-
మెగాస్టార్ ఇష్టసఖి..హీరో తల్లి.. హీరోయిన్ అత్త..ఎవరీమె?
-
జయ బచ్చన్ జుట్టు రహస్యం ఇదే!
రాజకీయనాయకురాలు, బాలీవుడ్ నటి జయబచ్చన్ రెండు రంగాల్లోనూ తనదైన ముద్ర వేసుకున్నారు. నటిగానూ అభిమానుల చేత పలు ప్రశంసలు అందుకున్నారు. రాజకీయ నాయకురాలిగా ఆమె ఏంటన్నది ప్రూవ్ చేసుకున్నారు. ఏడు పదుల వయసుకు చేరువైనా ఆమె జుట్టు అంతగా మెరవలేదని చెప్పొచ్చు. తనతోటి నటులు జుట్టు రాలిపోయి, ముగ్గబుట్టయ్యే పోయినా.. ఆమె మాత్రం నలభై, యాభైల వయసు మాదిరిగా ఉన్న శిరోజాలను మెయింటైయిన్ చేస్తారు. ఆమె తన శిరోజాలు నెరవకుండా ఆరోగ్యంగా ఉండేందుకు ఫాలో అయ్యే చిట్కాను వాట్ ది హెల నవ్య అనే పోడోకాస్ట్ ప్రోగ్రాంలో షేర్ చేసుకున్నారు. ఈ ప్రోగ్రా మూడు తరాలకు చెందిన మహిళల వారి ఆలోచనలను షేర్ చేసుకునే ఒక కార్యక్రమం. ఈ కార్యక్రమంలో ఆమె కూతురు శ్వేతాబచ్చన్, మనవరాలు నవ్వ నందాతో కలసి జయబచ్చన్ తన శిరోజాల సీక్రేట్ని గురించి షేర్ చేసుకున్నారు. తాను జుట్టు ఆరోగ్యంగా ఉండేందుకు సహజసిద్ధమైన కొబ్బరినూనెని ఉపయోగిస్తానని చెప్పుకొచ్చారు. తమ అమమ్మల కాలం నుంచి ఆకొబ్బరి నూనెతో తయారు చేసే ఆ ఆయిల్నినే వాడతామని అన్నారు. అందువల్లే తన శిరోజాలు ఇంతలా ఆరోగ్యంగా ఉన్నాయని, ఇప్పుడిప్పుడే నెరుస్తుందని చెప్పుకొచ్చారామె. అంతేగాదు ఆ నూనెని ఎలా తయారు చేయాలో కూడా వివరంగా చెప్పారు. ఈ నూనె తయారీకి కావాల్సిన పదార్థాలు: కొబ్బరి నూనె కొద్దిగా కరివేపాకులు మెంతులు ఓ కుండ తయారీ విధానం: ఒక కుండలో కొబ్బరి నూనె, కరివేపాకులు, మెంతులు వేసి సన్నని మంటపై మరగనివ్వాలి. ఆ తర్వాత చల్లారాక వడకట్టి పొడి డబ్బాలో వేసి ఉపయోగించుకోవాలి. ఈ హెయిర్ ఆయిల్లో ఉపయోగించే కొబ్బరి నూనె జుట్టుని డ్రై అవ్వకుండా తేమగా ఉండేలా చేస్తుంది. పైగా చివర్ల చిట్లిపోకుండా కాపాడుతుంది. అలాగే ఇందులో ఉపయోగిచే కరివేపాకులో యాంటీఆక్సిడెంట్లు జుట్టుకు కావాల్సిన పోషకాలను అందిస్తుంది. కుదుళ్లు బలంగా ఉండేలా చేస్తుంది. జుట్టు నెరిసిపోకుండా చేస్తుంది. డ్యామేజ్ అయ్యిన జుట్టుని రిపేర్ చేయడంలో సమర్థవంతంగా ఉంటుంది. అలాగే ఈ మెంతి గింజల్లో ప్రోటీన్లు, నికోటిన్ యాసిడ్లు జుట్టు రాలడాన్ని సమర్థవంతంగా అరికడుతుంది. జయబచ్చన్ చెప్పిన ఈ హోం మేడ్ హెయిర్ ఆయిల్ మీ జుట్టు సంరక్షణకు తప్పకు తోడ్పడుతుంది. తప్పక ట్రై చేసి చూడండి. View this post on Instagram A post shared by Mithi Ki Rasoi (@mithi_ki_rasoi) (చదవండి: రక్తంతో జుట్టు రాలు సమస్యకు చెక్!) -
ఆస్తుల వివరాలు వెల్లడించిన జయా బచ్చన్
అమితాబ్ బచ్చన్- జయా బచ్చన్.. బీటౌన్లో మోస్ట్ పాపులర్ అండ్ సీనియర్ జంట. ఇద్దరిదీ సినిమా బ్యాక్గ్రౌండే.. కాకపోతే బిగ్బీ ఇప్పటికీ సినీ ఇండస్ట్రీలోనే తిరుగులేని స్టార్గా కొనసాగుతుండగా జయా బచ్చన్ మాత్రం పాలిటిక్స్లో రాణిస్తున్నారు. అయితే చాలాకాలం తర్వాత ఈమె ఈ మధ్యే రాకీ ఔర్ రాణీకీ ప్రేమ్ కహానీలో ఓ ముఖ్య పాత్రలో మెరిశారు. ఇకపోతే జయా బచ్చన్ వరుసగా ఐదోసారి రాజ్యసభకు నామినేట్ అయ్యారు. సమాజ్ వాదీ పార్టీ తరపున ఆమె నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా ఆమె తన కుటుంబ ఆస్తుల వివరాలను వెల్లడించారు. 2022 - 2023వ సంవత్సరానికి గానూ జయ వ్యక్తిగత నికర విలువ రూ.1.63 కోట్లు కాగా, ఆమె భర్త అమితాబ్ నికర విలువ రూ.273.74 కోట్లుగా ఉంది. తన బ్యాంకులో రూ.10 కోట్లు ఉన్నాయన్న ఆమె అమితాబ్ బ్యాంక్ బ్యాలెన్స్ రూ.120 కోట్లుగా పేర్కొన్నారు. ఉమ్మడి చరాస్తుల విలువ రూ.849 కోట్లు కాగా స్థిరాస్తి విలువ రూ.729 కోట్లుగా ఉంది. ఆమె దగ్గర రూ.40.97 కోట్ల విలువైన నగలతో పాటు రూ.9.82 లక్షల విలువ చేసే కారు ఉంది. అమితాబ్ దగ్గర రూ.54.77 కోట్ల ఆభరణాలతో పాటు రూ.17.66 కోట్లు విలువ చేసే 16 వాహనాలున్నట్లు ఎన్నికల అఫిడవిట్లో పేర్కొన్నారు. మొత్తంగా బిగ్బీతో కలిసి రూ.1578 కోట్ల విలువైన ఆస్తులు ఉన్నట్లు జయా బచ్చన్ ప్రకటించారు. చదవండి: Valentine's Day 2024: ఎవరినైనా ప్రేమిస్తున్నారా? ముందు ఇది తెలుసుకోండి! -
ఎంపీ జయా బచ్చన్ క్షమాపణలు.. ఎందుకో తెలుసా?
ఢిల్లీ: సమాజ్వాదీ పార్టీ రాజ్యసభ ఎంపీ జయబచ్చన్ రాజ్యసభలో శుక్రవారం వీడ్కోలు ప్రసంగంలో క్షమాపణలు చెప్పారు. అమె ఇటీవల పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా ఒక సందర్భంలో రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్ఖడ్ను ఎగతాళి చేస్తూ మాట్లాడారు. అయితే ఆ విషయాన్ని జయా బచ్చన్ రాజ్యసభ వీడ్కోలు సమయంలో ప్రత్యేకంగా ప్రస్తావిస్తూ ఆ రోజు తాను ప్రవర్తించిన తీరుకు రాజ్య సభ చైర్మన్ నొచ్చుకొని ఉంటే క్షమాపణలు తెలియజేస్తున్నాని తెలిపారు. ‘మీరు ఎందుకు ఆవేశపడతారని నన్ను చాలా మంది అడుగుతారు. అది నా తత్వం. నేను సహజమైన ప్రవర్తనను మార్చుకోను. నాకు కొన్ని విషయాలు నచ్చకపోతే లేదా అంగీకరించలేకపోతే వెంటనే కొంత శాంతాన్ని కోల్పోతాను. నా ప్రవర్తన, మాటలతో ఎవరినైనా ఇబ్బంది పెట్టి ఉంటే.. నా మాటలను వ్యక్తిగతంగా తీసుకొని ఎవరైనా నొచ్చుకొని ఉంటే వారికి నా క్షమాపణలు. నాది క్షణికమైన ఆవేశం తప్పితే.. నాకు ఎవరిని నొప్పించాలని ఉండదు’ అని అన్నారామె. Samajwadi Party MP Jaya Bachchan apologised to the fellow members of the Rajya Sabha during her farewell speech. Watch for more🎥#JayaBachchan #SamajwadiParty #RajyaSabha pic.twitter.com/7AeNPQjDwg — Moneycontrol (@moneycontrolcom) February 9, 2024 వీడియో క్రెడిట్స్: moneycontrol ఇక.. పెద్దల సభ నుంచి రిటైర్ అవుతున్న సభ్యుల సహకారం, ప్రేమను చైర్మన్ జగదీప్ ధన్ఖడ్ గుర్తుచేసుకున్నారు. పెద్దల సభలో సదరు సభ్యుల ద్వారా పంచుకున్న జ్ఞానాన్ని తాను ఇక నుంచి మిస్ అవుతానని అన్నారు. రిటైర్ అవుతున్న సభ్యుల వల్ల సభలో కొంత శూన్యత కూడా ఏర్పడుతుందని పేర్కొన్నారు. మంగళవారంనాడు సభలో కాంగ్రెస్ సభ్యుడి ప్రశ్నను దాటేవేసే క్రమంలో చైర్మన్ జగదీప్ ధన్ఖడ్.. జయా బచ్చన్ నుంచి ఎదురుదాడిని ఎదుర్కొన్నారు. దీంతో ధన్ఖడ్.. సభ్యులకు సమస్యను చెబితే వారు అర్థం చేసుకోగలరని వారేం చిన్న పిల్లలు కాదని అన్నారు. దీంతో జయా.. ఎంపీలను సభలో గౌరవంగా చూడాలని అన్నారు. సభలోని పరిస్థితిని అదుపులోకి తీసుకురావడాని దాటివేసిన ప్రశ్నను మళ్లీ అడగాలని ధన్ఖడ్ అనుమతి ఇచ్చారు. చదవండి: భారతరత్న.. ఆ సంప్రదాయాన్ని తిరగరాసి మరీ..! -
పెద్దల సభలో 68 మంది రిటైర్మెంట్!
