుగుతుంది. అతను కూడా సినిమా ఇండస్ట్రీకి దగ్గరగా ఉండే వ్యక్తితో ఆమె వివాహం జరగనుందట. ఇప్పటికే ఆయన పలు షార్ట్ ఫిలిమ్స్లలో నటించాడని అంటున్నారు. ఇందులో ఎంతవరకు నిజం ఉందో తెలియదు కానీ సోషల్ మీడియాలో ప్రచారం మాత్రం భారీగా జరుగుతుంది. నిజం ఎంటో తెలియాలంటే మన చిట్టి చెప్పే వరకు వేచి ఉండాల్సిందే. ప్రపంచమంతా స్వేచ్ఛగా తిరగాలనుకుంటున్నానని గతంలో ఓ ఇంటర్వ్యూ ద్వారా చెప్పిన ఫరియా.. తనకు కొంతమంది బాయ్ఫ్రెండ్స్ ఉన్నారని కూడా తెలిపింది. కానీ వాళ్లు కేవలం బాయ్ఫ్రెండ్స్ మాత్రమేనని. రిలేషన్, పెళ్లి లాంటి విషయాలపై పెద్దగా నమ్మకం లేదని ఆ సమయంలో చెప్పింది. తాజాగా ఆమె పెళ్లి వార్తలు బయటకు రావడంతో తను ప్రేమించిన వాడితో పెళ్లికి రెడీ అయినట్లు చెబుతున్నారు. పెళ్లి కాన్సెప్ట్తో అల్లరి నరేశ్తో కలిసి 'ఆ ఒక్కటీ అడక్కు' అనే చిత్రంలో నటించింది ఫరియా అబ్దుల్లా.. త్వరలోనే ఈ సినిమా విడుదల కానుంది. View this post on Instagram A post shared by Faria Abdullah (@fariaabdullah) -
ఆ వీడియోతో ఎమోషనల్ అవుతుంటా: నవీన్ పోలిశెట్టి
మళ్లీ మళ్లీ చూడాలనిపించే చిత్రాల్లో జాతిరత్నాలు ఫస్ట్ ప్లేస్లో ఉంటుంది. అంతలా సినీ ప్రియులను అలరించింది ఈ టాలీవుడ్ సూపర్ హిట్ చిత్రం. ఫర్ఫెక్ట్ యూత్పుల్ ఎంటర్టైనర్గా వచ్చిన ఈ చిత్రానికి అభిమానుల నుంచి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. ప్రేక్షకులను కామెడీతో కట్టిపడేసిన తీరు అద్భుతం. కరోనా పాండమిక్ టైంలో వచ్చినప్పటికీ విశేష ఆదరణ దక్కించుకుంది. ఈ చిత్రం రిలీజై ఇప్పటికీ మూడేళ్లు పూర్తయిన సందర్భంగా హీరో నవీన్ పోలిశెట్టి ట్వీట్ చేశారు. ఈ సినిమాను థియేటర్లలో చూసిన వీడియోను షేర్ చేస్తూ ఆనందం వ్యక్తం చేశారు. నవీన్ తన ట్వీట్లో రాస్తూ..' బ్లాక్బస్టర్ చిత్రం జాతిరత్నాలు రిలీజై నేటికి మూడేళ్లు. ఆ సమయంలో ప్రపంచమంతా కరోనా మహమ్మారితో పోరాడుతోంది. అయితే అన్ని సవాళ్లు ఉన్నప్పటికీ.. ఆ రోజు థియేటర్లలో చూసిన ఈ త్రోబాక్ వీడియో చూస్తే ఆ ఆనందం మళ్లీ గుర్తుకు వస్తోంది. మీ ఆదరణను చూసి కొన్నిసార్లు నేను ఎమోషనల్ అవుతుంటా. ఇందులోని ప్రతి డైలాగ్ మన తెలుగు సినిమాలో ఉంది. ఈ సందర్భంగా మన తెలుగు సినిమా కుటుంబానికి నా ధన్యవాదాలు. నా రాబోయే చిత్రం ద్వారా థియేటర్లలో ఇలాంటి ఆనందం, వినోదాన్ని పంచడానికి సిద్ధంగా ఉన్నా. అందుకోసమే పని చేస్తున్నాం. ఈ విషయంలో నేను హామీ ఇస్తున్నా. ఇది నా వాగ్దానం. లవ్ యు గాయ్స్' అంటూ లవ్ సింబల్ జత చేశారు. కాగా.. ఈ చిత్రంలో నవీన్తో పాటు ఫరియా అబ్దుల్లా, ప్రియదర్శి పులికొండ, రాహుల్ రామకృష్ణ ప్రధాన పాత్రలు పోషించారు. ఈ సినిమాకు అనుదీప్ కేవీ దర్శకత్వం వహించడంతో పాటు నటించారు కూడా. Today marks 3 years to this joyful blockbuster film #JathiRatnalu. World was in the middle of a pandemic. But despite all challenges this throwback video is a small reminder of the euphoria that we saw in theatres that day. Sometimes I feel emotional to see how you guys have made… pic.twitter.com/Eph3DwnUwq — Naveen Polishetty (@NaveenPolishety) March 11, 2024 -
ఇదే నా చివరి సినిమా: జాతిరత్నాలు డైరెక్టర్