న్యూఢిల్లీ: తొమ్మిది మంది కేంద్ర మంత్రులతో సహా అరవై ఎనిమిది మంది రాజ్యసభ సభ్యుల పదవీకాలం ఈ ఏడాదితో ముగియనుంది. పార్లమెంట్లో ఎగువసభ/ పెద్దలసభగా పిలుచుకునే రాజ్యసభలో ఈ ఏడాది పదవీకాలం పూర్తి చేసుకుంటున్నవాళ్లలో.. మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్, జయా బచ్చన్ కూడా ఉన్నారు. ఖాళీ అవుతున్న ఈ 68 స్థానాల్లో ఢిల్లీలోని మూడు స్థానాలకు ఎన్నికల నిర్వహణకు నోటిషికేషన్ జారీ అయ్యింది. ఆప్ నుంచి పెద్దల సభకు ప్రాతినిధ్యం వహిస్తున్న సంజయ్ సింగ్, నారాయణ్ దాస్ గుప్తా, సుశీల్కుమార్ గుప్తాలు జనవరి 27న తమ పదవీకాలం పూర్తవనుంది. ఇక సిక్కింలోని ఏకైక రాజ్యసభ స్థానానికి కూడా ఎన్నికలు త్వరలో జరగనుంది. ఎస్డీఎఫ్ నేత హిషే లచుంగ్పా ఫిబ్రవరి 23న పదవీ విరమణ చేయనున్నారు. రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్, విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, పర్యావరణ మంత్రి భూపేంద్ర యాదవ్, ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాండవీయా, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ సహా 57 మంది నేతల పదవీకాలం ఏప్రిల్లో పూర్తవుతుంది. ►తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ తరపున జోగినిపల్లి సంతోష్ కుమార్, రవిచంద్ర వద్దిరాజు, బి లింగయ్య యాదవ్ పదవీ విరమణ చేయనున్నారు. ఇక ప్రస్తుతం రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ కనీసం ఇద్దరిని తెలంగాణ నుంచి రాజ్యసభకు పంపాలని భావిస్తోంది. ► ఆంధ్రప్రదేశ్కి చెందిన టీడీపీ సభ్యుడు కనకమేడల రవీంద్రకుమార్, బీజేపీ సభ్యుడు సీఎం రమేష్, వైఎస్సార్సీపీ సభ్యుడు ప్రభాకర్రెడ్డి వేమిరెడ్డి రాజ్యసభ నుంచి రిటైర్ అవుతున్నారు. ►ఇక ఉత్తరప్రదేశ్లో అత్యధికంగా 10 సీట్లు, మహారాష్ట్ర 6, బీహార్ 6, మధ్యప్రదేశ్ 5, పశ్చిమ బెంగాల్ 5, కర్ణాటక 4, గుజరాత్ 4, ఒడిశా 3, తెలంగాణ 3, కేరళ 3, ఆంధ్ర ప్రదేశ్ 3, జార్ఖండ్ 2, రాజస్థాన్ 2, ఉత్తరాఖండ్ 1, హిమాచల్ ప్రదేశ్ 1, హర్యానా 1, ఛత్తీస్గఢ్ 1 స్థానం చొప్పున పదవీ విరమణ చేయనున్నారు. వీరితోపాటు జూలైలో నలుగురు నామినేటెడ్ సభ్యులు జూలైలో పదవీ విరమణ చేయనున్నారు. పదవీ విరమణ చేస్తున్న సభ్యులలో మన్మోహన్ సింగ్, భూపేంద్ర యాదవ్ (రాజస్థాన్), అశ్విని వైష్ణవ్, బీజేపీ సభ్యులు ప్రశాంత నందా, అమర్ పట్నాయక్ (ఒడిశా), బిజెపి ముఖ్య అధికార ప్రతినిధి అనిల్ బలూని (ఉత్తరాఖండ్), మన్సుఖ్ మాండవీయా,యు మత్స్య శాఖ మంత్రి పర్షోత్తమ్ రూపాలా, కాంగ్రెస్ సభ్యులు నరన్భాయ్ రత్వా ఉన్నారు. ►గుజరాత్కు చెందిన అమీ యాగ్నిక్. విదేశాంగ శాఖ సహాయ మంత్రి వి మురళీధరన్, ఎంఎస్ఎంఈ మంత్రి నారాయణ్ రాణే, మాజీ కేంద్ర మంత్రి ప్రకాష్ జవదేకర్, కాంగ్రెస్ సభ్యుడు కుమార్ కేత్కర్, ఎన్సీపీ సభ్యుడు వందనా చవాన్, శివసేన (ఉద్దవ్) సభ్యుడు అనిల్ దేశాయ్ మహారాష్ట్ర నుంచి పదవీ కాలం పూర్తి కానుంది. ►మధ్యప్రదేశ్ నుంచి ధర్మేంద్ర ప్రధాన్, సమాచార, ప్రసార శాఖ సహాయ మంత్రి ఎల్ మురుగన్, బీజేపీ సభ్యులు అజయ్ ప్రతాప్ సింగ్ కైలాష్ సోనీ, కాంగ్రెస్ సభ్యుడు రాజమణి పటేల్ ఎగువసభ నుంచి పదవీ విరమణ చేయనున్నారు. ►కర్ణాటకలో బీజేపీకి చెందిన రాజీవ్ చంద్రశేఖర్, కాంగ్రెస్కు చెందిన ఎల్ హనుమంతయ్య, జీసీ చంద్రశేఖర్ సయ్యద్ నాసిర్ హుస్సేన్ పెద్దల సభ నుంచి వైదోలగనున్నారు. ►పశ్చిమ బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ సభ్యులు అబిర్ రంజన్ బిస్వాస్, సుభాసిష్ చక్రవర్తి, మహమ్మద్ నడిముల్ హక్, శాంతాను సేన్, కాంగ్రెస్ నుంచి అభిషేక్ మను సింఘ్వీ పదవీ విరమణ చేయున్నారు. ►బీహార్లో ఆర్జేడీ నుంచి మనోజ్ కుమార్ ఝా, అహ్మద్ అష్ఫాక్ కరీం, జేడీయూ నుంచి అనిల్ ప్రసాద్ హెద్డే, బశిష్ట నారాయణ్ సింగ్, బీజేపీ తరపున సుశీల్ కుమార్ మోదీ, కాంగ్రెస్ నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న అఖిలేష్ ప్రసాద్ సింగ్ రాజ్యసభ పదవీకాలం పూర్తవుతోంది. ►ఉత్తరప్రదేశ్లో బీజేపీ నుంచి అనిల్ అగర్వాల్, అశోక్ బాజ్పాయ్, అనిల్ జైన్, కాంత కర్దమ్, సకల్దీప్ రాజ్భర్, జీవీఎల్ నరసింహారావు, విజయ్ పాల్ సింగ్ తోమర్, సుధాంషు త్రివేది, హరనాథ్ సింగ్ యాదవ్, సమాజ్వాదీ పార్టీ సభ్యురాలు జయ బచ్చన్ పదవీ విరమణ చేస్తున్నారు. ►చత్తీస్గఢ్, హర్యానా నుంచి బీజేపీ తరపున సరోజ్ పాండే, డీపీ వాట్స్ పదవీ విరమణ చేయనున్నారు. ►జార్ఖండ్లో బీజేపీ నుంచి సమీర్ ఒరాన్, కాంగ్రెస్ సభ్యుడు ధీరజ్ ప్రసాద్ సాహు మేలో పదవీ విరమణ చేయనున్నారు. ►కేరళలో సీపీఎం పార్టీ నుంచి ఎలమరం కరీం, సీపీఐ నుంచి బినోయ్ విశ్వం, కేసీఎం సభ్యుడు జోస్ కె మణి జూలైలో పదవీ విరమణ పొందుతున్నారు. ►నామినేటెడ్ సభ్యుల్లో బీజేపీకి చెందిన మహేశ్ జెఠ్మలానీ, సోనాల్ మాన్సింగ్, రామ్ షకల్, రాకేష్ సిన్హా జూలైలో పదవీ విరమణ చేయనున్నారు. -
కూతురుతో సహా భర్త ఇంటి నుంచి బయటకొచ్చేసిన ఐశ్వర్య రాయ్
బాలీవుడ్లో అందరూ ఇష్టపడే జంటలలో ఐశ్వర్య రాయ్- అభిషేక్ బచ్చన్లు ముందు వరసలో ఉంటారు. 2007లో ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ జోడీ ప్రస్తుతం తమ వివాహ విషయంలో చాలా కఠినమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు ఇప్పటికే చాలాసార్లు రూమర్స్ వచ్చాయి. గత కొన్ని సంవత్సరాలుగా వారిద్దరూ విడిపోతున్నారని పలుమార్లు పుకార్లు వచ్చాయి. అయినప్పటికీ, వారు దానిపై ఎప్పుడూ వ్యాఖ్యానించలేదు. తాజాగా ఐశ్వర్య రాయ్ గురించి బాలీవుడ్ మీడియా పలు కథనాలు ప్రచురిస్తుంది. అవి నిజమేనంటూ బలంగా చెబుతున్నాయి. ప్రస్తుతం ఐశ్వర్య రాయ్ తన కుమార్తె ఆరాధ్య బచ్చన్ను తీసుకుని తన భర్త ఇంటి నుంచి బయటకు వచ్చేసినట్లు కథనాలు వస్తున్నాయి. భర్తతో చాలా కాలంగా విభేదాలు ఉండటంతో అవి ఇక భరించలేనని ఆమె తన అమ్మగారి ఇంటికి చేరుకుందట. అత్తగారి ఇంట్లో ఆమె ఎదుర్కొన్న ఇబ్బందులను తల్లి చెప్పుకుందట. ఒకే ఇంట్లో ఉంటున్నప్పటికీ తన అత్తగారు అయిన జయా బచ్చన్తో చాలా ఏళ్లుగా కనీసం మాటలు కూడా లేవని ఐశ్వర్య చెప్పినట్లు సమాచారం. ఇదే క్రమంలో భర్త అభిషేక్ బచ్చన్తో కూడా విభేదాలు రోజురోజుకు పెరుగుతూ వచ్చాయని ఆమె చెప్పుకొచ్చిందట. ఇలాంటి గొడవల మధ్య తన కూతురును పెంచడం ఏమాత్రం కరెక్ట్ కాదని భావించే ఐశ్వర్య ఆ ఇంటి నుంచి బయటకు వచ్చేసినట్లు వార్తలు వస్తున్నాయి. కానీ వారిద్దరూ ఇప్పట్లో విడాకుల వరకు మాత్రం వెళ్లే పరిస్థితి లేదని ప్రముఖ ఆంగ్ల పత్రిక తన వెబ్సైట్లో పేర్కొంది. కానీ ఈ విషయంపై ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. కొద్దిరోజుల క్రితం ఐశ్వర్య రాయ్ తన 50వ పుట్టినరోజు వేడుక జరిగింది. ఆమె తన తల్లి, కుమార్తెతో కలిసి ఈ వేడుకను జరుపుకున్నారు. ఆ సమయంలో ఆమె అత్తమామలు ఎవరూ కూడా శుభాకాంక్షలు తెలుపలేదు. అభిషేక్ కూడా చాలా సింపుల్గా రెండు ముక్కల్లో ఒక పోస్ట్ను సోషల్ మీడియాలో షేర్ చేశాడు. అంతే కాకుండా ఎంతో ఇష్టంగా ఐశ్వర్య ఇచ్చిన ఉంగరాన్ని కూడా ప్రస్తుతం తను ధరించడం లేదని తెలిసింది. దీంతో వారి అభిమానుల్లో కొంతమేరకు ఆందోళన మొదలైంది. -
ఆయన కోమాలోకి వెళ్లిపోయారు.. ఏం చేయాలో అర్థం కాలేదు: జయా బచ్చన్
బాలీవుడ్ సీనియర్ నటుడు అమితాబ్ బచ్చన్ పరిచయం అక్కర్లేని పేరు. బీటౌన్లో బిగ్ బీగా పేరు సంపాదించుకున్నారు. దక్షిణాది సినిమాల్లోనూ నటించి ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే ఇటీవల ఆయన భార్య జయా బచ్చన్ తమ జీవితంలో అత్యంత బాధకరమైన సందర్భాన్ని గుర్తు చేసుకున్నారు. 1983లో వచ్చిన కూలీ సినిమా సెట్స్లో అమితాబ్ గాయపడిన సందర్భాన్ని తలుచుకుని ఎమోషనలయ్యారు. ఆ క్షణాలు ఇప్పటికీ తన కళ్లముందు కదులుతున్నాయని తెలిపారు. ఆ సమయంలో దేవున్ని ప్రార్థించడం తప్ప తనకేలాంటి ప్రత్యామ్నాయం లేదని పేర్కొన్నారు. ఇవాళ జయ- అమితాబ్ 50వ వివాహా వార్షికోత్సవం సందర్భంగా ఈ విషయాన్ని పంచుకున్నారు. (ఇది చదవండి: టీవీ షోలో నాపై చవకబారు కామెంట్లు.. యాంకర్ విరగబడి నవ్వింది) దేవుడిని ప్రార్థించమన్నారు: జయా బచ్చన్ జయా బచ్చన్ మాట్లాడుతూ.. 'నేను ఆసుపత్రికి వెళ్లగానే మా బావగారు అక్కడే ఉన్నారు. అతను నన్ను ధైర్యంగా ఉండమని చెప్పాడు. దీంతో నేను ఒక్కసారిగా నాకు ఏం చేయాలో అర్థం కాలేదు. అప్పుడు నా చేతిలో హనుమాన్ చాలీసా ఉంది. డాక్టర్ మా దగ్గరకు వచ్చి మీ ప్రార్థనలే ఆయనను కాపాడతాయని చెప్పారు. ఆ తర్వాత నేను ఆయన బొటనవేలు కదలడాన్ని చూశా. డాక్టర్ ఈ విషయాన్ని మాతో చెప్పారు. ఆ తర్వాత మేం కాస్త ఊపిరి పీల్చుకున్నాం.' అని జయా బచ్చన్ ఆనాటి సంఘటనను వివరించారు. కాగా.. అమితాబ్ బచ్చన్, జయ బచ్చన్ 1973లో వివాహం చేసుకున్నారు. వీరికి కుమార్తె శ్వేతా బచ్చన్, కుమారుడు అభిషేక్ బచ్చన్ జన్మించారు. అసలేం జరిగిందంటే... అమితాబ్ బచ్చన్ 1982 ఆగస్టు 2న కూలీ సెట్స్లో తీవ్రంగా గాయపడ్డారు. బెంగళూరు యూనివర్శిటీ క్యాంపస్లో నటుడు పునీత్ ఇస్సార్తో ఫైట్ సన్నివేశంలో ఈ ప్రమాదం జరిగింది. పొత్తికడుపు ప్రాంతంలో తీవ్ర రక్తస్రావమైంది. ఆ సమయంలో ఆయన కోమాలోకి వెళ్లిపోయారు. పలుమార్లు శస్త్రచికిత్సలు చేసినా చికిత్సకు స్పందించలేదు. వెంటిలేటర్పై ఉంచేముందు ఆయన కోసం దేవున్ని ప్రార్థించడమే తప్ప ఏం చేయలేమని డాక్టర్ చెప్పారని ఆ రోజు భయానక పరిస్థితిని జయా బచ్చన్ గుర్తు చేసుకున్నారు. (ఇది చదవండి: అలా చేయడంతో అందరూ ప్రెగ్నెన్సీ అనుకున్నారు: బుల్లితెర నటి) -
అభ్యంతరకర సీన్.. టచ్ చేసినందుకు విలన్ను చితకబాదిన జయ
జయా బచ్చన్.. ఒకప్పుడు హిందీ పరిశ్రమలో స్టార్ హీరోయిన్గా వెలుగొందింది. అందాల ఆరబోతకు ఓ అడుగు దూరంగా ఉండే ఆమె తన సహజసిద్ధ నటనతో ఎంతోమంది మనసులు గెలుచుకుంది. 1971లో గుడ్డి సినిమాతో వెండితెరపై అరంగేట్రం చేసిన ఆమె ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉంటోంది. నేడు (ఏప్రిల్ 9) ఆమె పుట్టినరోజు. ఈ రోజు ఆమె 75వ పడిలోకి అడుగుపెట్టింది. ఈ సందర్భంగా జయా బచ్చన్ గతంలో ఓ ఇంటర్వ్యూలో పంచుకున్న ఆసక్తికర విషయాలను ఆమె మాటల్లోనే.. '1972లో బీఆర్ ఇషారా డైరెక్షన్లో ఏక్ నజర్ సినిమా చేశాను. ఇందులో అమితాబ్ హీరో. ఈ మూవీలో సుధీర్ అనే వ్యక్తి నాపై అత్యాచారం చేయాల్సి ఉంటుంది. నా బట్టలు చింపుకోమన్నారు. నేనేమో కుదరదు, అందుకు అంగీకరించనని తెగేసి చెప్పాను. చాలాసేవు వాదనలు జరిగాయి. నేను ఒప్పుకోకపోతే సినిమా ఆపేస్తానని డైరెక్టర్ హెచ్చరించాడు. నీకు నచ్చింది చేసుకోపో అన్నాను. అదే కనక జరిగితే ఆర్టిస్ట్ అసోసియేషన్కు ఫిర్యాదు చేస్తానని నిర్మాత బెదిరించాడు. ఏదైనా చేసుకో అన్నాను, కానీ అస్సలు తగ్గలేదు. కాదూ, కూడదని బలవంతంగా నాతో ఆ సీన్ చేయిస్తే దాన్ని ఎలా నాశనం చేస్తానో మీరే చూస్తారని వార్నింగ్ ఇచ్చాను. అలా ఆరోజు షూటింగ్ క్యాన్సల్ చేశారు. రెండు రోజులదాకా షూట్ ఊసే ఎత్తలేదు. దీంతో అమితాబ్ జోక్యం చేసుకుని నాకు నచ్చజెప్పే ప్రయత్నం చేశాడు. ఇది నీ రోల్.. అక్కడేం చెప్తే అది చేయాల్సిందే! చేయనని ఎలా ఎదురుతిరుగుతావు? అన్నాడు. నాకు బట్టలు చింపుకోవడం ఇష్టం లేదు. నేనలా చిరిగిన బట్టలతో స్క్రీన్పై కనిపించాలనుకోవడం లేదని బదులిచ్చాను. మొత్తానికి ఎలాగోలా నేనే కొంత వెనక్కు తగ్గాను. అత్యాచార సన్నివేశంలో చాలా సహజంగా నటించమన్నారు. పాపం ఆ విలన్ నా దగ్గరకు రాగానే ఇష్టమొచ్చినట్లు కొట్టాను. దీంతో అతడు నేను ఈ రేప్ సీన్ చేయను అని ఏడుపుముఖం పెట్టాడు' అంటూ నవ్వుతూ ఆనాటి సంఘటనను షేర్ చేసుకుంది జయా బచ్చన్. -
మాధురి దీక్షిత్పై అసభ్య పదజాలం.. తీవ్రస్థాయిలో మండిపడ్డ జయాబచ్చన్
అమెరికన్ సిట్ కామ్ 'ది బిగ్ బ్యాంగ్ థియరీ' షోపై బాలీవుడ్ నటి జయాబచ్చన్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఈ షోలోని ఎపిసోడ్లో బాలీవుడ్ నటి మాధురి దీక్షిత్పై చేసిన వ్యాఖ్యల పట్ల తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. చంక్ లోరె, బిల్ ప్రాడీ రూపొందించిన అమెరికన్ టెలివిజన్ షోలో మాధురి దీక్షిత్పై చేసిన కామెంట్స్పై ఆమె జయాబచ్చన్ ఫైరయ్యారు. ది బిగ్ బ్యాంగ్ థియరీ షోలో పాల్గొన్న కునాల్ నయ్యర్ ఐశ్యర్యారాయ్తో పోలుస్తూ మాధురీ దీక్షిత్ను వేశ్య అని సంభోదించారు. కునాల్ నయ్యర్ వ్యాఖ్యల పట్ల జయా బచ్చన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. వాడికేమైనా పిచ్చి పట్టిందా? అతన్ని వెంటనే మానసిక ఆస్పత్రికి తరలించాలని అన్నారు. అతని వ్యాఖ్యల పట్ల వారి కుటుంబ సభ్యులను నిలదీయాలని మండిపడ్డారు. ఈ షోలో షెల్డన్ కూపర్ పాత్రను పోషిస్తున్న జిమ్ పార్సన్స్ ఐశ్వర్య రాయ్ బచ్చన్ను పొగిడారు. అదే సమయంలో మాధురీ దీక్షిత్ను పోలుస్తూ కునాల్ నయ్యర్ అసభ్య పదజాలాన్ని ఉపయోగించారు. ఈ వ్యాఖ్యలతో ఇండియాలో జనాదరణ పొందిన అమెరికన్ సిట్కామ్ 'ది బిగ్ బ్యాంగ్ థియరీ' భారతీయుల ఆగ్రహానికి గురవుతోంది. కునాల్ నయ్యర్ వ్యాఖ్యల పట్ల నటి ఊర్మిళ మటోండ్కర్ ఇది అత్యంత దారుణమని అన్నారు. ఇది వారి చీప్ మెంటాలిటీని చూపిస్తోందని మండిపడ్డారు. ఇలా మాట్లాడటం అత్యంత అసహ్యంగా ఉందని దియా మీర్జా అన్నారు. నెట్ఫ్లిక్స్కు నోటీసులు అయితే ఈ ఎపిసోడ్ను తొలగించాలని రచయిత, రాజకీయ విశ్లేషకుడు మిథున్ విజయ్ కుమార్ స్ట్రీమింగ్ దిగ్గజాన్ని కోరుతూ నెట్ఫ్లిక్స్కి లీగల్ నోటీసులు పంపారు. సీజన్ టూ మొదటి ఎపిసోడ్లో బాలీవుడ్ నటి మాధురీ దీక్షిత్పై కునాల్ నయ్యర్ చేసిన వ్యాఖ్యలను ఆయన ప్రస్తావించారు. అతని వ్యాఖ్యలు అభ్యంతరకరంగా ఉన్నాయిని.. పరువు నష్టం కలిగించేలా ఉన్నాయని లీగల్ నోటీసులో విజయ్ కుమార్ పేర్కొన్నారు. ఇలాంటి కంటెంట్ సమాజంపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుందని నోటీసులో పేర్కొన్నారు. బిగ్ బ్యాంగ్ థియరీ 'బిగ్ బ్యాంగ్ థియరీ' అనేది చక్ లోర్రే, బిల్ ప్రాడీ రూపొందించిన అమెరికన్ సిట్కామ్. ఇది 2007లో ప్రారంభం కాగా.. 12 సీజన్ల తర్వాత చివరి ఎపిసోడ్ 2019లో ప్రసారమైంది. -
తొలిసారి నెగటివ్ రోల్లో ఒకరు.. ఎమోషనల్ కేరెక్టర్లో మరొకరు.. ఇంకా
ఒకరు నెగటివ్గా కనిపించనున్నారు. ప్రేక్షకులు ఎప్పుడూ ఆమెను అలాంటి పాత్రలో చూడలేదు. ఇంకొకరు కన్నీళ్లు తెప్పించే పాత్రతో వచ్చారు.. అలాంటి పాత్రతో వచ్చినందుకు ఆనందభాష్పాలను ఆపుకోలేకపోయారామె. మరొకరు కథానాయికగా కనుమరుగై.. చెల్లెలిగా రిటర్న్ అవుతున్నారు. నటనకు ఒక్కసారి బ్రేక్ ఇచ్చాక మళ్లీ నటించాలంటే ఆ క్యారెక్టర్ ఎంతో బలమైనది అయ్యుంటేనే ఆ ఆర్టిస్ట్ గ్రీన్ సిగ్నల్ ఇస్తారు. జయా బచ్చన్, షర్మిలా ఠాగూర్, జీవితలకు అలాంటి పాత్రలే దొరికాయి. అందుకే బ్రేక్లు తీశారు.. నటిగా మేకప్ వేసుకున్నారు. ఒక్కప్పటి ఈ స్టార్స్ రిటర్న్ కావడం అభిమానులకు ఆనందమే కదా. ఇక ఈ ముగ్గురి చిత్రాల విశేషాలు తెలుసుకుందాం. తొలిసారి నెగటివ్గా... జయా బచ్చన్ కెరీర్ దాదాపు 60 ఏళ్లు. ఇన్నేళ్ల సుదీర్ఘ కెరీర్లో నటిగా ఎన్నో అద్భుత పాత్రలు చేశారామె. కెరీర్ ఆరంభంలో ‘గుడ్డి’ (1971)లో చేసిన పాత్రతో ‘గర్ల్ నెక్ట్స్ డోర్’ ఇమేజ్ తెచ్చుకున్న జయ ఆ తర్వాత ‘జవానీ దివానీ’లో గ్లామరస్ రోల్లో మెప్పించారు. అలాగే అనామిక (1973)లో కాస్త నెగటివ్ టచ్ ఉన్న పాత్ర చేసి, భేష్ అనిపించుకున్నారు. అయితే ఇన్నేళ్ల కెరీర్లో జయ పూర్తి స్థాయి నెగటివ్ క్యారెక్టర్ చేయలేదు. ఇప్పుడు చేస్తున్నారు. ‘రాఖీ ఔర్ రాణీ కీ ప్రేమ్ కహానీ’లో లేడీ విలన్గా కనిపించనున్నారామె. దాదాపు ఏడేళ్ల తర్వాత జయా బచ్చన్ ఒప్పుకున్న చిత్రం ఇది. కరణ్ జోహార్ స్వీయదర్శకత్వంలో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. జయా బచ్చన్తో కరణ్ నెగటివ్ క్యారెక్టర్ గురించి చెప్పగానే ‘‘నేనా? నన్నే తీసుకోవాలని ఎందుకు అనుకున్నారు?’ అని ఆమె అడిగారు... ‘మీరే చేయాలి’ అంటూ జయాని కన్విన్స్ చేయడానికి చాలా ప్రయత్నాలు చేశారు కరణ్. ఫైనల్గా ‘ఓకే’ అన్నారామె. అయితే ఈ పాత్రని అర్థం చేసుకుని, ఒక క్రూరమైన మనస్తత్వం ఉన్న వ్యక్తిలా నటించడానికి జయ కొన్నాళ్లు ఇబ్బందిపడ్డారట. ఆ తర్వాత పూర్తిగా ఆ పాత్రలోకి లీనం కాగలిగారని, నెగటివ్ క్యారెక్టర్ని ఆమె ఎంజాయ్ చేస్తున్నారని చిత్ర యూనిట్ పేర్కొంది. రణ్వీర్ సింగ్, ఆలియా భట్ జంటగా రూపొందిన ఈ చిత్రం జులై 28న విడుదల కానుంది. పుష్కర కాలం తర్వాత... పుష్కర కాలం తర్వాత షర్మిలా ఠాగూర్ ఓ సినిమా చేశారు. ఈ నెల 3న విడుదలైన ‘గుల్మోహార్’లో ఆమె ఇంటి పెద్దగా లీడ్ రోల్ చేశారు. గుల్ మోహార్ అనే తమ ఇంటిని అమ్మేసి, తాను వేరే రాష్ట్రానికి వెళతానని ఇంటి పెద్ద కుసుమ్ బాత్రా (షర్మిలా ఠాగూర్ పాత్ర) చెబుతారు. అప్పుడు ఆ కుటుంబ సభ్యుల భావోద్వేగాల నేపథ్యంలో ఈ సినిమా సాగుతుంది. ‘బ్రేక్ కే బాద్’ (2010) సినిమా తర్వాత మళ్లీ మంచి పాత్రలు వచ్చేంతవరకూ బ్రేక్ తీసుకోవాలనుకున్నారు షర్మిలా. ‘గుల్మోహార్’లో తన పాత్ర కీలకం కావడంతో పాటు మంచి ఎమోషన్స్ కనబరిచే చాన్స్ ఉన్నందున ఆమె అంగీకరించారు. ఈ సినిమా ప్రివ్యూ చూసి, షర్మిలా ఏడుపు ఆపుకోలేకపోయారు. ‘‘పన్నెండేళ్ల తర్వాత ఒక మంచి పాత్రలో తెరపై కనిపించడంతో నన్ను నేను నియంత్రించుకోలేకపోయాను. ఈ సినిమాని మూడుసార్లు చూశాను. చూసిన ప్రతిసారీ ఏడ్చాను. అంతగా ఈ పాత్రతో కనెక్ట్ అయ్యాను’’ అని షర్మిలా పేర్కొన్నారు. చెల్లెలిగా... కథానాయికగా గర్ల్ నెక్ట్స్ డోర్ అనదగ్గ పాత్రల్లో కనిపించారు జీవిత. ‘తలంబ్రాలు’, ‘ఆహుతి’, ‘అంకుశం’ వంటి చిత్రాల్లో చేసిన పాత్రలతో మంచి నటి అనిపించుకున్నారామె. ‘మగాడు’ (1990) తర్వాత నటిగా వేరే సినిమాలు ఒప్పుకోలేదు. ఇప్పుడు రజనీకాంత్ అతిథి పాత్రలో ఆయన కుమార్తె ఐశ్వర్య దర్శకత్వం వహిస్తున్న ‘లాల్ సలామ్’లో నటించడానికి జీవిత ఒప్పుకున్నారు. ఇందులో ఆమెది రజనీ చెల్లెలి పాత్ర. ‘‘నా కెరీర్లో రజనీ సార్తో సినిమా చేయలేదు. ఇప్పుడు కుదిరినందుకు హ్యాపీగా ఉంది. ఈ సినిమా ఒప్పుకోవడానికి కొంత టైమ్ తీసుకున్నాను. ‘మీరు స్క్రీన్పై కనిపించి చాలా రోజులైంది కాబట్టి.. చేస్తే బాగుంటుంది’ అని ఐశ్వర్య అనడం, నా ఫ్యామిలీ సపోర్ట్ వల్ల ఓకే చెప్పాను’’ అని పేర్కొన్నారు జీవిత. దాదాపు 30 ఏళ్ల తర్వాత ఆమె కనిపించనున్న చిత్రం ఇది. కాగా నటిగా ఇన్నేళ్లు సినిమాలకు దూరంగా ఉన్నప్పటికీ నిర్మాతగా ‘గడ్డం గ్యాంగ్, దెయ్యం’ వంటి చిత్రాలను నిర్మించారు. గత ఏడాది ‘శేఖర్’ చిత్రానికి దర్శకత్వం వహించారు జీవిత. -
సీరియస్ విషయాలే కాస్త సరదాగా!