నవ్వుల ఆటంబాంబు, కామెడీ ఖజానా, పొట్టచెక్కలయ్యేలా నవ్వించే సినిమా జాతిరత్నాలు. ఈ ఫుల్ కామెడీ ప్యాక్ మూవీని ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చిన దర్శకుడు అనుదీప్ కేవీ. పిట్టగోడ సినిమాతో 2016లో దర్శకరచయితగా తన ప్రయాణాన్ని ప్రారంభించాడీ డైరెక్టర్. ఐదేళ్లు గ్యాప్ తీసుకుని జాతిరత్నాలు సినిమాతో సెన్సేషన్ సృష్టించాడు. ఈయన సినిమాలే కాదూ, ఇంటర్వ్యూలు కూడా భలే గమ్మత్తుగా ఉంటాయి. తన నోటి వెంట నుంచి వరుసగా పంచులు పేలుతూనే ఉంటాయి. గతేడాది ప్రిన్స్ మూవీతో తమిళంలోనూ ఎంట్రీ ఇచ్చిన ఇతడు తాజాగా మ్యాడ్ సినిమాలో నటించాడు. ఈ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ బుధవారం(అక్టోబర్ 5) ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి హాజరైన అనుదీప్ ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చాడు. మ్యాడ్ మూవీ డైరెక్టర్ కల్యాణ్ శంకర్ నటించమని కోరితేనే తాను ఈ చిత్రంలో యాక్ట్ చేసినట్లు తెలిపాడు. ఇంతలో యాంకర్ సుమ వచ్చి.. జాతిరత్నాలు సినిమాలో నటించారు. ఈ చిత్రంలోనూ యాక్ట్ చేశారు. మున్ముందు మిమ్మల్ని హీరోగా చూడాలని కోరుకుంటున్నాం అంది. దీంతో అనుదీప్.. అదేం లేదండీ.. ఇదే నా చివరి సినిమా.. కేవలం కళ్యాణ్ కోసమే ఈ మూవీలో నటించాను అని చెప్పుకొచ్చాడు. ఇకపై నటనకు దూరం కానున్నట్లు వెల్లడించాడు. చదవండి: ఒకేసారి గుడ్ న్యూస్, బ్యాడ్ న్యూస్ చెప్పిన బిగ్బాస్.. కంటెస్టెంట్లకు విషమ పరీక్ష! -
‘జాతిరత్నాలు’ సమయంలో డైరెక్టర్ నిన్ను కొట్టారా? క్లారిటీ ఇచ్చిన ఫరియా
‘జాతిరత్నాలు’ మూవీతో హీరోయిన్గా పరిచమైన హైదరబాదీ బ్యూటీ ఫరియా అబ్దుల్లా. ఈ సినిమాలో చిట్టిగా కుర్రకారు మనసులను కొల్లగొట్టింది. తొలి సినిమాతోనే ఎంతో ఫ్యాన్ ఫాలోయింగ్ను సంపాదించుకుంది. ఈ మూవీ తర్వాత కాస్తా గ్యాప్ తీసుకున్న ఫరియా ప్రస్తుతం చేతి నిండా సినిమాలతో బిజీగా ఉంది. అందులో ‘లైక్ షేర్ సబ్స్క్రైబ్’ ఒకటి. ఈ చిత్రం నవంబర్ 4న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ నేపథ్యంలో మూవీ ప్రమోషన్స్లో భాగంగా రీసెంట్గా హీరో సంతోష్ శోభన్తో కలిసి ఓ టాక్లో షోలో పాల్గొంది. చదవండి: ‘గాడ్ ఫాదర్’ ఓటీటీ రిలీజ్ డేట్ వచ్చేసింది! ఆ రోజు నుంచే స్ట్రీమింగ్? ఈ సందర్భంగా ఆమె పలు ఆసక్తికర విషమాలను పంచుకుంది. అలాగే జాతిరత్నాలు సినిమా సమయంలో డైరెక్టర్ హీరోయిన్ కొట్టారంటూ వచ్చిన వార్తలపై ఆమె క్లారిటీ ఇచ్చింది. కాగా సినిమాలో ఆఫర్ ఎలా వచ్చిందని అడగ్గా హీరో నాగార్జున గారి వల్ల వచ్చిందంటూ ఆసక్తికర విషయం చెప్పింది. తన కాలేజీలో జరిగిన ఓ ఈవెంట్కి నాగార్జున గెస్ట్గా వచ్చారని, అప్పుడు ఆయన తనని చూసి మీరు యాక్టరా? అని అడిగాని చెప్పింది. అప్పుడే ఆయన నెంబర్ తీసుకుని ఫాలోఅప్ చేశానని, ఈ క్రమంలో ఆడిషన్స్ ఇవ్వగా జాతిరత్నాలు సినిమాలో అవకాశం వచ్చిందని తెలిపింది. చదవండి: ఓటీటీకి వచ్చేసిన ది ఘోస్ట్ మూవీ, స్ట్రీమింగ్ ఎక్కడంటే.. అనంతరం ఈ సినిమా షూటింగ్ సమయంలో డైరెక్టర్ అనుదీప్ కేవీ నిన్ను కొట్టారని అప్పట్లో వార్తలు వచ్చాయి అందులో నిజమేంత అడగ్గా ఫరియా దీనిపై స్పందించింది. ఆమె మాట్లాడుతూ.. ‘అది సరదాగా జరిగింది. సెట్లో అనుదీప్ గారు చాలా సరదగా ఉంటారు. ఆయన జోక్స్ వేసినప్పుడు నవ్వుతూ పక్కనున్న వాళ్లని కొడతారు. అది ఆయన అలవాటు. అలా ఒకసారి నన్ను చేతితో అలా అన్నారు. అంతే’ అంటూ వివరణ ఇచ్చింది. అలాగే తనకు రాజమౌళి దర్శకత్వంలో నటించాలని ఉందంటూ మనసులోని మాటలను బయటపెట్టింది. -
స్టార్ హీరోతో 'జాతి రత్నాలు' డైరెక్టర్ సినిమా..