పాడ్కాస్ట్లో కడుపుబ్బా నవ్వించే జోక్స్ వినవచ్చు. కమ్మని సంగీతం వినొచ్చు... ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో! అయితే మహిళల ఆధ్వర్యంలోని కొన్ని పాడ్కాస్ట్లు మాత్రం ఎన్నో విషయాలను నీళ్లు నమలకుండా చర్చిస్తున్నాయి. మన గురించి, సమాజం గురించి ఆలోచించడానికి అవసరమైన ప్రేరణ ఇస్తున్నాయి... సీరియస్ విషయాలను సీరియస్గానే మాట్లాడుకోవాలనే నిబంధన ఏమీ లేదు. నవ్వుతూ, నవ్విస్తూ సరదాగా కూడా మాట్లాడవచ్చు. ఈ పాయింట్ దగ్గరే విజయం సాధించింది నవ్య నవేలీ నందా. నవ్య పాడ్కాస్ట్ ‘వాట్ ది హెల్ నవ్య’ శ్రోతలకు దగ్గర కావడానికి కారణం ‘సీరియస్ విషయాలైనా సరే కాస్త సరదాగా మాట్లాడుకుందాం’ అనే కాన్సెప్ట్. ఈ పాడ్కాస్ట్కి సంబంధించిన ఒక కార్యక్రమంలో మూడు తరాలకు చెందిన నవ్య నందా, శ్వేతా నందా, జయబచ్చన్లు జీవితానికి సంబంధించిన భిన్నమైన కోణాల గురించి మాట్లాడారు. అయితే వారేమీ ఉపదేశం ఇచ్చినట్లు, ఉపన్యాసాలు ఇచ్చినట్లు ఉండదు. సరదాగా మాట్లాడుతున్నట్లుగానే ఉంటుంది. ఇరుగుపొరుగుతో సహజంగా సంభాషిస్తున్నట్లుగానే ఉంటుంది. ‘నేను నవ్య అమ్మను మాట్లాడుతున్నాను. ఒక సరదా విషయం మీకు చెప్పుకోవాలని ఉంది’ అంటూ తనను తాను పరిచయం చేసుకుంటుంది శ్వేతా నందా. ‘నేను నవ్య నానీని. మీకు కొన్ని రహస్యాలు చెప్పాలని ఉంది’ అని ఊరిస్తుంది జయబచ్చన్. ‘త్రీ లేడీస్’ ‘త్రీ జెనరేషన్స్’ ‘త్రీ పర్స్పెక్టివ్స్’ అంటూ వచ్చిన ప్రోమో ఆకట్టుకొని ఆసక్తి పెంచింది. వ్యాపారం అనేది అనుకున్నంత సులువు కాదు. ఎంత దిగ్గజ వ్యాపారికైనా అడుగడుగునా పరీక్షలు ఎదురవుతుంటాయి. వాటిలో ఏ మేరకు ఉత్తీర్ణత సాధించారనేదానిపైనే వారి విజయం ఆధారపడి ఉంటుంది. ‘నో సుగర్ కోట్’ పాడ్కాస్ట్ ద్వారా వ్యాపారంలో ఎదురయ్యే సవాళ్లు, పోరాటస్ఫూర్తి, అనుసరించాల్సిన వ్యూహాలు...ఇలా ఎన్నో విషయాల గురించి చర్చిస్తుంది పూజా దింగ్రా. ఔత్సాహిక ఎంటర్ప్రెన్యూర్లతో పాటు ఎంటర్ప్రెన్యూర్గా రాణించాలనుకునేవారిని ఆకట్టుకుంటున్న పాడ్కాస్ట్ ఇది. చెఫ్గా మంచి పేరు తెచ్చుకున్న పూజా సీజన్వన్లో ఎంతో మంది సక్సెస్ఫుల్ చెఫ్లు, ఫుడ్రైటర్స్ను ఇంటర్వ్యూ చేసింది. ‘నల్లేరుపై నడక అనేది వాస్తవం కాదు. భ్రమ. ప్రతి ఒక్కరూ కష్టపడాల్సిందే’ అంటోంది పూజా. మానసిక ఆరోగ్యంలాంటి సీరియస్ విషయాలతో పాటు బ్యాచ్లర్ పార్టీలాంటి తేలికపాటి విషయాల గురించి మాట్లాడటానికి ‘రియల్ టాక్ విత్ స్మృతి నొటాని’ పాడ్కాస్ట్ వేదిక అవుతుంది. స్మృతి మాట్లాడుతుంటే అప్పుడే పరిచయమైన ఫ్రెండ్ గలగలమని మాట్లాడుతున్నట్లుగానే ఉంటుంది. సోషల్ మీడియా ధోరణుల గురించి కూడా తనదైన శైలిలో వ్యాఖ్యానిస్తుంటుంది స్మృతి. ‘ఫ్యాట్.సో?’ ....పేరు ద్వారానే తన పాడ్కాస్ట్ లక్ష్యం ఏమిటో తెలియజేశారు పల్లవినాథ్, అమేయ నాగరాజ్. స్థూలకాయం వల్ల నలుగురిలోకి వెళ్లడానికి ఇబ్బంది పడే అమ్మాయిలు, ఆత్మన్యూనతకు గురయ్యే వారు ఎంతోమంది ఉన్నారు. అలాంటి వారిలో ఆత్మవిశ్వాసం నింపి ముందుకు నడిపిస్తుంది ఈ పాడ్కాస్ట్. ‘మనల్ని మనం ప్రేమించుకున్నప్పుడు ఆత్మవిశ్వాసం దగ్గరవుతుంది. అదొక ఆయుధం అవుతుంది. అద్భుతమైన విజయాలు సాధించడానికి ఇంధనం అవుతుంది’....ఇలాంటి మాటలు ఎన్నో ‘ఫ్యాట్.సో’లో వినిపిస్తాయి. -
పెళ్లి కాకుండా తల్లయినా ఎలాంటి అభ్యంతరం లేదు.. ఆమెపై జయా బచ్చన్ షాకింగ్ కామెంట్స్
బాలీవుడ్ సీనియర్ నటి, అమితాబ్ బచ్చన్ సతీమణి జయా బచ్చన్ షాకింగ్ కామెంట్స్ చేశారు. ఇటీవల వాట్ ది హెల్ నవ్య పాడ్కాస్ట్ ఎపిసోడ్లో పాల్గొన్న ఆమె ప్రస్తుత సమాజంలో మానవ సంబంధాలపై స్పందించారు. ఈ సందర్భంగా తన మనవరాలికి ఓ అదిరిపోయే సలహా కూడా ఇచ్చి ఆశ్చర్యానికి గురి చేశారు. ప్రస్తుత సమాజంలో ఆధునిక పోకడల ప్రకారం తన మనవరాలు నవ్య నవేలి నందా పెళ్లి కాకుండా తల్లయినా ఫర్వాలేదని.. తనకేలాంటి అభ్యంతరం లేదని షాకింగ్ కామెంట్స్ చేశారు. జయా బచ్చన్ మాట్లాడుతూ.. 'ఈ తరానికి నేను ఇచ్చే సూచన ఏమిటంటే... నేను చాలా వైద్యపరమైన మార్పులు చాలా చూశాను. ఎలాంటి ఎమోషన్స్ లేకుండానే రొమాన్స్ చేసుకుంటున్నారు. నవ్య మీరు మీ బెస్ట్ ఫ్రెండ్ని పెళ్లి చేసుకోవాలని నేను అనుకుంటున్నా. నీకు మంచి స్నేహితుడు ఉండి.. నిన్ను ఇష్టపడి బిడ్డను కలిగి ఉండాలనుకుంటే.. ఈ సమాజంతో పనిలేదు. పెళ్లి కాకుండానే బిడ్డ ఉంటే నాకు ఎలాంటి సమస్య లేదు.' అంటూ మనవరాలు నవ్య నవేలి నందకు సలహా ఇచ్చింది. ఈ ఎపిసోడ్లో అమితాబ్ బచ్చన్తో తన పెళ్లి ఎలా జరిగిందనే విషయాన్ని జయా బచ్చన్ పంచుకున్నారు. మేం మొదట అక్టోబర్లో పెళ్లి చేసుకోవాలని అనుకున్నామని.. అయితే జంజీర్ సక్సెస్ తర్వాత వెకేషన్కు వెళ్లే ముందు పెళ్లి చేసుకోవాలని వారి తల్లిదండ్రులు సూచించారని ఆమె చెప్పారు. అందుకే జూన్లో పెళ్లి జరిగిందని తెలిపారు. -
జయా బచ్చన్కి కరోనా.. నిలిచిపోయిన షూటింగ్
Jaya Bachchan Tests Positive For Covid-19: బిగ్ బీ అమితాబ్ బచ్చన్ సతీమణి, ప్రముఖ నటి జయా బచ్చన్ కోవిడ్ బారిన పడ్డారు. గతేడాది అమితాబ్, అభిషేక్లతో పాటు ఐశ్వర్య, ఆరాధ్యలు అందరూ కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే. కానీ అదృష్టవశాత్తూ జయాబచ్చన్ మాత్రం తప్పించుకోగలిగారు. అయితే తాజాగా జరిపిన కోవిడ్ పరీక్షల్లో మాత్రం ఆమెకు కరోనా పాజిటివ్ అని నిర్థారణ అయ్యింది. ఈ విషయాన్ని స్వయంగా బీఎంసీ అధికారి దృవీకరించారు.ప్రస్తుతం ఆమె ఇంట్లోనే హోం ఐసోలేషన్లో చికిత్స తీసుకుంటున్నారు. కాగా ప్రస్తుతం జయా బచ్చన్కు కరోనా అని తెలియగానే ఆమె నటిస్తున్న ‘రాకీ ఔర్ రాణీ కీ ప్రేమ్ కహానీ’చిత్రం షూటింగ్ను ఆపేశారు. కరణ్ జోహార్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో రణ్వీర్ సింగ్, ఆలియా భట్ హీరో హీరోయిన్లుగా నటిస్తుండగా ప్రీతిజింటా, ధర్మేంద్ర, జయా బచ్చన్, షబానా ఆజ్మీ వంటి హేమాహేమీలు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇటీవలె షబానా ఆజ్మీ సైతం కరోనా బారిన పడ్డారు. తాజాగా జయా బచ్చన్కి కూడా కోవిడ్ సోకడంతో షూటింగ్ నిలిచిపోయింది. -
వ్యక్తిగత విమర్శలు.. శాపనార్థాలు పెట్టిన జయా బచ్చన్
న్యూఢిల్లీ: పార్లమెంటు శీతాకాల సమావేశాలు వాడివేడిగా కొనసాగతున్నాయి. పలు కీలక అంశాలపై విపక్షాలు.. అధికార పార్టీని.. ఇరుకున పెడుతున్నాయి. ఈ క్రమంలో సోమవారం రాజ్యసభలో వ్యక్తిగత దూషణలు చోటు చేసుకున్నాయి. సమాజ్వాద్ పార్టీ ఎంపీ జయా బచ్చన్ రాజ్యసభ వేదికగా శాపనార్థాలు పెట్టారు. ఓ ఎంపీ జయా బచ్చన్ను ఉద్దేశించి.. వ్యక్తిగత విమర్శలు చేయడంతో.. సహనం కోల్పోయిన జయా బచ్చన్.. సదరు ఎంపీని శపించారు. ఆ వివరాలు.. మాదక ద్రవ్యాల కట్టడికి సంబంధించిన బిల్లుపై సోమవారం రాజ్యసభలో చర్చ జరిగింది. ఈ సమయంలో జయా బచ్చన్ ఎవరిని టార్గెట్ చేసి.. విమర్శించలేదు కానీ.. ట్రెజరీ బెంచీలపై ఆరోపణలు చేశారు. అంతేకాక అధికారంలో ఉన్న వారు విపక్షాల వాదనలు పట్టించుకోవడం లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. (చదవండి: లఖీంపూర్ ఖేరి ‘కుట్ర’పై... దద్దరిల్లిన లోక్సభ) ఈ సందర్భంగా భువనేశ్వర్ కల్ అధ్యక్షతన జరిగిన సభను ఉద్దేశించి జయా బచ్చన్ మాట్లాడుతూ.. ‘‘మీరు న్యాయంగా ఉండాలి. ఏ పార్టీకి మద్దతు ఇవ్వకూడదు. మీ నుంచి మేం ఏం ఆశిస్తాం.. సభలో ఏం జరుగుతుందో చూస్తున్నారా.. మనం చర్చించడానికి చాలా అంశాలు ఉన్నాయి. ప్రభుత్వం ఓ బిల్లును సభ ముందుకు తీసుకువచ్చింది. దానిలో ఉన్న లోటుపాట్లను మనం చర్చించి.. ప్రభుత్వ తప్పిదాలను ప్రజలకు తెలియజేయాలి’’ అంటూ జయా బచ్చన్ ప్రసంగించసాగారు. (చదవండి: మీ తీరు మారకపోతే.. మార్చాల్సి ఉంటుంది: మోదీ) జయా బచ్చన్ ఇలా మాట్లాడుతుండగా.. బీజేపీ ఎంపీ రాకేశ్ సిన్హా.. ఆమె కుటుంబ సభ్యుల గురించి ప్రస్తావించి.. ఆరోపణలు చేశారు. పనామా పేపర్స్ వ్యవహారంలో జయా బచ్చన్ కోడలు.. ఐశ్వర్య రాయ్ ఈడీ విచారణకు హాజరైన సంఘటనను ప్రస్తావించారు. ఈ క్రమంలో సహనం కోల్పోయిన జయా బచ్చన్.. ‘‘త్వరలోనే మీ జీవితంలోకి దుర్దినాలు రాబోతున్నాయి. మీకిదే నా శాపం’’ అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అంతేకాక.. తనపై వ్యక్తిగత ఆరోపణలు చేసిన మంత్రిపై తగిన చర్యలు తీసుకోవాలని జయా బచ్చన్ డిమాండ్ చేశారు. చదవండి: సెల్ఫీ కోసం ఆరాటం.. అభిమానిని తోసేసిన సీనియర్ నటి -
KBC: అమితాబ్పై జయా బచ్చన్ ఫిర్యాదు!