Sivakarthikeyan Anudeep KV Movie SK20 In Telugu And Tamil: శివ కార్తికేయన్ హీరోగా ‘జాతి రత్నాలు’ ఫేమ్ అనుదీప్ కేవీ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతోంది. నారాయణ్ దాస్ నారంగ్, సురేష్ బాబు, పుస్కూర్ రామ్మోహన్ రావు నిర్మిస్తున్నారు. ‘ఎస్కె 20’ వర్కింగ్ టైటిల్తో తెలుగు–తమిళ భాషల్లో రూపొందుతోన్న ఈ చిత్రం విడుదల తేదీ ఫిక్స్ అయింది. వినాయక చవితి సందర్భంగా ఆగస్టు 31న రిలీజ్ చేయనున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. ‘ ‘ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది’’ అని సురేష్ బాబు తెలిపారు. మరియా ర్యాబోషప్క కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో సత్యరాజ్ కీలక పాత్రధారి. ఈ చిత్రానికి తమన్ సంగీతం అందించగా సహనిర్మాతగా అరుణ్ విశ్వ వ్యవహరిస్తున్నారు. చదవండి: రూ. 44 లక్షల మోసం.. యూట్యూబర్ అరెస్ట్.. నాకు మూడు ఫ్యామిలీలు ఉన్నాయి: అనిల్ రావిపూడి ❤️❤️❤️👍#SK20FromAugust31 https://t.co/aa13VqnZct — Sivakarthikeyan (@Siva_Kartikeyan) May 30, 2022
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
కమల్ హాసన్పై లింగుస్వామి ఫిర్యాదు
"అతడొక యార్కర్ల కింగ్.. వరల్డ్కప్కు ఎందుకు సెలక్ట్ చేయలేదు"
ఎన్నికల తనిఖీలు: భారీగా బంగారం, వెండి పట్టివేత
అమిత్ షా వీడియో మార్ఫింగ్ కేసు.. మరో వ్యక్తి అరెస్ట్
కనిగిరి.. జనగిరి: జగన్ కోసం జనం సిద్ధం (ఫొటోలు)
గుర్తుపట్టలేనంతగా మారిపోయిన టాలీవుడ్ స్టార్ హీరోయిన్
రాజ్యాంగాన్ని నాశనం చేయాలని చూస్తున్నారు.. ప్రధానిపై.. రాహుల్ ఆరోపణలు
KKR vs MI: కేకేఆర్తో ముంబై కీలక పోరు.. తుది జట్లు ఇవే
జూనియర్ ఎన్టీఆర్ను అణగదొక్కాలని చూస్తున్నారు: కొడాలి నాని
లోక్సభ ఎలక్షన్స్ 2024: మూడో దశ పోలింగ్ జరిగేది ఇక్కడే..
తప్పక చదవండి
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన టాలీవుడ్ స్టార్ హీరోయిన్
- ICC: నంబర్ వన్గా ఆసీస్.. అందులో మాత్రం టీమిండియానే టాప్
- కోర్టు పెండింగ్లో ఉన్న కేసు గురించి ఎలా మాట్లాడతారు?
- మద్యం పాలసీ కేసు.. మనీష్ సిసోడియాకు ఊరట
- ‘రాహుల్, లాలూ యాదవ్ పేరుందని పోటీ చేయకుండా ఆపలేం’
- ఎక్కువ జీతం కోసం ఎదురు చూస్తున్నారా? అయితే ఇది మీకోసమే
- గేల్, డివిలియర్స్ కాదు.. అతడంటే నాకు వణుకు: గంభీర్
- 'సలార్' పరిస్థితి మరీ ఇంత దారుణమా.. కారణం అదేనా?
- Kushitha Kallapu: ఆరెంజ్ ఆర్మీ విన్తో ‘ఖుషీ’ అవుతున్న ఈ గ్లామర్ లుక్స్ ఎవరివి? (ఫోటోలు)
- రాయ్బరేలీ నుంచి తప్పుకున్న ప్రియాంక.. కారణం అదేనా?
Advertisement