బాలీవుడ్ బిగ్బి అమితాబ్ బచ్చన్ హోస్ట్ చేస్తున్న ‘కౌన్ బనేగా కరోడ్ పతి’ షో ప్రస్తుతం 13వ సీజన్ను జరుపుకుంటోంది. అయితే ఈ సిజన్లో కేబీసీ ఓ 1000వ ఎపిసోడ్ మైలురాయిని చేరుకుంది. అయితే ఈ సందర్భంగా హాట్ సీట్లో కూర్చొని క్విజ్లో పాల్గొనడానికి తన కూతురు స్వేతా బచ్చన్, మనవరాలు నవ్వా నవేలీ నందాలను అమిత్ ఆహ్వానించారు. దీంతో పాటు అమితాబ్ భార్య జయా బచ్చన్.. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా షోకి గెస్ట్గా హాజరయ్యారు. దీనికి సంబంధించిన ప్రోమోను ‘సోనీ ఎంటర్టైన్మెంట్ టెలివిజన్’ తన ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసింది. గతంలో విడుదల చేసిన ప్రోమోల్లో అమితాబ్, జయా అనుబంధం చూపించారు. అయితే తాజాగా విడుదల చేసిన ఈ ప్రోమోలో అమిత్పై జయా.. ఫిర్యాదు చేసింది. ‘ఫోన్ చేస్తే.. అస్సలు లిఫ్ట్ చేయరు’ అని కంప్లైంట్ చేశారు. ‘ఇంటర్నెట్ వస్తూపోతూ ఉంటే నేను ఏం చేయను?’ అంటూ అమితాబ్ ఫన్నీగా తనను తాను సమర్థించుకున్నారు. స్వేతా బచ్చన్ జోక్యం చేసుకొని జయా పక్షాన మాట్లూడుతూ.. ‘సోషల్ మీడియాలో ఫోటోలు పంచుకోవడం, ట్వీట్లు పెట్టడం చేస్తారు’ అని గుర్తుచేస్తుంది. టాపిక్ మారుస్తూ.. అమితాబ్ ‘జయా నువ్వు చాలా అందంగా ఉన్నావు’ అని అంటారు. వెంటనే స్పందిన జయా.. ‘మీరు అబద్దాలు చెప్పేటప్పుడు బాగుండరు’ అని సరదగా బదులిస్తుంది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో వైరల్గా మారింది. ఇక 1000వ ఎపిసోడ్ డిసెంబర్ 3 రాత్రి 9 గంటలకు టీవీల్లో ప్రసారం కానుంది. View this post on Instagram A post shared by Sony Entertainment Television (@sonytvofficial) -
అమితాబ్-రేఖల లవ్ ట్రాక్: జయా బచ్చన్ ఏమన్నారంటే
బాలీవుడ్లో హీరోహీరోయిన్ల మధ్య సాగే లవ్ ఎఫైర్స్ అంటే వెంటనే గుర్తుకు వచ్చే పేరు అమితాబ్ బచ్చన్-రేఖ. బాలీవుడ్ని ఓ ఊపు ఊపింది వీరి ప్రేమ కథ. ‘దో అన్జానే’ (1976) ఈ ఇద్దరికీ తొలి సినిమా. అప్పుడే ఒకరితో ఒకరికి పరిచయం కూడా. కానీ అప్పటికే రేఖ అమితాబ్ కంటే సీనియర్. అంతకు ముందు వరకు రేఖకు, అమితాబ్ బచ్చన్ అంటే దీదీబాయి (జయా బచ్చన్) భర్తగానే తెలుసు. ‘దో అన్జానే’సెట్స్ మీదే అమితాబ్ బచ్చన్గా పరిచయం అయ్యాడు. పరిచయం కాస్త ప్రేమగా మారింది. సినిమాలో వీరిద్దరి మధ్య మంచి కెమిస్ట్రీ కుదిరింది. ఇది ప్రేక్షకులకు తెగ నచ్చింది. దాంతో ఇద్దరి కాంబినేషన్లో సినిమాల సంఖ్య పెరిగింది. ఇక వీరిద్దరి ప్రేమ వ్యవహారం ఎప్పుడు బయటపడింది అంటే 1978లో ‘గంగా కీ సౌగంద్’ సినిమా షూటింగ్ జరుగుతోంది. ఇందులోనూ రేఖ, అమితాబ్లే హీరోహీరోయిన్లు. ఒక సహనటుడు రేఖ పట్ల అనుచితంగా ప్రవర్తించసాగాడు. రేఖ వారించింది. అయినా వినిపించుకోలేదు అతను. పైగా రేఖ నిస్సహాయతను అలుసుగా తీసుకోసాగాడు. ఇదంతా గమనిస్తున్న అమితాబ్ ఇక ఊరికే ఉండలేకపోయాడు. ఆవేశంగా ఆ నటుడి దగ్గరకు వెళ్లి చెడమడా తిట్టేశాడు. అమితాబ్ రియాక్షన్కి అక్కడున్న వారందరూ ఆశ్చర్యానికి గురయ్యారు. మేడం పట్ల సార్కు ఈ స్పెషల్ కేర్ ఏంటి అని గుసగుసలాడుకోవడం ప్రారంభించారు. ఈ వార్తలు కాస్త జయా బచ్చన్ చెవిన పడ్డాయి. ‘సిల్సిలా’ సినిమా విడుదల వరకు ఇదే కొనసాగింది. ఆ తర్వాత రేఖ-అమితాబ్ల మధ్య ఉన్న బంధం బలహీనపడుతూ వచ్చింది. గతంలో పీపుల్ మ్యాగ్జైన్కిచ్చిన ఇంటర్వ్యూలో జయా బచ్చన్.. అమితాబ్-రేఖల లవ్ ఎఫైర్పై స్పందించారు. ఇన్ని పుకార్ల మధ్య ఎలా తన వివాహ బంధాన్ని నిలబెట్టుకున్నారో వెల్లడించారు. ఈ సందర్భంగా జయా బచ్చన్ మాట్లాడుతూ.. ‘‘వీటి గురించి తెలిసినప్పుడు నేను బిగ్ బీని ఎలాంటి ప్రశ్నలు వేసేదాన్ని కాదు. ఆయనను ఒంటరిగా వదిలేసేదాన్ని. ఆలోచించుకునే అవకాశం ఇచ్చేదాన్ని. ఇక మా వివాహబంధంపై నాకు పూర్తి నమ్మకం ఉంది. నేను ఎంతో మంచి వ్యక్తిని వివాహం చేసుకున్నాను. బంధాలకు విలువిచ్చే ఇంటికి కోడలిగా వెళ్లాను’’ అన్నారు. ‘‘ఇక సినిమా ఇండస్ట్రీలాంటి రంగుల ప్రపంచంలో అన్ని సవ్యంగా సాగవు. నాకే సొంతం.. అంటూ కట్టుబాట్లు విధించడం కూడా క్షేమం కాదు. ఇక్కడ మీరు ఆర్టిస్టిలను పిచ్చివాళ్లు చేయవచ్చు.. లేదా వారి ఎదుగుదలకు సాయం చేయవచ్చు. ఎవరిని బలవంతంగా కట్టి పడేయలేం’’ అన్నారు. బిగ్ బీ ఎఫైర్స్కు సంబంధించిన వార్తలు విన్నప్పుడు మీ ఫీలింగ్స్ ఏంటనే ప్రశ్నకు జయా బచ్చన్ బదులిస్తూ.. ‘‘నేను మనిషినే.. తప్పక స్పందించాలి. చెడు వార్తలు, మంచి వార్తలు అన్నింటిపై స్పందించాలి. మన మాట, స్పందన, చూపు ద్వారా తనకు నమ్మకం కలిగించాలి. ఇక బిగ్ బీతో నటించిన ప్రతి హీరోయిన్తో ఆయనకు సంబంధం ఉన్నట్లు మీడియా రాసుకొచ్చేది. వాటన్నింటిని మనసులోకి తీసుకుంటే నా జీవితం నరకం అయ్యేది. ఏళ్లు గడుస్తున్న కొద్ది మా బంధం మరింత బలపడింది’’ అంటూ చెప్పుకొచ్చారు జయా బచ్చన్. చదవండి: ‘పెళ్లైన మగాడి వెంట పడొచ్చా’.. రేఖ ఆన్సర్ -
సెల్ఫీ కోసం ఆరాటం.. అభిమానిని తోసేసిన సీనియర్ నటి
కోల్కతా: బాలీవుడ్ సీనియర్ నటి, సమాజ్వాదీ పార్టీ ఎంపీ జయా బచ్చన్ ముక్కిసూటి మనిషి. ఆమె మాటలు, చేష్టలు స్ట్రెయిట్ ఫార్వర్డ్గా ఉంటాయి. చూసేవారు ఏం అనుకుంటారో అని ఆలోచించరు. ఇలాంటి ప్రవర్తనతో తాజాగా మరోసారి వార్తల్లో నిలిచారు జయా బచ్చన్. తన అనుమతి లేకుండా సెల్ఫీ తీయడానికి ప్రయత్నించిన ఓ వ్యక్తి పట్ల జయా బచ్చన్ కఠినంగా ప్రవరించారు. ఆ వ్యక్తిని పక్కకు తోసేశారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజనులు ఆమె పట్ల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇంత పొగరుగా ప్రవర్తించడం సరికాదు అంటున్నారు. ఆ వివరాలు.. పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో జయా బచ్చన్ టీఎంసీకి మద్దతిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రెండు రోజుల క్రితం జయా బచ్చన్ టీఎంసీ అధినేత్రి మమతకు మద్దతుగా కోల్కతాలో రోడ్ షో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జనాలు భారీ ఎత్తున హాజరయ్యారు. వారందరికి చేతులు ఊపుతూ అభివాదం చేశారు జయా బచ్చన్. ఈ క్రమంలో ఓ యువకుడు ఆమె సమీపంలోకి వెళ్లి సెల్ఫీ తీసేందుకు ప్రయత్నించాడు. ఇది గమనించిన జయా బచ్చన్.. అతడిని పక్కకు తోసి ర్యాలీని కొనసాగించారు. తన అనుమతి లేకుండా ఫోటోలు తీయడానికి ప్రయత్నిస్తుండటంతో ఆగ్రహానికి గురైన జయా అతడిని నెట్టేశారు. ఇక ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. మరీ ఇంత కోపంగా, కఠినంగా ప్రవర్తించాల్సిన అవసరం లేదు. ఫోటోలు తీయోద్దు అని చెప్తే సరిపోయేది కదా అంటున్నారు నెటిజనులు. చదవండి: జయ బచ్చన్ వల్లే బాలీవుడ్లో ఎన్నో మార్పులు, చరిత్ర చేర్పులు -
జయ బచ్చన్ వల్లే బాలీవుడ్లో ఎన్నో మార్పులు, చరిత్ర చేర్పులు
అమితాబ్ను ఆమె హీరో చేసింది. అమితాబ్ కోసం తాను హీరోయిన్గా మానుకుని ఉండిపోయింది. గొప్ప నటి. చేసిన నాలుగు పాత్రలతోనే నేటికీ కోట్లాది అభిమానులను మూటగట్టుకుని ఉంది. చాలామందికి ఆమె గాడ్ మదర్. కొందరికి ఫ్రెండ్. కొందరికి ఇన్స్పిరేషన్. జయభాదురి ప్రమేయం బాలీవుడ్లో ఎన్నో మార్పులకు చరిత్ర చేర్పులకి కారణమైంది. 73 ఏళ్లు నిండి 74వ పుట్టినరోజు జరుపుకుంటున్న ఆమెపై స్పెషల్ కామెంట్... ‘అభిమాన్’ సినిమాలో అమితాబ్, జయభాదురి భార్యాభర్తలు. అమితాబ్ గాయకుడు. జయభాదురి కూడా గాయని అవుతుంది. జయ భాదురిని అమితాబ్ ప్రోత్సహిస్తుంటే ఒక పెద్దమనిషి గమనించి ‘ఇతను ఈ పని ఎందుకు చేస్తున్నాడు. ఆమె అతని కంటే మంచి గాయని. ఈ కాపురం నిలువదు. ఇగో వచ్చేస్తుంది’ అంటాడు. అలాగే జరుగుతుంది. గాయనిగా జయ భాదురికి వచ్చే పేరు చూసి అమితాబ్ తట్టుకోలేకపోతాడు. నిజ జీవితంలో ఈ ప్రమాదంలో ఇరువురూ పడలేదు. కాకుంటే జయ భాదురి ఎంత సమర్థురాలైన నటో అమితాబ్ కూడా అంతే సమర్థుడైన నటుడు. వారి కెరీర్లకు సంబంధించి టాలెంట్ పరంగా ఇగో వచ్చే అవకాశం లేదు కాని ఆమె కూడా అతనంత బిజీగా ఉండి ఉండేది. అయితే పెళ్లయ్యాక జయ ఇంటి కోసం ఉండిపోతే అమితాబ్ ఆమె ఉందన్న ధైర్యంతో ముందుకు పోయాడు. అమితాబ్ను తయారు చేసింది జయ అని అంటారు. సినిమాల్లో ‘లంబు’గా అందరి వెక్కిరింతను మొదటగా ఎదుర్కొన్న అమితాబ్ అదిలో అన్నీ ఫ్లాప్స్ చూశాడు. అప్పటికే అతని తో ప్రేమలో ఉన్న జయ ‘జంజీర్’ సినిమాకు అమితాబ్ను రికమండ్ చేసింది. ఆ సినిమా చాలామంది హీరోలు కాదనుకోవడం వల్ల అమితాబ్కు దక్కింది. ‘జంజీర్’ నాటికి జయ సూపర్స్టార్. అయినా సరే అమితాబ్ పక్కన చేసి అతణ్ణి నిలబెట్టింది. ఆ సినిమా తర్వాత వాళ్లు పెళ్లి చేసుకున్నారు. అమితాబ్ను అమితాబ్ ఎంత నమ్ముకున్నాడో తెలియదు కాని జయ బాగా నమ్మింది. పెద్ద స్టార్ అవుతాడని అనుకుంది. ‘షోలే’లో అతనికి ఆ పాత్ర దక్కడానికి ఆమె కూడా తన వంతు కృషి చేసింది. జయ అమితాబ్ సమర్థత తో పాటు స్టార్డమ్ను కూడా భరించింది. అతని ఆకర్షణలు, స్త్రీలతో పరిచయాలు, న్యూస్లో నలిగిన అమితాబ్–రేఖల కథ ఇవన్నీ తట్టుకుని ఇల్లు కాపాడుకుని అమితాబ్ను తనని కాపాడుకునేలా చేసింది. జయ భాదురి సంజీవ్ కుమార్తో మంచి సినిమాలు చేసింది. ‘కోషిష్’, ‘అనామిక’ వాటి లో ముఖ్యమైనవి. హృషికేశ్ ముఖర్జీ దర్శకత్వం లో తొలి సినిమా ‘గుడ్డీ’తో మొదలు ‘బావర్చీ’, ‘అభిమాన్’, ‘చుప్కే చుప్కే’... అన్నీ సూపర్హిట్స్. జయ హిందీలో సహజమైన నటనను తీసుకు వచ్చిందని అంటారు. ఆమె క్షణాల్లో గంభీరమైన నటిగా మారగలదు. అంతే వేగంగా అల్లరి పిల్లగా కూడా మారగలదు. ‘అభిమాన్’లో ‘తేరి నిందియారే’ పాడేటప్పుడు జయా, ‘అనామికా’లో ‘బాహోంమే చలే ఆవో’ పాడే జయా... ఇరువురూ ఒక్కరే. కాని ఎంత తేడా ఆ నటనలో. జయ రణ్ధీర్ కపూర్తో ‘జవానీ దివానీ’ చేసి తాను గ్లామరస్ రోల్స్ కూడా చేయగలనని నిరూపించింది. అందులోని ‘జానే జా ఢూండ్తా ఫిర్ రహా’ పాట పెద్ద హిట్. ‘పియా కా ఘర్’, ‘పరిచయ్’, ‘అన్నదాత’, ‘మిలి’.. ఇవన్నీ జయ నటనకు పతాకలు. యశ్చోప్రా ‘సిల్ సిలా’ చేయమంటే రేఖా ఉన్నప్పటికీ చేసింది. ఇదొక అరుదైన విషయమే. సినిమాల నుంచి సుదీర్ఘ విరామం తర్వాత ఆమె చేసిన ‘హజార్ చౌరాసి కి మా’ అంతే పెద్ద స్థాయిలో ఆమెకు పేరు తెచ్చి పెట్టింది. వజ్రం కిరీటంలో ఉన్నా వస్త్రంలో చుట్టి పెట్టినా వజ్రమే కదా. జయ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో చదివేటప్పుడు విలన్ డేనీ ఆమె క్లాస్మేట్. అతని నిజం పేరు పొడుగ్గా ఉందని జయా బచ్చనే ‘డేనీ’ అని పెట్టింది. అదే అతనికి స్క్రీన్ నేమ్ అయ్యింది. రాజీవ్ గాంధీ కుటుంబం నుంచి విడిపోవాల్సి వచ్చాక అమితాబ్ సమాజ్వాదీ పార్టీలో అమర్ సింగ్ సపోర్ట్తో నిలదొక్కుకోవాల్సి వచ్చినప్పుడు జయ కూడా ఆ పార్టీకి సపోర్ట్ చేసి ఆ పార్టీలో కొనసాగింది. జయ భాదురి, అమితాబ్ ల సరదా నటనను మీరు ‘చుప్కే చుప్కే’లో చూడొచ్చు. నేడు ఆమె జన్మదినం సందర్భంగా ఆ సినిమాను ప్లే చేయండి. – సాక్షి ఫ్యామిలీ -
బెదిరింపులకు బెంగాలీలెప్పుడూ తల వంచరు: జయా బచ్చన్
కోల్కతా: ‘భయం కారణంగా బెంగాలీలెప్పుడూ తమ తలలను ఇతరుల ఎదుట వంచలేదు. బెంగాలీలను భయపెట్టి ఎవరూ ఇంతవరకు గెలవలేదు..’ అంటూ బాలీవుడ్ ప్రముఖ నటుడు అమితాబ్ బచ్చన్ భార్య, సమాజ్వాదీ పార్టీనేత జయా బచ్చన్ పేర్కొన్నారు. సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్ ఆదేశాల మేరకు తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా ఆమె బెంగాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఎన్సీపీ, శివసేన, ఆర్జేడీ, జేఎంఎం వంటి పార్టీలు సైతం టీఎంసీకి మద్దతిచ్చిన సంగతి తెలిసిందే. మమతా అనుకున్నది సాధిస్తారు.. పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ గురించి జయా బచ్చన్ మాట్లాడారు. మమతా అనుకున్నది సాధిస్తారని ఆమె చెప్పారు. ‘మమతా బెనర్జీ మీద నాకెంతో గౌరవం, ప్రేమ ఉన్నాయి. అన్ని రకాల దాడులకు వ్యతిరేకంగా ఆమె ఒక్కరే పోరాడుతున్నారు. తల పగిలినా, కాలు విరిగినా.. ఆమె గుండె ధైర్యం, మనో నిబ్బరం మాత్రం సడలడంలేదు’ అని వ్యాఖ్యానించారు. ఆమె నాయకత్వంలో రాష్ట్రం అభివృద్ధి సాధిస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తూ మమతా తిరిగి గెలుస్తారని అన్నారు. నా మూలాలు బెంగాల్లో.. రాష్ట్రానికి వెలుపల జన్మించినప్పటికీ, తాను బెంగాలీనేనని జయా బచ్చన్ తెలిపారు. పెళ్లికి ముందు వరకూ తన ఇంటి పేరు భాదురి అని చెప్పారు. బెంగాల్ ప్రజాస్వామ్య హక్కుల కోసం మమతా పోరాడుతున్నారని అన్నారు. రవీంధ్రనాధ్ ఠాగూర్ సైతం బెంగాలీలంతా అక్కాచెల్లెళ్లు, అన్నా తమ్ముళ్లని చెప్పారని గుర్తు చేశారు. బెంగాల్ ప్రస్తుతం మహిళలకు సురక్షితంగా ఉందన్నారు. మమతాను అసభ్యపదజాలంతో దూషించిన వారి పై స్పందిస్తూ.. సిగ్గు సిగ్గు.. అని వ్యాఖ్యానించారు. -
సినిమాల్లోకి జయా బచ్చన్ రీ ఎంట్రీ!
బాలీవుడ్ సీనియర్ నటి, సమాజ్వాదీ ఎంపీ జయా బచ్చన్ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇవ్వనున్నట్లు బీటౌన్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఏ పాత్రలోనైనా పరకాయ ప్రవేశం చేసే ఆమె కబీ కుషి కబీ ఘమ్, కల్ హోనా హో, లాగా చునారీ మేన్ దాగ్ వంటి పలు సినిమాల్లో తన నటనతో అభిమానులను కట్టిపడేసింది. రాజకీయాల్లోకి అడుగు పెట్టిన తర్వాత సినిమాలు తగ్గించేసిన ఆమె ఏడేళ్లుగా వెండితెరపై కనిపించనేలేదు. ఈ నేపథ్యంలో తాజాగా ఓ సినిమా అంగీకరించినట్లు వార్తలు వస్తున్నాయి. పైగా ఇది ఆమె తొలి మరాఠీ చిత్రమని అంటున్నారు. దీనికి గజేంద్ర అహిరే దర్శకత్వం వహించనున్నట్లు టాక్. ఇతడు మరాఠీలో సుమారు 50కి పైగా చిత్రాలకు డైరెక్షన్ చేశాడు. ఇక ఈ వార్తలపై డైరెక్టర్ గజేంద్ర స్పందిస్తూ "మేమింకా ఏ నిర్ణయానికి రాలేదు. అప్పుడే బోలెడన్ని పుకార్లు వినిపిస్తున్నాయి. కానీ ఒక్కటైతే నిజం. ఈ సినిమాలో జయాబచ్చన్ ఉంటే బాగుంటుంది అనిపించింది. ఇదే మాట ఆమెతో చెప్పాను కూడా! మరి ఏమని సమాధానమిస్తుందో చూడాలి. ఈ సినిమా ద్వారా జయ రీ ఎంట్రీ ఇస్తుందని ఆశిస్తున్నా. కానీ ఇప్పటివరకైతే ఇంకా ఏదీ ఫైనలైజ్ కాలేదు. కనీసం ఏ భాషలో తీస్తున్నామనేది కూడా డిసైడ్ కాలేదు" అని చెప్పుకొచ్చాడు. జయ సినిమాల్లోకి వస్తానంటే ఆమె భర్త అమితాబ్ బచ్చన్ కూడా సంతోషిస్తాడు. మరి డైరెక్టర్ అభ్యర్థనను జయా బచ్చన్ అంగీకరిస్తుందా? ఆమె నిజంగానే రీఎంట్రీ ఇస్తుందా? అనేది క్లారిటీ రావాలంటే మరికొద్ది రోజులు ఆగాల్సిందే! చదవండి: బిగ్బీ కూతురిని చులకనగా చూసిన నెటిజన్! నీ కన్ను నీలి సముద్రం.. చిందేసిన హీరోహీరోయిన్లు -
‘ఇప్పటికి నా భార్యకి లవ్ లెటర్స్ రాస్తాను’
‘కౌన్ బనేగా కరోడ్పతి’ షోకి ఎంతటి ఆదరణ ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇక షోని రక్తికట్టించడంలో బిగ్ బీ అమితాబ్ బచ్చన్ది కీలక పాత్ర అనడంలో ఎలాంటి సందేహం లేదు. హాట్ సీటులో కూర్చున్న వారిని నవ్విస్తూ.. టెన్షన్ పెడుతూ.. వారి జీవితం గురించి తెలుసుకుంటూ.. తన ప్రయాణం గురించి వారికి చెప్తూ షోపై ఆసక్తి పెంచుతారు. ఇక తాజా ఎపిసోడ్లో మహారాష్ట్రకు చెందిన రైతు యోగేష్ పాండే ఫాస్టెస్ట్ ఫింగర్ రౌండ్లో గెలిచి హాట్ సీట్లో కూర్చున్నారు. ఈ నేపథ్యంలో కేబీసీ టీం యోగేష్కు సంబంధించిన వీడియో ఇంట్రడక్షన్ని ప్రసారం చేసింది. ఇక యోగేష్, బిగ్ బీల మధ్య జరిగిన సంభాషణ హాట్ సీటును కాస్త కూల్గా మార్చేసింది. ఇక గేమ్లో ముందుకు వెళ్తున్న కొద్ది యోగేష్ తనకు సంబంధించిన విషయాలను వెల్లడించాడు. ఈ ఏడాది ప్రారంభంలో తనకు నిశ్చితార్థం అయ్యిందని తెలిపాడు యోగేష్. అయితే కరోనా వ్యాప్తితో వివాహం పోస్ట్ పోన్ అయ్యిందని.. కానీ తామిద్దరూ ప్రతి రోజు ఫోన్లో మాట్లాడుకుంటామని.. వీడియో కాల్ చేసుకుంటామని తెలిపాడు. ఈ విషయాలేవి ఇంట్లో వారికి తెలియదన్నాడు యోగేష్. ఇక ఈ లవ్ స్టోరిని అర్థం చేసుకోవడానికి బిగ్ బీ, యోగేష్ లవర్గా మారి పోయారు. కంటెస్టెంట్కి కాల్ చేసి అతడి లవర్గా మాట్లాడి సెట్లో నవ్వులు పూయించారు. (మళ్లీ వివాదం: అమితాబ్పై కేసు) ఇక ఎలాంటి లైఫ్లైన్ల సాయం లేకుండానే యోగేష్ గేమ్లో ముందుకు వెళ్లాడు. ఇక వివాహ జీవితం గురించి తనకు తగిన సలహాలు ఇవ్వాల్సిందిగా యోగేష్, బిగ్ బీని కోరాడు. అలానే అమితాబ్ లవ్ స్టోరిని చెప్పమని అడగడమే కాక భార్య జయా బచ్చన్కి ఏవైనా లవ్ లెటర్స్ రాశారా అని ప్రశ్నిస్తాడు యోగేష్. దాంతో అమితాబ్ మరోసారి తన లవ్ స్టోరిని ప్రేక్షకులకు తెలిపారు. అంతేకాక ఇప్పటికి తన భార్య జయా బచ్చన్కి లవ్ లటర్స్ రాస్తానని తెలిపి అందరిని ఆశ్చర్యంలో ముంచెత్తారు. ఇక బిగ్బీ తన లవ్ స్టోరిని గుర్తు చేసుకుంటూ.. ‘1973లో విడుదలైన జంజీర్ సినిమా బ్లాక్బస్టర్ హిట్ అయ్యింది. దాంతో స్నేహితులతో కలిసి లండన్ ట్రిప్ వెళ్లాలని భావించాను. నాతో పాటు జయా బచ్చన్ని కూడా తీసుకెళ్లాలని అనుకున్నాను. మా నాన్న హరివంశరాయ్ బచ్చన్ అనుమతి కోరాను. దానికి ఆయన ముందు మీరిద్దరు వివాహం చేసుకొండి.. ఆ తర్వాత వెళ్లండి అన్నారు. దాంతో ఆ మరుసటి రోజే జయా బచ్చన్ని వివాహం చేసుకున్నాను’ అని తెలిపారు. ఇక ఈ షోటో యోగేష్ పాండే 12.50 లక్షల రూపాయల ప్రశ్నకి తప్పు సమాధానం చెప్పి.. 3,20,000 రూపాయలతో ఇంటికి వెళ్లాడు. -
విమర్శలు... వ్యంగ్యాస్త్రాలు
‘బాలీవుడ్ డ్రగ్స్ మత్తులో ఉంది’ అని నటుడు, యంపీ రవికిషన్ చేసిన వ్యాఖ్యలు ఓ కొత్త వివాదానికి దారి తీసిన విషయం, ఆయన మాటల్ని నటి, యంపీ జయా బచ్చన్ ఖండించిన విషయం తెలిసిందే. జయ మాటలకు ఇండస్ట్రీ నుంచి మిశ్రమ స్పందన లభిస్తోంది. ఆమె మాటలు కరెక్ట్ అని చాలామంది అన్నారు. కొందరు కొట్టిపారేశారు. కంగనా రనౌత్ అయితే అస్సలు ఏకీభవించలేదు. జయ కామెంట్స్ను తిప్పి కొట్టారు. అయితే కంగనా మాట్లాడిన విషయాన్ని ఊర్మిళ తప్పుబట్టారు. ఇదంతా బుధవారం వరకూ జరిగిన మాటల యుద్ధం. జయా బచ్చన్ వ్యాఖ్యలకు గురువారం వ్యంగ్యంగా బదులిచ్చారు నటుడు రణ్వీర్ షోరే. తన మీద ఊర్మిళ చేసిన కామెంట్స్ను తిప్పికొట్టారు కంగనా రనౌత్. ఈ విషయాల గురించి జయప్రద, పూజా భట్ మాట్లాడారు. క్యూట్ గాళ్ నిధీ అగర్వాల్ కూడా ‘నెపోటిజమ్’ గురించి మాట్లాడారు. ఆ విశేషాలు. ఊర్మిళ కేవలం శృంగార తార! – కంగనా ‘డ్రగ్స్ హిమాచల్ ప్రదేశ్లోనే మొదలయ్యాయి. ముందు నీ ప్రాంతాన్ని శుభ్రం చేసుకో’ అని కంగనా రనౌత్కు కౌంటర్ ఇచ్చారు నటి ఊర్మిళ. ఈ కౌంటర్కి ఘాటుగా సమాధానం ఇచ్చారు కంగనా. ‘ఊర్మిళగారి ఇంటర్వ్యూ చూశాను. నా గురించి, నా ప్రయాణం గురించి తక్కువ చేస్తూ మాట్లాడారామె. ఇదంతా నేను రాజకీయాల్లో సీట్ కోసం చేస్తున్నాను అని అంటున్నారామె. ఊర్మిళ సాఫ్ట్ పోర్న్ స్టార్ (శృంగార తార). ఆమె యాక్టింగ్కి ఆమె పాపులర్ అవ్వలేదు. మరి దేనికి పాపులరయ్యారు? అంటే... సాఫ్ట్ పోర్న్ చేయడం వల్లే కదా. ఆమెకే టికెట్ వచ్చినప్పుడు నాకెందుకు రాదు?’ అని కౌంటర్ ఇచ్చారు కంగనా. అయితే కంగనా చేసిన ఈ వ్యాఖ్యలకు బాలీవుడ్లో పలువురు ప్రముఖులు ఊర్మిళకు మద్దతుగా ట్వీట్ చేశారు. మా దగ్గర ఉన్న ప్రతిదీ మా కష్టార్జితమే! – రణ్వీర్ షోరే ‘ఇండస్ట్రీలో పని చేస్తూ ఇండస్ట్రీనే తప్పుపట్టడమంటే అన్నం పెట్టిన చేతినే నరకడం వంటిది’ అన్నారు జయా బచ్చన్. ఈ కామెంట్ను కంగనా తిప్పి కొట్టిన సంగతి తెలిసిందే. తాజాగా నటుడు రణ్వీర్ షోరే కూడా స్పందించారు. ‘ఖరీదైన ప్లేట్లలో మీ పిల్లలకు మీరు భోజనం సమకూరుస్తారు. మాకు మాత్రం చివాట్లు. మా భోజనాన్ని మేమే తయారుచేసుకుని బాక్స్ కట్టుకొని పనికి వెళ్తాం. మాకు ఎవ్వరూ ఎప్పుడూ ఏదీ ఇవ్వలేదు. మా దగ్గర ఏముందో అది మాదే. దాన్ని మా నుంచి ఎవ్వరూ లాక్కోలేరు. ఒకవేళ తీసుకునే వీలుంటే దాన్ని కూడా వాళ్ల పిల్లలకే పెడతారు’ అని ఇన్సైడర్స్ వర్సెస్ అవుట్ సైడర్స్ (బ్యాక్గ్రౌండ్ ఉన్నవాళ్లు/బయటినుంచి వచ్చినవాళ్లు) టాపిక్ను చెప్పకనే చెబుతూ ట్వీట్ చేశారు రణ్వీర్ షోరే. వాళ్ల గురించీ ఆలోచించండి – పూజా భట్ ప్రస్తుతం డ్రగ్స్ పై జరుగుతున్న చర్చ గురించి నటి, దర్శక–నిర్మాత పూజా భట్ కూడా మాట్లాడారు. తన అభిప్రాయాన్ని ట్విట్టర్ ద్వారా తెలియజేశారామె. ‘‘ప్రస్తుతం అందరూ బాలీవుడ్లో డ్రగ్స్ ఉన్నాయి. బాలీవుడ్లోనే ఉన్నాయి.. వాటిని తొలగించాలి అని అంటున్నారు. కన్న కలల్ని సాధించలేక, ఆశలన్నీ కూలిపోయి జీవితాన్ని భారంగా గడుపుతూ కలల వెనక పరిగెత్తేవాళ్లు కూడా మత్తు పదార్థాల వెనక పరిగెడుతున్నారు. దారిద్య్రంలో ఉంటూ జీవించడమే భారంగా అనిపించి, మత్తులో తేలుతూ ఈ భారాన్నంతా తేలిక చేసుకుంటున్నవాళ్ల గురించి కూడా ఆలోచించండి. వాళ్లను మామూలు మనుషుల్లా మార్చే ప్రయత్నాలు చేయండి’’ అన్నారు పూజా భట్. నెపోటిజమ్ నా ప్రయాణాన్ని ఆపలేదు – నిధీ అగర్వాల్ ‘అవును.. బాలీవుడ్లో నెపోటిజమ్ (బంధుప్రీతి) ఉంది. ఎప్పటికీ ఉంటుంది. అది ఉన్నంత మాత్రాన అవుట్సైడర్గా నా ప్రయాణం ఆగిపోదు’ అన్నారు ‘ఇస్మార్ట్ శంకర్’ హీరోయిన్ నిధీ అగర్వాల్. ఈ విషయం గురించి ఆమె మాట్లాడుతూ – ‘‘మా నాన్నగారు వ్యాపారవేత్త. నేను సినిమాల్లో హీరోయిన్ అవ్వాలని వచ్చాను. ఒకవేళ నేనూ మా నాన్నగారి వ్యాపారంలో ఉంటే ఆయన వారసురాలిగా నన్నే సీఈఓని చేస్తారు. అలానే ఇండస్ట్రీ బ్యాక్గ్రౌండ్ ఉన్నవాళ్లకు కొన్ని ప్లస్ పాయింట్లు ఉంటాయి. వాళ్లను గైడ్ చేసేవాళ్లు ఉంటారు. ఎలాంటి నిర్ణయాలు శ్రేయస్కరమో సూచిస్తుంటారు. దీనివల్ల నేను (అవుట్సైడర్) స్టార్ని అవ్వలేనని కాదు. కొంచెం సమయం పడుతుందేమో కానీ కచ్చితంగా స్టార్ని అవుతాను. కష్టపడితే, ప్రేక్షకులు ఆదరిస్తే కచ్చితంగా ఎవ్వరైనా ఇండస్ట్రీలో ఎదగగలరు’’ అన్నారు నిధీ అగర్వాల్. జయా జీ రాజకీయం చేస్తున్నారు – జయప్రద డ్రగ్స్ వివాదం గురించి ప్రముఖ నటి, రాజకీయ నాయకురాలు జయప్రద మాట్లాడుతూ – ‘‘రవికిష¯Œ గారు మాట్లాడిన పాయింట్తో నేను ఏకీభవిస్తాను. ఆయన భవిష్యత్తు గురించి ఆలోచిస్తున్నారు. యువతను డ్రగ్స్ బారినపడకుండా కాపాడాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. ఈ విషయం మీద మనందరం పోరాటం చేయాలి. జయా బచ్చన్గారు మా అందరికంటే పెద్దావిడ.. ఆమె మీద మా అందరికీ గౌరవం ఉంది. కానీ ఆమె ఈ విషయాన్ని (డ్రగ్స్) రాజకీయం చేస్తున్నారనిపించింది’’ అన్నారు. -
బచ్చన్ భవంతులకు భద్రత పెంపు
ముంబై: బాలీవుడ్ దిగ్గజం అమితాబ్ బచ్చన్, ఆయన భార్య, సమాజ్వాదీ ఎంపీ జయాబచ్చన్కు ముంబైలో ఉన్న బంగళాలకు పోలీసుల రక్షణ పెంచారు. సినీ పరిశ్రమపై బురద చల్లవద్దంటూ జయాబచ్చన్ పార్లమెంట్లో పేర్కొన్న సంగతి తెలిసిందే. తన ప్రసంగంలో కంగన, రవికిషన్ను జయాబచ్చన్ పరోక్షంగా విమర్శించారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే అమితాబ్ ఎక్స్ కేటగిరీ భద్రత పొందుతున్నారని, జయాబచ్చన్ ప్రసంగానంతరం జుహులో వారి భవంతుల బయట భద్రతను, పెట్రోలింగ్ను పెంచామని పోలీసు అధికారులు చెప్పారు. జుహులో బచ్చన్ కుటుంబానికి జల్సా, జనక్, ప్రతీక్ష పేరిట మూడు బంగ్లాలున్నాయి. వీటిలో జల్సా, ప్రతీక్షల్లో అమితాబ్ కుటుంబం నివశిస్తోంది. -
బంధుప్రీతి.. గ్యాంగ్వార్.. డ్రగ్స్...
సుశాంత్ సింగ్ రాజ్పుత్ మరణం దగ్గర నుంచి బాలీవుడ్ ప్రశాంతంగా లేదు. ప్రతిభను తొక్కేస్తున్నారు... బాయ్కాట్ నెపోటిజమ్ అని మొన్న. బాలీవుడ్ స్టీరింగ్ ఓ గ్యాంగ్ చేతిలో ఉంది.. వాళ్లు ఎటు అంటేæఇండస్ట్రీ అటు తిరుగుతుందని నిన్న. బాలీవుడ్ను నడుపుతున్నది డ్రగ్స్ మత్తే అని ఈ మధ్య. ఇలా రకరకాల వివాదాలు. బాలీవుడ్ కాదు... వివాదాలవుడ్ అంటున్నారు చాలామంది. అయితే... ‘ఇండస్ట్రీలో కొందరు చేసిన తప్పుకు అందర్నీ తప్పుపట్టొద్దు’ అంటున్నారు జయాబచ్చన్. ఆమె మాటలతో ఇండస్ట్రీలో పలువురు ఏకీభవించారు. కంగనా రనౌత్ కాదన్నారు. ఆ వివరాలు. సుశాంత్ సింగ్ ఆత్మహత్య దగ్గర మొదలైన వివాదాలు ఎప్పటికప్పుడు ఏదో ఒక టాపిక్ వైపు మళ్లుతున్నాయి. మిస్టరీ నవలల్లోలా ఏదో ఒక కొత్త టాపిక్కి తెరలేస్తోంది. బంధుప్రీతిని ప్రోత్సహించడం వల్లే ప్రతిభకు చోటుండట్లేదు అని కొన్ని రోజులు చర్చ నడిచింది. ఆ తర్వాత డ్రగ్స్ మత్తులో ఇండస్ట్రీ మునిగి తేలుతోందని మరో కొత్త అంశం వెలుగులోకొచ్చింది. రియా చక్రవర్తి డ్రగ్స్ తీసుకున్నట్టు, డ్రగ్స్ తీసుకున్న వాళ్ల పేర్ల జాబితాను పోలీసులకు అందించినట్టు వార్త. ఈ విషయం మీద నటుడు, యంపీ రవికిషన్ కొన్ని వ్యాఖ్యలు చేశారు. అది ఓ కొత్త వాదనలకు దారి తీసింది. రవికిషన్ వర్సెస్ జయా బచ్చన్ ‘బాలీవుడ్ ఇండస్ట్రీ మత్తు పదార్ధాలకు బానిస అవుతోంది. ఈ విషయంపై కఠిన చర్యలు తీసుకోవాలి’ అని తన అభిప్రాయాన్ని తెలిపారు రవికిషన్. ఆయన వ్యాఖ్యలను తిప్పికొట్టారు నటి, యంపీ జయా బచ్చన్. ‘‘కొందరు చేసిన తప్పుకి ఓ పరిశ్రమ మొత్తాన్నీ నిందించడం కరెక్ట్ కాదు’’ అని మాట్లాడారామె. ఇదంతా మంగళవారం జరిగింది. జయ మాటలకు బుధవారం స్పందించారు రవికిషన్. జయాజీ నాతో ఏకీభవించండి ‘నా ఉద్దేశం ఇండస్ట్రీలో అందరూ మత్తు పదార్థాలు తీసుకుంటున్నారని కాదు. కానీ తీసుకుంటున్న వాళ్ల ఉద్దేశమైతే పరిశ్రమను నాశనం చేయడమే. ఇండస్ట్రీ మీద ఉన్న బాధ్యతతో ఈ విషయం గురించి మాట్లాడుతున్నాను. జయాజీ కూడా నాతో ఏకీభవించాలి. ప్రస్తుతం డ్రగ్స్ ఓ ఫ్యాషన్ అయిపోయింది. 90వ దశకంలో ఇలాంటివి జరగలేదు. ఇండస్ట్రీలో మురికిని తొలగించాలన్నది మా ముఖ్యోద్దేశం’’ అన్నారు రవి కిషన్. జయా జీ... ఇది నా సొంత భోజనం: కంగనా ‘కొందరు సినీ ఇండస్ట్రీలో పెరిగి దాన్నే మురికి కాలువగా పిలుస్తున్నారని, ఇది భోజనం పెట్టిన చేతిని కరవడమే’ అని జయా బచ్చన్ చేసిన వ్యాఖ్యలకు మంగళవారం స్పందించిన కంగనా బుధవారం కూడా తన విమర్శలను కొనసాగించారు. ‘‘ఏ భోజనం గురించి మీరు మాట్లాడుతున్నారు జయా జీ! రెండు నిమిషాల వేషం, ఐటమ్ నంబర్లు, ఒక రొమాంటిక్ సీన్ ఉండే భోజనమే ఇక్కడ దొరుకుతుంది, అది కూడా హీరోతో గడిపితేనే! నేను వచ్చి ఇండస్ట్రీకి ఫెమినిజమ్ నేర్పాను. మీరనే భోజనాన్ని దేశభక్తి చిత్రాలతో నింపాను. ఇది నా సొంత భోజనం, మీది కాదు’’ అని కంగనా ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇదిలావుంటే జయా బచ్చన్కి పలువురు తారలు మద్దతు పలికారు. జయాజీ... యూ ఆర్ రైట్ ‘ఎన్నో సామాజిక విషయాలకు ఇండస్ట్రీకి చెందిన చాలామంది అండగా నిలబడ్డాం. ఇప్పుడు ప్రభుత్వం మాతో నిలబడాల్సిన సమయం ఇది. చెప్పాల్సిన విషయం సూటిగా, స్పష్టంగా చెప్పారు జయాజీ’ అన్నారు తాప్సీ. ‘బహుశా వెన్నెముక ఉండేవాళ్లు ఇలానే మాట్లాడతారేమో’ అని జయ మాటలను ప్రశంసించారు దర్శకుడు అనుభవ్ సిన్హా. ‘జయాజీ మాట్లాడింది అక్షర సత్యం. ఇండస్ట్రీ కోసం ఆమె మాట్లాడటం చాలా సంతోషం’ అన్నారు దియా మిర్జా. ‘పెద్దయ్యాక నేనూ జయాజీలా అవ్వాలనుకుంటున్నాను’ అన్నారు సోనమ్ కపూర్. ‘కంగనా.. పెద్దవాళ్లను గౌరవించాలన్న విషయం కూడా నీకు గుర్తులేదా? నువ్వు తిట్టాలనుకుంటే నన్ను తిట్టు.. వింటాను’ అన్నారు నటి స్వరా భాస్కర్. అలానే జయా బచ్చన్ వ్యాఖ్యలను నటుడు, దర్శకుడు ఫర్హాన్ అక్తర్, దర్శకుడు సుధీర్ మిశ్రా సమర్థించారు. ఈ వివాదం ఇంకెంత దూరమెళ్తుందో? ఎవరెవర్ని వివాదాల్లోకి లాగుతుందో? ఇండస్ట్రీని ఇంకెన్ని ఇబ్బందుల్లో పడేస్తుందో చూడాలి. వివాదాలవుడ్గా మారిన బాలీవుడ్ ఇండస్ట్రీని ఏమైనా అంటే ఊరుకోను – హేమా మాలిని ‘నాకు పేరు, గౌరవం, మర్యాద అన్నీ ఇచ్చింది సినిమా ఇండస్ట్రీయే. అలాంటి ఇండస్ట్రీని ఎవరైనా ఏమైనా అంటే ఊరుకునేది లేదు’ అన్నారు సీనియర్ నటి హేమా మాలిని. ప్రస్తుతం జరుగుతున్న చర్చ గురించి ఆమె మాట్లాడుతూ – ‘‘బాలీవుడ్ ఓ అందమైన ప్రదేశం. సృజనాత్మక ప్రపంచం. ఈ ఇండస్ట్రీ మీద తప్పుడు వ్యాఖ్యలు చేస్తే నాకు చాలా బాధగా ఉంటుంది. డ్రగ్స్ ఉన్నాయి అంటున్నారు. డ్రగ్స్ లేనిదెక్కడ? ఒకవేళ మురికి ఉంటే కడిగితే పోతుంది. బట్టల మీద అంటుకున్న మురికి ఉతికితే పోతుంది. బాలీవుడ్ మీద పడ్డ మరక కూడా పోతుంది’’ అని అన్నారామె. కంగనాకు సెక్యూరిటీ ఎందుకు – ఊర్మిళ కంగనా చేస్తున్న వ్యాఖ్యలపై (ముంబై పాకిస్తాన్ని తలపిస్తోంది. డ్రగ్స్ నిండిన బాలీవుడ్) మండిపడ్డారు నటిæఊర్మిళ. ‘డ్రగ్స్ సమస్య దేశమంతా ఉంది. కంగనాకు తెలుసు.. తన సొంత రాష్ట్రం హిమాచల్ ప్రదేశ్లోనే డ్రగ్స్ మొదలయిందని. తన సొంత ప్రాంతం నుంచే ఆమె డ్రగ్స్ పై యుద్ధం మొదలుపెట్టాలి. అసలు ఈమెకు వై కేటగిరీ సెక్యూరిటీ ఎందుకు ఏర్పాటు చేశారు? ముంబై అందరిదీ. ఆ సిటీ గురించి తప్పుగా మాట్లాడితే ముంబై పుత్రికగా ఊరుకునేది లేదు. ఒక వ్యక్తి అదే పనిగా అరుస్తున్నాడంటే అతను నిజం చెబుతున్నాడని కాదు. కొంతమందికి ఊరికే అరవడం అలవాటు.. అంతే. ఒకవేళ బయటకు వచ్చి మాట్లాడితే తమ కేం అవుతుందో అని చాలా మంది బయటకు రావట్లేదంతే’ అన్నారు ఊర్మిళ. -
‘రియా ఎవరో నాకు నిజంగా తెలియదు’
ముంబై : యువ హీరో సుశాంత్ రాజ్పుత్ కేసుతో బాలీవుడ్లో డ్రగ్స్ వాడకంపై ఎన్నో ఆసక్తికర విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. సుశాంత్ కేసును డ్రగ్ కోణంలో విచారిస్తున్న ఎన్సీబీ ఇప్పటికే నటి రియా చక్రవర్తి, ఆమె సోదరుడు షోవిక్లతోపాటు డ్రగ్స్ను సరాఫరా చేసే కొంతమందిని అదుపులోకి తీసుకొని విచారిస్తుంది. అదే క్రమంలో ఈ విషయంపై కంగనా రనౌత్కు.. ముంబై ప్రభుత్వం, .బీటౌన్ సెలబ్రిటీలకు మధ్య రచ్చ కొనసాగుతున్న విషయం తెలిసిందే. తాజాగా బాలీవుడ్లో మారుతున్న పరిణామాలపై స్పందించిన తాప్సీ పన్ను.. రియా, కంగనా, జయా బచ్చన్ గురించి మాట్లాడారు. కాగా గతంలో తాప్సీ, రియా చక్రవర్తికి మద్దతుగా మాట్లాడిన విషయం తెలిసిందే. ఇటీవల ఓ జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు విషయాలపై తాప్సీ చర్చించారు. (సుశాంత్ ఫామ్హౌస్లో తరచూ పార్టీలు) ‘రియా చక్రవర్తి ఎవరో నాకు నిజంగా తెలియదు. నేను కేవలం రియాకు జరుగుతున్న అన్యాయానికి, ఆమెపై ఇచ్చిన తీర్పును గురించే మాట్లాడుతున్నాను. ఇది కేవలం కొత్తది కాదు. ఇంతకముందు ఇతర పరిశ్రమల నుంచి అనేక తప్పులు జరిగాయి. మా పరిశ్రమలో(సినీ పరిశ్రమ)కూడా కొంత మంది పెద్ద స్టార్లు తప్పులు చేశారు. కానీ ఎవరిని రియా మాదిరి శారీరకంగా, మానసికంగా హింసిస్తూ చిత్రీకరించి చూపించలేదు. ఇది నాకు చాలా షాకింగ్గా అనిపించింది. అందుకే ఆమె గురించి నాకు ఏమి తెలియకుండానే మాట్లాడాల్సి వచ్చింది. నా అభిప్రాయానికి మద్దతు ఇచ్చే వ్యక్తులు ఉన్నారు. అలాగే కోర్టు, దర్యాప్తు సంస్థలు తమ తీర్పును ఇవ్వక ముందే తమకు ఇష్టం వచ్చినట్లు రాసే వ్యక్తులు ఉన్నారు. వారు తమ అభిప్రాయాన్ని ప్రతి ఒక్కరిపై ప్రభావితం చేసేలా బలవంతం చేయాలనుకుంటున్నారు. అది తప్పు అని నేను అనుకుంటున్నాను. రియా చక్రవర్తి జైలుకు వెళ్లాలని మీరు కోరుకుంటున్నారా లేదా నేరస్థులు జైలుకు వెళ్లాలని మీరు కోరుకుంటున్నారా..’ అని ప్రశ్నించారు. (రియాకు మంచు లక్ష్మి, తాప్సీ మద్దతు) అలాగే రాజ్యసభ్యలో జయా బచ్చన్ ఇచ్చిన ప్రసంగాన్ని తాప్సి ప్రశంసించారు. ఆమె ప్రతి విషయాన్నా చాలా ఖచ్చితంగా చెప్పారని, ఈ రోజు తను చెప్పబోయే అనేక విషయాలు ఇప్పటికే జయా బచ్చన్ చెప్పేసారని అన్నారు. ఇక కంగనా రనౌత్ గురించి మట్లాడుతూ..కంగనా వ్యాఖ్యలు ఎప్పటి నుంచో తనపై ప్రభావం చూపడం ఆగిపోయిందన్నారు. ‘ఓకే వ్యక్తి తరచూ ఒకేలా మాట్లాడితే కొన్ని రోజులకు వారి మాటలు ఎవరిపై ప్రభావం చూపించలేవు. అలాగే కంగన మాటలు కూడా న్ను ఏ విధంగానే కదిలించలేవు’ అని తాప్సీ అన్నారు. (డ్రగ్ కేసు: త్వరలో సారా, రకుల్కు సమన్లు)
Pagination
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
మిస్టర్ అండ్ మిసెస్ మహీ చిత్రంలో జాన్వీ.. ధోనిపై ఆసక్తికర కామెంట్స్ చేసిన భామ (ఫొటోలు)
దాక్షాయణి బర్త్ డే.. పుష్ప మేకర్స్ స్పెషల్ అప్డేట్!
దేవర బర్త్ డే ట్రీట్.. అప్డేట్ అదిరిపోయింది!
‘బీజేపీకి ఓటేస్తే నేను జైలుకే’.. కేజ్రీవాల్ ఆసక్తికర వ్యాఖ్యలు
కాంగ్రెస్ రైతు వ్యతిరేక చర్యలు.. రాష్ట్రవ్యాప్త నిరసనకు కేసీఆర్ పిలుపు
మాజీ గవర్నర్ కమలా బెనివాల్ కన్నుమూత
ఇండియా కూటమి గెలిస్తే మద్దతిస్తాం: మమతా బెనర్జీ
కేజ్రీవాల్కు మధ్యంతర బెయిల్.. సాధారణ తీర్పు కాదన్న అమిత్ షా
కాబోయేవాడు ఎలా ఉండాలంటే?.. జాన్వీ కపూర్ ఆసక్తికర కామెంట్స్!
స్లొవేకియా ప్రధానిపై కాల్పులు
తప్పక చదవండి
- Lok Sabha Election 2024: డ్రమ్స్.. ధూం ధాం
- Lok Sabha Election 2024: మథువాల మద్దతెవరికో!
- Lok Sabha Election 2024: సెన్స్క్స్ డౌట్!
- ఇండియా కూటమి గెలిస్తే మద్దతిస్తాం: మమతా బెనర్జీ
- పనిమనిషి ఇంట్లో నోట్ల గుట్టలు.. జార్ఖండ్ మంత్రి అలంగిర్ అరెస్టు
- మెగాస్టార్ చిత్రంలో మరో సీనియర్ నటి.. ఆ కాంబో రిపీట్!
- స్టార్ క్రికెటర్ ప్రపోజ్.. హీరోయిన్ ఏమన్నారంటే!
- వడదెబ్బ మరణాలు.. ఐదో వంతు భారత్లోనే !
- సచిన్ టెండూల్కర్ సెక్యూరిటీ గార్డు ఆత్మహత్య!
- పల్నాడు ప్రమాదంపై సీఎం జగన్ దిగ్భ్రాంతి
Advertisement